Bee Alert
-
బీ అలెర్ట్!
– నేరస్తులపై ఉక్కుపాదం – అర్ధరాత్రి నగరంలో కార్డన్ సర్చ్ – 26 మంది అనుమానాస్పద వ్యక్తులు, ముగ్గురు రౌడీ షీటర్లు, 26 ద్విచక్ర వాహనాలు, కారు స్వాధీనం – 750 మందితో మూకుమ్మడి తనిఖీలు తిరుపతి క్రైం : నగరంలో నేరస్తులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆకస్మిక తనిఖీలు, కార్డన్ సర్చ్, నాకాబందీ వంటి కార్యక్రమాలు ముమ్మరం చేసి, నేరస్తుల భరతం పడుతున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం తెల్లవారుజామున 1గంట నుంచి 4 గంటల వరకు నగరంలోని జీవకోన, క్రాంతినగర్, రాజీవ్గాంధీ కాలనీల్లో కార్డన్ సర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో 750 మంది పోలీసులు అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి ఆదేశాల మేరకు ఏఎస్పీ స్వామి, డీఎస్పీ కనకరాజు ఆధ్వర్యంలో ఏడుగురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు 58, హెడ్కానిస్టేబుళ్లు 80, పీసీలు 400, ఆర్ముడ్ రిజర్వ్డ్ ఫోర్సు 100, హోంగార్డ్స్ 100 మంది ఇలా సుమారు 750 మందితో తనిఖీలు నిర్వహించారు. ఉక్కుపాదం ఇటీవల దేశవిదేశాల్లో నెలకొంటున్న ఉగ్రవాదులదాడులు, మరోవైపు ఇంటెలిజెన్సి వర్గం వారు తిరుమలకు ప్రమాద హెచ్చరికలు జారీచేస్తున్న నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే ఎర్ర స్మగ్లర్లు, దొంగల భరతం పట్టేందుకే తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు చెబుతున్నారు. కలకలం పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి నగరంలోని రాజీవ్గాంధీ కాలనీ, జీవకోన, క్రాంతినగర్లో తెల్లవారు జామున 4 గంటల వరకు జల్లెడపట్టారు. దీంతో ఆయా పాంతాల్లో కలకలం రేగింది. ఏం జరిగింది.. ఏం జరుగుతోందో తెలియక స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇంతమంది పోలీసులను ఒకేసారి చూసేసరికి ఏదో జరిగిపోయిందన్న అపోహలు చక్కర్లు కొట్టాయి. అదుపులో పలువురు నగరంలోని రాజీవ్గాంధీ కాలనీ, జీవకోన, క్రాంతినగర్లో అనుమానిత వ్యక్తులు, దొంగల కోసం పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఇందులో 26 మంది అనుమానిత వ్యక్తులు, మరో ముగ్గురు రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు. సరైన ఆధారాలులేని 28 ద్విచక్ర వాహనాలు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టి పూర్తిస్థాయిలో దొంగలను ఏరివేస్తామని అర్బన్ జిల్లా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. -
బీ అలర్ట్ !
సాక్షి, ఏలూరు (పశ్చిమగోదావరి) : సమైక్యాంధ్ర ఉద్యమం, ఎన్నికలు తరుముకొస్తున్న వేళ పోలీసులు అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని డీజీపీ బి. ప్రసాదరావు ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రసాదరావు తొలిసారిగా ఆదివారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చారు. శాంతిభద్రతలు, సమైక్యాంధ్ర ఉద్యమం, రానున్న ఎన్నికలపై కోస్తా రీజియన్ ఐజీ, ఏలూరు రేంజ్ డీఐజీ, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల అధికారులతో స్థానిక ఎస్పీ కార్యాలయం సమావేశ మందిరంలో సమీక్షించారు. జిల్లా పరిస్థితులు, సమైక్యాంధ్ర ఉద్యమంలో వ్యవహరించాల్సిన తీరు, వచ్చే ఎన్నికలకు సమాయత్తం వంటి అంశాలపై చర్చించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే బైండోవర్లపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు అదనపు బలగాలు రానున్న ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నట్టు డీజీపీ తెలిపారు. 2009 ఎన్నికల నిర్వహణలో అమలు చేసిన విధానాలను దృష్టిలో ఉంచుకుని 2014 ఎన్నికలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అదనపు బలగాల విషయాన్ని ఇప్పటికే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఎన్నికల కమిషన్ సూచనల ప్రకారం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటామని డీజీపీ తెలిపారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగానే పోలీస్ సిబ్బంది బదిలీలు జరిగాయన్నారు. సైబర్, ఆన్లైన్ బ్యాంకింగ్ నేరాలను అరికట్టేందుకు సంబంధిత సిబ్బందికి వివిధ మాడ్యూల్స్ ద్వారా నిరంతరం శిక్షణ ఇస్తున్నామన్నారు. బంగ్లాదేశ్, దుబాయ్ నుంచి రాష్ర్ట్రంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న నకిలీ కరెన్సీని పూర్తిగా నిరోధించేందుకు సీఐడీ విభాగంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలీసు శాఖలో వివిధ హోదాలకు సంబంధించి పదోన్నతుల విషయంలో కొందరు ట్రిబ్యునల్, కోర్టులను ఆశ్రయించడం వల్ల జాప్యం జరిగిందని, దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీనియార్టీ జాబితాను రూపొందించి ప్రభుత్వానికి పంపించినట్టు చెప్పారు. సమీక్షలో కోస్తా రీజియన్ (విశాఖపట్నం) ఐజీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు, ఏలూరు రేంజ్ డీఐజీ విక్రమ్సింగ్మాన్, పశ్చిమ ఎస్పీ ఎస్. హరికృష్ణ, కృష్ణా జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు, విజయవాడ పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎన్.శివశంకరరెడ్డి, రాజమండ్రి అర్భన్ పోలీస్ జిల్లా ఎస్పీ రవికుమార్మూర్తి, మూడు జిల్లాల ముఖ్య అధికారులు పాల్గొన్నారు. -
బీ అలర్ట్..!
సాక్షి, ఏలూరు:సమైక్యాంధ్ర ఉద్యమం, ఎన్నికలు తరుముకొస్తున్న వేళ పోలీసులు అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని డీజీపీ బి.ప్రసాదరావు ఆదేశించారు. ఎన్నికలయ్యేంత వరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రసాదరావు తొలిసారిగా ఆదివారం జిల్లాకు వచ్చారు. శాంతిభద్రతలు, సమైక్యాంధ్ర ఉద్యమం, రానున్న ఎన్నికలపై కోస్తా రీజియన్ ఐజీ, ఏలూరు రేంజ్ డీఐజీ, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల అధికారులతో స్థానిక ఎస్పీ కార్యాలయం సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. జిల్లా పరిస్థితులు, సమైక్యాంధ్ర ఉద్యమంలో వ్యవహరించాల్సిన తీరు, వచ్చే ఎన్నికలకు సమాయత్తం వంటి అంశాలపై చర్చించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే బైండోవర్లపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరంవిలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు అదనపు బలగాలు రానున్న ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నట్టు డీజీపీ తెలిపారు. 2009 ఎన్నికల నిర్వహణలో అమలు చేసిన విధానాలను దృష్టిలో ఉంచుకుని 2014 ఎన్నికలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అదనపు బలగాల విషయాన్ని ఇప్పటికే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఎన్నికల కమిషన్ సూచనల ప్రకారం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటామని డీజీపీ తెలిపారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగానే పోలీస్ సిబ్బంది బదిలీలు జరిగాయన్నారు. సైబర్, ఆన్లైన్ బ్యాంకింగ్ నేరాలను అరికట్టేందుకు సంబంధిత సిబ్బందికి వివిధ మాడ్యూల్స్ ద్వారా నిరంతరం శిక్షణ ఇస్తున్నామన్నారు. బంగ్లాదేశ్, దుబాయ్ నుంచి రాష్ర్ట్రంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న నకిలీ కరెన్సీని పూర్తిగా నిరోధించేందుకు సీఐడీ విభాగంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలీసు శాఖలో వివిధ హోదాలకు సంబంధించి పదోన్నతుల విషయంలో కొందరు ట్రిబ్యునల్, కోర్టులను ఆశ్రయించడం వల్ల జాప్యం జరిగిందని, దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీనియార్టీ జాబితాను రూపొందించి ప్రభుత్వానికి పంపించినట్టు చెప్పారు. పోలీస్ స్టేషన్ల ఆధునికీకరణ, నూతన భవనాల నిర్మాణం కోసం ఇక నుంచి రాష్ట్ర పోలీస్ బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరతామన్నారు. ఈ సమీక్షలో కోస్తా రీజియన్ (విశాఖపట్నం) ఐజీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు, ఏలూరు రేంజ్ డీఐజీ విక్రమ్సింగ్మాన్, ఎస్పీ ఎస్.హరికృష్ణ, కృష్ణా జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు, విజయవాడ పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎన్.శివశంకరరెడ్డి, రాజమండ్రి అర్భన్ పోలీస్ జిల్లా ఎస్పీ రవికుమార్మూర్తి, మూడు జిల్లాల ముఖ్య అధికారులు పాల్గొన్నారు. డీజీపీకి ఘన స్వాగతం తొలిసారిగా జిల్లాకు వచ్చిన డీజీపీ ప్రసాదరావుకు జిల్లా పోలీసులు ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నం గన్నవరం విమాశ్రయం నుంచి ఏలూరు చేరుకుని స్థానిక పోలీస్గెస్ట్ హౌస్లో మధ్యాహ్న భోజనం పూర్తి చేశారు. అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పలువురు పోలీసులు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.