Complexes
-
AP: ఆర్థిక స్వయం సమృద్ధి దిశగా ఆర్టీసీ
సాక్షి, అమరావతి: వనరుల సద్వినియోగం ద్వారా ఆర్థిక స్వయం సమృద్ధి సాధన దిశగా ఆర్టీసీ కార్యాచరణ చేపట్టింది. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో విలువైన స్థలాల్లో ‘నిర్మించు–నిర్వహించు–బదలాయించు(బీవోటీ) విధానంలో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్లు నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించింది. తాజాగా మున్సిపాల్టీలు, మండల కేంద్రాల్లోని ఆర్టీసీ స్థలాలను కూడా లీజుకు ఇవ్వాలని, ఆ స్థలాలను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించాలని ప్రణాళిక రూపొందించింది. చదవండి: ఏపీ రైతులకు అలర్ట్.. ఈ నెల 12 వరకే గడువు.. మొదటి దశలో 48 కేంద్రాల్లో స్థలాలను లీజుకు ఇవ్వనుంది. రాష్ట్రంలో నాలుగు జోన్ల పరిధిలోని మొత్తం 1,98,393 చ.గజాల విస్తీర్ణంలోని స్థలాలను ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల కాలపరివిుతికి ఇవ్వాలని నిర్ణయించింది. మొదటి జోన్ పరిధిలో 14 కేంద్రాల్లో 38,188 చ.గజాలు, రెండో జోన్ పరిధిలో 10 కేంద్రాల్లో 21,125 చ.గజాలు, మూడో జోన్ పరిధిలో 11 కేంద్రాల్లో 33,326 చ.గజాలు, నాలుగో జోన్ పరిధిలో 13 కేంద్రాల్లో 1,05,754 చ.గజాల స్థలాలు ఉన్నాయి. వాటిలో కనిష్టంగా 250 చ.గజాల నుంచి గరిష్టంగా 15,500 చ.గజాల స్థలాల వరకు ఉండటం విశేషం. ఆ స్థలాల్లో జి+1 విధానంలో వాణిజ్య సముదాయాల నిర్మాణానికి అనుమతిస్తారు. లీజు కాలపరిమితి ముగిసిన తర్వాత ఆ సముదాయాలు ఆర్టీసీ సొంతమవుతాయి. ఈ స్థలాల లీజుకు సంబంధించి ఆయా జోన్ల వారీగా వచ్చే ఏడాది ప్రారంభం నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. -
‘ఎంఎస్ స్వామినాథన్ అనెక్సి’ ప్రారంభం
వ్యవసాయ విశ్వవిద్యాలయం (రాజేంద్రనగర్): ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధి రాజేంద్రనగర్లోని వ్యవసాయ పరిశోధన సంస్థ వద్ద రాష్ట్రీయ కృషి వికాస్ యోజన నిధుల సాయంతో ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్’, ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్’ కాంప్లెక్స్ను బుధవారం ప్రారంభించారు. ఈ కాంప్లెక్స్కు వ్యవసాయ శాస్త్రవేత్త ‘డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అనెక్సి’ అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ డాక్టర్ ప్రవీణ్రావు మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రప్రభుత్వ సాయంతో విశ్వవిద్యాలయంలో బోధన, పరిశోధనలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఈ సదుపాయాల్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుని రైతాంగం వ్యవసాయాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. -
అపోలో ‘సొసైటీ క్లినిక్స్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న అపోలో క్లినిక్ భారీ నివాస సముదాయాల్లో సొసైటీ క్లినిక్స్ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ సేవల్లో ఉన్న అప్నా కాంప్లెక్స్తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. హైదరాబాద్ సహా బెంగళూరు, పుణే, చెన్నైలో వీటిని నెలకొల్పుతారు. ఈ క్లినిక్స్లో వైద్యుల కన్సల్టేషన్, రక్తపరీక్షల కోసం నమూనాల సేకరణ, హెల్త్ చెక్ ప్యాక్స్, ప్రాథమిక వైద్య పరీక్షలు, వైద్య చికిత్సలు, వ్యాక్సినేషన్ సేవలు అందుబాటులో ఉంటాయి. మూడేళ్లలో హైదరాబాద్లో ఇటువంటి కేంద్రాలు 75 దాకా ఏర్పాటు చేస్తామని అపోలో క్లినిక్ సీవోవో ఆనంద్ వెల్లడించారు. మరో ఎనిమిది నగరాలకు విస్తరించడం ద్వారా 2021 నాటికి 500 కేంద్రాల స్థాయికి తీసుకువెళతామని చెప్పారు. -
నయీమ్ ఆస్తులకు లెక్కేలేదు..
⇔ పోలీసులకు సైతం అంతుపట్టని నయీమ్ ‘ఖజానా’ ⇔ రాష్ట్రంలోని ఖరీదైన ప్రాంతాల్లో 1,015 ఎకరాల్లో వెంచర్లు ⇔ మరో లక్షన్నర గజాలకు పైగా విస్తీర్ణంలో ఇళ్లు, కాంప్లెక్సులు ⇔ ఈ మొత్తం ఆస్తుల విలువ రూ.వేల కోట్లలో.. ⇔ ఇక ఇతర రాష్ట్రాల్లో ఎన్నున్నాయో..! సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ జరిగి పదిరోజులవుతున్నా అతడి ఆస్తుల లెక్కలు పోలీసులకు అంతుపట్టడం లేదు. ఆస్తుల చిట్టా విప్పే కొద్దీ బయటకొస్తోంది.. ఎక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయో అధికారులు సైతం ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఇప్పటివరకు సిట్ గుర్తించిన ఆస్తులే దిమ్మ తిరిగిపోయేలా ఉన్నాయి. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న వందలాది డాక్యుమెంట్లను సిట్ క్షుణ్నంగా పరిశీలిస్తోంది. ఒక్క రాష్ట్రంలోనే నయీమ్ చెరలో ఖరీదైన ప్రాంతాల్లో 1,015 ఎకరాల భూమిలో వెంచర్లు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చిన సిట్.. రెవెన్యూ అధికారులతో కలసి ఈ స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలి స్తోంది. వీటితోపాటు రాష్ట్రంలోని ముఖ్య పట్టణాల్లోనూ లక్షన్నర గజాలకు పైగా విస్తీర్ణంలో ఇళ్లు, షాపింగ్ కాంప్లెక్స్, ఓపెన్ ఫ్లాట్లు ఉన్నట్లు ఆధారాలు దొరికాయి. ఈ ఆస్తుల విలువను ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ ప్రకా రం కేవలం రూ.14.39 కోట్లుగా లెక్కగడుతున్నారు. అయితే మార్కెట్లో వీటి విలువ రూ.1,500 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. హైదరాబాద్ పరిసరాల్లోని కొండాపూర్ ఏరియాలో నయీమ్ చెరలో ఉన్న 9 ఎకరాల స్థలమే దాదాపు రూ.200 కోట్లు ధర పలుకుతోంది. నయీమ్ ఆస్తులన్నీ హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటం తో వాటి విలువ వేలాది కోట్లలో ఉంటుందని స్పష్టమవుతోంది. ఇక మిగతా రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, ఛత్తీస్గఢ్, ఒడిశాలలో ఇంకెన్ని ఆస్తులు ఉన్నాయనే విషయాలు పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. సిటీలో షాపింగ్ కాంప్లెక్స్లు..? నయీమ్ ఇంటి వద్ద లభించిన పత్రాల్లో సిటీల్లోనూ షాపింగ్ కాంప్లెక్స్లు, ఇళ్లు, ఫ్లాట్ల రూపంలో 1,67,117 గజాల భూమి ఉందని పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. హైదరాబాద్లో మూడు షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయని గుర్తించిన సిట్ అధికారులు ఇప్పటికే అక్కడ తనిఖీలు చేసినట్లు సమాచారం. వీటితోపాటు ఓపెన్ ప్లాట్ల వివరాలను పూర్తిస్థాయిలో సేకరించారు. పుప్పాలగూడ పరిధిలోని నెక్నాంపూర్ గ్రామపంచాయతీ అల్కాపురి టౌన్షిప్లోని నయీమ్ ఇంటితోపాటు అతడి వంట మనిషి ఫర్హానా పేరిట ఉన్న అంజలీ గార్డెన్, తిరుమల గార్డెన్లోని ఇళ్లను కూడా పోలీసులు ఇప్పటికే సీజ్ చేశారు. మిగతా ఐదు రాష్ట్రాల్లో ఆస్తులెన్నో..! రాష్ట్రంలోనే వేల కోట్ల ఆస్తులుంటే నయీమ్ దందా సాగిన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, ఛత్తీస్గఢ్, ఒడిశాలలో ఎన్ని ఆస్తులు ఉంటాయన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే సైబరాబాద్ వెస్ట్ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించిన నయీమ్ వంట మనిషి ఫర్హానా, అతడి డ్రైవర్ భార్య ఆఫ్సాలు వెల్లడించిన ప్రకారం ఆ ఐదు రాష్ట్రాల్లో ఆస్తులున్నట్టుగా తెలిసింది. వీటిని గుర్తించేందుకు న్యాయస్థానం ఆ ఇద్దరినీ బుధవారం నుంచి ఆరు రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వడంతో ఏపీతోపాటు మహారాష్ట్ర, గోవా, ఛత్తీస్గఢ్, ఒడిశాలకు తీసుకెళుతున్నారు. అలాగే మహబూబ్నగర్లోని షాద్నగర్ పోలీసులు అరెస్టు చేసిన నయీమ్ భార్య హసీనా బేగం, అక్క సలీమా బేగం, షాద్నగర్ ఇంటికి చెందిన వాచ్మన్ మతీన్, అతని భార్య ఖలీమా బేగంలను వారంరోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో వారిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. వీరి విచారణలో కూడా మరిన్ని ఆస్తుల వివరాలు పూర్తిస్థాయిలో తెలిసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. కన్ను పడిందంటే వదలడు.. ఏదైనా భూమిపై నయీమ్ కన్ను పడిందంటే అది అతడి చేతికి చిక్కాల్సిందే. నగరం, పట్టణం, గ్రామం అనే తేడా ఉండదు. ఆ భూమి ఎవరిదైనా వశం కావల్సిందేనన్నది నయీమ్ సిద్ధాంతం. ఇలా రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాల్లో పట్టణాలకు దగ్గరగా ఉండే వ్యవసాయ భూములను అనుచరగణంతో కలసి కబ్జా చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. వ్యవసాయ భూములను ఓపెన్ ప్లాట్లుగా చేసి రియల్ ఎస్టేట్ దందా సాగించాలనుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే కొంత మంది అనుచరులను ఈ దిశగా రంగంలోకి దింపాడని తెలుస్తోంది. అలాగే హైదరాబాద్, మహబూబ్నగర్, నల్లగొండ, మెదక్, కరీంనగర్, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో 20 ఇళ్ల ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించారు. -
ఇకపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు తప్పనిసరి
గుర్గావ్: కొత్తగా నిర్మించే ఇల్లు, భవన సముదాయాలు, హౌసింగ్ సొసైటీలపై సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేయడాన్ని గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీజీ) తప్పనిసరి చేసింది. దీర్ఘకాలంగా విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న నగరవాసుల సమస్యకు ఇదొక్కటే పరిష్కారమని ఎంసీజీ భావిం చి ఈ నిర్ణయం తీసుకుంది. సోలార్ ప్యానల్లు ఏర్పాటు చేసుకునేందుకు స్థలం కేటాయించిన భవనాలకు మాత్రమే నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలనే యోచనలో ఉన్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అంటే గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏ ప్రాంతంలోనైనా ఇల్లు కొన్నా, కొత్త ఇల్లు కట్టుకున్నా సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకోవడానికి స్థలం కేటాయించినట్లు రుజువులు చూపాల్సి ఉంటుంది. అంతటితోనే కాకుండా సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకుంటున్నట్లు కూడా హామీ పత్రం ఇవ్వాలి. అంటే ఇంటి నిర్మాణానికి సంబంధించిన లేఅవుట్లోనే సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు సంబంధించిన వివరాలుండాలి. అప్పుడే దానికి ఆమోదముద్ర పడుతుంది. అయితే ఇది కేవలం కొత్తగా నిర్మించనున్న ఇళ్లకే కాకుండా ఇప్పటికే నిర్మించిన ఇళ్లకు కూడా వర్తింపజేసే యోచనలో ఉన్నట్లు కూడా ఎంసీజీ అధికారి తెలిపారు. అయితే తమ మొదటి దృష్టి మాత్రం కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లపైనే సారిస్తామన్నారు. కాగా ఈ విషయ మై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎంసీ జీ సీనియర్ అధికారి ఒకరు ఈ విషయమై మాట్లాడుతూ... ‘నగరంలో విద్యుత్ కొరత సమస్య రోజు రోజుకు తీవ్రమవుతోంది. సంప్రదాయ విద్యుత్ వనరులు రోజురోజుకు తగ్గుతున్నాయి. తగ్గకుండా మూడు కాలాలపాటు విద్యుత్ను ఉత్పత్తి చేయగలిగేది ఒక్క సోలార్ పవర్ను మాత్రమే. -
ఆపార్ట్మెంట్లో టార్గెట్గా దోపిడీ