Advertisement
driving license must
-
డ్రైవింగ్ లైసెన్సులు ఉండాల్సిందే
వికారాబాద్ అర్బన్ : వాహనం ఉన్న ప్రతి ఒక్కరికీ డ్రైవింగ్ లైసెన్సు ఉండాల్సిందేనని ఎస్పీ అన్నపూర్ణ తెలిపారు. మంగళవారం వికారాబాద్ డీఎస్పీ శిరీష ఆధ్వర్యంలో వికారాబాద్ డివిజన్ పరిధిలోని మండల కేంద్రాల్లో ఏకకాలంలో వాహనాలు తనిఖీలు చేశారు. స్థానిక మహాశక్తి చౌరస్తాలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడారు. ప్రతి వాహనదారుడు విధిగా లైసెన్సు, ఇతర పత్రాలు కలిగి ఉండాలని చెప్పారు. లైసెన్సు లేకుండా వాహనాలు నడిపితే చట్టరీత్యా నేరమని, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరిగా డ్రైవింగ్ రాకపోయినా నడిపితే మనతో పాటు, ఇతరులకు ప్రమాదాలబారిన పడే అవకాశం ఉందని తెలిపారు. అజాగ్రత్తగా వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలతో చెలాగాటం ఆడొద్దని సూచించారు. తల్లిదండ్రులు చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దన్నారు. ట్రాఫిక్ రూల్స్ను ప్రతిఒక్కరూ పాటించాలని తెలిపారు. ప్రమాదాలను నివారించేందుకే వాహనాల తనిఖీలు చేస్తున్నట్లు వివరించారు. వాహనానికి సంబంధించి పత్రాలు లేకపోతే ఈ–పిట్టీ కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో వాహనదారులకు జరిమానా వేసి రశీదు ఇచ్చేవారమని, ఇప్పుడు ఈ పిటీ కేసు నమోదు చేయడంతో నేరుగా ఆన్లైన్లో కేసు నమోదవుతుందని వివరించారు. వాహనదారుడు మీ సేవా, లేదా ఆన్లైన్లో జరిమానా చెల్లించి కోర్టులో హాజరు కావాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. త్వరలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అనంతరం జరిమానాలు, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని, అతివేగం ప్రాణాంతకం అన్నారు. వికారాబాద్ డివిజన్ పరిధిలో వాహనాల తనిఖీని డీఎస్పీ శిరీష ఆద్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తున్నారని అభినందించారు. అనంతరం డీఎస్పీ శిరీష మాట్లాడుతూ.. మంగళవారం డివిజన్ పరిధిలో 70 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వికారాబాద్ సీఐ వెంకట్ రామయ్య, ఎస్ఐ సురేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
వాహన లైసెన్సు తప్పనిసరి
అనంతపురం సెంట్రల్ : జిల్లాలో డ్రైవింగ్ లైసెన్స్లు లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జీవీజీ అశోక్కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో విడుదల చేశారు. సోమవారం నుంచి వారం రోజుల పాటు జిల్లా అంతటా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాల నడిపే వారిపై ముమ్మర తనిఖీలు చేపడుతామన్నారు. అన్ని పోలీసు స్టేషన్ అధికారులను ఇప్పటికే ఆదేశించామన్నారు. వాహన ప్రమాదాల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. కొందరు యజమానులు తమ వాహనాలను ఇతరులకు ఇచ్చే సమయంలో డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అని ఆలోచించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. నెలన్నర కిందట జిల్లాలో మడకశిర పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ లేని యువకుడికి ద్విచక్ర వాహనం ఇచ్చి పరోక్షంగా రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు చట్టరీత్యా నేరమన్నారు. ఈ తరహా ఘటనలు పునరావృతమైతే యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహన తనిఖీల సమయంలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు.