చేనేత షో యగం
పోచంపల్లి వస్త్ర సోయగం..
సిటీవాసులను పలకరించింది. కుషాయిగూడలోని ఈసీఐఎల్ క్రాస్ రోడ్డు ఎస్ఎస్ఐసీ ఎగ్జిబిషన్ సెంటర్లో శుక్రవారం పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళాను టాలీవుడ్ నటి హాసికా దత్ ప్రారంభించింది. ష్యాషన్ లుక్.. ట్రెడిషనల్ మార్క్.. ఈ రెండూ చేనేత వస్త్రాల్లోనే కనిపిస్తాయన్నారామె. తాను కూడా చేనేత వస్త్రాలను ఇష్టంగా ధరిస్తానని చెప్పారు.
ఈ నెల 17 వరకు కొనసాగే ప్రదర్శనలో.. డిజైనర్ శారీస్, సిల్క్ అండ్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కుర్తాలు, టేబుల్ లెనిన్ వంటి రకరకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుంది.
- కుషాయిగూడ