Free Wi-Fi zones
-
నగరంలో ఇక ఫ్రీ వైఫై..
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ టెలికం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రైవేటు టెలికం రంగ సంస్ధలకు దీటుగా వినియోగదారులను ఆకర్షించేందుకు సరికొత్త పంథాతో ముందడుగు వేస్తోంది. డిజిటల్ ఇండియాలో భాగంగా ఎప్పటికప్పుడు పెరుగుతున్న డిమాండ్తోపాటు ‘హై స్పీడ్ ఇంటర్నెట్ కోసం వివిధ టెక్నాలజీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. తాజాగా గూగుల్ సంస్థతో ఒప్పందం కుదర్చుకొని హైస్పీడ్ ఇంటర్నెట్తో ఉచిత వైఫై సేవలకు సిద్ధమైంది. అందులో భాగంగా హైదరాబాద్ మహా నగరంలో ఇటీవల సుమారు 25 ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్–గూగుల్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఈ స్టేషన్ల ద్వారా అన్లిమిటెడ్ హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. వినియోగదారులు స్టేషన్ పరిధిలోకి వచ్చి వైఫై ఓపెన్ చేస్తే బీఎస్ఎన్ఎల్ గూగుల్ స్టేషన్ వైఫై సిగ్నల్ వస్తోంది. కనెక్ట్ చేస్తే మొబైల్కు సంక్షిప్త సమాచారం వస్తోంది. దానిని ఎంటర్ చేస్తే ఓటీపీ జనరేట్ అవుతోంది. దానిని కాపీ చేసి ఎంటర్ చేస్తే వైఫ్ కనెక్ట్ అవుతుంది. వినియోగదారులు ఉచితంగా అన్లిమిటెడ్ డేటాను పొందవచ్చు. శివార్లలో 125 హాట్ స్పాట్లు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తు న్న ‘డిజిటల్ ఇండియా’లో భాగాంగా గ్రామీణ ప్రాంతాల్లో వైఫై సేవలు విస్తరించేందుకు బీఎస్ఎన్ఎల్ సంస్థ హైదరాబాద్ నగర శివార్లలో స్వంతంగా 125 హాట్స్పాట్లను ఏర్పాటు చేసింది. హాట్ స్పాట్ పరిధిలో వైఫై కనెక్ట్ అయ్యే వినియోగదారుడు తన మొబైల్ కనెక్షన్ ద్వారా నెలకు 4 జీబీ డేటాను ఉచితంగా పొందవచ్చు. ఇప్పటికే ఉచిత వైఫై సేవలు ప్రారంభం కాగా, శివారు ప్రాంతాలైన బండ్లగూడ 96 శాతం, శంకరపల్లి 86.2 శాతం, పరిగి 84.2 శాతం, షాపూర్ 75.7 శాతం వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. -
అమెజాన్ ఉచిత వైఫై జోన్లు
హైదరాబాద్తోసహా మూడు నగరాల్లో హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వినూత్న ఆలోచనతో తొలిసారిగా రంగంలోకి దిగింది. హైదరాబాద్, చెన్నై, పుణే నగరాల్లో ఉచిత వైఫై జోన్లను ఏర్పాటు చేసింది. ఇంటర్నెట్ వినియోగంపై ఎటువంటి పరిమితి లేదు. 24 గంటలు సేవలు అందుబాటులో ఉంటాయని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆటంకం లేకుండా ఆన్లైన్లో షాపింగ్ చేసుకునేందుకు వీలుగా కస్టమర్ల సౌకర్యార్థం ఈ చొరవ తీసుకున్నట్టు కంపెనీ ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ డెరైక్టర్ మనీష్ కల్రా వెల్లడించారు. హైదరాబాద్లో సికింద్రాబాద్ బస్ కూడలి, దిల్సుఖ్నగర్, అమీర్పేటల్లో వైఫై జోన్లు ఏర్పాటయ్యాయి. ఈ ప్రాంతాల్లో వినియోగదార్లకు సహకారం అందించేందుకు కంపెనీ సిబ్బంది ఉంటారు. జూలై 14న ప్రారంభమైన ఈ సేవలు 20 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. కంపెనీ లక్ష్యం నెరవేరితే ఈ సేవలు మరి కొంతకాలం కొనసాగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. భారత్లో 2 బిలియన్ డాలర్లను వెచ్చించనున్నట్టు గతేడాది అమెజాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.భారత్లో ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్తో కంపెనీకి తీవ్రమైన పోటీ ఉంది. ఇప్పుడు ఉచిత వైఫై జోన్లతో కస్టమర్లను ఆకట్టుకుని అమ్మకాలను పెంచుకోవడానికి కంపెనీకి వీలవుతుంది. అమెజాన్ బ్రాండ్కు కూడా మరింత ప్రాచుర్యం వచ్చే అవకాశం ఉంది.