army deployment
-
డ్రాగన్కు చెక్ : సరిహద్దుల్లో సైన్యం సమర నినాదం
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో దూకుడు పెంచిన చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ సన్నద్ధమైంది. సరిహద్దుల్లో ఇప్పటికే సమర సన్నద్ధతను పెంచిన భారత్ తాజాగా వివాదానికి కేంద్ర బిందువైన తూర్పు లడఖ్లో టీ-90, టీ-72 యుద్ధ ట్యాంకులను మోహరించింది. చుమర్-డెమ్చోక్ ప్రాంతంలో నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి యుద్ధ బలగాలతో పాటు ట్యాంకులను తరలించింది. 14,500 అడుగుల ఎత్తులో చైనా సైనికులతో తలపడేందుకు భారత సేన సాయుధ బలగాలు సిద్ధమయ్యాయి. భారత్ టీ-72, టీ-90 ట్యాంకులను మోహరించగా చైనా తేలికపాటి టైప్ 15 ట్యాంకులను మోహరించింది. సరిహద్దు ప్రతిష్టంభనతో భారత్-చైనాల మధ్య గత ఐదు నెలలుగా ఉద్రిక్తతలు పెచ్చుమీరాయి. ద్వైపాక్షిక ఒప్పందాలకు తూట్లు పొడుస్తూ చైనా పలుమార్లు భారత భూభాగంలోకి చొచ్చుకురావడంతో పాటు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించిన అనంతరం చైనా దుందుడుకు వైఖరికి అడ్డుకట్ట వేసేందుకు భారత్ దీటుగా స్పందిస్తోంది. సరిహద్దు వెంబడి చైనా సైన్యం కుయుక్తులను తిప్పికొడుతూ భారత సేనలు పలుమార్లు డ్రాగన్ను నిలువరించాయి. మరోవైపు చైనాతో దౌత్య, సైనిక సంప్రదింపులు జరుపుతూనే డ్రాగన్ దుస్సాహసానికి పాల్పడితే తిప్పికొట్టేందుకు భారత సైన్యం అప్రమత్తమైంది. చదవండి : కరోనా మూలాలు తేలాల్సిందే! -
సచివాలయంలో తీవ్ర ఉద్రిక్తత.. లోపలే సీఎం
-
ఆమెది రాజకీయ ఫ్రస్ట్రేషన్
-
ఆమెది రాజకీయ ఫ్రస్ట్రేషన్: పారికర్
భారత సైన్యం గురించి పశ్చిమబెంగాల్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలతో తనకు చాలా బాధ కలిగిందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చెప్పారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీది రాజకీయ ఫ్రస్ట్రేషన్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఆర్మీ చేస్తున్న రొటీన్ ఎక్సర్సైజ్ అని.. చాలా సంవత్సరాలుగా ఇది కొనసాగుతూనే ఉందని లోక్సభలో చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికీ సచివాలయంలోని తన చాంబర్లోనే ధర్నా చేస్తున్నారని, ముందుగా పోలీసులకు.. రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చే వచ్చినట్లు సైన్యం చెబుతున్నా, నిజానికి అలా జరగలేదని టీఎంసీ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించగా, దానికి సమాధానంగా పారికర్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత 15 సంవత్సరాలుగా భారత సైన్యం ఇలా వెళ్తూనే ఉందని, ఇదేమీ కొత్త కాదని పారికర్ వివరించారు. గత సంవత్సరం కూడా నవంబర్ 19-21 తేదీల మధ్య ఇలా జరిగిందని అన్నారు. పశ్చిమబెంగాల్ సహా ఈశాన్య రాష్ట్రాలకు ఈస్ట్రన్ కమాండ్ వెళ్తుందని, అలాగే ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా ఇది జరుగుతుందని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో సంబంధిత అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చిందన్నారు. వాస్తవానికి నవంబర్ నెలాఖరులో 28, 29, 30 తేదీలలో ఈ ఎక్సర్సైజ్ చేద్దామని ఆర్మీ భావించి అక్కడి పోలీసు అధికారులను సంప్రదిస్తే.. ఆ సమయంలో భారత్ బంద్ ఉన్నందున వాళ్లు తేదీలు మార్చి చెప్పారని, అందుకే సైన్యం ఇప్పుడు వెళ్లిందని పారికర్ వివరించారు. పోలీసులతో కలిసే సైన్యం సంయుక్తంగానే ఎక్సర్సైజ్ చేసిందని అన్నారు. సైన్యం చేసే రొటీన్ ఎక్సర్సైజును వివాదం చేయడం మాత్రం తప్పని ఆయన అన్నారు. -
సచివాలయంలో తీవ్ర ఉద్రిక్తత.. లోపలే సీఎం
పశ్చిమబెంగాల్ సచివాలయం కేంద్రంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికి దాదాపు 10 గంటలకు పైగా లోపలే ఉండి గడియ పెట్టుకున్నారు. బయటకు రావడానికి ఏమాత్రం అంగీకరించడం లేదు. రాష్ట్రంలోని అన్ని టోల్ ప్లాజాల వద్ద నుంచి సైన్యాన్ని ఉపసంహరిస్తే తప్ప తాను బయటకు వచ్చేది లేదని పట్టుబట్టారు. అయితే భారత సైన్యం మాత్రం ఆమె వాదనను కొట్టిపారేసింది. సైన్యం పశ్చిబెంగాల్లో కవాతు ఏమీ చేయడంలేదని, ఇది సర్వసాధారణంగా అన్నిచోట్లా తాము చేసే డ్రిల్లేనని చెప్పింది. పెద్దనోట్ల రద్దు మీద 190వ నిబంధన కింద చర్చిద్దామని అధికారపక్షం ప్రతిపాదించగా.. ఈరోజు కూడా ఆ అంశం మీద చర్చ జరిగే పరిస్థితి కనిపించడంలేదు. బెంగాల్ అంశం పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసే అవకాశం స్పష్టంగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాను ఇక్కడే ఉంటానని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తన ప్రభుత్వాన్ని కూడా కాపాడుకుంటానని మమత మీడియాతో అన్నారు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో సైన్యాన్ని మోహరించినట్లు తనకు సమాచారం ఉందని తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ అన్నారు. తాము పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నామని.. వాళ్లకు ఆ విషయం తెలుసని ఆర్మీ ఈస్ట్రన్ కమాండ్ చెబుతున్న విషయం వాస్తవం కాదని చెప్పారు. సైన్యం అంటే తమకు గౌరవం ఉందిగానీ, వాహనాల లెక్కలు ఇప్పటికే సైన్యం వద్ద ఉన్నాయని చెబుతున్నారని అన్నారు. రాష్ట్రాల్లో ఇలా జరగడం ఇదేమీ కొత్త కాదని సైన్యానికి చెందిన వింగ్ కమాండర్ ఎస్ఎస్ బిర్ది అన్నారు. గురువారం అర్ధరాత్రి తర్వాత సచివాలయం సమీపంలో ఉన్న టోల్ప్లాజా నుంచి సైన్యాన్ని ఉపసంహరించారు. -
సైన్యం వెళ్లినా.. సీఎం కదల్లేదు!
పశ్చిమబెంగాల్లోని కొన్ని టోల్ ప్లాజాల వద్ద సైన్యాన్ని మోహరించడంపై మొదలైన హైడ్రామా అర్ధరాత్రి దాటేవరకు కొనసాగుతూనే ఉంది. రాత్రంతా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సచివాలయంలోనే ఉండిపోయారు. ఆమె డిమాండు మేరకు సైన్యాన్ని టోల్ ప్లాజాల నుంచి తొలగించినా ఆమె మాత్రం అక్కడినుంచి కదల్లేదు. ''ప్రజలను కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది. వాళ్లను అభద్రతా భావంలో వదిలేసి నేను వెళ్లలేను. రాత్రంతా ఇక్కడే ఉండి పరిస్థితిని పరిశీలిస్తాను'' అని అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో మీడియాకు చెప్పారు. రెండో హూగ్లీ బ్రిడ్జి టోల్ ప్లాజా దగ్గర నుంచి ఆర్మీ వెళ్లిపోయింది కదా అని ప్రశ్నించగా, అక్కడి నుంచి వెళ్లొచ్చు గానీ మరో 18 జిల్లాల్లో వాళ్లు ఉన్నారని చెప్పారు. ఇదేమైనా సైనిక కుట్రా అని మమత ప్రశ్నించారు. సైన్యం ఎక్కడైనా మాక్ డ్రిల్ చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని, కానీ వాళ్లు ఏకంగా ఇక్కడ మోహరించినా అనుమతి తీసుకోలేదని చెప్పారు. ఆమె ప్రెస్మీట్ పెట్టడానికి ముందే పాత్రికేయులు టోల్ ప్లాజా వద్దకు వెళ్లి చూడగా, అక్కడ సైన్యానికి సంబంధించినవాళ్లు ఎవరూ లేరు. వాళ్ల కోసం ఏర్పాటుచేసిన తాత్కాలిక శిబిరాన్ని కూడా అక్కడినుంచి తీసేశారు. కాగా, ఉదయం 8.45 గంటల సమయానికి కూడా ఆమె సచివాలయంలోనే ఉన్నారు. అక్కడి నుంచి కదల్లేదు. దేశవ్యాప్తంగా సైన్యం ఏడాదికి రెండుసార్లు ఇలాంటి ఎక్సర్సైజులు చేస్తుందని, ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే అందుబాటులో కావాల్సిన లోడ్ క్యారియర్ల గురించి లెక్కలు తీసి సిద్ధంగా ఉంచుకుంటుందని, ఇక్కడ కూడా అందుకోసమే సైన్యం వచ్చింది తప్ప.. వేరే ఉద్దేశం లేదని వింగ్ కమాండర్ ఎస్ఎస్ బిర్ది తెలిపారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఏదైనా ప్రాంతం గుండా నిర్దేశిత సమయంలో ఎన్ని వాహనాలు వెళ్తున్నాయో లెక్క చూస్తామని, అత్యవసర సమయంలో అక్కడ వాహనాలు ఆగిపోతే ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేస్తామని ఆయన అన్నారు. పశ్చిబెంగాల్ పోలీసులకు పూర్తి సమాచారం అందించిన తర్వాతే సైన్యం ఇక్కడకు వచ్చిందని.. టోల్ ప్లాజాలను ఆర్మీ స్వాధీనం చేసుకుందంటూ వచ్చిన ఆరోపణలు సరికావని ఈస్ట్రన్ కమాండ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. అసోంలోని 18 ప్రాంతాలు, అరుణాచల్ప్రదేశ్లో 13 ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో 6, నాగాలాండ్లో 5, మేఘాలయలో 5, త్రిపుర, మిజొరాంలలో ఒక్కో ప్రాంతంలో ఈ ఎక్సర్సైజులు జరుగుతున్నాయన్నారు. కోల్కతా పోలీసులు మాత్రం సైన్యం ఇక్కడకు రావడం వల్ల ట్రాఫిక్ సమస్య, భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తాయని అంటున్నారు. సచివాలయం, టోల్ ప్లాజా రెండూ సున్నితమైన ప్రాంతాలని, ఇలాంటి చోట్ల సైన్యంఎందుకని మమత అన్నారు. వాళ్లు చెబుతున్న కారణాలు సహేతుకం కావని, వాళ్లు అబద్ధాలు ఆడుతున్నారని చెప్పారు. ఎప్పటికప్పుడు కారణాలు మార్చుకుంటూ వెళ్తున్నారని, వేర్వేరు రాష్ట్రాల్లో వాహనాల కదలికలకు సంబంధించిన పూర్తి సమాచారం కేంద్ర హోం మంత్రిత్వశాఖ వద్ద ఉందని ఆమె అన్నారు. తాను మహారాష్ట్ర, కేరళ, ఒడిషా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో చూశానని, ఎక్కడా ఇలా జరగలేదని ఆమె తెలిపారు. (ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్లో ఇలా చేసినట్లు సైన్యం వివరాలతో సహా చెప్పింది). ''ఇక్కడ ఏం జరుగుతోంది? వాళ్లు కాల్చేస్తారేమోనని నేను భయపడుతున్నాను. నేను బతికున్నా.. చనిపోయినా.. నేను మాత్రం సామాన్య ప్రజల గురించే మాట్లాడతా'' అని అన్నారు. కేంద్రం పదే పదే తప్పులు చేస్తోందని, ఇప్పుడు ఘోరమైన తప్పిదం చేసిందని మండిపడ్డారు. ఇది సమాఖ్య వ్యవస్థమీదే జరిగిన దాడిగా ఆమె అభివర్ణించారు.