రేపటి నుంచి అంధులకు చదరంగం పోటీలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : లూయీ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకుని అంధులకు ఈ నెల 2 నుంచి 4 వరకు చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు జాతీయ అంధుల సమాఖ్య అనంతపురం జిల్లా శాఖ అ«ధ్యక్ష, కార్యదర్శులు విజయభాస్కర్, రవి తెలిపారు. ఈ పోటీలు స్థానిక కృష్ణ కళా మందిరంలో జరుగుతాయన్నారు. అలాగే 3న నీలం సంజీవరెడ్డి క్రీడా మైదానంలో అంధుల క్రీడా పోటీలు నిర్వహిస్తామన్నారు. 4న ముగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, జెడ్పీచైర్మన్ చమన్ ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు.