bhasker
-
అధికారి ఇంట్లో సోదాలు.. 3 కేజీల బంగారం
-
అధికారి ఇంట్లో సోదాలు.. 3 కేజీల బంగారం
హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ కె.ఎల్.భాస్కర్కు సంబంధించిన ఇళ్లలో రెండో రోజు కూడా ఏసీబీ సోదాలు కొనసాగాయి. హైదరాబాద్ సీతాఫల్మండిలోని హార్మోని హైట్స్లో ఉన్న ఇంట్లో 3 కేజీల బంగారం, 15 కేజీల వెండి, ఏపీ, తెలంగాణల్లోని ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భాస్కర్ను అరెస్టు చేసి విశాఖపట్నంకు తరలిస్తున్నారు. (చదవండి: ఎక్సైజ్ కమిషనర్పై ఏసీబీ పంజా) -
కలెక్టర్ కొరడా
ఏలూరు సిటీ : కలెక్టర్ కె.భాస్కర్ వ్యవహార శైలి ఉద్యోగ వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. ముడుపులు ఇవ్వనిదే పనిచేయడం లేదనే ఆరోపణ ఎదుర్కొన్న ఒక వీఆర్వోను ఇటీవల తన కార్యాలయానికి పిలిపించుకుని అతడికి లంచంగా రూ.5 వేలు ఇచ్చిన కలెక్టర్.. తాజాగా ప్రభుత్వం కేటాయించిన డిజిటల్ కీ తెరిచి వెళ్లిన ఉద్యోగి పేరిట ఆన్లైన్లో రాజీనామా లేఖ సమర్పించారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలతోపాటు సర్వశిక్ష అభియాన్, డీఈవో, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లి ఈ–ఫైలింగ్ విధానం అమలుపై ఆరా తీశారు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాల యంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న బి.విజయలక్ష్మి ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టుగా ఆమె పేరిట కలెక్టర్ లేఖ రాసి దానిని తక్షణమే ఆమోదించాలని కోరుతూ జిల్లా రిజిస్ట్రార్కు ఆన్లైన్లో పంపించారు. జూనియర్ అసిస్టెంట్ విజయలక్ష్మి శుక్రవారం సెలవు పెట్టారు. కలెక్టర్ ఆ కార్యాలయాన్ని తనిఖీ చేస్తుండగా.. విజయలక్ష్మికి ప్రభుత్వం కేటాయించిన డిజిటల్ కీ, మెయిల్ ఐడీ తెరిచి ఉండటాన్ని గమనించారు. సెలవులో ఉండి డిజిటల్ కీ ఎలా తెరిచి వెళ్లారని ప్రశ్నిం చారు. విజయలక్ష్మి మెయిల్ ఐడీ నుంచి ఆమె పేరిట రాజీనామా లేఖను కలెక్టర్ స్వయంగా కంపోజ్ చేసి ఆన్లైన్లో జిల్లా రిజిస్ట్రార్కు పంపించారు. ఆ సమయంలో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో లేకపోవడంతో ఆమె వచ్చాక.. విజయలక్ష్మి రాజీనామా లేఖను తనకు ఆన్లైన్లో పంపాలని జాయింట్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లును కలెక్టర్ ఆదేశించారు. ఈ ఫైలింగ్లో నిర్లక్ష్యంపై ఆగ్రహం ఈ–ఫైలింగ్ విధానంపై వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. కనీసం ఫైల్ ఎలా తయారు చేయాలో సిబ్బందికి అవగాహన లేకపోవడం శోచనీయమన్నారు. ఇలా అయితే భవిష్యత్లో రికార్డులు ఎలా భద్రంగా ఉంటాయని జేడీ వై.సాయిలక్ష్మీశ్వరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వశిక్షాభియాన్ జిల్లా కార్యాలయం ఆర్థిక విభాగంలో నలుగురు పనిచేస్తుంటే ఒకేసారి ఇద్దరు సెలవుపెడితే ఎలాగంటూ పీవో బ్రహ్మానందరెడ్డిని ప్రశ్నించారు. ఎవరిష్టం వచ్చినట్టు వారు కార్యాలయంలోని బీరువాలకు తాళాలు వేసుకుని వెళ్లిపోతే ఎలాగని నిలదీశారు. డీఈవో కార్యాలయాన్ని పరిశీలించిన ఆయన తలుపుల నిండా ఉద్యోగ సంఘాల క్యాలెం డర్లు అతికించి ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రూ.72 లక్షలతో నిర్మించిన డీఈవో కార్యాలయ నూతన భవనాన్ని పరిశీ లించారు. ఇతర నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేయాలని డీఈవో డి.మధుసూదనరావును ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఆన్లైన్లోనే జరగాలని ఏడాది నుంచి చెబుతున్నా పాత విధానాన్ని అమలు చేస్తున్న ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయలక్ష్మికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్టు కలెక్టర్ పేర్కొన్నారు. -
ప్రవాసాంధ్రులు ఐక్యంగా ఉండాలి
–కాపునాడు జిల్లా అధ్యక్షుడు భాస్కర్ పిలుపు యూనివర్సిటీ క్యాంపస్: అమెరికాలోని ప్రవాసాంధ్రులు ఐకమత్యంతో మెలగాలని ఏపీ కాపునాడు చిత్తూరు జిల్లా అధ్యక్షుడు దేపూరి భాస్కర్ కోరారు. అమెరికాలోని అట్లాంటా ప్రాంతంలో అమెరికన్ పోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఏపీటీఏ) ఆధ్వర్యంలో మంగళవారం ప్రవాసాంధ్రుల సమ్మర్ ఫెస్టివల్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన దేపూరి భాస్కర్ మాట్లాడుతూ ప్రవాసాంధ్రులు ఏపీలోని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సహకరించాలని కోరారు. ఏపీలో కాపులను బీసీలుగా మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పసుపులేటి సురేష్ పాల్గొన్నారు. -
మద్యం మత్తులో యువకుడు ఆత్మహత్యాయత్నం
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో భాస్కర్ అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని... నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దీంత కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి మంటలార్పి... ఆతడిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తమాషా చేస్తున్నారా...?
ఇరిగేషన్ ఏఈపై మండిపడ్డ కలెక్టర్ నీతూప్రసాద్ వెల్గటూరు : ఏం తమాషా చేస్తున్నారా... వారం రోజుల నుంచి చెప్పుతున్నా ను... భక్తులకు కొత్తఘాట్లను అందుబాటులోకి తేవాలని.. మీరెందుకు పట్టిం చుకోవటం లేదు... జాబ్ చేస్తున్నారా.. చోద్యం చూస్తాన్నారా... మనుషుల ప్రా ణాలంటే విలువలేదా..? అని ఇరిగేషన్ ఏఈ భాస్కర్పై బుధవారం కలెక్టర్ నీతూ ప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. కోటిలింగాల పుష్కర ఘాట్లను పొద్దు పోయాక కలెక్టర్ పరిశీలించారు. కొత్తఘాట్ల కింద ఇసుక బస్తాలను వేసి వాటి ని వినియోగంలోకి తేవాలని వారం రోజుల ముందు నుంచి చెబుతున్నాను. ఎందుకు ఆదేశాలను ఖాతర్ చేయడంలేదని ఏఈపై విరుచుకపడ్డారు. వారం రోజులు నుంచి చెప్పుతున్నా ఘాట్ల వద్ద ఎలాంటి మార్పులు చేపట్టలేదని ఆగ్రహించారు. ఈ రోజు వచ్చిన 25 వేల మంది భక్తులే పుణ్య స్నానాలు చేయడానికి చాల ఇక్కట్లు పడ్డారు. రేపు రెట్టింపు సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. వారిని ఎలా మెయింటెన్ చేస్తారని మండిపడ్డారు. ఖచ్చితంగా రెండు రోజుల్లో కొత్త పుష్కర ఘాట్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కొత్త పుష్కర ఘాట్లను ఎలా పెంచితే భక్తులకు వినియోగ పడుతాయనుకుంటే అలాగే చేయించండి, ఎంత డబ్బు అవసరమైనా ప్రభుత్వం నుంచి అందజేస్తామని, ఎంపీపీ శ్రీనివాసరావుకు పుష్కర ఘాట్లను పెంచే బాధ్యతలను కలెక్టర్ అప్పగించారు.