bus services bandh
-
మహారాష్ట్ర-కర్నాటక సరిహద్దుల్లో హైఅలర్ట్.. బస్సులు బంద్
మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రెండు రాష్ట్రాల అనుకూలవాదులు నిరసన ప్రదర్శనలు చేపట్టడం, వాహనాలపై పరస్పరం దాడులకు దిగడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, శాంతి భద్రతలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, బసవరాజ బొమ్మై నిర్ణయించుకున్నారు. ఇరువురు నేతలు మంగళవారం రాత్రి ఫోన్ద్వారా మాట్లాడుకున్నారు. సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించుకున్నారు. మరోవైపు.. మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులపై కర్నాటకలో నిరసనకారులు దాడులు చేస్తున్న కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర నుంచి కర్నాటకకు బస్సు సర్వీసులను నిలిపేస్తున్నట్టు మహారాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్టుమెంట్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, కర్నాటకలో ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. దాడుల నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు హెచ్చరించిన కారణంగానే తాము బస్సు సర్వీసులను నిలిపివేశామని తెలిపారు. మళ్లీ పోలీసులు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే బస్సు సర్వీసులను పునఃప్రారంభిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఏమిటీ వివాదం? రెండు రాష్ట్రాల నడుమ సరిహద్దు వివాదం 1957 నుంచి కొనసాగుతోంది. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న బెళగావితోపాటు మరాఠా భాష మాట్లాడే ప్రజలు అధికంగా ఉన్న 814 గ్రామాలు స్వాతంత్య్రం కంటే ముందు అప్పటి బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. బెళగావి నగరాన్ని, 814 గ్రామాలను కర్ణాటకలో 1957లో విలీనం చేశారు. కానీ, అవి తమవేనని మహారాష్ట్ర వాదిస్తోంది. వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. బెళగావి తమ రాష్ట్రంలో అంతర్భాగమని కర్ణాటక వాదిస్తోంది. అంతేకాదు అక్కడ బెంగళూరులోని విధాన సౌధను పోలిన సువర్ణ విధాన సౌధను నిర్మించింది. ఏడాదికోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోంది. Mumbai: Maharashtra Suspends All Bus Services To Karnataka Amid Border Dispute - https://t.co/36uk5KYPiy#Karnataka#BorderDispute#BusServices pic.twitter.com/nNcGVXGk6T — HW News English (@HWNewsEnglish) December 7, 2022 -
'ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని అర్ధం చేసుకోవాలి'
-
'ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని అర్ధం చేసుకోవాలి'
హైదరాబాద్:ఆర్టీసీ కార్మికులు సంస్థ ఆర్థిక పరిస్థితిని అర్ధం చేసుకోవాలని ఎండీ సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులు జరప తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని సూచించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఛార్జీలు పెంచగా వచ్చిన ఆదాయంలో కార్మికులకు ఫిట్ మెట్ ఇస్తామని తెలిపారు. ఫిట్ మెంట్ ఎగ్గొట్టాలనే ఆలోచన లేదని ఆయన ఈ సందర్భంగ పేర్కొన్నారు. ఫిట్ మెంట్ నిధులను ఏ విధంగా సమకూర్చుకోవాలన్న దానిపై చర్చిస్తామని సాంబశివరావు తెలిపారు. చర్చలకు ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా సమ్మె సబబు కాదని ఆయన అన్నారు. 27 శాతం ఫిట్ మెంట్ ఇచ్చి రూ. 820 కోట్ల భారం మోయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కార్మికులు సమ్మె చేస్తే ఆర్టీసీ మనుగడకు ప్రమాదమన్నారు. ఒకవేళ కార్మికులు సమ్మె చేస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న మాదిరిగా తమకు 43 శాతం ఫిట్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ యూనియన్లు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. -
చర్చలు విఫలం, వెనక్కి తగ్గేది లేదు..
హైదరాబాద్ : ఆర్టీసీ యాజమాన్యంతో మంగళవారం కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనంపై యాజమాన్యం నుంచి హామీ లభించలేదు. అయితే దీనిపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంది. డిమాండ్ల పరిష్కారానికి సమయం కావాలని, జులై వరకూ సమ్మె వాయిదా వేసుకోవాలని యాజమాన్యం ఈ సందర్భంగా కార్మిక సంఘాలను కోరింది. ఆర్టీసీ కార్మికులు కోరుతున్నట్టుగా 43 శాతం ఫిట్మెంట్ చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తుండగా, ఆర్టీసీ యాజమాన్యం మాత్రం 28 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే 28 శాతం ఫిట్మెంట్కు అంగీకరించేది లేదని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. దాంతో చర్చలు విఫలం అయ్యాయి. దాంతో ఆర్టీసీ ఎండీ సాంబశివరావు.... ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసేందుకు సచివాలయానికి వెళ్లారు. కార్మిక సంఘాల చర్చలపై ఆయన ఈ సందర్భంగా సీఎంకు వివరించనున్నారు. మరోవైపు మధ్యాహ్నం రవాణామంత్రి మహేందర్ రెడ్డితో కార్మిక సంఘాలు చర్చలు జరపనున్నారు. కాగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న మాదిరిగా తమకు 43 శాతం ఫిట్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ యూనియన్లు సమ్మెకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలో అర్థరాత్రి నుంచి బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇందుకోసం ఆర్టీసీ బస్సు స్టీరింగ్ను లారీలు, ప్రైవేటు బస్సు డ్రైవర్లకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఫిట్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని కొంతకాలంగా అడుగుతున్నా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమ్మెకు దిగుతామని ఆర్టీసీ యూనియన్లు హెచ్చరిస్తున్నాయి. -
నేటి అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె
-
బస్సులు బంద్
- నేటి అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె - 43% ఫిట్మెంట్ కోసం యూనియన్ల డిమాండ్ - ఎక్కడికక్కడ నిలిచిపోనున్న బస్సులు - ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఆర్టీసీ యాజమాన్యం - రంగంలోకి ప్రైవేటు బస్సులు, లారీల డ్రైవర్లు హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న మాదిరిగా తమకు 43 శాతం ఫిట్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ యూనియన్లు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. దీంతో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇందుకోసం ఆర్టీసీ బస్సు స్టీరింగ్ను లారీలు, ప్రైవేటు బస్సు డ్రైవర్లకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఫిట్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని కొంతకాలంగా అడుగుతున్నా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమ్మెకు దిగుతామని ఆర్టీసీ యూనియన్లు హెచ్చరిస్తున్నాయి. అయితే, బస్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ నడపాల్సిందేనంటూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. రవాణా శాఖ ఇప్పటికే కమిషనర్, వివిధ జిల్లాల ఎస్పీలకు లేఖలు రాసింది. వారికి అందుబాటులో ఉన్న ప్రైవేటు బస్సులు, లారీల డ్రైవర్లను ఈ మేరకు సిద్ధం చేయాలని అందులో కోరింది. గతంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మె చేసినప్పుడు ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇలా ప్రైవేటు బస్సులు, లారీల డ్రైవర్ల సాయంతో బస్సులు నడిపారు. మొత్తం బస్సుల్లో దాదాపు 60 శాతం బస్సులను నడిపించగలిగారు. అయితే, ప్రమాదాలు జరుగుతాయని విమర్శలు వెల్లువెత్తినా యాజమాన్యం వెనక్కు తగ్గలేదు. ఇప్పుడు కూడా అదే పంథాను అనుసరించాలని నిర్ణయించింది. నేడు ప్రభుత్వంతో చర్చలు.... ఆర్టీసీ కార్మికులు కోరుతున్నట్టుగా 43 శాతం ఫిట్మెంట్ చెల్లించే స్తోమత ఆర్టీసీకి లేదని సంస్థ ఎండీ సాంబశివరావు ఇప్పటికే గుర్తింపు కార్మిక సంఘాలు ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రతినిధులకు స్పష్టం చేశారు. ఆ భారాన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తే తప్ప దాని అమలు సాధ్యం కాదని పేర్కొన్న ఆయన విషయాన్ని ఇద్దరు ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ, టీఆర్ఎస్ ప్లీనరీ, పార్టీ ఆవిర్భావ సభ, ప్రజాప్రతినిధులకు శిక్షణ... ఇలా వరుస కార్యక్రమాలతో కొంతకాలంగా బిజీగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ఈ విషయంపై దృష్టి సారించలేదు. సమ్మెకు సిద్ధమని కార్మిక సంఘాల నేతలు పదేపదే ప్రకటిస్తున్నా ప్రభుత్వం చర్చలకు పిలవలేదు. ఇక మంగళవారం ఒక్కరోజే గడువు ఉండడం, శిక్షణ తరగతులు ముగిసి ముఖ్యమంత్రి కూడా సచివాలయంలో అందుబాటులో ఉంటుండడంతో నేడు చర్చలకు పిలవవచ్చని భావిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఆర్టీసీ జేఎండీ రమణరావు ముఖ్యమంత్రిని కలసి సమ్మె విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు. అక్కడి నుంచి సానుకూల నిర్ణయం వెలువడని పక్షంలో సమ్మె తప్పదని అధికారులు నిర్ణయానికొచ్చారు. అటు ఏపీలోనూ కార్మికులు సమ్మెకు వెళ్తున్నారు. ఆర్టీసీ కార్మికుల వేతన సవరణపై ఎంప్లాయీస్ యూనియన్ తలపెట్టిన సమ్మెకు తాము పూర్తి మద్దతు తెలియజేస్తూ సమ్మెలో పాల్గొంటామని నేషనల్ మజ్దూర్ యూనియన్ సోమ వారం విజయవాడలో ప్రకటించింది. సాగర్కు వెళ్లినా దక్కని అపాయింట్మెంట్.. సమ్మె విషయమై చర్చించేందుకు ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలు నాగార్జునసాగర్కు వెళ్లినా సీఎం, మంత్రుల అపాయింట్మెంట్ దక్కలేదు. సుమారు 3 గంటల పాటు ఎదురుచూసినా వినతిపత్రం తీసుకోవడానికి కూడా ఎవరూ రాకపోవడంతో తీవ్ర నిరుత్సాహంతో వెనుదిరిగారు. దీంతో ఇక సమ్మె విషయంలో రాజీ లేదని తేల్చిచెప్పారు. దీన్ని స్పష్టం చేస్తూ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి ఆధ్వర్యంలో బృందం సోమవారం సచివాలయంలో సీఎస్ రాజీవ్శర్మను కలిసి 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించాల్సిందేనని, లేకుంటే సమ్మె తప్పదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో వేతనాలు సమం కావాలంటే ఫిట్మెంట్ 62 శాతం ప్రకటించాలని, ఆ డిమాండ్తో సమ్మెకు మద్దతు ఇస్తున్నట్టు తెలంగాణ ఎన్ఎంయూ పేర్కొంది.