‘డేరా’ భూములు స్వాధీనం చేసుకుంటాం
నల్లగొండ ఆర్డీవో వెంకటాచారి
చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మం డలం వెలిమినేడులోని గుర్మిత్ రామ్ రహీం సింగ్ డేరా సచ్చా సౌదాలోని అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుంటామని ఆర్డీవో వెంకటాచారి తెలిపారు. వెలిమినేడు లోని జాతీయ రహదారి వెంట గల డేరా సచ్చా సౌదాను ఆదివారం ఆయన సంద ర్శించారు. భూముల వివరాలను ఆ సంస్థ నిర్వాహకుడు శ్యాంలాల్ను అడిగి తెలుసు కున్నారు. ఆర్డీఓ మాట్లాడుతూ డేరా సచ్చా సౌదాలోని 56 ఎకరాల భూముల్లో 9 ఎక రాల 20 గుంటలు అసైన్డ్ భూములుగా ఉన్నాయని తేలిందని, వాటిని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.