Bangladesh cricket
-
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025 విజేత ఫార్చూన్ బారిషల్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025 ఎడిషన్ విజేతగా ఫార్చూన్ బారిషల్ నిలిచింది. ఇవాళ (ఫిబ్రవరి 7) జరిగిన ఫైనల్లో బారిషల్.. చిట్టగాంగ్ కింగ్స్పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన చిట్టగాంగ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్లు ఖ్వాజా నఫే (66), పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ (78 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. వీరిద్దరు తొలి వికెట్కు 121 పరుగులు జోడించారు. ఆతర్వాత వచ్చిన గ్రహం క్లార్క్ (44) కూడా రాణించడంతో కింగ్స్ భారీ స్కోర్ చేసింది. బారిషల్ బౌలర్లలో మొహమ్మద్ అలీ, ఎబాదత్ హొసేన్ తలో వికెట్ పడగొట్టారు.195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బారిషల్కు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (54), తౌహిద్ హృదోయ్ (320 శుభారంభాన్ని అందించారు. అనంతరం కైల్ మేయర్స్ (46) మెరుపు ఇన్నింగ్స్ ఆడి బారిషల్ను విజయానికి చేరువ చేశాడు. ఆఖర్లో రిషద్ హొసేన్ (18 నాటౌట్) రెండు సిక్సర్లు బాది బారిషల్కు విజయాన్ని ఖరారు చేశాడు. మరో మూడు బంతులు మిగిలుండగానే బారిషల్ విజయతీరాలకు చేరింది. కింగ్స్ బౌలర్లలో షోరిఫుల్ ఇస్లాం 4 వికెట్లు తీసి బారిషల్ను భయపెట్టాడు. నయీమ్ ఇస్లాం 2, బినుర ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. ఫార్చూన్ బారిషల్ టైటిల్ సాధించడం వరుసగా ఇది రెండో సారి కావడం విశేషం. -
టీ20 వరల్డ్కప్-2024పై నీలినీడలు! భారత్ వేదికగా?
బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అంశంపై జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో అక్కడి పరిస్థితి చేజారింది. దీంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్కు చేరుకున్నారు. ఆమె భారత్ నుంచి లండన్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ఈ ఏడాది ఆక్టోబర్లో జరగనున్న మహిళల టీ20 వరల్డ్కప్పై నీలినీడలు కమ్ముకున్నాయి. టోర్నమెంట్ ఆరంభానికి కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉండడంతో బంగ్లాలోని పరిస్థితులను ఐసీసీ కూడా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆధికారులు మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే బంగ్లాలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ మెగా టోర్నమెంట్ను ప్రత్యామ్నాయ వేదికపై నిర్వహించాలని ఐసీసీ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. భారత్, శ్రీలంక, యూఏఈలను బ్యాకప్ ఆప్షన్స్గా ఐసీసీ ఉంచినట్లు సమాచారం."బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB), ఆ దేశ భద్రతా ఏజెన్సీలతో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాం. అక్కడ పరిస్థితిలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాము. ఈ మెగా టోర్నీలో పాల్గోనే ఆటగాళ్లే భద్రత మా ప్రాధన్యత. అందుకోసం మేము ఈ నిర్ణయం తీసుకోవడానికైనా సిద్దం. ఈ మెగా టోర్నీ నిర్వహణపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని" ఐసీసీ అధికారి ప్రతినిథి ఒకరు పేర్కొన్నారు. కాగా ఈ మెగా టోర్నీ ఆక్టోబర్ 3 నుంచి ఆక్టోబర్ 20 వరకు జరగనుంది. -
టీ20లకు గుడ్బై చెప్పిన స్టార్ క్రికెటర్
పొట్టి క్రికెట్ నుంచి సీనియర్లు వరుసగా వైదొలుగుతుండటంతో ఆశించిన స్థాయి ప్రదర్శన కనబర్చ లేక వరుస పరాజయాల బాట పట్టిన బంగ్లాదేశ్కు తాజాగా మరో షాక్ తగిలింది. ఆ జట్టు మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్, స్టార్ వికెట్కీపర్ ముష్ఫికర్ రహీం.. పొట్టి క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఆదివారం ట్విటర్ వేదికగా ప్రకటన విడుదల చేశాడు. టెస్ట్లు, వన్డేలపై ఫోకస్ పెట్టేందుకు టీ20ల నుంచి వైదొలుగుతున్నట్లు రహీం వెల్లడించాడు. అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకున్నా.. ఫ్రాంచైజీ క్రికెట్కు మాత్రం అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. I would like to announce my retirement from T20 INTERNATIONALS and focus on Test and ODI formats of the game. I will be available to play franchise leagues when the opportunity arrives. Looking forward to proudly represent my nation in the two formats-MR15 — Mushfiqur Rahim (@mushfiqur15) September 4, 2022 రహీం.. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్లో బ్యాటింగ్, వికెట్కీపింగ్ విభాగాల్లో పేలవ ప్రదర్శన (1, 4 పరుగులు) కనబర్చి జట్టు పరాజయాలకు పరోక్ష కారణంగా నిలిచాడు. శ్రీలంకతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో కీలక సమయంలో క్యాచ్ను జారవిడిచి తన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడానికి కారణమయ్యాడు. కాగా, తమ కంటే చిన్న జట్ల చేతుల్లో కూడా వరుస పరాజయాలు ఎదుర్కొంటూ ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ ఈ ఏడాది ఇది రెండో షాక్ అని చెప్పాలి. ఇదే ఏడాది జులైలో సీనియర్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ టీ20లకు గుడ్బై చెప్పి తొలి షాకివ్వగా.. తాజాగా ముష్ఫికర్ బంగ్లాను మరో దెబ్బేశాడు. 35 ఏళ్ల ముష్ఫికర్.. బంగ్లా తరఫున 82 టెస్ట్ల్లో 9 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీల సాయంతో 5235 పరుగులు, 236 వన్డేల్లో 8 సెంచరీలు, 42 హాఫ్ సెంచరీల సాయంతో 6774 పరుగులు, 102 టీ20ల్లో 115 స్ట్రయిక్ రేట్తో 6 హాఫ్ సెంచరీ సాయంతో 1500 పరుగులు సాధించాడు. వికెట్కీపింగ్లో రహీం అన్ని ఫార్మాట్లలో కలిపి 449 మందిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు. చదవండి: 'ఆసియా కప్లా లేదు.. బెస్ట్ ఆఫ్ త్రీ ఆడుతున్నట్లుంది' -
ఫిక్సింగ్ టు కుకింగ్
ఒకప్పుడు అష్రాఫుల్ బంగ్లాదేశ్లో పెద్ద క్రికెట్ స్టార్. తన ముద్దుపేరు ‘బంగ్లా సచిన్’. ఒకప్పుడు ఆ దేశంలోని కార్పొరేట్ సంస్థలన్నీ తన వెనక పడ్డాయి. కానీ ఇప్పుడు సీన్ మారింది. 29 ఏళ్ల వయసులో తన సహచరులు ఇంకా ఆడుతుంటే తాను మాత్రం క్యాటరింగ్ ఆర్డర్స్ కోసం అదే కార్పొరేట్ కంపెనీల చుట్టూ తిరుగుతున్నాడు. అవును... అష్రాఫుల్ ఇప్పుడు ఢాకాలో ఓ చైనీస్ రెస్టారెంట్ నడుపుతున్నాడు. బత్తినేని జయప్రకాష్ ఓల్డ్ ఢాకా... సాయంత్రం 7 గంటలు... వెళ్లాల్సిన ప్రదేశం షెజ్వాన్ గార్డెన్స్... విపరీతమైన రద్దీ.. చుట్టూ బోర్డులన్నీ బెంగాలీలో... ఒక్కళ్లకీ హిందీ, ఇంగ్లీష్ రావడం లేదు... ఎలా..? ‘మీరు అడ్రస్ అడిగితే ఎవరూ చెప్పరు. అష్రాఫుల్ రెస్టారెంట్ ఎక్కడ?’ అని అడగండి (ఫోన్లో అష్రాఫుల్). ఫర్వాలేదు... అష్రాఫుల్కు ఇంకా గిరాకీ బాగానే ఉంది. పది నిమిషాల్లోనే రెస్టారెంట్కు వెళ్లగలిగిన పరిస్థితి. మ్యాచ్ ఫిక్సర్గా ముద్రపడ్డా తన రెస్టారెంట్కు డిమాండ్ కూడా బాగానే ఉంది. ఓడలు బండ్లు... బండ్లు ఓడలు కావడం సహజం. పరిస్థితి బాగోక మారిపోయేవాళ్లు కొంతమందైతే... చేజేతులా కెరీర్ను నాశనం చేసుకునేవాళ్లు మరికొందరు. ఇందులో రెండో కోవలోకి వచ్చే క్రికెటర్ అష్రాఫుల్. 2013 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో ఢాకా గ్లాడియేటర్స్కు కెప్టెన్గా ఆ జట్టు ఆడిన మ్యాచ్ను ఫిక్స్ చేశాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? దీనివల్ల ఎదురైన పరిణామాలకు ఎలా స్పందించాడు? భవిష్యత్ ఏంటి? ఇలా అనేక ప్రశ్నలకు అష్రాఫుల్ చెప్పిన సమాధానాలు అతడి మాటల్లోనే... కోపంతో చేశా బంగ్లాదేశ్ లీగ్ తొలి సీజన్లో ఢాకా గ్లాడియేటర్స్ నన్ను 1.60 కోట్ల టాకా(బంగ్లాదేశ్ కరెన్సీ)లకు కొనుక్కుంది. రెండో సీజన్ సమయానికి నా ఫామ్ పోయింది. కేవలం 48 లక్షల టాకాలకే అదే జట్టు కొనుక్కుంది. అయితే తొలి సీజన్కు సంబంధించి వాళ్లు నాకు కేవలం 86 లక్షల టాకాలు మాత్రమే ఇచ్చారు. మిగతావి ఇవ్వలేదు. దీంతో ఢాకా జట్టు ఓనర్కి, నాకు చాలాసార్లు వాగ్వాదాలు జరిగాయి. ఒక రోజు ఒక బుకీ నా దగ్గరకు వచ్చి 10 లక్షల టాకాలు ఇస్తా, మ్యాచ్ ఫిక్స్ చేయమని అడిగాడు. కానీ నేను ఒప్పుకోలేదు. కానీ ఓ రోజు ఢాకా ఓనర్తో వాగ్వాదం జరిగిన తర్వాత... నేను ఆ కోపంలో ఉండగానే బుకీ వచ్చాడు. 10 లక్షల టాకాలు ఇస్తా మ్యాచ్ ఓడిపోమని అడిగాడు. ఆ సమయంలో ఏం ఆలోచించానో తెలియదు. నా డబ్బులు నాకు రాలేదని కోపం బహుశా నన్ను అలా ఆలోచించేలా చేసిందేమో. నేను ఒప్పుకున్నాను. నా జీవితంలో నేను చేసిన తప్పు అదొక్కటే. డబ్బు మనిషిని కాను నిజానికి నేను డబ్బు మనిషినే అయితే గనక ఎప్పుడో ఐసీఎల్లోనే నాకు 15 కోట్ల టాకాలకు కాంట్రాక్ట్ ఇస్తామని వచ్చారు. కానీ ఆ లీగ్లో నేను ఆడితే బంగ్లాదేశ్ అభిమానులు నన్ను డబ్బు మనిషిగా భావిస్తారని వెళ్లలేదు. దేశం, అభిమానులు ముఖ్యమని అనుకున్నా కాబట్టే అప్పట్లో అంత భారీ మొత్తం ఇస్తామన్నా వెళ్లలేదు. ఐసీసీ విచారణ ఐసీసీ విచారణలో మొదట గంట పాటు నేనేం చెప్పలేదు. కానీ అప్పటికే నా మీద నిషేధం ఖాయమని తెలుసు. ఓ గంట తర్వాత ఎందుకో నా మనసుకు అనిపించింది. ఎందుకు అబద్దం చెప్పడం.? అదేదో నిజం చెప్పే నిషేధాన్ని ఎదుర్కొందాం అనుకున్నాను. బంగ్లాదేశ్ క్రికెట్ నాకు చాలా ఇచ్చింది. అభిమానులు నన్ను ఎంతో ఆరాధించారు. కానీ తిరిగి వాళ్లకు నేనేం ఇచ్చాను. ఎలాగూ నా కెరీర్ ముగిసిపోతోంది. ఇక ఎందుకు అబద్దం ఆడటం? స్నేహితులతో కలిసి రెస్టారెంట్ నిషేధం తర్వాత స్నేహితులు నాలో ధైర్యం పెంచారు. వాళ్లలో ఎక్కువమంది చిన్నప్పుడు నాతో కలిసి క్రికెట్ ఆడినవాళ్లే. నేనేంటో వాళ్లకు తెలుసు. అందుకే అందరం కలిసి ఈ రెస్టారెంట్ (షెజ్వాన్ గార్డెన్) పెట్టుకున్నాం. మా వాళ్లు సంబంధాలు చూస్తున్నారు. త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా. ఇప్పటివరకూ గర్ల్ఫ్రెండ్ను వెతుక్కోవడానికి సమయం సరిపోలేదు. క్రికెట్తో బిజీగా గడిపాను. ఇప్పుడు సమయం దొరికింది. కాస్త దైవం మీద కూడా శ్రద్ధ పెరిగింది. హజ్ వెళ్లి రావాలని అనుకుంటున్నాను. ఆ రోజులు మరవలేను 2001లో 17 ఏళ్ల వయసులో బంగ్లాదేశ్ క్రికెట్ రాతను మార్చాను నేను. ఫుట్బాల్ను పిచ్చిగా ప్రేమించే దేశంలో అభిమానులను క్రికెట్ వైపు మళ్లించింది నేనే. 17 ఏళ్ల వయసులో తొలి టెస్టు సెంచరీ చేయడంతో నాకు క్రేజ్వచ్చింది. ఓ దశలో జట్టు ఎలా ఆడినా, గెలిచినా ఓడిపోయినా వేరే వాళ్లు పరుగులు చేసినా... ఏం జరిగినా అన్ని పేపర్లలో మొదటి పేజీలో నా ఫొటోనే వచ్చేది. ఒకప్పుడు ‘అష్రాఫుల్’ అనేది బంగ్లాదేశ్ క్రికెట్కు మారుపేరు. క్షమించండి: ప్రపంచవ్యాప్తంగా అభిమానులు నన్ను ఆదరించారు. కానీ నేను తిరిగి వాళ్లకు ఏమీ ఇవ్వలేకపోయాను. కేవలం ఒక్క బీపీఎల్ మ్యాచ్లో మాత్రమే నేను తప్పు చేశాను. నన్ను క్షమించి మరొక్క అవకాశం ఇస్తే అందరి రుణం తీర్చుకుంటాను. -
మాకు పోయేదేం లేదు
ఈ దృక్పథంతోనే ఆడతాం స్వదేశంలో ప్రపంచకప్లో ఒత్తిడి సహజం కొన్ని ఓటములు బాధిస్తాయి షకీబ్ అల్ హసన్ ఇంటర్వ్యూ బంగ్లాదేశ్ క్రికెట్లో అతి పెద్ద స్టార్ షకీబ్ అల్ హసన్. టి20 క్రికెట్లో అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడు. నిజానికి భారత్ లాంటి పెద్ద జట్టులో అయినా స్థానం సంపాదించుకోగల నైపుణ్యం తన సొంతం. అందుకే షకీబ్ పేరు వింటే బంగ్లాదేశ్ ఊగిపోతుంది. ఇక స్వదేశంలో తనమీద ఎన్నో అంచనాలు. అయితే భారత క్రికెటర్ల తరహాలో ఇవన్నీ అలవాటయ్యాయంటున్నాడు షకీబ్. ఢాకా నుంచి బత్తినేని జయప్రకాష్ అతిశయోక్తిలా అనిపిస్తుందేమో గానీ... భారత్లో సచిన్కు ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో, బంగ్లాదేశ్లో షకీబ్కూ అదే స్థాయిలో అభిమానులు ఉన్నారు. అతని పేరు వినిపిస్తేనే ఊగిపోతున్నారు. అతను ఆడుతుంటే బిజీగా ఉండే ఢాకా రోడ్లు ఖాళీ అయిపోతున్నాయి. అంత స్టార్డమ్ ఉన్నా షకీబ్ నేల మీదే ఉన్నాడు. అందరినీ మర్యాదగా పలకరిస్తాడు. ఓ గొప్ప క్రికెటర్తో పాటు మంచి మనిషిగా కూడా బంగ్లాదేశ్ క్రికెట్ సర్కిల్లో పేరు తెచ్చుకున్న షకీబ్ వివిధ అంశాలపై చెప్పిన విశేషాలు... బంగ్లాదేశ్లో టి20 ప్రపంచకప్... మా అందరికీ గొప్ప అవకాశం. ఇలాంటి టోర్నీలు బాగా నిర్వహించడం వల్ల క్రికెట్కు ఇంకా క్రేజ్ పెరుగుతుంది. 2011 వన్డే ప్రపంచకప్ నిర్వహణ ద్వారా బంగ్లాదేశ్ స్థాయి ఏమిటో ప్రపంచానికి తెలిసింది. ఇక ఈ ప్రపంచకప్ కూడా విజయవంతంగా నడుస్తోంది. ఏ రెండు దేశాల మధ్య మ్యాచ్లు జరిగినా అభిమానులు బాగా వస్తున్న సంగతి గమనించే ఉంటారు. నాణ్యమైన క్రికెట్ను బంగ్లా అభిమానులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఇలాంటి టోర్నీలో ఒత్తిడి... దేశం తరఫున ఏ మ్యాచ్లో ఆడినా ఏ క్రికెటర్కైనా ఒత్తిడి ఉండటం సహజం. ముఖ్యంగా ఉపఖండంలో అన్ని జట్లదీ ఇదే పరిస్థితి. భారత్ క్రికెటర్ల తరహాలోనే మాకు కూడా అంచనాలు, ఒత్తిడీ అలవాటయ్యాయి. క్లిష్టమైన గ్రూప్లో ఆడటం నిజాయతీగా చెప్పాలంటే ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీల్లో, ఈ దశలో (సూపర్-10) అన్నీ పెద్ద జట్లే ఉంటాయి. నాలుగు ప్రపంచ చాంపియన్ జట్లతో ఆడటం కచ్చితంగా క్లిష్టమైన ప్రక్రియే. అయితే ఏ మ్యాచ్లో అయినా మా పూర్తి సామర్థ్యంతో ఆడటం ముఖ్యం. ఈ జట్ల చేతిలో ఓడినా మాకు పోయేదేం లేదు. స్వదేశంలో ప్రపంచకప్ మ్యాచ్ ఆడటం మరింత ఒత్తిడితో కూడుకున్న అంశం. స్పిన్ బలం టోర్నీలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి మా జట్టు బలంగా ఉందనే అనుకోవాలి. మా జట్టులో కనీసం నలుగురు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. బ్యాటింగ్ విషయంలో మాత్రం మేం బాగా మెరుగుపడాలి. హాంకాంగ్ చేతిలో ఓటమి కొన్నిసార్లు కొన్ని ఓటములను జీర్ణించుకోలేం. బాగా బాధ కలిగిస్తాయి. హాంకాంగ్ చేతిలో ఓటమి కూడా అలాంటిదే. మా చేతిలో పాకిస్థాన్ లేదా భారత్ లాంటి జట్టు ఓడిపోయినప్పుడు ఆ జట్టు క్రికెటర్లు కూడా ఇలాగే అనుకుంటారేమో. ఇటీవల కాలంలో అభిమానులకు ఇచ్చిన సందేశం మేం గెలిస్తే ఆకాశానికి ఎత్తుతారు. ఓడిపోయినప్పుడు తిడతారు. ఇది మా దగ్గర సహజం. మా దగ్గర నుంచి మంచి ఆటను ఆశిస్తారు. ఇలాంటి పెద్ద టోర్నీలో టైటిల్ గెలవాలనే అంచనా కరెక్ట్ కాదు. అభిమానులకు ఇదే చెప్పాను. ఎలాంటి అంచనాలు లేకుండా ఆటను ఆస్వాదించాలని కోరాను. -
పాక్పై బంగ్లాదేశ్ రికార్డు స్కోర్