assembly blocked
-
ప్రయాణికుల్లా వచ్చి...
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తోందంటూ బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకారులు ఇటీవల ఎన్నడూలేని విధంగా అసెంబ్లీ గేట్ నంబర్–2 వరకు పెద్దసంఖ్యలో రాగలిగారు. నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు జిల్లాల నుంచి ముందస్తు వ్యూహంతో బయలుదేరిన ఏబీవీపీ కార్యకర్తలు సాధారణ ప్రయాణికుల మాదిరిగా, గరిష్టంగా పది మంది చొప్పున ఆర్టీసీ బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణించారు. జెండాలు ఎవరి కంటా పడకుండా వాహనాలు దిగే వరకు జేబుల్లోనే ఉంచుకున్నారు. అసెంబ్లీ చుట్టూ ఉన్న తెలుగు యూనివర్సిటీ, నిజాం కళాశాల వైపుల నుంచి బస్సులు, ఆటోల ద్వారా వచ్చి.. రవీంద్రభారతి, ఆ చుట్టుపక్కల దిగారు. ఉదయం 11.20 కి ఒక్కసారిగా 1, 2 నంబర్ల అసెంబ్లీ గేట్ల వైపు దూసుకొచ్చారు. గేట్–2 వద్దకు చేరుకుని, ఎక్కేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. వారిని కిందికి దింపే క్రమంలో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు లాఠీచార్జీ చేశారు. గేట్లు ఎక్కేందుకు ప్రయత్నించిన వారిని కిందకు లాగేశారు. లాఠీచార్జిలో రాష్ట్ర నాయకులు పృథ్వి సొమ్మసిల్లి పడిపోయాడని, నిహారిక, నరేంద్ర, మల్లికార్జున్ల చేతులకు తీవ్ర గాయాలయ్యాయని ఏబీవీపీ నాయకులు అంబాల కిరణ్, సుమన్శంకర్, రాఘవేంద్ర తెలిపారు. ముట్టడిలో పాల్గొన్న ఏబీవీపీతో పాటు పీడీఎస్యూ నాయకులు 224 మందిని సైఫాబాద్ పోలీసులు అరెస్ట్చేసి నగరంలోని వివిధ పోలీస్స్టేషన్లకు తరలిం చారు. వీరిపై 151 సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కొందరు కార్యకర్తలపై నాన్–బెయిలబుల్ కేసులు నమోదు చేసిన పోలీసులు వారికి నోటీసులిచ్చి విడిచిపెట్టారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, వర్సిటీలలో వైస్చాన్సలర్లను నియమించాలని, జూనియర్, డిగ్రీ కాలేజీలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్లతో ఏబీవీపీ ఈ కార్యక్రమం చేపట్టింది. పీడీఎస్యూకు చెందిన విద్యార్థి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు: ఏబీవీపీ విద్యార్థులపై లాఠీచార్జీని నిరసిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు ఏబీవీపీ పిలుపునిచ్చింది. 24 గంటల్లోగా సీఎం కేసీఆర్ స్పందించి, లాఠీచార్జీ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోకపోతే.. శుక్రవారం తెలంగాణవ్యాప్తంగా కళాశాలల బంద్కు పిలుపునివ్వడానికీ వెనుకాడబోమని హెచ్చరించింది. అరెస్ట్ చేసిన విద్యార్థులందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. -
రణ 'అంగన వాడి'!
-
రణ 'అంగన వాడి'!
హైదరాబాద్: తాము తలపెట్టిన చలో అసెంబ్లీని విజయవంతం చేసే క్రమంలో పోలీసుల నిర్భంధాన్ని సైతం లెక్కచేయకుండా ముందుకు దూకారు అంగన్ వాడీ కార్యకర్తలు. ప్రభుత్వం తమను అడ్డుకోవడానికి చూస్తున్నా.. వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా రణాంగన యుద్దానికి సిద్ధమైయ్యారు. మంగళవారం వేలాది మంది కార్యకర్తలు ఏపీ అసెంబ్లీ అసెంబ్లీ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపుచేసేందుకు ప్రయత్నించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచే అంగన్ వాడీలు ర్యాలీగా బయల్దేరారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద అంగన్ వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసేందుకు యత్నించగా అంగన్ వాడీ కార్యకర్తలు వాగ్వావాదానికి దిగారు. అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ మహిళలందరూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి అసెంబ్లీకి వచ్చే దారులన్నింటిని పోలీసులు దిగ్భందించారు. దీంతో కార్యాలయాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. మరోవైపు జిల్లాలనుంచి హైదరాబాద్ బయలుదేరిన కార్యకర్తల్ని పోలీసులు ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకుంటున్నారు. వార్షిక బడ్జెట్లో తమకు కేటాయింపులు లేవని నిరసనగా అంగన్వాడీ సిబ్బంది ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరే ఏపీ ప్రభుత్వం కూడా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. -
'అంగన్ వార్' ఉద్రిక్తం
మంగళవారం తాము తలపెట్టిన చలో అసెంబ్లీని విజయవంతం చేసేక్రమంలో పోలీసుల నిర్భంధాన్ని సైతం లెక్కచేయకుండా ముందుకు దూకారు అంగన్ వాడీ కార్యకర్తలు. వేలాది మంది కార్యకర్తలు ఏపీ అసెంబ్లీ అసెంబ్లీ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపుచేసేందుకు ప్రయత్నించారు. ఇందిరాపార్క్, ట్యాంక్ బండ్ వద్ద పెద్ద సంఖ్యలో అంగన్ వాడీ కార్యక్తల్ని అరెస్టుచేసిన పోలీసులు వారిని గాంధీనగర్ పీఎస్కు తరలించారు. చంద్రబాబు ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ మహిళలందరూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి అసెంబ్లీకి వచ్చే దారులన్నింటిని పోలీసులు దిగ్భందించారు. దీంతో కార్యాలయాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. మరోవైపు జిల్లాలనుంచి హైదరాబాద్ బయలుదేరిన కార్యకర్తల్ని పోలీసులు ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకుంటున్నారు. వార్షిక బడ్జెట్లో తమకు కేటాయింపులు లేవని నిరసనగా అంగన్వాడీ సిబ్బంది ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరే ఏపీ ప్రభుత్వం కూడా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. -
చలో అసెంబ్లీకి అనుమతి నిరాకరణ
-
చలో అసెంబ్లీకి అనుమతి నిరాకరణ
ఆంధ్రప్రదేశ్ అంగన్ వాడీ కార్యకర్తలు మంగళవారం నిర్వహించతలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో ఇప్పటికే హైదరాబాద్ బయలుదేరిన పలువురు కార్యకర్తలను పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టు చేశారు. విడజవాడ, విశాఖ వంటి ప్రాంతాల్లో ముందస్తు అరెస్టులు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో తమకు కేటాయింపులు లేవని నిరసనగా అంగన్ వాడీ సిబ్బంది ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరే ఏపీ ప్రభుత్వం కూడా వేతనాలు పెంచాని డిమాండ్ చేస్తున్నారు.