Dashrath manjhi
-
నిజమైన ఇంజనీర్ నమ్మేది ఇదే! ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్..
మనిషి అనుకుంటే కొండను సైతం పిండి చేస్తాడనే మాటకు నిలువెత్తు నిదర్శనం 'దశరథ్ మాంఝీ' (Dashrath Manjhi). పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు, టెక్నాలజీ గురించి తెలియదు.. కానీ ఈ పేరు తెలియని వారు భారతదేశంలో దాదాపు లేదు అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అయితే నేడు దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఈయన గురించి ట్వీట్ చేసాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 360 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు ఉన్న ఒక కొండను ఒక సాధారణ మనిషి 22 సంవత్సరాలు పాటు శ్రమించి నిలువుగా చీల్చి రోడ్డు మార్గం ఏర్పాటు చేసాడు. దీంతో ఈ రోజు ఆ చుట్టుపక్కల ఉన్న దాదాపు 61 గ్రామాలు ఈ రోడ్డుని ఉపయోగించుకుంటున్నాయి. దశరథ్ మాంఝీ, పేరు కోసమో.. ప్రతిష్ట కోసమో, డబ్బు కోసమో పని చేయలేదు. మొదట ఈ పని తన భార్య కోసం ప్రారభించినప్పటికి.. చివరికి గ్రామం కోసం పాటుపడ్డారు. చివరకు అనుకున్నది సాధించాడు. ఆ రాష్ట్ర ప్రభుత్వం మాంఝీ సేవకు మెచ్చి ఆ రహదారికి మాంజీ మార్గ్ అని పేరు పెట్టింది. ఒక సందర్భంలో ఆయనను అప్పటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సీఎం కుర్చీలో కూర్చోబెట్టి గౌరవించాడు. ఇంజినీరింగ్ డే సందర్భంగా ఆనంద్ మహీంద్రా.. దశరథ్ మాంఝీని ఉద్దేశించి, నేను ఈ వ్యక్తి నమస్కరిస్తున్నాను, అంటూ.. అతడు ఇంజినీర్ కాదు, ఏ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పట్టా పొందలేదు, కంప్యూటర్ పరిజ్ఞానం లేదు, ఎటువంటి యంత్రాలను రూపొందించలేదు, కానీ నిజమైన ఇంజనీర్ నమ్మేదాన్ని అతను నమ్మాడు. అనుకుంటే ఏదీ అసాధ్యం కాదంటూ తెలిపాడు. ఇదీ చదవండి: ఐఫోన్ 15కు ఇస్రోకు ఉన్న సంబంధమేంటి? తెలిస్తే అవాక్కవుతారు! ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వేలమంది లైక్ చేయగా.. కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆనంద్ మహీంద్రా గతంలో ఈయనకు కంపెనీ ట్రాక్టర్ గిఫ్ట్గా అందించాడు. అప్పట్లో ఈ వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. On #EngineersDay2023 I bow low to this man. No, he wasn’t an engineer. No, he didn’t graduate from any Institute of Technology. No he wasn’t even computer literate nor did he design any machines. But he believed what every true Engineer believes:: “NOTHING is impossible.” https://t.co/zwyDe4Swr0 — anand mahindra (@anandmahindra) September 15, 2023 -
పనికిరాని ఇసుక దిబ్బలు.. 10 వేల చెట్లయ్యాయి!
పట్నా: విత్తనాన్ని పాతితే మొక్కై హామీ ఇస్తుంది. ఆ తరువాత చెట్టుగా ఎదిగి రక్షణ ఇస్తుంది. బిహార్లో గయ ప్రాంతంలోని బెలగాంజ్ ఇసుకతిప్పలతో ఉంటుంది. చెట్లేమీ ఉండవు. మొక్క నాటాలనే ఆలోచన పొరపాటున కూడా రాదు. ఆ ఎడారిలాంటి ప్రదేశంలో పదిహేను సంవత్సరాల కాలంలో పదివేల మొక్కలు నాటి రికార్డ్ సృష్టించాడు సత్యేంత్ర మంఝీ. ఎం.ఏ చేసిన ఇతడికి ‘మౌంటెన్ మ్యాన్’గా ప్రసిద్ధుడైన దశ్రథ్ మంఝీ ఆదర్శం. ఒకసారి దశరథ్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ‘ఈ ఎడారిలో చెట్లు నాటవచ్చు కదా’ అన్నాడు. అదే సత్యేంద్రకు వేదవాక్కు అయింది. దశ్రథ్ ఒక్కడే 22 సంవత్సరాలు కష్టపడి కొండను తవ్వి, దారి వేసిన మహాకష్టంతో పోల్చితే తాను పడబోయే కష్టం ఎంత అనుకొని రంగంలోకి దిగాడు సత్యేంద్ర. ఆయన శ్రమ వృథా పోలేదు. ఇసుకదిబ్బలు ఇప్పుడు చెట్లయ్యాయి. మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది లేదు... అని మరోసారి నిరూపించిన పచ్చటి సత్యం ఇది. చదవండి: ఆ పక్షులు మంటలో దూకి ప్రాణాలు విడుస్తాయి చదవండి: టూర్ ప్యాకేజీ: ఒక్కరికి 35 వేలవుతుంది! -
ఒడిశాలో మాంఝీ తరహా పోరాటం
-
మహారాష్ట్రలోనూ ‘మౌంటెన్ మేన్’
57 ఏళ్లలో 40 కి.మీ రోడ్లు నిర్మించిన ధీరుడు ముంబై: పొరుగూరికి రోడ్డు వేయడానికి కొండను పిండి చేసిన బిహార్ యోధుడు దశరథ్ మాంఝీ. ఆయన జీవితకథ ఆధారంగా ఇటీవలే ‘మాంఝీ- ద మౌంటెన్ మేన్’ పేరుతో హిందీలో ఓ సినిమా వచ్చింది. మాంఝీలాంటి వీరుడొకరు మహారాష్ట్రలోనూ ఉన్నాడు. ఆయన పేరు రాజారామ్ భాప్కర్. ఆయన 57 ఏళ్లు అవిరామంగా కష్టపడి ఏడు కొండలను నుగ్గు చేసి పలు గ్రామాలకు ఏడు రోడ్లను నిర్మించాడు. వాటి మొత్తం పొడవు 40 కి.మీ. ఈ సాహసాన్ని గౌరవించి ఆ ధీరుడిని అక్కడి ప్రజలు ‘భాప్కర్ గురూజీ’ అని ఆప్యాయంగా పిలుస్తుంటారు. 84 ఏళ్ల వయసున్న భాప్కర్ మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా గుండెగావ్లో టీచర్గా పనిచేసి రిటైరయ్యాడు. ఆయన ఏడో తరగతి వరకే చదువుకున్నారు. తెల్లచొక్కా, పైజామా, గాంధీ టోపీతో సౌమ్యుడిగా కనిపించే ఆయన మదిలో ఉక్కు సంకల్పం ఉంది. స్వాతంత్య్రం వచ్చేనాటికి గుండెగావ్ నుంచి పక్క ఊరికి కాలిబాట కూడా ఉండేది కాదు. ఆయన కొలెగావ్లో పనిచేస్తున్నప్పుడు గుండెగావ్ ప్రజలు అక్కడికి చేరుకోవడానికి మూడు గ్రామాలను దాటాల్సి వచ్చేది. 700 మీటర్ల ఎత్తున్న సంతోష కొండను పగలగొట్టి రోడ్డు వేయాలని భాప్కర్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఒంటరి పోరాటం ప్రారంభించారు. కొండను పగలగొట్టే పనిలోకి దిగారు. తనతోపాటు పనిచేస్తున్న వారికి తన జీతంలోంచి వేతనాలు చెల్లించాడు. రోడ్డు పనికి యంత్రాలను కూడా అద్దెకు తీసుకున్నారు. ‘సగం జీతాన్ని పనివాళ్ల వేతనాలకు ఖర్చు పెట్టాను. రోడ్డు పనికి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులు, పింఛను మొత్తం రోడ్డు పనికే ఖర్చు పెట్టాను’ అని భాప్కర్ చెప్పారు. రోడ్లు నిర్మించక ముందు కొలేగావ్ నుంచి గుండెగావ్కు 29 కి.మీ ప్రయాణించాల్సి వచ్చేది. కొండ పగలగొట్టి 1997లో రోడ్డు నిర్మాణం పూర్తి చేశాక ప్రయాణం 10 కి.మీకి తగ్గింది. 1968లో అక్కడి కాలిబాటలో సైకిల్ కూడా సరిగ్గా వెళ్లేది కాదు. ఇప్పుడు భారీ వాహనాలు కూడా వెళ్తున్నాయి.