Delhi Assembly Speaker
-
ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్గా విజేందర్ గుప్తా
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్గా అధికార బీజేపీ శాసనసభ్యుడు విజేందర్ గుప్తా ఎన్నికయ్యారు. కొత్తగా కొలువుదీరిన ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి మొదలయ్యాయి. సెషన్ ప్రారంభానికి ముందు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా బీజేపీ ఎమ్మెల్యే అర్వీందర్ సింగ్ లవ్లీతో ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేయించారు. అత్యంత సీనియర్ ఎమ్మెల్యే అయిన లవ్లీ నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో ప్రమాణం చేయించారు. అనంతరం, మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన గుప్తా పేరును స్పీకర్ పదవికి ప్రతిపాదిస్తూ సీఎం రేఖా గుప్తా, మంత్రి రవీందర్ ఇంద్రజ్ రెండు తీర్మానాలను ప్రవేశపెట్టగా, వీటిని మంత్రులు పర్వేశ్ వర్మ, మంజిందర్ సింగ్ బలపరిచారు. మూడువాణి ఓటుతో తీర్మానాలను సభ ఆమోదించిందని ప్రొటెం స్పీకర్ అర్వీందర్ సింగ్ లవ్లీ ప్రకటించారు. దీంతో, సీఎం రేఖా గుప్తా, ప్రతిపక్ష నేత ఆతిశీ వెంట రాగా కొత్త స్పీకర్ కుర్చీలో ఆసీనులయ్యారు. స్పీకర్ విజేందర్ గుప్తాకు సీఎం రేఖా గుప్తా శుభాకాంక్షలు తెలపగా, ఆప్కు చెందిన ప్రతిపక్ష నేత ఆతిశీ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. దళిత, సిక్కు వ్యతిరేక పార్టీ ఢిల్లీ అసెంబ్లీకి సారథ్యం వహించడం దురదృష్టకరమంటూ వ్యాఖ్యానించారు. సీఎం కార్యాలయంలో బీఆర్ అంబేడ్కర్, భగత్ సింగ్ల ఫొటోలను తీసేయడం చూస్తే బీజేపీ దళిత వ్యతిరేక వైఖరి తేటతెల్లమవుతోందని ఆరోపించారు. దీంతో, సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల పోటాపోటీ నినాదాలతో సభ 15 నిమిషాలపాటు వాయిదా పడింది. ఢిల్లీ సీఎం కార్యాలయంలో బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాన్ని తొలగించవద్దని అనంతరం ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ‘ఎక్స్’లో బీజేపీని కోరారు. ప్రధాని మోదీ ఫొటో పెట్టి, అంబేడ్కర్ ఫొటోను తీసేయడం కోట్లాది మంది ఆయన అనుచరుల మనస్సులను గాయపరిచినట్లేనన్నారు.ఆరు భాషల్లో ఎమ్మెల్యేల ప్రమాణంసెషన్ ప్రారంభానికి ముందు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా బీజేపీ ఎమ్మెల్యే అర్వీందర్ సింగ్ లవ్లీతో ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేయించారు. అత్యంత సీనియర్ ఎమ్మెల్యే అయిన లవ్లీ నూతన ఎమ్మెల్యేలందరితో ప్రమాణం చేయించారు. వీరు హిందీ, ఇంగ్లిష్, సంస్కృతం, ఉర్దూ, మైథిలి, పంజాబీ భాషల్లో ప్రమాణం చేయడంతో అసెంబ్లీలో భాషాపరమైన వైవిధ్యం ప్రతిఫలించింది. -
ఆనాడు మార్షల్స్ ఈడ్చుకెళ్లిన నేత.. నేడు ఢిల్లీ స్పీకర్!
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం చేయబోతున్నారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతోంది. ఈ క్రమంలో రేఖా గుప్తాతో పాటుగా మరో ఆరుగురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఇక, ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్గా బీజేపీ నుంచి రోహిణి ఎమ్మెల్యే విజేందర్ గుప్తాకు అవకాశం ఇచ్చారు. అయితే, గతంలో(2015) విజేందర్ను సభ నుంచి మార్షల్స్ ఎత్తుకెళ్లిన ఘటనను బీజేపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు.రోహిణి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజేందర్ గుప్తా మూడోసారి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో స్పీకర్గా తనకు అవకాశం ఇవ్వడంపై విజేందర్ గుప్తా స్పందించారు. ఈ క్రమంలో విజేందర్ మాట్లాడుతూ.. ‘నాకు స్పీకర్ స్థానం ఇచ్చినందుకు పార్టీకి ధన్యవాదాలు. సభకు సంబంధించి నా బాధ్యతలను నేను సక్రమంగా నిర్వర్తిస్తాను. గత ఆప్ ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన కాగ్ నివేదికలను నేను సభ ముందుకు తీసుకువస్తాను’ అని తెలిపారు.అయితే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజేందర్ గుప్తా, ఇతర బీజేపీ ఎమ్మెల్యేలు ఆప్ సర్కార్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ ప్రభుత్వం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదికలను సమర్పించకుండా అడ్డుకుంటోందని ఆరోపిస్తూ గతంలో కోర్టును ఆశ్రయించారు. కాగ్ నివేదికలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.VIDEO | Delhi: BJP leader Vijender Gupta (@Gupta_vijender) says, “I am thankful to the party for giving me the responsibility of Speaker of Delhi Assembly. I will fulfill my responsibility… I hope we will have healthy discussions in the House.”(Full video available on PTI… pic.twitter.com/8SsH8GEmNT— Press Trust of India (@PTI_News) February 20, 20252015లో ఏం జరిగింది?నవంబర్ 30, 2015న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. నాటి ఆప్ ఎమ్మెల్యే అల్కా లంబా(ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు), ఓపీ శర్మపై విజేందర్ గుప్తా అవమానకర వ్యాఖ్యలు చేశారని అధికార పార్టీ నేతలు వ్యాఖ్యలు చేశారు. దీంతో, సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అప్పటి అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్.. విజేందర్ గుప్తాను బయటకు పంపించి వేశారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో విజేందర్ను సభ నుంచి మార్షల్స్ బయటకు ఎత్తుకెళ్లారు. ఈ సందర్భంగా విజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ నేతల పట్ల స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇక, ఇప్పుడు విజేందర్కు స్పీకర్ అవకాశం రావడంతో ఆనాటి పరిస్థితులను బీజేపీ నేతలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. I remember that day when then LOP of Delhi assembly @Gupta_vijender ji was dragged out of the assembly not once but many times. Now he will become the Delhi assembly speaker. AAP will taste its karma. Many congratulations to Mr Gupta. pic.twitter.com/fwGsUxF10k— Prof Sayantan Ghosh (@sayantan_gh) February 20, 2025 -
సంచలనం : ఢిల్లీ స్పీకర్కు ఆరు నెలల జైలు
న్యూఢిల్లీ : ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్, అతని కుమారుడు సుమిత్ గోయెల్కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. జైలు శిక్షతో పాటు చెరో వెయ్యి రూపాయల జరిమానా విధించింది. వివరాలు.. 2015 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శాదర నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రామ్ నివాస్ గోయెల్ పోటీ చేశారు. ప్రత్యర్థి తరపున ఓటర్లకు మద్యం, దుప్పట్లు పంపిణీ చేస్తున్నారనే అనుమానంతో వివేక్ విహార్లోని మనీశ్ ఘాయి అనే స్థానిక బిల్డర్ ఇంట్లోకి తన అనుచరులతో కలిసి అక్రమంగా చొరబడి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఇంట్లోని పర్నీచర్ను ధ్వంసం చేయడంతో పాటు అడ్డొచ్చిన పని మనుషులపై దాడి చేశారు. దీంతో బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రామ్ నివాస్పై సెక్షన్ 448 కింద కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం 2017 సెప్టెంబర్లో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేటు ఏడుగురిని దోషులుగా తేల్చింది. తాజాగా ఇప్పుడు శిక్ష ఖరారైంది. అయితే సెక్షన్ 448 ప్రకారం గరిష్టంగా ఏడాది మాత్రమే శిక్ష విధించాలి. దీంతో రాజ్యాంగబద్ధంగా స్పీకర్ అనర్హత వేటుకి గురికారు. అయితే, గతంలో ఈ ఆరోపణలను రామ్ నివాస్ గోయెల్ ఖండించారు. ఘటనకు ముందు ప్రైవేట్ ఫిర్యాదునిచ్చి పోలీసుల సహాయంతోనే మనీశ్ ఘాయి ఇంటికి వెళ్లామనడం గమనార్హం. -
ఇఫ్తార్కు ఎల్జీని పిలవని స్పీకర్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్నివాస్ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) అనిల్ బైజల్కు షాకిచ్చారు. ఢిల్లీ∙అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు బైజల్కు ఆహ్వానం పంపలేదు. గతేడాది ఇఫ్తార్ విందుకు ఆహ్వానించినప్పటికీ ఎల్జీ రాలేదనీ, అందుకు ఎలాంటి కారణం చెప్పలేదని, అందుకే ఈసారి ఆయనకు ఆహ్వానం పంపలేదని స్పీకర్ చెప్పారు. విందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్, సామాజిక సంక్షేమ మంత్రి రాజేంద్రపాల్ గౌతమ్, పర్యావరణ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్, ఆప్ శాసనసభ్యులు హాజరయ్యారు. ఈ ఇఫ్తార్ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలు రాలేదు. -
అసెంబ్లీ స్పీకర్కు బెయిలబుల్ వారెంట్
న్యూఢిల్లీ: అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్కు స్థానిక కోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2008లో అప్పటి బీజేపీ నేత అయిన గోయల్ అప్పడు జరిగిన నిరసన కార్య క్రమంలో భాగంగా ఢిల్లీలోని సీపీఐ(ఎమ్) కార్యాలయం ఆస్తుల ధ్వంసం కేసులో కోర్టుకు హాజరుకాకపోవడంతో ఈ వారెంటు జారీ చేశారు. ఈ అల్లర్లుకు సంబంధించి పోలీసులు గోయల్, కేంద్ర మంత్రి హర్షవర్ధన్తోపాటు 21 మంది పేర్లు పేర్కొంటూ చార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసుపై కోర్టులో హాజరుకావాల్సిందిగా గోయల్ను జడ్జీ ఆదేశించినా గైర్హాజరవడంతో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శర్మ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. తదుపరి విచారణ మే 30కి వాయిదా వేశారు. -
నేడు స్పీకర్ ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం బీజేపీ జగ్దీశ్ ముఖిని బరిలోకి దింపడంతో స్పీకర్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక శుక్రవారం జరుగనుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన జంగ్పురా ఎమ్మెల్యే ఎం.ఎస్. ధీర్, బీజేపీ తరఫున జగ్దీశ్ ముఖి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఢిల్లీలో మైనారిటీ ప్రభుత్వం కొనసాగుతున్నందువల్ల అసెంబ్లీ స్పీకర్ పదవి ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ పదవిని దక్కించుకుని అసెంబ్లీలో తమది పైచేయి చేసుకోవడానికి పోటీపడుతున్నాయి. ఆప్కి బయటి నుంచి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ఎన్నికపై తన వైఖరిని స్పష్టం చేయలేదు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోరితేనే స్పీకర్ ఎన్నికలో ఆప్కి మద్దతు ఇస్తానని ఆ పార్టీ అంటోంది.