Bond Issue
-
కంపెనీల బాండ్ బాజా!
ఎఫ్ఐఐల అమ్మకాలు ఆగటం లేదు. మార్కెట్లు పడిపోతున్నాయి. దీంతో చాలా కంపెనీల షేర్లు ఏడాది కనిష్టానికి వచ్చేశాయి. మిగిలిన పెట్టుబడి సాధనాల్లో... బంగారం పెరుగుతున్నా... ధరల్లో ఊగిసలాట తప్పదు. రియల్ ఎస్టేట్ అంతంత మాత్రంగానే ఉంది. బ్యాంకు డిపాజిట్లు సురక్షితమే కానీ... వడ్డీ రేట్లు తక్కువ. మరి వీటికన్నా ఎక్కువ వచ్చే ప్రభుత్వ బాండ్లు బెటరా? లేకపోతే అంతకన్నా కాస్త ఎక్కువ గిట్టుబాటయ్యే ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల బాండ్లు బెటరా? రాబోయే వారం పది రోజుల్లో పలు ప్రభుత్వ కంపెనీలు సైతం బాండ్లు జారీ చేయటానికి ముందుకొస్తున్న నేపథ్యంలో... వాటి లాభనష్టాలు, రిసు్కల గురించి తెలుసుకుందాం...వడ్డీ రేట్లు పెంచుతూ లిక్విడిటీని రిజర్వు బ్యాంకు కట్టడి చేస్తోంది. దీంతో అప్పుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా పలు కంపెనీలు బాండ్ల జారీకి వస్తున్నాయి. ఈ తాకిడి ఎంతలా అంటే... ఈ ఒక్కవారంలోనే కంపెనీలు రూ.30 వేల కోట్ల విలువైన బాండ్లు జారీ చేస్తున్నాయి. వీటిలో ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఇరెడా) 7.40 శాతం వడ్డీతో 11 ఏళ్ల కాలానికి రూ.820 కోట్లు సమీకరించగా... నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్హెచ్బీ) ఏడేళ్ల కాలానికి 7.35 శాతం వడ్డీ రేటుతో రూ.4,800 కోట్లు సమీకరించింది. ఇక ఆర్ఈసీ 7.99 శాతం వడ్డీతో నిరవధిక బాండ్లను జారీ చేసింది. రూ.2,000 కోట్లు సమీకరించాలనుకున్నా రూ.1,995 కోట్లే చేయగలిగింది. ఇక రాబోయే రోజుల్లో నాబార్డ్ పదేళ్ల కాలానికి రూ.7,000 కోట్లు, సిడ్బి నాలుగేళ్ల కాలానికి రూ.6,000 కోట్లు, పీఎఫ్సీ నాలుగేళ్లకు రూ.4 వేల కోట్లు సమీకరించనున్నాయి. జనవరిలో ట్రంప్ టారిఫ్ల ప్రకటన, భౌగోళిక అనిశి్చతుల నేపథ్యంలో బాండ్ మార్కెట్ భయపడింది. వడ్డీ రేట్లు పెరిగాయి. ఆర్బీఐ సైతం వడ్డీ రేట్లు పెంచి లిక్విడిటీని కట్టడి చేసింది. దీంతో ప్రభుత్వ బాండ్లపై ఈల్డ్లు (రాబడి) 0.5 శాతం వరకూ పెరిగాయి. దీంతో కార్పొరేట్లు మరింత ఎక్కువ వడ్డీని ఆఫర్ చేయాల్సి వచి్చంది. ప్రస్తుతం ప్రభుత్వ బాండ్ల ఈల్డ్ 7.1 శాతం నుంచి 7.3 శాతం మధ్య ఉండగా... ప్రైవేటు కంపెనీలు అంతకన్నా ఎక్కువ కూపన్ రేటును ఆఫర్ చేయాల్సి వస్తోంది. నిరవధిక బాండ్లు అంటే..సాధారణంగా పెర్పెట్యువల్ బాండ్లుగా పిలిచే ఈ బాండ్లకు నిర్ణీత కాలమంటూ ఏదీ ఉండదు. ఒక కంపెనీ ఈ రకమైన బాండ్లను జారీ చేస్తే... కాలపరిమితి ఉండదు కనుక ఏడాదికోసారి చొప్పున నిరవధికంగా వడ్డీని చెల్లిస్తూ పోతాయి. ఒకవేళ వాటిని బైబ్యాక్ చెయ్యాలని భావిస్తే అప్పుడు ప్రకటన ఇచి్చ... తమ బాండ్ల ప్రిన్సిపల్ మొత్తాన్ని చెల్లించి వెనక్కి తీసుకుంటాయి. అప్పటిదాకా వడ్డీ మాత్రం చెల్లిస్తుంటాయి. ప్రిన్సిపల్ మొత్తాన్ని తిరిగి పొందటానికి కాలపరిమితి ఉండదు కనుక వీటికి వడ్డీ రేటు కూడా ఎక్కువే ఉంటుంది. గమనించాల్సింది ఏంటంటే...బాండ్లలో ఇన్వెస్ట్ చేసేవారు గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే... ఆ బాండ్లకు బాగా రేటింగ్ ఉండి, చురుగ్గా ట్రేడయితేనే సెకండరీ బాండ్ మార్కెట్లో వెంటనే విక్రయించగలం. రేటింగ్ తక్కువగా ఉన్న బాండ్లయినా, నిరవధిక బాండ్లయినా విక్రయించటం అంత ఈజీ కాదు. పైపెచ్చు విక్రయించేటపుడు వాటి ధర అప్పటి వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. మీరు కొన్నపుడు వడ్డీరేట్లు తక్కువ ఉండి ఆ తరవాత పెరిగాయనుకోండి. మీ బాండ్ల ధర కూడా తగ్గుతుంది. అదే రివర్స్లో మీరు కొన్నాక వడ్డీ రేట్లు తగ్గితే.. మీ బాండ్లకు ఎక్కువ వడ్డీ వస్తుంది కనక వాటికి గిరాకీ ఉంటుంది. ఈ అంశాలు దృష్టిలో పెట్టుకుంటే బాండ్లలోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు.ప్రభుత్వ సావరిన్ బాండ్లు→ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేస్తాయి కనుక చాలా తక్కువ రిస్కు ఉంటుంది. → సురక్షితం కనుక... తక్కుక వడ్డీని ఆఫర్ చేస్తాయి. కానీ బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే వడ్డీ కాస్తంత ఎక్కువ ఉంటుంది. → డిపాజిట్ల మాదిరి ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాన్సిల్ చేసుకోలేరు. కానీ బాండ్ మార్కెట్లో ట్రేడవుతాయి కనుక అప్పటి ధరకు విక్రయించుకోవచ్చు. → ఏడాదికోసారి వడ్డీ మన ఖాతాలో ఠంచనుగా పడుతుంది. ప్రైవేటు, ప్రభుత్వ కంపెనీల బాండ్లు→ కంపెనీలు తమ సొంత పూచీకత్తుపై జారీ చేస్తాయి. వాటి పనితీరుపై ఆధారపడి ఉంటాయి కనుక రిస్కు కాస్తంత ఎక్కువ. → రిస్కు ఎక్కువ కనుక ప్రభుత్వ బాండ్ల కన్నా వడ్డీ కాస్త ఎక్కువే. → వీటిని కూడా ప్రభుత్వ బాండ్ల మాదిరి ఎప్పుడు కావాలంటే అప్పుడు బాండ్ మార్కెట్లో విక్రయించుకునే అవకాశం ఉంటుంది. → వీటి రేటింగ్ను బట్టి వడ్డీ ఉంటుంది. ట్రిపుల్ ఏ బాండ్లకు కాస్త తక్కువగా... రేటింగ్ తగ్గుతున్న కొద్దీ వడ్డీ పెరిగేలా ఉంటాయి. → కాకపోతే తక్కు రేటింగ్ ఉన్న బాండ్లకు రిస్కు కూడా ఎక్కువని గమనించాలి. – సాక్షి, బిజినెస్ ప్రతినిధి -
ఫారెక్స్ నిల్వలు ఎందుకంటే..
భారత విదేశీ మారక నిల్వలు మొదటిసారి రికార్డుస్థాయిలో 700 బిలియన్ డాలర్ల మార్కును చేరాయి. ఇటీవల ప్రభుత్వ వర్గాలు అధికారికంగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2024 సెప్టెంబర్ 27 నాటికి దేశంలోని విదేశీ మారక నిల్వలు 705 బిలియన్ డాలర్ల(రూ.59 లక్షల కోట్లు)కు చేరాయి. ఫారెక్స్ నిర్వల వల్ల దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతాయో తెలుసుకుందాం. దేశీయ స్టాక్ మార్కెట్లు పెరిగేందుకు ఫారెక్స్ నిల్వలు ఉపయోగపడుతాయి.రూపాయి విలువను స్థిరీకరించడానికి ఆర్బీఐ ఫారెక్స్ నిల్వలను ఉపయోగిస్తుంది. కరెన్సీలో తీవ్రమైన హెచ్చుతగ్గులను నిరోధించడానికి తోడ్పడుతాయి.విదేశీ కరెన్సీలను కొనుగోలు చేయడం లేదా విక్రయించడం ద్వారా రూపాయి విలువను ఆర్బీఐ నియంత్రిస్తుంది.వస్తువుల దిగుమతుల కోసం ఫారెక్స్ నిల్వలు ఉపయోగపడుతాయి.చమురు ధరల పెరుగుదల, ఆర్థిక సంక్షోభాల సమయంలో ఈ నిల్వలు తోడ్పడుతాయి.ఇదీ చదవండి: ఫ్లిప్కార్ట్, అమెజాన్లపై దర్యాప్తు వాయిదా!ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ వాతావరణం, ప్రపంచ ఉద్రిక్తతలు వెరసి చమురు ధరలు పెరుగుతున్నాయి. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడుతున్న దేశం మనది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేయాలంటే ఫారెక్స్ నిల్వలు ఎంతో ఉపయోగపడుతాయి. రానున్న రోజుల్లో భారత్ ఎన్నో రెట్లు అభివృద్ధి చెందుతుందని నమ్మి వివిధ దేశాలకు చెందిన ఇన్వెస్టర్లు వివిధ రూపాల్లో పెట్టుబడి పెడుతున్నారు. దాంతో ఫారెక్స్ నిల్వలు పెరుగుతున్నాయి. -
బాండ్ల జారీలో తగ్గిన కార్పొరేట్ స్పీడ్
న్యూఢిల్లీ: బాండ్ల జారీ ద్వారా మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్లు కేవలం రూ.5.88 లక్షల కోట్ల నిధులను సమీకరించాయి. గడచిన ఆరు సంవత్సరాల్లో ఈ మార్గంలో నిధుల సమీకరణ ఇంత తక్కువ స్థాయికి తగ్గడం ఇదే తొలిసారి. 2020–21లో ఈ విధానం ద్వారా కార్పొరేట్లు రూ.7.72 లక్షల కోట్ల నిధుల సమీకరించాయి. అంటే వార్షికంగా చూస్తే 24 శాతం తగ్గాయన్నమాట. ఈక్విటీ మార్కెట్లు మంచి పనితీరును కనబరచడం, బ్యాంకింగ్ తక్కువ వడ్డీరేట్ల విధానం వంటి అంశాల నేపథ్యంలో ఈ సాధనాల ద్వారానే నిధుల సమీకరణకు కార్పొరేట్లు మొగ్గు చూపినట్లు మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) విడుదల చేసిన గణాంకాలు సూచిస్తున్నాయి. వడ్డీరేట్ల పెరుగుదల, ఈక్విటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, మూలధన అవసరాలు పెరగడం వంటి పరిస్థితుల్లోనే తిరిగి కార్పొరేట్ల ప్రైవేట్ ప్లేస్మెంట్ల వైపు దృష్టి సారించవని విశ్లేషకులు భావిస్తున్నారు. చదవండి: ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ మళ్లీ డిఫాల్ట్ -
25 నుంచి తాజా సావరిన్ గోల్డ్ బాండ్
న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్ బాండ్ తాజా ఇష్యూ ఈ నెల 25వ తేదీ నుంచి (సోమవారం) ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు అంటే అక్టోబర్ 29వ తేదీ వరకూ ఇష్యూ అందుబాటులో ఉంటుంది. నవంబర్ 2న బాండ్ జారీ అవుతుంది. ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బాండ్ జారీ చేస్తుంది. 2021–22 సిరిస్లో ఇది ఏడవ విడత గోల్డ్బాండ్ స్కీమ్. చందా కాలానికి ముందు మూడు పనిదినాల్లో 999 ప్యూరిటీకి సంబంధించి ఇండియన్ బులియన్ అండ్ జ్యూయెలర్స్ అసోసియేషన్ పబ్లిష్ చేసిన సగటు ముగింపు ధరను ప్రాతిపదికగా తీసుకుని గోల్డ్ బాండ్ ధర నిర్ణయం అవుతుంది. అంటే అక్టోబర్ 20,21,22 తేదీల్లో పబ్లిష్ అయిన సగటు ముగింపు ధర బాండ్ ధరగా ఉంటుందన్నమాట. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వారికి బాండ్ ధరపై గ్రాముకు రూ.50 రిబేట్ కూడా లభిస్తుంది. 2021 మే నుంచి బాండ్ల జారీ 2021–22 సిరిస్ ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం 10 విడతల బాండ్ల జారీ జరుగుతుండగా, 2021 సెప్టెంబర్ వరకూ ఆరు విడతలు పూర్తయ్యింది. అక్టోబర్ 25న జారీ అవుతున్న బాండ్తో కలుపుకుని 2022 మార్చి లోపు మరో నాలుగు విడతల్లో బాండ్ల జారీ జరగాల్సి ఉంది. నిర్ధారిత బ్యాంకులు, పోస్టాఫీసులు, బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, క్లీనింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా బాండ్లను పొందవచ్చు. -
గోల్డ్ బాండ్ జారీ ధర రూ.5,051
ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్ జారీ ధరను ఆర్బీఐ నిర్ణయించింది. ఈ బాండ్ జారీ ధరను రూ. 5,051(ఒక గ్రాముకు)గా ఖరారు చేసినట్లు ఆర్బీఐ పేర్కొంది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2020–21 సిరీస్ –7 ఈ నెల 12న మొదలై 16న ముగుస్తుంది. 1 గ్రాము, 1గ్రాము గుణిజాల డినామినేషన్లలో ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ గోల్డ్బాండ్ల కాలపరిమితి ఎనిమిదేళ్లు. ఐదేళ్ల తర్వాత ఈ బాండ్లను విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ బాండ్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసేవారికి, అలాగే బాండ్ల సొమ్ములను డిజిటల్ విధానంలో చెల్లించేవారికి రూ.50 డిస్కౌంట్ లభిస్తుంది. కాగా ఆరో సిరీస్ గోల్డ్ బాండ్ల జారీ ధర రూ.5,117గా ఉంది. నివాసిత వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబం, ట్రస్ట్లు, యూనివర్శిటీలు,చారిటబుల్ ట్రస్ట్లను మాత్రమే ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేయడానికి అనుమతిస్తున్నారు. బ్యాంక్లు, కొన్ని అధీకృత పోస్ట్ ఆఫీసులు, బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ఈ బాండ్లను విక్రయిస్తాయి. -
ఓవర్ సబ్స్క్రైబ్ అయిన హెచ్డీఎఫ్సీ రూపీ బాండ్స్
లండన్/న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ రూ.3,000 కోట్ల రూపీ(మసాలా) బాండ్ ఇష్యూ 4.3 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. రూపీ బాండ్ల ద్వారా రూ.2,000 కోట్లు, రూ. 1,000 కోట్లు గ్రీన్ షూ ఆప్షన్గా.. మొత్తం రూ.3,000 కోట్ల సమీకరించాలని హెచ్డీఎఫ్సీ భావించింది. ఈ 3,000 కోట్ల రూపీ బాండ్లకు 48 ఖాతాల ద్వారా రూ.8,673 కోట్లకు బిడ్లు వచ్చాయి. ఈ బాండ్లకు సెమీ-యాన్యువల్ కూపన్ రేటు 7.875 శాతమని, వీటి కాలపరిమితి మూడు సంవత్సరాల 1నెల అని హెచ్డీఎఫ్సీ తెలిపింది. మొత్తం మీద ఇన్వెస్టర్లకు ఏడాదికి 8.33 శాతం రాబడి వస్తుందని తెలిపింది. విదేశాల్లో రూపాయి బాండ్ల ద్వారా నిధులు సమీకరించిన తొలి భారత కంపెనీగా హెచ్డీఎఫ్సీ నిలిచింది.