Advertisement
Domestic economy
-
సమ్మిళిత అభివృద్ధే లక్ష్యం కావాలి!
దేశీయ ఆర్థిక వ్యవస్థ 8 శాతం వద్ద స్థిరంగా వృద్ధి చెందుతూ ఉండొచ్చు; అయితే బయటి ఎదురుగాలులు ఈ వృద్ధిని దెబ్బ తీయొచ్చు. వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సమాన స్థాయిలో మద్దతునిస్తూ, మౌలిక సదుపాయాలు, సేవల వంటి కీలక రంగాలను బలోపేతం చేయడంపై బడ్జెట్ దృష్టి పెట్టాలి. ప్రైవేట్ పెట్టుబడులకు సులభతర వాతావరణాన్ని సృష్టించే దిశగా కూడా ముందుకు సాగాలి. ఐఐటీలు, ఐఐఎమ్ల వంటి అద్భుతమైన ఉన్నత విద్యా సంస్థలతో కూడిన దేశంలో ప్రాథమిక, మాధ్యమిక విద్య దుర్భర స్థితిలో ఉంది. సమాజంలోని అన్ని వర్గాలూ ప్రయోజనాలను పొందేలా చూసుకోవాలి. భారీస్థాయిలోని మన యువ జనాభా శ్రామికశక్తిలోకి ప్రవేశించడానికి సన్నద్ధం అయ్యేలా కేంద్ర, రాష్ట్రాలు కలిసి పని చేయాలి.భౌగోళిక రాజకీయ రంగంలో కొనసాగు తున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రంలోని కొత్త ప్రభుత్వం తన మొదటి బడ్జెట్ను సిద్ధం చేస్తోంది. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్–హమాస్ వివాదం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. దేశీయ ఆర్థిక వ్యవస్థ దాదాపు 8 శాతం వద్ద స్థిరంగా వృద్ధి చెందుతూ ఉండవచ్చు. అయితే బాహ్య వాతా వరణపు స్థిరత్వాన్ని బట్టి ఇది మారవచ్చు. ప్రపంచ చమురు ధరలు తగ్గింపు స్థితిలోనే ఉంటాయనీ, ఎగుమతి వృద్ధిని ప్రభావితం చేసిన మాంద్యం పోకడల నుండి పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలు బయటపడ తాయనీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆశిస్తూ ఉండ వచ్చు. అంతర్జాతీయ సముద్ర మార్గాలను కలహాలు లేకుండా ఉంచడం కూడా వచ్చే పోయే వాణిజ్య ఖర్చులలో అనవసరమైన పెరుగుదలను నివారించడంలో కీలకం. స్పష్టంగా, బయటి ఎదురు గాలులు భారతదేశ వృద్ధి కథనాన్ని చెడగొట్టే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అందువల్ల, వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సమాన స్థాయిలో మద్దతునిస్తూ, మౌలిక సదుపాయాలు, సేవల వంటి కీలక రంగాలను బలోపేతం చేయడంపై బడ్జెట్ దృష్టి పెట్టడం అవసరం.మౌలిక వసతుల రంగంలో, గత కొన్నేళ్లుగా నమోదైన మూలధన వ్యయంలో విపరీతమైన పెరుగుదలను విధాన రూపకర్తలు కొన సాగించడం మంచిది. 2024–25 మధ్యంతర బడ్జెట్ మూలధన వ్యయంలో అంతకుముందు నమోదైన 30 శాతం పెరుగుదలను సుమారు 16.9 శాతానికి తగ్గించింది. దేశంలోని విస్తారమైన మౌలిక సదుపాయాల అంతరం కారణంగా మూలధన వ్యయంలో అధిక పెరుగుదల అవసరం. ఇది భారీ సంఖ్యలో నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను వెంటనే సృష్టించలేకపోయినా, ఉపాధి కల్పనపై నిస్సందేహంగా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ. 2.11 లక్షల కోట్లను బదిలీ చేసిన వాస్తవం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ దిశలో కొనసాగడానికి గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది.ప్రభుత్వ రంగం కంటే వెనుకబడిన ప్రైవేట్ పెట్టుబడులకు సులభతర వాతావరణాన్ని సృష్టించే దిశగా కూడా బడ్జెట్ ముందుకు సాగాలి. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాలు వంటి అమలులో ఉన్న విధానాలు తయారీకి ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఈ విధానాలను మరింత క్రమబద్ధీకరించాలి. 1991 ఆర్థిక సంస్కరణల కాలం నుండి నియంత్రణ వాతావరణం కచ్చితంగా చాలా ప్రగతి సాధించింది. కానీ గతంతో పోల్చడం అసందర్భం అవుతుంది. ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో ఇప్పుడు పోల్చుకోవలసి ఉంది. వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు సరళమైన, సులభ మైన పెట్టుబడి విధానాలను అందిస్తున్నాయి. బహుళజాతి సంస్థలు అక్కడ స్థావరాన్ని ఏర్పరచుకోవడానికి ఇది ఒక ఆకర్షణ. దీనికి విరుద్ధంగా భారతదేశం అంత ఆకర్షణీయంగా కనిపించడం లేదు.దేశీయ పెట్టుబడిదారులు అధిక మూలధనం, లాజిస్టిక్స్ ఖర్చు లతో పోరాడవలసి ఉంటుంది. అయినప్పటికీ, కొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి అవసరమైన అనుమతులు సమృద్ధిగా లభించకపోవడం అనేది దేశీయ, విదేశీ పెట్టుబడిదారులకు ప్రధాన అడ్డంకిగా మిగిలిపోయింది. ఈ సమస్యలు ఇప్పుడు ఎక్కువగా రాష్ట్రాలు లేదా స్థానిక మునిసిపాలిటీల స్థాయిలో ఉన్నాయి. సులభతరమైన వ్యాపారాన్ని ఈ స్థాయికి తీసుకురావడం తదుపరి తరం సంస్కరణల్లో భాగం కావాలి.మరో తరం సంస్కరణలు అవసరంఫిబ్రవరిలో 2024–25 మధ్యంతర బడ్జెట్తో విడుదల చేసిన ఆర్థిక ప్రకటనలో ఇది ఇప్పటికే పరిగణించబడుతుందనే సూచన కనిపిస్తోంది. ఇది మండలం, జిల్లా, గ్రామ స్థాయిలలో పాలనను మెరుగుపరచడం గురించి ప్రస్తావించింది. వృద్ధి, అభివృద్ధి ఆధారిత సంస్కరణల కోసం రాష్ట్రాలకు 75,000 కోట్ల రూపాయల రుణాన్ని కూడా అందించారు. ఆరోగ్యం, విద్య, నైపుణ్యం, భూసేకరణ వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించడమైనది.సంస్కరణలు చేపట్టేందుకు రుణాలు అందుబాటులో ఉన్నప్ప టికీ, అన్ని రాష్ట్రాలు సహకరించకపోవడమే ఈ ప్రణాళికలోని ఏకైక చిక్కు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలకు కట్టు బడి ఉండాల్సి ఉంటుంది, కానీ ఇతర రాష్ట్రాల నుంచి అదే స్పందన రాకపోవచ్చు. అందుకే తదుపరి తరం సంస్కరణలను ప్రారంభించే లక్ష్యం పాక్షికంగా మాత్రమే విజయవంతమవుతుంది. అదే సమయంలో, ముఖ్యంగా దక్షిణ భారతంలోని కొన్ని రాష్ట్రాలు, ఇప్పటికే నియంత్రణ ప్రక్రియలను క్రమబద్ధీకరించినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఇన్వెస్టర్లు వారికి అండగా నిలుస్తున్నారు. ఉదాహరణకు, ఆపిల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు కొత్త ప్రాజెక్ట్లను ప్రధానంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసుకొంటున్నాయి. ఈ రాష్ట్రాలు అవలంబించిన విధానాలను అధ్యయనం చేయాలి. ఇతర రాష్ట్రాల్లోనూ వీటిని పునరావృతం చేయాలి.ఈ సందర్భంలో, విద్య, నైపుణ్యాలకు చెందిన క్లిష్టమైన విభాగా నికి బడ్జెట్ కేటాయింపులు అవసరం. ప్రభుత్వ ఎజెండాలో ఉద్యోగాల కల్పన ఎక్కువగా ఉండాల్సి ఉండగా, అనేక రంగాలు నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయన్నది వాస్తవం. విద్య రకం, పరిశ్రమకు అవసరమైన నిర్దిష్ట నైపుణ్యాల మధ్య అసమతుల్యత కూడా ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి దీర్ఘకాలిక విధాన చికిత్సలను రూపొందించాలి. అయితే స్వల్పకాలంలో, రాబోయే బడ్జెట్లో నైపుణ్యం కలిగిన సంస్థలకు తగిన కేటాయింపులను అందించవచ్చు.అదనంగా, విద్యపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఐఐటీలు, ఐఐఎమ్ల వంటి అద్భుతమైన ఉన్నత విద్యా సంస్థలతో కూడిన దేశం ఇది. కానీ ప్రాథమిక, మాధ్యమిక విద్య దుర్భరమైన స్థితిలో ఉంది. ఇక్కడ కూడా, మన భారీస్థాయిలోని యువ జనాభా శ్రామికశక్తిలోకి ప్రవేశించడానికి బాగా సన్నద్ధం అయ్యేలా కేంద్ర, రాష్ట్రాలు కలిసి పని చేయాలి.జీడీపీ, ఉపాధి కల్పనలకు సహకారం అందిస్తున్నందున ప్రయాణం, పర్యాటకం వంటి సేవలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా మరింత మద్దతు ఇవ్వాలి. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికీ, మెరుగైన ఆర్థిక ఎంపికలు అందుబాటులోకి రావడానికీ హోటళ్లకు మౌలిక సదుపాయాల స్థితిని ఆతిథ్య పరిశ్రమ కోరుతోంది. కోవిడ్ ప్రభావిత పతనం నుండి ఈ రంగం బలంగా పుంజుకుంటోంది. అయితే కొంత లక్ష్యితి మద్దతు ఉపాధి అవకాశాలను విస్తరిస్తుంది.గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయడం తక్షణ అవసరం. వాటిని ఏర్పాటు చేయడానికి ప్రోత్సాహకాలతో పాటు, రైతులు రిటైల్ మార్కెట్లను ప్రత్యక్ష మార్గంలో అందుకోవడానికి తగిన వ్యవస్థలను ఏర్పాటు చేయడం అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని ఆదాయ మార్గాల కల్పనతో పాటు మౌలిక వసతుల కల్పనను తక్షణ ప్రాతిపదికన చేపట్టాలి. లేకుంటే రానున్న సంవత్సరాల్లో పట్టణ, గ్రామీణ అంతరం మరింత విస్తరిస్తూనే ఉంటుంది. సమాజంలోని అన్ని వర్గాలూ ప్రయోజనా లను పొందగలిగేలా చూసుకోవాలి. దేశవ్యాప్తంగా ఆకాంక్షలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయని ఇటీవలి ఎన్నికలు తెలియజేశాయి.సంక్షేమ విధానాలకు స్వాగతమే. అయితే దీర్ఘకాలంలో అవి స్థిరమైన అభివృద్ధికి దారితీయాలి.సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
పీనోట్ల పెట్టుబడుల దూకుడు
న్యూఢిల్లీ: దేశీ క్యాపిటల్ మార్కెట్లలో పార్టిసిపేటరీ(పీ) నోట్ల పెట్టుబడులు గత నెల(ఏప్రిల్)లో రూ. 95,911 కోట్లను తాకాయి. ఇది నాలుగు నెలల గరిష్టంకాగా.. గత రెండు నెలలుగా పీనోట్ల పెట్టుబడులు పెరుగుతూ వస్తున్నాయి. ఇంతక్రితం 2022 నవంబర్లో పీనోట్ పెట్టుబడులు రూ. 96,292 కోట్లకు చేరాయి. ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుండటం తాజా పెట్టుబడులకు కారణమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దేశీయంగా రిజిస్టరైన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(పీఎఫ్ఐలు) వీటిని జారీ చేస్తుంటారు. ప్రత్యక్షంగా రిజిస్టర్కాకుండానే దేశీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఆసక్తి చూపే విదేశీ ఇన్వెస్టర్లకు వీటిని ఎఫ్పీఐలు జారీ చేసే సంగతి తెలిసిందే. అయితే ఇందుకు తగిన పరిశీలన చేపట్టాక మాత్రమే వీటిని జారీ చేస్తారు. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం దేశీయంగా ఈక్విటీ, రుణ, హైబ్రిడ్ సెక్యూరిటీలలో పీనోట్ పెట్టుబడుల విలువ ఏప్రిల్ చివరికల్లా రూ. 95,911 కోట్లను తాకింది. మార్చి నెలాఖరుకు ఈ విలువ రూ. 88,600 కోట్లుగా నమోదైంది. ఇక ఫిబ్రవరికల్లా ఇవి రూ. 88,398 కోట్లుకాగా.. జనవరి చివరిలో రూ. 91,469 కోట్లకు చేరాయి. వెరసి మార్చిలో స్వల్పంగా పుంజుకోగా.. ఏప్రిల్లో భారీ వృద్ధి నమోదైంది. తాజాగా నమోదైన పెట్టుబడుల్లో రూ. 86,226 కోట్లు ఈక్విటీలలోకి ప్రవేశించాయి. ఈ బాటలో రూ. 9,586 కోట్లను రుణ పత్రాలలో ఇన్వెస్ట్ చేయగా, మరో రూ. 100 కోట్లు హైబ్రిడ్ సెక్యూరిటీల కొనుగోలుకి విదేశీ ఇన్వెస్టర్లు వెచ్చించారు. -
టాటా-మిస్త్రీల మధ్య మాటల యుద్ధం
-
టాటా-మిస్త్రీ వివాదంతో...ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
• పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం.. • ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ న్యూఢిల్లీ: టాటా-మిస్త్రీ కార్పొరేట్ వివాదాన్ని నిశితంగా గమనిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. 100 బిలియన్ డాలర్ల విలువైన టాటా గ్రూప్లో సంక్షోభం కారణంగా దేశీ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందని.. అందుకే దీనిపై ఓ కన్నేసి ఉంచినట్లు ఆయన వెల్లడించారు. ‘సాధారణంగా కొర్పొరేట్ వివాదాలు తలెత్తినప్పుడు ప్రభుత్వం తలదూర్చదు. టాటా సన్స వివాదం కూడా ఇలాంటిదే. ప్రభుత్వం ఈ విషయంలో చేసేదేమీ ఉండదు. ఇది వారి అంతర్గత వ్యవహారం. అరుుతే, దేశంలో అతిపెద్ద కార్పొరేట్ గ్రూప్ కావడంతో సహజంగానే ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఉంటుంది. అందుకే అక్కడ జరిగే పరిణామాలకు సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలు, ఇతరత్రా వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నాం. అరుుతే, ప్రస్తుతానికి దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భావిస్తున్నాం’ అని మేఘ్వాల్ పేర్కొన్నారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంసీఏ)కు కూడా ఆయన ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఈ వివాదం అంశాన్ని నియంత్రణ సంస్థలేవీ ఇంకా తమ(ఎంసీఏ) దృష్టికి తీసుకురాలేదని చెప్పారు. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని అర్ధాంతరంగా తొలగించడం.. ఆతర్వాత రతన్ టాటా, టాటా గ్రూప్పై మిస్త్రీ తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. ప్రస్తుతం రతన్-మిస్త్రీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. భయపడాల్సిన పనిలేదు... ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన అంశంపై స్పందిస్తూ... ఎల్ఐసీ ఒక్కటే కాదు.. దేశీ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు టాటా గ్రూప్తో సంబంధం ఉంది. ఆర్థిక వ్యవస్థలో టాటాలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. అరుుతే, ప్రతిష్టాత్మకమైన గ్రూప్గా పేరొందిన టాటా.. ఈ అంతర్గత వ్యవహరాన్ని పరిష్కరించుకోగలదని భావిస్తున్నా. కాబట్టి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. ఈ అంశం ప్రభుత్వం, నియంత్రణ సంస్థల ముందుకు వస్తే... నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని మేఘ్వాల్ పేర్కొన్నారు. ఎల్ఐసీకి టాటా మోటార్స్లో 7%, టాటా స్టీల్లో 13.91%, టాటా పవర్లో 13.12%, ఇండియన్ హోటల్స్లో 8.76% చొప్పున వాటాలున్నారుు. దొరాబ్జీ ట్రస్ట్కు ఖంబాటా రాజీనామా... టాటా కుటుంబానికి చెందిన కీలక ట్రస్టుల్లో ఒకటైన సర్ దొరాబ్జీ ట్రస్టీ సారథ్యం నుంచి డేరియస్ ఖంబాటా వైదొలిగారు. మాజీ అదనపు సొలిసిటర్ జనరల్, లాయర్ అరుున ఖంబాటా ట్రస్ట్రీ పదవికి గత నెల 25న రాజీనామా చేశారు. తన వృత్తిపరమైన అవసరాలు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా, మిస్త్రీని చైర్మన్ పదవి నుంచి తొలగించిన(అక్టోబర్ 24న) మర్నాడే ఈ ఖంబాటా రాజీనామా చోటుచేసుకోవడం గమనార్హం. టాటా ట్రస్ట్ల సూచనల మేరకే మిస్త్రీని తొలగించినట్లు టాటా సన్స ప్రకటించిన విషయం తెలిసిందే. టాటా గ్రూప్ కంపెనీలకు హోల్డింగ్ కంపెనీ అరుున టాటా సన్సలో టాటా ట్రస్ట్లకు 66 శాతం వాటా ఉంది. ఈ ట్రస్టుల్లో సర్ దొరాబ్జీ, రతన్ టాటా ట్రస్టులో అతిపెద్దవి. నిబంధనల ప్రకారమేముంద్రా ప్రాజెక్టు: టాటా పవర్ ముంద్రా అల్ట్రా పవర్ ప్రాజెక్టు(యూఎంపీపీ) విషయంలో చట్టపరమైన అంశాలన్నింటినీ పూర్తిగా పాటించామని టాటా పవర్ వివరణ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు అనవసరంగా అధిక ధరకు టాటా పవర్ బిడ్ చేసిందని.. దీని వల్ల భారీ మొత్తంలో పెట్టుబడులను నష్టపోవాల్సి(రైట్ డౌన్) వస్తుందంటూ చైర్మన్ పదవి నుంచి వేటు పడిన మిస్త్రీ తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. టాటా పవర్తో పాటు టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా డొకోమో తదితర గ్రూప్ కంపెనీలకు సంబంధించి 18 బిలియన్ డాలర్లకు(దాదాపు రూ.1.2 లక్షల కోట్లు)పైగానే రైట్డౌన్ చేయాల్సి రావచ్చని మిస్త్రీ బాంబు పేల్చడంతో.. సంబంధిత కంపెనీలను స్టాక్ ఎక్స్ఛేంజీలు వివరణ కోరారుు. ‘2006లో ముంద్రా యూఎంపీపీకి బిడ్ చేసినప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ కమిటీ పరిశీలన విధానం అమల్లోలేదు. ప్రతిపాదనలపై బోర్డు చర్చించాకే ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు వివరాలు, సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాటాదారులకు తెలియజేస్తున్నాం. సెబీ నిబంధనలమేరకే నడుచుకుంటున్నాం’ అని టాటా పవర్ పేర్కొంది. ఇండియన్ హోటల్స్ కూడా.. సైరస్ మిస్త్రీ ఆరోపణల నేపథ్యంలో ఇండియన్ హోటల్స్ కూడా స్టాక్ ఎక్స్ఛేంజీలకు వివరణ ఇచ్చింది. నిబంధనలు, చట్టప్రకారమే తాము ఎప్పటికప్పుడు కంపెనీ ఫలి తాలు, వివరాలన్నింటినీ వెల్లడిస్తూ వస్తున్నామని పేర్కొంది. ఇండియన్ హోటల్స్కు విదేశాల్లో ఉన్న ఆస్తులతో పాటు ఓరియంట్ హోటల్స్లో ఉన్న వాటాలను నష్టాలకు అమ్ముకోవాల్సి వచ్చిందని మిస్త్రీ పేర్కొనడం తెలిసిందే. అంతేకాదు... తన హయాంకు ముందు(రతన్ టాటా చైర్మన్గా ఉన్నప్పుడు)అనుసరించిన విదేశీ కొనుగోళ్ల వ్యూహమే దీనికి కారణమని ఆయన ఆరోపించారు. -
నిర్మాణాత్మక సంస్కరణలే శరణ్యం...
అప్పుడే ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతుంది... వచ్చే ఏడాది రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం స్థాయిలో ఉండొచ్చు... 2016 మార్చి నాటికి మొండిబకాయిలు 4%కి తగ్గొచ్చు ఆర్థిక స్థిరత్వ నివేదికలోరిజర్వ్ బ్యాంక్ అభిప్రాయం... ముంబై: ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పునరుద్ధరించాలంటే.. ప్రభుత్వం నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడం ఒక్కటే మార్గమని రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) పేర్కొంది. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం, వృద్ధి రేటు అంచనాలు పెరగడం, ద్రవ్యోల్బణం దిగిరావడం వంటి పరిణామాలతో దేశీ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితికి అడ్డుకట్టపడిందని తెలిపింది. సోమవారం విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక(ఎఫ్ఎస్ఆర్)లో ఈ అంశాలను ప్రస్తావించింది. 2015లో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దరిదాపుల్లో స్థిరపడొచ్చని అంచనా వేసింది. వడ్డీరేట్లపై పాలసీ నిర్ణయానికి ప్రధాన కొలమానంగా ఆర్బీఐ పరిగణిస్తున్న రిటైల్ ధరల ద్రవ్యోల్బణం ఈ ఏడాది నవంబర్లో 4.4%కి దిగిరావడం తెలిసిందే. కాగా, ఈ ఏడాది(2014-15)లో ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం మందగించడం ప్రధానంగా ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది. మొండిబకాయిలపై ఆందోళన... బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల(ఎన్పీఏ) పెరుగుదలపైనా ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. గత ఎఫ్ఎస్ఆర్ నివేదిక(2014 జూన్లో) నాటితో పోలిస్తే ఈ రంగంలో రిస్క్లు యథాతథంగానే ఉన్నాయని.. అంటే ఈ ఎన్పీఏల సమస్యకు చెక్ చెప్పాల్సిన ఆవశ్యకతను ఇది తెలియజేస్తోందని స్పష్టం చేసింది. గడచిన ఆరు నెలల్లో బ్యాంకుల స్థూల మొండి బకాయిలు(జీఎన్పీఏ) 0.4 శాతం మేర ఎగబాకాయని... సెప్టెంబర్ చివరికి మొత్తం రుణాల్లో 4.5 శాతానికి చేరినట్లు ఆర్బీఐ వివరించింది. ఇక నికర ఎన్పీఏలు మార్చిలో 2.2 శాతం ఉండగా... సెప్టెంబర్నాటికి 2.5 శాతానికి ఎగబాకాయని తెలిపింది. అయితే, ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాల నేపథ్యంలో 2016 మార్చి నాటికి ఈ పరిమాణం 4 శాతానికి మెరుగయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. రుణాల పునర్ వ్యవస్థీకరణలు ఎగబాకడం మాత్రం తీవ్ర ఆందోళనకరంగా పరిణమిస్తోందని పేర్కొంది. జీఎన్పీఏలు, రుణ పునర్వ్యవస్థీకరణలతో కలిపితే మొత్తం మొండి బకాయిల పరిమాణం ఈ ఏడాది మార్చిలో 10 శాతం కాగా.. సెప్టెంబర్ చివరికి 10.7 శాతానికి పెరిగాయని నివేదిక వెల్లడించింది. ‘బ్యాంకుల మధ్య అంతర్గత లింకుల కారణంగా కూడా మొండిబకాయిల రిస్క్లను పెంచుతోంది. ఒక బ్యాంకుకు సమస్య తలెత్తితే ఆ రిస్క్ ప్రభావం దానితో లింకున్న ఇతర బ్యాంకులపైనా పడేందుకు దారితీస్తోంది. దీన్ని కూడా నిశితంగా పర్యవేక్షించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి’ అని ఆర్బీఐ నివేదిక తేల్చిచెప్పింది. ప్రమోటర్ల షేర్ల తనఖాపై కన్ను... మొండిబకాయిల పెరుగుదల నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీల కార్యకలాపాలపై మరింత దృష్టిసారించాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ పేర్కొంది. ముఖ్యంగా వివిధ మార్గాల్లో షేర్ల తనఖాల ద్వారా ప్రమోటర్లు చేపడుతున్న నిధుల సమీకరణను నిశితంగా తనిఖీ చేయాలని సూచించింది. ప్రమోటర్లు తమ షేర్లను తనఖా పెట్టి ఎడాపెడా నిధులను సమీకరించడం వల్ల వాటాదారుల్లో భయాలు నెలకొనడంతోపాటు బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా ఆందోళనకు దారితీస్తుందని పేర్కొంది. మరీ ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్న ప్రస్తుత తరుణంలో ఇది చాలా ముఖ్యమని కూడా నివేదిక అభిప్రాయపడింది. మరోపక్క, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ) ఇటీవలి కాలంలో దేశీ డెట్(బాండ్లు) మార్కెట్లో ఎడాపెడా పెట్టుబడి పెట్టడంపై అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ పేర్కొంది. ప్రపంచ మార్కెట్లలో ముఖ్యంగా అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ పాలసీ ఇతరత్రా పరిస్థితులు మారిపోతే ఈ నిధులు ఒక్కసారిగా వెనక్కివెళ్లే ప్రమాదం ఉందని.. దీనివల్ల దేశీ మార్కెట్లపై తీవ్ర ప్రతికూలా ప్రభావానికి దారితీస్తుందని హెచ్చరించింది. -
నిఫ్టీ 8000 దాటేసింది
దూసుకెళుతున్న స్టాక్ మార్కెట్ - ఇంట్రాడేలో 26,900కు సెన్సెక్స్ - సెన్సెక్స్ 229, నిఫ్టీ 73 పాయింట్లు అప్ - మళ్లీ సరికొత్త రికార్డుల మోత - మెటల్, పవర్, రియల్టీ జోరు మార్కెట్ అప్డేట్ రెండున్నరేళ్ల తరువాత దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం ఇన్వెస్టర్లకు హుషారునిచ్చింది. ఈ ఏడాది(2014-15) తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో జీడీపీ 5.7% వృద్ధి చూపడంతో మెరుగుపడ్డ సెంటిమెంట్ అన్ని రంగాలకూ బలాన్నిచ్చింది. మరోవైపు గత రెండు దశాబ్దాలలో వివిధ ప్రభుత్వాలు చేపట్టిన బొగ్గు క్షేత్రాల కేటాయింపులను సుప్రీం కోర్టు మూకుమ్మడిగా రద్దు చేయబోదన్న అంచనాలు దీనికి జత కలిశాయి. సుప్రీం పేర్కొన్న మొత్తం 218 క్షేత్రాలకు సంబంధించి 48 బ్లాకుల్లో ఇప్పటికే అభివృద్ధి పనులు మొదలుకావడంతో వీటిని వెనక్కి తిరిగి తీసుకోలేమని అటార్నీ జనరల్ సుప్రీంకు నివేదించడంతో చివర్లో మార్కెట్లు మరింత జోరందుకున్నాయి. వెరసి సెన్సెక్స్, నిఫ్టీ మరోసారి సరికొత్త రికార్డులను లిఖించాయి. మార్కెట్ చరిత్రలో తొలిసారి 8,000 పాయింట్లను అధిగమించిన నిఫ్టీ 73 పాయింట్లు ఎగసి 8,028 వద్ద ముగిసింది. ఇక 229 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్ 26,867 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో నిఫ్టీ గరిష్టంగా 8,035కు చేరగా, సెన్సెక్స్ 26,900ను తాకడం విశేషం! కాగా, మే 12న నిఫ్టీ తొలిసారి 7,000 పాయింట్లను తాకింది.బీఎస్ఈలో ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాలూ లాభాలతో పుంజుకోగా, మెటల్, పవర్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ 2.5% చొప్పున ఎగశాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో సన్ ఫార్మా, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ మాత్రమే 1%పైగా నష్టపోయాయి. ఎన్సీసీ రూ. 599 కోట్ల రైట్స్ ఇష్యూ రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 598.7 కోట్లు సమీకరిస్తున్నట్లు నాగార్జునా కనస్ట్రక్షన్స్ (ఎన్సీసీ) స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. రూ.2 ముఖ విలువ కలిగిన 29.9 కోట్ల షేర్లను జారీ చేయడం ద్వారా ఈ మూలధనాన్ని సేకరించనుంది. ప్రతీ ఆరు షేర్లకు ఏడు షేర్లు ఇచ్చే విధంగా 7:6 నిష్పత్తిలో షేర్లను కేటాయిస్తారు. షేరు ధరను రూ. 20గా నిర్ణయించారు. కానీ ఈ రైట్స్ ఇష్యూకి రికార్డు తేదీని ఇంకా నిర్ణయించలేదు. ఈ వార్తల నేపథ్యంలో సోమవారం బీఎస్ఈలో ఎన్సీసీ షేరు 1.31 శాతం నష్టపోయి రూ. 67.80 వద్ద ముగిసింది.