back step
-
విమానాశ్రయాల్లో డ్యూటీ ఫ్రీ షాపులకూ పరోక్ష పన్ను వర్తింపు
న్యూఢిల్లీ: విమానాశ్రయాల్లోని డ్యూటీ ఫ్రీ షాపుల నుంచి ఎలాంటి పరోక్ష పన్నులు వసూలు చేయరాదని ఏప్రిల్ 10వ తేదీన ద్విసభ్య ధర్మాసనం ఇచి్చన తీర్పును తాజాగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెనక్కు తీసుకుంది. అంతర్జాతీయ విమానాశ్రయాలలో అరైవల్, డిపార్చర్ టెరి్మనల్స్ వద్ద డ్యూటీ ఫ్రీ షాపులు కస్టమ్స్ చట్టాల పరిధిలోనికి రావని, సేవా పన్ను వంటి పరోక్ష పన్ను విధింపు కూడదని ద్విసభ్య ధర్మాసనం ఏప్రిల్ 10న రూలింగ్ ఇచ్చింది. అయితే ఈ రూలింగ్లో లోపాలున్నాయని సెంటర్ అండ్ కమీషనర్ ఆఫ్ సెంట్రల్ గూడ్స్ అండ్ సరీ్వస్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ ఆఫ్ ముంబై ఈస్ట్ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎన్ వెంకట్రామన్ చేసిన వాదనలతో ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఏకీభవించింది. వారు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను అనుమతించింది. ఈ కేసులో ప్రభుత్వ వాదనలను ద్విసభ్య ధర్మాసనం వినలేదని, తద్వారా ‘‘సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన’’ జరిగిందని అదనపు సొలిసటర్ జనరల్ చేసిన వాదనతో అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించింది. తీర్పును రీకాల్ చేసినందున ప్రభుత్వం సేవా పన్నుగా వసూలు చేసిన రూ.200 కోట్లను తిరిగి పొందే ప్రయత్నాలను (పన్ను రిఫండ్ క్లెయిమ్) విరమించుకోవాలని కూడా ఈ కేసులో పారీ్టగా ఉన్న ఫ్లెమింగో ట్రావెల్ రిటైల్కు సుప్రీం సూచించింది. -
దేత్తడి హారిక షాకింగ్ నిర్ణయం
తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా బిగ్బాస్ ఫేమ్ దేత్తడి హారిక నియామకంపై రోజుకో పరిణామం చోటుచేసుకుంటోంది. దీనిపై తెలంగాణ ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హారిక ఎవరో తెలియదు అని చెప్పడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దేత్తడి హారిక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్టు హారిక ప్రకటించింది. యూట్యూబ్ స్టార్గా ఉన్న హారిక బిగ్బాస్ సీజన్ 4లో టాప్ -5లో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) బ్రాండ్ అంబాసిడర్గా మహిళా దినోత్సవం రోజు ప్రకటించారు. అప్పటి నుంచి వివాదం ఏర్పడింది. అయితే తాజాగా హారిక ఆ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో విడుదల చేసింది. ‘‘అందరికీ నమస్తే. ఒక చిన్న క్విక్ అప్డేట్.. మహిళా దినోత్సవం రోజు నన్ను టీఎస్టీడీసీకి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేయడం దగ్గర నుంచీ ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే.. కొన్ని కారణాలతో ఆ పదవి నుంచి తప్పుకుంటున్నా. నాకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు. ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి. లవ్యూ ఆల్’’ అంటూ హారిక చెప్పుకొచ్చింది. హారిక బ్రాండ్అంబాసిడర్ అంశం తెలంగాణతో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. మూడు రోజులుగా ఆమె చుట్టూనే వార్తలు నడిచిన విషయం తెలిసిందే. అయితే హారిక నియామకం వెనకాల ఏం జరిగిందో అనే విషయం సస్పెన్స్గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ కొనసాగుతోంది. Here is the update .As you all know, Was appointed for Promoting and Marketing the Tourism dept hotels and properties earlier,but then will not be continuing it further due to several other reasons .And thanks to all my well-wishers,and sorry for all the disappointment,love u all pic.twitter.com/SzLAaIPxwR — Alekhya Harika (@harika_alekhya) March 10, 2021 -
రైతు ఉద్యమం: వెనక్కి తగ్గిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్తో రైతులు చేస్తున్న సుదీర్ఘ ఉద్యమంలో తాజా పరిణామం ఆసక్తికరంగా మారింది. జనవరి 26న ఢిల్లీలో హింసాత్మక ఘటనలు, ఫిబ్రవరి 7న తలపెట్టిన దేశవ్యాప్త నిరసన కార్యక్రమం నేపథ్యంలో రైతులను నిలువరించేందుకు ఢిల్లీ సరిహద్దు వద్ద రోడ్లపై భారీ ఎత్తున ఇనుప మేకుల ఏర్పాటు, కందకాలు, ముళ్ల కంచెలు, కాంక్రీట్ దిమ్మెల ఏర్పాటుపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. సరిహద్దుల్లో అమర్చిన ఇనుప మేకులు, ముళ్ల కంచెలను తొలగించింది. ఈ ఘటనకుసంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే దీనిపై ఢిల్లీ పోలీసుల అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. (రైతులతోనే యుద్ధమా? వైరలవుతున్న ఫోటోలు) అటు రైతు ఉద్యమకారులను కలవడానికి ఘజియా పూర్లోని ఢిల్లీ సరిహద్దుకు చేరుకున్న పది రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 15 మంది ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. శిరోమణి అకాలీదల్కు చెందిన హరి సిమ్రత్ కౌర్ బాదల్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) కు చెందిన సుప్రియ సులే, డీఎంకెకు చెందిన కనిమెళి, తృణమూల్ కాంగ్రెస్కు చెందిన సౌతా రాయ్ ఉన్నారు. కాంక్రీట్ బారికేడ్స్, ముళ్ల కంచెల వెనుక రైతులున్న దృశ్యాలను చూసి షాకయ్యానంటూ హరిసిమ్రత్ పేర్కొన్నారు. (రైతు ఉద్యమం : ఒక్కసారిగా కుప్పకూలిన వేదిక) మరోవైపు కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకునేంతవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని రైతు సంఘాలు తెగేసి చెప్పాయి. అటు ఈ వ్యవహారంపై రైతులతో చర్చలు జరిపాలని, చట్టాలను రద్దు చేయాలంటూ పార్లమెంటు ఉభయసభల్లోనూ విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. #ghazipurborder #FarmersProtest https://t.co/zlrWJngT3d — Harsimrat Kaur Badal (@HarsimratBadal_) February 4, 2021 -
ఆధార్కు వెనకడుగు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూ రికార్డుల ప్రక్షాళనతో బినామీల బాగోతం వెలుగుచూస్తోంది. ఆధార్ నంబర్ అనుసంధానంతో ఇన్నాళ్లు రికార్డులకే పరిమితమైన భూముల వ్యవహారం బాహ్యప్రపంచానికి తెలుస్తోంది. రెవెన్యూ రికార్డుల నవీకరణకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. ఆధార్ విశిష్ట సంఖ్యను కూడా పట్టాదార్ పాస్ పుస్తకానికి జోడిస్తోంది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో భూ సమగ్ర సమాచారం ఆన్లైన్లో నిక్షిప్తమవుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే క్షేత్రస్థాయిలో రికార్డులను పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేస్తున్న రెవెన్యూయంత్రాంగం తాజాగా ఆ సమాచారాన్ని క్రోడీకరిస్తోంది. కాగా, ఈ ప్రక్షాళన కేవలం రికార్డుల అప్డేట్ వరకే పరిమితమవుతుందని భావించిన బడాబాబులు.. ఆధార్ సీడింగ్ తప్పనిసరి చేయడంతో కలవరం చెందుతున్నారు. ఒకవేళ ఆధార్ సంఖ్యను ఇవ్వకపోతే సదరు భూమిని బినామీల జాబితాలో చేరుస్తామని ప్రకటించడంతో వారిలో ఆందోళన మొదలైంది. జిల్లాలో ఇప్పటివరకు కేవలం 79.30 శాతం మాత్రమే ఆధార్ నంబర్ను అప్లోడ్ చేశారు. మిగతా 20.70 శాతం మంది ఇంకా ఆధార్ ఇవ్వకుండా దాటవేస్తున్నారు. ఆధార్ ఇవ్వని జాబితాలో అత్యధికం శివారు మండలాలే ఉన్నాయి. సరూర్నగర్ 1.45 శాతం, శేరిలింగంపల్లి 6.74 శాతం, రాజేంద్రనగర్ 20.95 శాతం, గండిపేట 46.23 శాతం మాత్రమే నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో భూముల విలువ నింగినంటింది. నల్లధనం కలిగిన సంపన్నవర్గాలు, సినీరంగ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్లు ఈ ప్రాంతంలో ఇబ్బడిముబ్బడిగా భూములను కొనుగోలు చేశారు. రియల్టీ కోణంలో ఆలోచించిన ఆయా వర్గాలు భూముల్లో పెట్టుబడులు పెట్టారు. ఆశించిన స్థాయిలో రేటు రాగానే అమ్ముకొని భారీగా గడిస్తున్నారు. ఈ క్రమంలోనే స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెడుతున్న పెద్దలు తమ వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేసేందుకు వెనుకాడుతున్నారు. దీంతో చాలావరకు వీరి తరఫున కొందరు బ్రోకర్లే రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ వ్యవహారాలను చక్కబెడతారు. తాజాగా ఇప్పుడు 1బీ రికార్డు ఆధారంగా గుర్తించిన ప్రతి సర్వేనంబర్, భూ విస్తీర్ణానికి సంబంధించిన యజమాని సమాచారాన్ని తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఒకవేళ ఈ సమాచారం గనుక రాకపోతే సదరు ఆస్తిని బ్లాక్లిస్ట్లో చేరుస్తామని ప్రకటించింది. అయినప్పటికీ, ఇంకా చాలామంది తమ ఆధార్నంబరే కాకుండా ఫోన్నంబర్ను కూడా ఇచ్చే విషయంలో తటపటాయిస్తున్నారు. 2.56 లక్షల నంబర్లకుగాను ఇప్పటివరకు 1.05 లక్షల నం బర్లు మాత్రమే నమోదు కావడం గమనార్హం. -
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ వెనుకంజ
-
మంచి చేస్తే మద్దతిస్తాం..లేకుంటే యుద్ధమే
చీప్ లిక్కర్పై ప్రభుత్వం వెనక్కు తగ్గటం హర్షణీయం వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి కూసుమంచి: మంచి చేస్తే మద్దతిస్తాం.. లేకుంటే యుద్ధం చేస్తామని వైఎస్ఆర్సీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. చీప్లిక్కర్పై ప్రభుత్వం వెనక్కు తగ్గటం హర్షణీయమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్కు పార్టీ తరఫున అభినందనలు తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చౌట్పల్లిలో శుక్రవారం రాత్రి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. సారాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని కోరారు. ఇందుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. మంచి పనులు చేస్తే తమ పార్టీ మద్దతు ఉంటుందని..లేకుంటే యుద్ధం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాదిన్నర కాలంగా ఆవగింజంతయినా అభివృద్ధి చేయలేదన్నారు. ఇకనైనా మేల్కొని ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలన్నారు. పక్కాఇళ్ల పెండింగ్ బిల్లులను విడుదల చేయూలని కోరారు. జిల్లాలోని పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాల్టీల్లో తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం చేస్తామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టుల పేర్లు, డిజైన్లు, స్థలాలు మార్చడం సరికాదన్నారు. వైఎస్ హయూం స్వర్ణయుగమని, దాన్ని ఎవరు రూపుమాపాలని చూసినా ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. -
బంగారుతల్లికి బాలరిష్టాలు
-
ముగ్గురు రాజీనామా...మిగిలినవారు వెనకడుగు