devootees
-
శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్న్యూస్ చెప్పిన టీఎస్ఆర్టీసీ.. ఇకపై
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ప్రకటించింది. ప్రతి వీకెండ్కు సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించింది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ టూర్.. ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి, భ్రమరాంబదేవి, సాక్షి గణపతి దర్శనంతో పాటు పాతాళగంగా, పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీ ధరను పెద్దలకు రూ.2700, పిల్లలకు రూ.1570గా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖరారు చేసింది. ప్రతి శనివారం ఉదయం ఈ టూర్ ప్రారంభమవుతుంది. తొలి రోజు హైదరాబాద్ లోని జేబీఎస్ నుంచి ఉదయం 7 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుంది. 8 గంటలకు ఎంజీబీఎస్ చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీశైలానికి చేరుకుని.. బస కోసం నేరుగా హోటల్కు వెళ్తుంది. మధ్యాహ్న భోజనం పూర్తయ్యాక.. 3 గంటలకు పాతాళగంగకు ప్రయాణికులను తీసుకెళ్తారు. కృష్ణానదిలో బోటింగ్ కూడా చేయిస్తారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబిక అమ్మ వారి దర్శనాన్ని భక్తులు చేసుకోవాలి. శీఘ్ర దర్శన సదుపాయం అక్కడ అందుబాటులో ఉంటుంది. రాత్రి భోజనం తర్వాత శ్రీశైలంలోనే హోటల్లో బస ఉంటుంది. రెండో రోజు ఉదయం 5 నుంచి 8 గంటల వరకు భక్తులు ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేసుకోవచ్చు. అనంతరం.. టిఫిన్ పూర్తవగానే హోటల్ చెక్అవుట్ చేయాలి. అక్కడి నుంచి శివాజి స్పూర్తి కేంద్రం, చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం సందర్శన ఉంటుంది. సాక్షి గణపతి ఆలయ దర్శనంతో పాటు పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. మార్గమధ్యంలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత రాత్రి 7.30 గంటలకు ఎంజీబీఎస్కు, 8.30 గంటలకు జేబీఎస్కు బస్సు చేరుకుంటుంది. రవాణా, వసతి, ఆలయ శీఘ్ర దర్శనం, శిఖరం ప్రవేశ రుసుం ప్యాకేజీలో చేర్చారు. ఆహారం, ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు, ఇతర ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. "ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంకు భక్తులు పెద్ద ఎత్తున వెళ్తుంటారు. హైదరాబాద్ నుంచి ప్రతి రోజు శ్రీశైలానికి 40 సర్వీసులను టీఎస్ఆర్టీసీ నడుపుతోంది. వీకెండ్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం వెళ్లాలనుకునే వారికోసం ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీని సంస్థ అందిస్తోంది.భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ ప్యాకేజీని యాజమాన్యం ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీని భక్తలందరూ వినియోగించుకోవాలి. టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ tsrtconline.in లోకి వెళ్లి మీ టికెట్లను బుకింగ్ చేసుకోవాలి. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలి" అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ సూచించారు. చదవండి సీఎం కేసీఆర్కు ఊహించని షాక్.. హైకోర్టు నోటీసులు -
చార్ధామ్ యాత్ర: భక్తులకు వార్నింగ్.. 2013ను గుర్తు తెచ్చుకోండి
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలివెళ్లారు. ఈ యాత్రను భారతీయలు ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. ఈ యాత్ర కోసం భక్తులు ఎంతో ఖర్చు చేసి అక్కడి వెళ్తుంటారు. ఆ ప్రాంతానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. కానీ, భక్తులు ఇవ్వన్నీ మరచి.. అక్కడి వాతావరణాన్ని, చుట్టుపక్కల ప్రాంతాలను కలుషితం చేస్తున్నారు. ఈ ఏడాది చార్ధామ్ యాత్రకు వెళ్లిన భక్తుల్లో కొందరు అక్కడి నియమాలను ఏమాత్రం పాటించడం లేదు. ప్లాస్టిట్స్ బాటిల్స్, ప్లాస్టిక్ బ్యాగులు, చెత్తా చెదారం అన్నీ అక్కడే పడేసి వచ్చేస్తున్నారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి ప్రాంతాన్ని చెత్త కుండీలా మార్చేశారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా సంస్థలు గుర్తించి ఫొటోలను షేర్ చేశాయి. ఈ క్రమంలో యాత్రికుల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ప్లాస్టిక్ కారణంగా పవిత్ర పుణ్యక్షేత్రం, అక్కడి వాతావరణం విపరీతంగా దెబ్బతిని పోతోందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చార్ధామ్ లాంటి సున్నిత ప్రాంతాల్లో ప్లాస్టిక్ కారణంగా లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దని పర్యావరణవేత్తలు హితవు పలుకుతున్నారు. అది జీవావరణానికే పెద్ద ప్రమాదమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్లో 2013 నాటి ఉపద్రవాన్ని ఒక్కసారి అందరూ గుర్తుకు తెచ్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. దేవుడిని కేవలం గర్భగుడిలోనే చూడటం కాదు.. ప్రకృతిలోనూ దైవత్వాన్ని చూడాలని కోరుతున్నారు. Uttarakhand | Heaps of plastic waste & garbage pile up on the stretch leading to Kedarnath as devotees throng for Char Dham Yatra pic.twitter.com/l6th87mxD9 — ANI UP/Uttarakhand (@ANINewsUP) May 22, 2022 ఇది కూడా చదవండి: యమునోత్రిలో కూలిన రహదారి భద్రత గోడ.. నిలిచిపోయిన 10 వేల మంది యాత్రికులు.. -
పూరీ వెళ్లే భక్తులకు గమనిక.. ఆలయ పాలక వర్గం కీలక నిర్ణయం
పూరీ: ఇకపై పూరీ జగన్నాథుడి దర్శనానికి వచ్చే భక్తులకు టీకా సర్టిఫికెట్, కోవిడ్ నెగెటివ్ రిపోర్టు అవసరం లేదని ఆలయ పాలక వర్గం ప్రకటించింది. కరోనా కేసులు భారీగా తగ్గినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక పై ఆదివారం మినహా ఇతర రోజుల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తామని అధికారులు చెప్పారు. భక్తులు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని వెల్లడించారు. -
కార్తీక పౌర్ణమి: దేదీప్యం.. ఇంద్రవైభోగం
సాక్షి, ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): కోటి కార్తిక జ్యోతులతో ఇంద్రకీలాద్రి దేదీప్యమానంగా వెలుగొందింది. పున్నమి చంద్రుడితో పోటీ పడినట్లు.. కృష్ణమ్మ బంగారు తరంగాలను మైమరపిస్తూ దీప కాంతులతో మెరిసిపోయింది. కార్తిక పౌర్ణమి సందర్భంగా దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం సాయంత్రం కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ విశిష్ట అతిథిగా విచ్చేశారు. అమ్మవారికి పంచహారతుల అనంతరం స్వా మిజీ పూజలు నిర్వహించి.. రాజగోపురం ఎదుట ఏర్పాటు చేసిన కోటి ఒత్తుల భారీ దీపాన్ని వెలిగించారు. ఆలయ మర్యాదలతో స్వామీజీకి స్వాగతం కోటి దీపోత్సవానికి విచ్చేసిన స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, దుర్గగుడి చైర్మన్ పైలాసోమినాయుడు, ఈవో భ్రమరాంబ సాదర స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శనానంతరం రాజగోపురం ఎదుట ఏర్పాటు చేసిన వేదికపై స్వామి వారు భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. పుష్పాలతో రంగవల్లులు కోటి దీపోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పుష్పాలతో ముగ్గులను తీర్చిదిద్దారు. వివిధ వర్ణాల పుష్పాలతో శ్రీచక్రాన్ని తీరిదిద్ది దీపాలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టు, మహా గణపతి ప్రాంగణం, మల్లేశ్వర స్వామి వారి ఆలయం, మహా మండప, కనకదుర్గనగర్లో దీపాలను ఏర్పాటు చేయగా, భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని దీపార్చన నిర్వహించారు. అనంతరం మల్లేశ్వర స్వామి వారి ఆలయం వద్ద జ్వాలా తోరణాన్ని అర్చకులు వెలిగించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేడు మహాజాతరకు అంకురార్పణ
సాక్షి ప్రతినిధి, వరంగల్: మేడారం మహాజాతరలో తొలిఘట్టమైన గుడిమెలిగె పండుగ బుధవారం జరగనుంది. మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలో ఉన్న సారలమ్మ ఆలయాలతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసి అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ తంతుతో మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ప్రారంభం కానుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు నాలుగు రోజులపాటు సమ్మక్క– సారలమ్మ మహాజాతర జరగనుంది. ఈ జాతరకు కోటి మందికిపైగా భక్తులు హాజరవుతారని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిచెందిన ఈ జాతర గుడిమెలిగె పండుగతోనే ప్రారంభమవుతుంది. ఒకప్పుడు మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మలకు గుళ్లుగా గుడిసెలు ఉండేవి. జాతరకు ముందు ఈ గుడిసెలకు మరమ్మతులు చేసేవారు. గుడిసెలకు కొత్తగా పైకప్పు అమర్చడం(కప్పడం) చేసేవారు. దీన్ని గుడి మెలగడం అంటారు. ఈ ప్రక్రియతోనే జాతర తొలిపూజ కార్యక్రమాలు మొదలయ్యేవి. ఇప్పుడు గుడిసెలు లేవు. వీటి స్థానంలో భవనాలు కట్టారు. గుడిసెలు లేకున్నా.. జాతరకు రెండు వారాల ముందు గుడిమెలిగెను నిర్వహిస్తున్నారు. -
తిరుమలలో భారీ వర్షాలకు భక్తుల ఇక్కట్లు
-
బాసరలో పెరిగిన భక్తులు
ఆదిలాబాద్(బాసర): ఆదిలాబాద్ జిల్లా బాసరలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవు కావడంతో పుష్కర స్నానానికి భక్తులు పోటెత్తారు. శనివారం వేకువ జామునే పెద్ద సంఖ్యలో బాసరకు చేరుకున్న భక్తులు గోదావరిలో పుష్కర స్నానాలు ఆచరించారు. భారీ రద్దీ కారణంగా అమ్మవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.