boondi potu
-
తిరుమల బూందీ పోటులో అగ్నిప్రమాదం
సాక్షి, తిరుపతి : తిరుమల శ్రీవారి లడ్డు తయారీ కేంద్రం బూందీ పోటులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం పోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. అగ్ని ప్రమాదం సంభవించడంతో.. లడ్డుల తయారీ నిలిచిపోయింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తిరుమల బూందీపోటులో అగ్నిప్రమాదం
-
తిరుమల బూందీపోటులో అగ్నిప్రమాదం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం వెలుపల బూందీ పోటులో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. బూందీ తయారీకి వాడే బాండిళ్లు (పెనం) అతివేడి కారణంగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పోటు సిబ్బంది డ్రై కెమికల్ పౌడర్తో మంటలు ఆర్పి వేశారు. గ్యాస్ సరఫరా నిలిపివేశారు. పోటు సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. డిప్యూటీ ఈవో కోదండ రామారావు, పోటు పేష్కార్ అశోక్ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మూడు బాండిళ్లు కాలినట్టు గుర్తించి వాటిని తొలగించారు. గంట వ్యవధిలోనే తిరిగి బూందీ తయారీ ప్రారంభించారు. బూందీ పోటులో ఎటువంటి అగ్నిప్రమాదం జరగలేదని, బాండిల్కు అంటుకుని ఉన్న నెయ్యి వ్యర్థాలు మాత్రమే కాలాయని కోదండ రామారావు తెలిపారు. ఘటనలో ఆస్తి నష్టం జరగలేదన్నారు. -
తిరుమలలో అగ్నిప్రమాదం
-
శ్రీవారి బూందీపోటులో అగ్ని ప్రమాదం
తిరుపతి: తిరుమల శ్రీవారి బూందీపోటులో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. బూందీ తయారు చేసే క్రమంలో ఆయిల్లో నీళ్లు పడటంతో ఒక్కసారిగా నూనె పొంగి మంటలు చెలరేగాయి. వెంటనే పోటు కార్మికులు, సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు.