environments
-
పరిసరాల పరిశుభ్రత పాటించాలి
కట్టంగూర్ ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని తెలంగాణ సాంస్కృతిక సారథి పైలం సంతోష్ అన్నారు. బుధవారం మండలకేంద్రంలో ఆరోగ్యశాఖ, పౌరసంబంధాల శాఖల ఆధ్వర్యంలో సారథి కళాకారులు పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యాధుల పట్ల ప్రజలు అవగాహన కల్గిఉండి అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో కళాకారులు వెంకట్, సంధ్యారాణి, తాటిపాముల శంకర్, వెంకట్ తదితరులున్నారు. -
పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
చిలుకూరు: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పర్యావరణ ఉద్యకారుడు కొల్లు లక్ష్మీనారాయణరావు అన్నారు. ఆదివారం చిలుకూరులో మహిళలు, చిన్నారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు కైలాసం వెంకటేశ్వర్లు, సురగాని లింగయ్య, వైష్ణవి డీఎడ్ కళాశాల కరస్పాండెంట్ బూర లక్ష్మీనారాయణ, వసంత, మాలతీ, రాధిక తదితరులు పాల్గొన్నారు. -
భారీ జీవాల్ని సైతం కబళించే చిన్న కీటకం