Emancipation day
-
Independence Day: ఒకరోజు ముందే ఎందుకంటే..!
బ్రిటిష్ పాలన నుంచి 1947లో ఇండియాకు విముక్తి లభించినా ఆంగ్లేయుల కుట్ర దేశాన్ని రెండు ముక్కలు చేసింది. ఫలితంగా భారత్, పాకిస్తాన్ స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించాయి. ఆగస్టు 15న ఒకే రోజు అధికారికంగా ఉనికిలోకి వచ్చాయి. కనుక రెండింటికీ అదే స్వాతంత్య్ర దినం. కానీ పాక్ మాత్రం ఆగస్టు 14నే తమ స్వాతంత్య్ర దినంగా జరుపుకుంటుంది. ఎందుకో తెలుసా? ఏటా భారత్ కంటే ముందే వేడుకలు చేసుకోవాలని నాటి పాక్ పెద్దలు చేసిన ఆలోచన వల్ల! లేదంటే చరిత్రను చూసినా, ఇంకే కోణంలో ఆలోచించినా అంతకుమించి దీని వెనక మరో కారణమేదీ ఏమీ కన్పించదు. స్వాతంత్య్ర ప్రకటన మొదలుకుని రెండు దేశాలకు అధికారాన్ని బ్రిటన్ బదలాయించడం దాకా ఏం జరిగిందన్నది నిజంగా ఆసక్తికరం... భారత స్వాతంత్య్ర చట్టాన్ని 1947 జూలై 18న ప్రకటించారు. ‘1947 ఆగస్టు 15న భారత్, పాకిస్తాన్ పేరిట బ్రిటిషిండియా రెండు స్వతంత్ర దేశాలుగా ఏర్పడనుంది’ అని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. పాక్ జాతి పిత, తొలి గవర్నర్ జనరల్ మహ్మదాలీ జిన్నా కూడా జాతినుద్దేశించి ప్రసంగించింది కూడా ఆగస్టు 15వ తేదీనే. ఆగస్టు 15ను స్వతంత్ర, సార్వ¿ౌమ పాకిస్తాన్’ పుట్టినరోజుగా ఆ ప్రసంగంలో ఆయన అభివర్ణించారు. ఇలాంటి వాస్తవాలు, రికార్డులతో పాటు లాజిక్ ప్రకారం చూసినా పాక్కు కూడా ఆగస్టు 15 మాత్రమే స్వాతంత్య్ర దినమని ఆ దేశానికి చెందిన సీనియర్ జర్నలిస్టు షాహిదా కాజీ అభిప్రాయపడ్డారు. జిన్నా, పాక్ తొలి మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది కూడా 1947 ఆగస్టు 15వ తేదీనే అని ఆయన గుర్తు చేశారు. 1948 జూలైలో పాక్ విడుదల చేసిన తొలి స్మారక పోస్టల్ స్టాంపుపై కూడా ఆగస్టు 15ను దేశ స్వాతంత్య్ర దినంగా స్పష్టంగా పేర్కొన్నారు. పాక్ మాజీ ప్రధాని చౌధురీ ముహమ్మద్ అలీ 1967లో రాసిన పుస్తకంలో కూడా ఈ ప్రస్తావన ఉంది. ‘‘1947 ఆగస్టు 15 ఈదుల్ ఫిత్ర్ పర్వదినం. ముస్లింలకు అతి పవిత్రమైన ఆ రోజునే ఖౌద్–ఏ–ఆజం (జిన్నా) పాక్ తొలి గవర్నర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. తొలి మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది. నెలవంక, నక్షత్రంతో కూడిన పాక్ పతాకం ప్రపంచ యవనికపై తొలిసారి అధికారికంగా ఎగిరింది’’ అని రాసుకొచ్చారు.ఆగస్టు 14న ఏం జరిగిందంటే...1947 ఆగస్టు 14న నాటి బ్రిటిíÙండియా వైస్రాయ్ లార్డ్ మౌంట్బాటెన్ కరాచీలో పాక్ రాజ్యాంగ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర చట్టం ప్రకారం ఆయన ఆగస్టు 15న భారత్, పాక్ రెండింటికీ అధికారాన్ని లాంఛనంగా బదలాయించాలి. బ్రిటన్ సింహాసన ప్రతినిధిగా సంబంధిత ప్రక్రియను వ్యక్తిగతంగా దగ్గరుండి పూర్తి చేయాలి. కానీ, అందుకోసం ఒకే రోజు ఇటు ఢిల్లీలో, అటు కరాచీలో ఉండటం సాధ్యపడని పని. పోనీ ముందుగా భారత్కు అధికారాన్ని బదలాయించాక కరాచీ వెళ్లడమూ కుదరదు. ఎందుకంటే బ్రిటన్ రాణి నిర్ణయం మేరకు విభజన అనంతరం స్వతంత్ర భారత్కు ఆయన తొలి గవర్నర్ జనరల్ అవుతారు. భారత్కు అధికార బదలాయింపు జరిగిన క్షణమే ఆయనకు వైస్రాయ్ హోదా పోయి గవర్నర్ జనరల్ హోదా వస్తుంది. కనుక బ్రిటిíÙండియా వైస్రాయ్గా ఉండగానే పాక్కు అధికార మార్పిడి ప్రక్రియ పూర్తి చేయాలి. అందుకే మౌంట్బాటెన్ 14వ తేదీనే కరాచీ వెళ్లి ఆ లాంఛనం పూర్తి చేసి ఢిల్లీ తిరిగొచ్చారు. పాక్కు స్వాతంత్య్రం మాత్రం ఆగస్టు 15నే వచ్చింది.ముందుకు జరుపుకోవడం వెనక... విభజన చట్టం ప్రకారం, వాస్తవాల ప్రాతిపదికన... ఇలా ఏ లెక్కన చూసినా పాక్ కూడా భారత్తో పాటే ఏటా ఆగస్టు 15వ తేదీనే స్వాతంత్య్ర దినం జరుపుకోవాలి. కానీ స్వాతంత్య్రం వచి్చన మరుసటి ఏడాది నుంచే, అంటే 1948 నుంచే ఆగస్టు 14న స్వాతంత్య్ర దినం జరుపుకుంటూ వస్తోంది. దీనికి రకరకాల కారణాలు చెబుతారు. ఎక్కువమంది చెప్పేదేమిటంటే, భారత్ కంటే ముందే స్వాతంత్య్ర వేడుకలు చేసుకోవాలని నాటి పాక్ పెద్దల మెదళ్లను ఓ పురుగు తొలిచిందట! దాంతో 1948 జూన్ చివర్లో నాటి ప్రధాని లియాకత్ అలీ ఖాన్ తన మంత్రివర్గాన్ని సమావేశపరిచి ఈ మేరకు అధికారికంగా తీర్మానించారు. ఈ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించొద్దంటే పాక్ జాతి పిత జిన్నా ఆమోదముద్ర ఉండాలని భావించారట. అందుకే, స్వాతంత్య్ర దినాన్ని ఒక రోజు ముందుకు జరిపేందుకు జిన్నా కూడా అనుమతించారని తీర్మానంలో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ అది శుద్ధ అబద్ధమని, 1948 ఆగస్టు నాటికే జిన్నా మరణశయ్యపై ఉన్నారని ఆయన జీవిత చరిత్ర రాసిన యాసర్ లతీఫ్ హందానీ స్పష్టం చేశారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కేంద్రమే నిర్వహిస్తుందా?
సాక్షి, హైదరాబాద్: భారత్లో హైదరాబాద్ స్టేట్ విలీనమైన చారిత్రక సందర్భాన్ని కేంద్రమే అధికా రికంగా నిర్వహించనుందా? 1948 సెప్టెంబరు 17న జరిగిన ఈ సందర్భాన్ని కేంద్రమే జాతీయస్థాయిలో అధికారికంగా నిర్వహించే అవకాశం ఉందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. గతంలో హైదరాబాద్ స్టేట్లో భాగమైన కొన్ని జిల్లాలు మహా రాష్ట్ర, కర్ణాటకలో కలవగా ఆయా జిల్లాల్లో ఈరోజును అధికారికంగా నిర్వహిస్తున్న విషయా న్ని గుర్తుచేస్తున్నారు. కేంద్రం దీన్ని నిర్వహించకపోతే పార్టీపరంగా పెద్ద ఎత్తున నిర్వహణకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం కార్యాచరణను రూపొందిస్తోంది. టీఆర్ఎస్ను ఇరుకున పెట్టేందుకేనా? టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ అంశాన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర బీజేపీ భావిస్తోంది. ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా సుముఖతను వ్యక్తం చేయనందున, తెలంగాణ సెంటి మెంట్ను ఉపయోగించుకుని టీఆర్ఎస్ను ఇరుకున పెట్టేందుకు ఇదొక మంచి అవకాశంగా బీజేపీ భావిస్తోంది. ఈ విషయంలో జాతీయపార్టీ నుంచి, నాయకత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు, మద్దతు అందుతుండటంతో ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పార్టీ మరింత విస్తరించవచ్చని వ్యూహాలు, కార్యాచరణను సిద్ధం చేసుకుంటోంది. వచ్చే నెల 17న కరీంనగర్ లేదా నిజామాబాద్లో నిర్వహించే హైదరాబాద్ విమోచన దినోత్సవాల్లో కేంద్ర మంత్రి అమిత్షా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ రెండుచోట్లా కూడా బీజేపీ ఎంపీలు గెలవడంతో, తమ నియోజకవర్గ కేంద్రంలో సభ జర పాలని ఇరువురు ఎంపీలు పోటీపడుతున్నారు. ఈ ఏడాది యాత్ర? హైదరాబాద్ స్టేట్ విలీన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది కూడా జిల్లాల యాత్ర చేపట్టా లని పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి పార్టీ అధిష్టానం నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 27న నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. గతంలో ఈ ఉద్యమంలో పాల్గొన్న వారితోపాటు కవులు, కళా కారులను సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు తెలంగాణ పోరాటంలో కీలకమైన భైరన్పల్లి ఇతర చారిత్రక ప్రదేశాల సందర్శన, ప్రాధాన్యత సంతరించుకున్న ఆయా ప్రాంతాల గురించి ప్రచారం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్ర బీజేపీ సిద్ధమవుతోంది. -
'మా వల్లే హైదరాబాద్ కలిసింది '
హైదరాబాద్: హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజును కాంగ్రెస్ ఆనవాయితీగా జరుపుకుంటుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నాయకత్వం వల్లే హైదరాబాద్ సంస్థానం భారంత దేశంలో విలీనమైందని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జాతీయ జెండాను ఉత్తమ్ గాంధీభవన్లో ఎగురవేసి తెలంగాణ విలీన దినోత్సవ కార్యక్రమాన్ని జరిపారు. ఈ కార్యక్రమానికి జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్కతో పాటూ పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. మరోవైపు వినాయక చవితి వేడుకలను కూడా గాంధీభవన్లో ఉత్తమ్ ప్రారంభించారు. -
'మరో అవతరణ దినోత్సవం అవసరం లేదు'
-
'మరో అవతరణ దినోత్సవం అవసరం లేదు'
హైదరాబాద్: జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం నిర్వహిస్తుండగా, మరో అవతరణ దినోత్సవం అవసరం లేదని హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయన గురువారం జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యబద్దంగా విలీనమైంది ఈ రోజేనని నాయిని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల కష్టాలు తెలిసి వ్యక్తి అని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు సెప్టెంబర్ 17 ను అధికారికంగా నిర్వహించాలని కోరాం..కానీ జూన్ 2 న అవతరణ దినోత్సం నిర్వహిస్తున్నందున ఇంకో కార్యక్రమం ఎందుకని వ్యాఖ్యానించారు. -
'విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి'
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. నగరంలోని తన నివాసంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్ విమోచనం సందర్భంగా ముస్లింలకు అన్యాయం జరిగిందన్న కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను, అమరవీరులను అవమానపరిచే విధంగా ఉన్నాయని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.