different reasons
-
వేర్వేరు కారణాలతో ముగ్గురి బలవన్మరణం
చౌటుప్పల్ :స్కూల్కు వెళ్లలేదని తండ్రి మందలించడంతో మనస్తాపం చెంది, కూతురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కుంట్లగూడెంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోగ సత్యనారాయణ చేనేత కార్మికుడు. ఈయనకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. కుమార్తె బోగ పూజ(13) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. సోమవారం పాఠశాలకు వెళ్లకపోవడంతో తండ్రి ఆమెను మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఓ గదిలోకి వెళ్లి, తలుపులు వేసుకొని, కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. కుటుంబ సభ్యులు చూసి, మంటలను ఆర్పి వేశారు.అప్పటికే బాగా కాలిపోయింది. చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసు ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జమ్మాపురంలో.. జమ్మాపురం (భువనగిరి అర్బన్) : పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని జమ్మాపురంలో గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివారల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్నాబత్తిని రవికుమార్(30)కు మూడు సంవత్సరాల క్రితం మూటకొండూరు గ్రామంలోని సికిందర్నగర్కు చెందిన స్వాతితో వివాహం జరిగింది. రెండు సంవత్సరాల క్రితం తర్వాత వారి మధ్య విభేదాలు వచ్చి కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి రవికుమార్ ఒంటరిగానే ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. దీంతో అతను మద్యం డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధించసాగాడు.నెల రోజుల నుంచి ఇంట్లో తగాదాలు ఎక్కువ య్యాయి. రవికుమార్ మనస్తాపానికి గురై ఆదివారం సాయంత్రం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు అతడిని భువనగిరి పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఈ మేరకు కేసునమోదు చేసుకున్ని దర్యాప్తు చేస్తున ట్లు రూరల్ ఏఎస్ఐ నర్సింగరావు తెలిపారు. రైలుకిందపడి.. యాదగిరిగుట్ట : రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మండలంలోని రామాజీపేట రైల్వేగేటు సమీపంలో జరిగింది. భువనగిరి రైల్వే హెడ్ కానిస్టేబుల్ బాలాగౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.రంగారెడ్డి జిల్లా హయాత్నగర్కు చెందిన కళ్యాణ్కుమార్ (27 )అదే ప్రాంతంలో ఓ బిస్కెట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతడికి నాలుగు నెలల క్రితం వివాహమైంది. పుట్టుకతోనే మూగవాడు. పెళ్లి జరిగిన తర్వాత కంపెనీలో పనికి సరిగ్గా వెళ్లడం లేదు. దీంతో పెద్దలు మందలించారు. దీంతో అతడు మనస్తాపానికి గురై సోమవారం తెల్లవారుజామున రామాజీపేట రైల్వే గేటు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ మేరకు భువనగిరి రైల్వే హెడ్ కానిస్టేబుల్ బాలాగౌడ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వేర్వేరు కారణాలతో ముగ్గురి బలవన్మరణం
తుర్కపల్లి న్యూస్లైన్ : వేర్వేరు కారణాలతో జిల్లాలో బుధవారం ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులబాధతో ఒకరు, ఆర్థిక సమస్యలతో ఇంకొకరు, మద్యానికి బానిసై మరోకరు బలవన్మారణానికి పాల్పడ్డారు. వివరాలు. తుర్కపల్లి మండలం వాసాలమర్రికి చెందిన బెజ్జనబోయిన సత్తయ్య,అండాలు (49) వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయానికి, ఇంటి నిర్మాణానికి అప్పు లు చేశారు. తమకున్న నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిలో పత్తి, వరి సాగు చేయగా వరుస కరువుతో పంట చేతికందలేదు. పెట్టిన పెట్టుబడులు కూడా అంతంత మాత్రమే. రుణదాతలు డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో కుటుంబ తగాదాలు ఎక్కువయ్యాయి. దీంతో మనస్తాపానికి గురైన అండా లు తెల్లవారుజామున ఇంట్లోనే పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కడుపునొప్పి ఎక్కువై కేకలు వేయడంతో కుటంబ సభ్యులు గమనించారు. చికిత్స నిమిత్తం ఆమెను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్కలో మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఒక కూమార్తె ఉంది. మృతురాలి కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ అభిలాష్ తెలిపారు. ఉరివేసుకొని ఇద్దరు.. చౌటుప్పల్: చౌటుప్పల్కు చెందిన కొక్కు శేఖర్(35) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. శేఖర్ దర్జీగా పనిచేస్తున్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మద్యానికి బానిసైన శేఖర్ భార్య, పిల్లలను పట్టించుకోవడంలేదు. దీంతో భార్య పిల్లలను తీసుకొని, ఇటీవలే పుట్టింటికి వెళ్లి పోయింది. మనస్తాపానికి గురైన శేఖర్ మంగళవారం రాత్రి, ఇంట్లో ఉరివేసుకొని మృతిచెందాడు. బుధవారం ఉదయం ఇరుగుపొరుగువారు చూసేసరికి మృతిచెంది ఉన్నాడు. ఇతని మృతిపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట పట్టణ శివారు చాకలిగిద్దె చెరువు సమీపంలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశువులు మేపేందుకు కాపరు లు అక్కడికి వెళ్లగా చెట్టుకు మృతదేహం వెలాడుతూ కని పించింది. దీంతోవారు పోలీసులకు సమాచారం ఇవ్వడం తో విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడు పట్టణంలోని పాతగుండ్లపల్లికి చెందిన ఎస్ సత్తయ్య (45)గా గుర్తించారు. ఇతడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. మన స్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నా రు.కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ నర్సింహారావు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.