Cabinet sub commitee
-
రైతులతో సమావేశం
-
కడియంకు కీలక బాధ్యతలు
మంత్రివర్గ ఉప సంఘంలో చోటు జిల్లాల పునర్విభజన ప్రకియపై రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘంలో కడియం శ్రీహరికి చోటు కల్పించింది. రెవెన్యూ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మరో ఉప ముఖ్యమంత్రి మహమూద్అలీ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాల ఎంపిక, జోనల్ వ్యవస్థ, శాఖల పునర్వ్యవస్థీకరణ, ఉద్యోగుల కేటాయింపు వంటి అంశాలపై ఈ కమిటీ నివేదికలు ఇవ్వనుంది. -
రీ టెండర్ భారం రూ. 9 వేల కోట్లు!
ఎస్కలేషన్ ఇస్తే పెరిగే వ్యయం రూ. 3 వేల కోట్లు మాత్రమే నేడు కేబినెట్ సబ్ కమిటీకి నీటిపారుదల శాఖ నివేదిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల్లో నిలిచిపోయిన పనులకు మళ్లీ టెండర్లు పిలిస్తే ఆ భారం భారీగా ఉంటుందని నీటి పారుదల శాఖ తేల్చింది. ఈ భారం రూ.9 వేల కోట్లు ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని బదులు ఎస్కలేషన్ చెల్లిస్తేనే మేలని, దీని ద్వారా పడేభారం రూ.3 వేల కోట్ల వరకు మాత్రమే ఉంటుందని నిర్ధారణకు వచ్చింది. ప్రాజెక్టులు, ప్యాకేజీల వారీగా ఆర్థిక వ్యయ భారాలతో లెక్కలు వేసిన అధికారులు నివేదికను బుధవారం కేబినెట్ సబ్ కమిటీకి అందించనున్నారు. నేడు కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. ప్రాజెక్టుల పనులు, ఎస్కలేషన్, రీ టెండర్ల అంశాలను చర్చించేందుకు కేబినెట్ సబ్ కమిటీ నేడు మరోమారు భేటీ కానుంది. సచివాలయంలో జరిగే ఈ భేటీకి మంత్రులు హరీశ్రావు, తుమ్మల హాజరు కానున్నారు. ప్యాకేజీల వారీ సమీక్ష అనంతరం మొత్తం నివేదికను కమిటీ సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.