Electronic Weighing Machines
-
తూకాల్లో మోసాలకు అడ్డుకట్ట
సాక్షి, అమరావతి: వ్యాపార దుకాణాలు, సూపర్ మార్కెట్లు, బంగారు ఆభరణాల విక్రయాల్లో మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. తూనికలు, కొలతల చట్టాన్ని గ్రామస్థాయి నుంచి పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. వినియోగదారుల హక్కులను సంపూర్ణంగా పరిరక్షించడంలో గ్రామ, వార్డు సచివాలయ (జీఎస్డబ్ల్యూఎస్) సిబ్బందిని భాగస్వాములను చేయనుంది. దుకాణాల్లో సంప్రదాయ, ఎలక్ట్రానిక్ కాటా యంత్రాలను నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం ధ్రువీకరించడం, స్టాంపింగ్ ప్రక్రియలను పర్యవేక్షించేలా బాధ్యతలను వికేంద్రీకరించింది. ఇప్పటికే జీఎస్డబ్ల్యూఎస్లో సాంకేతిక అర్హత కలిగిన ఇంజినీరింగ్ సహాయక సిబ్బందిని గుర్తించింది. వీరికి వచ్చే వారంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ప్రారంభించనున్నారు. సిబ్బంది కొరతను అధిగవిుంచేలా.. వాస్తవానికి తూనికలు, కొలతల శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. తూకంలో మోసాలతో పాటు ప్యాకింగ్ ఉత్పత్తులపై ముద్రిత ధర కంటే ఎక్కువకు విక్రయించడం, ఎమ్మార్పీలు ముద్రించకపోవడం వంటి లోపాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పరిపాలన వికేంద్రీకరణలో కీలక భూమిక పోషిస్తున్న సచివాలయ వ్యవస్థను సమర్థంగా వినియోగించుకునేలా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే భౌతికశాస్త్రం చదివిన బీఈ, బీటెక్, బీఎస్సీ విద్యార్హత కలిగిన ఇంజినీరింగ్ సహాయకులను ఎంపిక చేసింది. తూనికలు, కొలతల శాఖ అధికారుల పర్యవేక్షణలో సచివాలయ ఇంజినీరింగ్ సహాయక సిబ్బంది స్థానికంగా వ్యాపార దుకాణాల్లో తనిఖీలు చేసి లోపాలు గుర్తించాలి. తూకాల్లో తేడా, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించడం, గ్యాస్, పెట్రోల్ బంకుల్లో మోసాలు వంటి అంశాలపై ఫిర్యాదులు అందిన వెంటనే వాటిని సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపట్టేలా విధులను కేటాయిస్తూ పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ ఎక్స్ అఫిషియో సెక్రటరీ హెచ్.అరుణ్కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. వీటితోపాటు గ్రామ, మండల స్థాయిలో ఎప్పటికప్పుడు వినియోగదారులకు అవగాహన కల్పించడంతోపాటు 1967 టోల్ఫ్రీ నంబరుపై చైతన్యం తీసుకొచ్చేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
పాత తూకం యంత్రంతో రైతులకు భారీ టోకరా
రామాయంపేట (మెదక్): మండలంలోని కాట్రియాల గ్రామంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో భారీ అవినీతి చోటు చేసుకుంది. దీంతో రైతులు రూ.లక్షలు నష్టపోయారు. ఎల్రక్టానిక్ తూకం యంత్రానికి బదులుగా పాత తూకం యంత్రం వినియోగించి దోపిడీకి పాల్పడ్డారు. ప్రతీ తూకానికి 40 కిలోలకు బదులుగా 48 నుంచి 50 కిలోల వరకు అక్రమంగా తూకం చేసుకొని రైతులను మోసగించారు. కాగా రైతులకు తెలియకుండానే ఒక్కో తూకం (40 కిలోలు)లో ఎనిమిది నుంచి పది కిలోల మేర మోసానికి పాల్పడ్డారు. ఈ కేంద్రంలో ఇప్పటివరకు పదివేల బ్యాగుల వరకు తూకం వేయగా, ఇందులో సుమారుగా ఐదు వేల బ్యాగులను పాత కాంటాపై తూకం చేశారు. ఈ లెక్కన రైతులు రూ.లక్షలు నష్టపోయారు. కాగా ఎవరి ప్రోద్బలంతో తూకం వేసిన హమాలీలు ఈ మోసానికి పాల్పడ్డారో తెలియాల్సి ఉంది. బయటపడింది ఇలా.. సాయంత్రం మ్యాన్యువల్ కాంటాతో ధాన్యం బస్తాలను తూకం వేస్తున్న క్రమంలో అనుమానించిన కొందరు రైతులు ఈ కాంటాతో తూకం వేసిన బస్తాలను కొన్నింటిని ఎల్రక్టానిక్ తూకం యంత్రంపై తూకం వేయగా, ఈ మోసం బయటపడింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రైతులు వందలాది మంది కేంద్రం వద్ద నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకొని వచి్చన పోలీసులు రైతులను శాంతపర్చారు. చదవండి: సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో రోడ్డెక్కిన రైతన్న -
స్టాక్ పాయింట్లలో ఈ–వేయింగ్ మిషన్లు
సాక్షి, అమరావతి: రేషన్ దుకాణాల్లో తూకాల్లో మోసాలను అరికట్టేందుకు ఈ–పాస్ యంత్రాలను వినియోగిస్తున్నట్లే ఇకపై మండల స్థాయి స్టాక్ పాయింట్లలోనూ (ఎంఎల్ఎస్) అవకతవకలకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధమైంది. స్టాక్ పాయింట్లలో ఈ–వేయింగ్ మిషన్లను తప్పనిసరి చేస్తూ పౌర సరఫరాల సంస్థ నిర్ణయం తీసుకుంది. స్టాక్ పాయింట్ల వద్ద 50 కిలోల బస్తా నుంచి 1–2 కిలోల బియ్యం తీసి, డీలర్లకు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సబ్సిడీ బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు ఏర్పాటు చేసింది. గతంలో స్టాక్ పాయింట్లలో అక్రమాలకు అలవాటుపడ్డ కొందరు సిబ్బంది ఈ యంత్రాలను వినియోగించకుండా పక్కన పడేశారు. డీలర్ల నుంచి ఫిర్యాదులు అందుతుండడంతో ఇకపై స్టాక్పాయింట్లలో ఈ–వేయింగ్ యంత్రాల వినియోగాన్ని అధికారులు తప్పనిసరి చేశారు. - శ్రీకాకుళం జిల్లాలో 18, విజయనగరంలో 15, విశాఖపట్నంలో 30, తూర్పు గోదావరిలో 21, పశ్చిమ గోదావరిలో 14, కృష్ణాలో 17, గుంటూరులో 20, ప్రకాశంలో 19, నెల్లూరులో 15, చిత్తూరులో 28, వైఎస్సార్ కడపలో 19, అనంతపురంలో 24, కర్నూలు జిల్లాలో 17 మండల స్థాయి స్టాక్ పాయింట్లు ఉన్నాయి. - 257 స్టాక్ పాయింట్ల నుంచి 29 వేల రేషన్ దుకాణాలకు ప్రతినెలా 2.60 లక్షల టన్నుల బియ్యాన్ని తరలిస్తున్నారు. ఇందులో క్వింటాల్కు 1–2 కిలోల చొప్పున బియ్యం తగ్గుతున్నట్లు ఆరోపణలున్నాయి. - స్టాక్ పాయింట్లలో పనిచేసే కొందరు సిబ్బంది మిల్లర్లతో కుమ్మక్కై బియ్యాన్ని అక్రమంగా నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. - ఇకపై స్టాక్ పాయింట్లలో తప్పనిసరిగా ఈ–వేయింగ్ మిషన్ల ద్వారా బియ్యం తూకం వేసి, డీలర్లకు ఇవ్వాలని అధికారులు స్పష్టం చేశారు. - తూకాల్లో మోసాలకు తావులేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు నుంచి లబ్ధిదారులకు 5, 10, 15, 20 కిలోల సంచుల్లో నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. - ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. - ఏప్రిల్ నుంచి జిల్లాకు ఒక నియోజకవర్గం చొప్పున ఈ విధానాన్ని అమలు చేసి, ప్రతినెలా కొన్ని చొప్పున ఆగస్టు నాటికి 175 నియోజకవర్గాల్లో అమలు చేసేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. -
వినియోగదారులను దోపిడీ చేస్తున్న వ్యాపారులు