breaking news
friendly relations
-
నూతన శిఖరాలకు భారత్–అమెరికా భాగస్వామ్యం
వాషింగ్టన్: రష్యా, చైనా అధినేతలు పుతిన్, జిన్పింగ్లతో ప్రధాని మోదీ భేటీ నేపథ్యంలో భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ఒక సందేశాన్ని ‘ఎక్స్’లో పోస్టు చేసింది. భారత్–అమెరికాల మధ్య భాగస్వామ్యం నూతన శిఖరాలకు చేరుకుంటోందని వెల్లడించింది. ఇరుదేశాల మధ్య చక్కటి స్నేహ సంబంధాలు ఉన్నాయని, 21వ శతాబ్దంలో ఇది నిర్ణయాత్మక బంధమని ఉద్ఘాటించింది. ప్రజలు, ప్రగతి అనే అంశాలు మనల్ని ముందుకు నడిపిస్తున్నాయని స్పష్టం చేసింది. కీలక రంగాల్లో 2 దేశాలు కలిసి పని చేస్తున్నాయని పేర్కొంది. ఇరుదేశాల ప్రజల నడుమ ఉన్న ఎడతెగని స్నేహబంధం మన ప్రయాణానికి ఇంధంగా పని చేస్తోందని తేల్చిచెప్పింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేసిన వ్యాఖ్యను కూడా అమెరికా రాయబార కార్యాలయం తమ పోస్టుకు జతచేసింది. -
భారత్, గయానా మధ్య బలమైన బంధం
జార్జిటౌన్: భారత్, గయానా మధ్య చక్కటి స్నేహ సంబంధాలు ఉన్నాయని, రెండు దేశాలను సంస్కృతి, వంటలు, క్రికెట్ అనుసంధానిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రెండు దేశాల నడుమ ఉన్న సారూప్యతలు బంధాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని పేర్కొ న్నారు. గయానా రాజధాని జార్జిటౌన్లో స్థానిక కాలమానం ప్రకారం గురువారం భారత సంతతి ప్రజలు, ప్రవాస భారతీ యుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. కరీబియన్ దేశమైన గయానా అభివృద్ధిలో ఇండో–గయానీస్ సామాజిక వర్గం కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. భారత్, గయానా పరస్పరం పంచుకుంటున్న విలువలే ఇరు దేశాల మధ్య బంధానికి బలమైన పునాదిగా మారాయని వివరించారు. సుసంపన్నమైన, విశిష్టమైన సంస్కృతి ఇరు దేశాలకు గర్వకారణంగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు. మన సాంస్కృతిక వైవిధ్యమే మన బలం అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. క్రికెట్ క్రీడ పట్ల ఉన్న ప్రేమ భారత్–గయానాను ఒక్కటిగా కలిపి ఉంచుతోందని తెలిపారు. క్రికెట్ అంటే ఒక జీవన విధానమని వెల్లడించారు. టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ల్లో భారత జట్టుకు గయానా ప్రజలు మద్దతు తెలిపారని గుర్తుచేసుకున్నారు. ప్రవాస భారతీయులను ‘రాష్ట్రదూతలు’గా ప్రధాని మోదీ అభివర్ణించారు. భారత సంస్కృతి, విలువలకు వారు రాయబారులని కొనియాడారు. ఇండో–గయానీస్ ప్రజలు రెండు రకాలుగా ఆశీస్సులు పొందారని, వారికి గయానా మాతృభూమి అయితే భారతమాత ప్రాచీన భూమి అని వివరించారు. రెండు దశాబ్దాల క్రితం ఒక యాత్రికుడిగా గయానాలో పర్యటించానని, అప్పటితో పోలిస్తే దేశం ఇప్పుడు దేశం చాలా మారిపోయిందని చెప్పారు. గయానా ప్రజల ప్రేమ, ఆప్యాయ తల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని ఉద్ఘాటించారు. స్వదేశానికి మోదీ: నైజీరియా, బ్రెజిల్, గయానాల్లో ఐదు రోజుల పర్యటన ముగించుకొని మోదీ శుక్రవారం భారత్ చేరుకున్నారు. -
భద్రతపై రాజీ లేదు: రాజ్నాథ్
తిరువనంతపురం: ‘‘భారతదేశం పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటుంది. అదే సమయంలో జాతీయ భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడబోదు’’ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. శివగిరి మఠం 90వ వార్షిక తీర్థయాత్రప్రారంభం సందర్భంగా శుక్రవారం ఇక్కడ ఆయన మాట్లాడారు. సంఘ సంస్కర్త నారాయణ గురు బోధనల స్ఫూర్తితోనే కేంద్రం ఆత్మ నిర్భర్ పథకాన్ని తెచ్చిందన్నారు. దేశాన్ని, సరిహద్దులను రక్షించేందుకు ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో తాను కృషి చేస్తుండగా, దేశ ఆత్మను పరిరక్షించేందుకు శివగిరి మఠం సాధువులు కృషి చేస్తున్నారన్నారు. -
బలగాల ఉపసంహరణ
న్యూఢిల్లీ: యుద్ధ మేఘాలు కమ్ముకున్న దశ నుంచి ఉద్రిక్తతలను తగ్గించుకునే దిశగా భారత్, చైనా కీలకమైన ముందడుగు వేశాయి. తూర్పు లద్దాఖ్లోని అన్ని వివాదాస్పద, ఘర్షణాత్మక ప్రదేశాల నుంచి వెనుదిరగాలని ఏకాభిప్రాయానికి వచ్చాయి. రెండు దేశాల లెఫ్ట్నెంట్ జనరల్ స్థాయి అధికారుల మధ్య సోమవారం జరిగిన చర్చల సందర్భంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. తూర్పు లద్దాఖ్లోని చైనా భూభాగంలో ఉన్న మోల్డా వద్ద సోమవారం దాదాపు 11 గంటల పాటు ఈ చర్చలు జరిగాయి. భారత ప్రతినిధి బృందానికి 14 కారప్స్ కమాండర్ లెఫ్ట్నెంట్ జనరల్ హరీందర్ సింగ్ నాయకత్వం వహించారు. టిబెట్ మిలటరీ డిస్ట్రిక్స్ కమాండర్ మేజర్ జనరల్ ల్యూ లిన్ నేతృత్వంలో చైనా బృందం ఈ చర్చల్లో పాల్గొంది. ‘సానుకూల, సుహృద్భావ, నిర్మాణాత్మక వాతావరణంలో చర్చలు జరిగాయి. తూర్పు లద్దాఖ్లోని అన్ని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించేందుకు విధివిధానాలను రూపొందించుకోవాలని, అందుకు మరికొన్ని సార్లు భేటీ కావాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. బలగాల ఉపసంహరణకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది’ అని ఆర్మీ వర్గాలు మంగళవారం తెలిపాయి. గల్వాన్ లోయలో భారత జవాన్లపై చైనా సైనికులు ప్రాణాంతక దాడులు చేయడాన్ని ఈ చర్చల సందర్భంగా భారత ప్రతినిధి బృందం గట్టిగా ప్రశ్నించిందని వెల్లడించాయి. వాస్తవాధీన రేఖ దగ్గర్లోని మిలటరీ కేంద్రాల్లో బలగాల సంఖ్యను రెండు దేశాలు గణనీయంగా తగ్గించుకోవాలని కూడా భారత బృందం సూచించినట్లు పేర్కొన్నాయి. ‘ఉద్రిక్తతలను తగ్గించుకునే దిశగా, అన్ని వివాదాస్పద అంశాలపై రెండు దేశాల అధికారులు లోతైన చర్చ జరిపారు. స్పష్టంగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు’ అని ఈ చర్చలపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో జిన్లింగ్ స్పందించారు. రెండు దేశాల ఆర్మీ ఉన్నతాధికారుల మధ్య జూన్ 6వ తేదీని తొలి విడత చర్చలు జరిగాయి. గల్వాన్ లోయ నుంచి ప్రారంభించి సరిహద్దుల్లోని అన్ని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి ఇరు దేశాల సైనికులు క్రమంగా వెనక్కు తొలగాలని ఆ చర్చల్లో నిర్ణయించారు. కానీ, జూన్ 15న రెండు దేశాల సైనికుల మధ్య తీవ్ర స్థాయిలో హింసాత్మక ఘర్షణలు చెలరేగి ఇరుదేశాల సైనికులు భారీగా ప్రాణాలు కోల్పోయారు. దాంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ ఘర్షణల్లో కల్నల్ సహా 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారని భారత్ ప్రకటించింది. కానీ, చైనా నుంచి అలాంటి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. 35 మంది వరకు చైనా సైనికులు చనిపోయారని యూఎస్ నిఘా వర్గాలు తెలిపాయి. చైనా సోషల్ మీడియాలోనూ దీనిపై పలు వార్తలు వచ్చాయి. చైనా ఆర్మీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)కు చెందిన కమాండింగ్ ఆఫీసర్ కూడా మృతుల్లో ఉన్నారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది. ఐటీబీపీ బలగాల పెంపు చైనాతో ఉద్రిక్తతలు నెలకొనడంతో వాస్తవాధీన రేఖ వెంట బలగాల సంఖ్యను ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ భారీగా పెంచుతోంది. లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్ల్లోని సరిహద్దుల్లో ఉన్న వివిధ సైనిక కేంద్రాలకు 4000 మంది సైనికులను పంపించడం ప్రారంభించింది. వారు మంచు పర్వతాల్లో పోరాడే సామర్థ్యమున్న సుశిక్షితులైన సైనికులని అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో విధుల్లో ఉన్న ఆ సైనికులను వెనక్కు పిలిపిస్తున్నట్లు తెలిపారు. కరోనా ముప్పు ఉన్న నేపథ్యంలో.. వారందరికీ క్వారంటైన్ సౌకర్యం కల్పించాలని ఆయా సైనిక కేంద్రాలను ఆదేశించామన్నారు. పెద్ద ఎత్తున స్నో స్కూటర్లు, ట్రక్కులు ఇతర వాహనాలను కూడా ఎల్ఏసీ సమీప కేంద్రాల్లో ఐటీబీపీ మోహరించింది. సరిహద్దుల్లో ఆర్మీ చీఫ్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె మంగళవారం తూర్పు లద్దాఖ్లో సైనిక బలగాల సన్నద్ధతను పరిశీలించారు. లేహ్ చేరుకోగానే మొదట, జూన్ 15న గల్వాన్ లోయలో చైనా సైనికుల దాడిలో గాయపడిన 18 మంది భారత సైనికులను ఆర్మీ ఆసుపత్రిలో పరామర్శించారు. ఆ సైనికులను ఒక్కొక్కరిని ప్రత్యేకంగా పరామర్శించి, వారి ధైర్య సాహసాలను ప్రశంసించారు. ఆ తరువాత, క్షేత్రస్థాయి కమాండర్లతో అక్కడి సరిహద్దుల్లోని వాస్తవ పరిస్థితిని సమీక్షించారు. చైనా ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే, తక్షణమే స్పందించేలా అత్యంత అప్రమత్తతతో ఉండాలని వారికి ఆదేశాలిచ్చారు. తూర్పు లద్ధాఖ్లోని సరిహద్దు పోస్ట్లను నేడు(బుధవారం) ఆయన సందర్శిస్తారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. లేహ్లో జనరల్ నరవణెకు 14 కారŠప్స్ కమాండర్ లెఫ్ట్నెంట్ జనరల్ హరీందర్ సింగ్ సరిహద్దుల్లోని పరిస్థితిని వివరిస్తారని, చైనా బృందంతో జరిపిన చర్చల వివరాలను వెల్లడిస్తారని తెలిపాయి. లేహ్కు బయల్దేరే ముందు ఆర్మీ ఉన్నతాధికారుల సదస్సులో జనరల్ నరవణె పాల్గొన్నారు. సరిహద్దుల్లో పరిస్థితిని, భారత దళాల సన్నద్ధతను టాప్ కమాండర్లు ఆయనకు వివరించారు. గతవారం లద్దాఖ్, శ్రీనగర్ల్లోని ఎయిర్ బేస్లను ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బధౌరియా సందర్శించిన విషయం తెలిసిందే. అక్కడ వైమానిక దళ సన్నద్ధతను ఆయన సమీక్షించారు. అవి ఫేక్ న్యూస్: చైనా బీజింగ్: తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో భారత సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 40 మంది తమ సైనికులు చనిపోయారని వస్తున్న వార్తలు అబద్ధమని చైనా స్పష్టం చేసింది. 40 మందికిపైగా చైనా సైనికులు చనిపోయారని కేంద్రమంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ చేసిన వ్యాఖ్యలను చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ వద్ద మీడియా ప్రస్తావించింది. దీనిపై లిజియాన్ స్పందిస్తూ.. అవన్నీ అబద్ధాలని, మీడియాలో వస్తున్నవి తప్పుడు వార్తలని పేర్కొన్నారు. భారత్లో దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయన్నారు. మరణాలపై చైనా అధికారికంగా స్పందించడం ఇదే ప్రథమం. పాక్ కన్నా చైనానే డేంజర్ శత్రు దేశాల విషయానికి వస్తే పాక్కన్నా చైనానే ప్రమాదకరమని అత్యధిక శాతం భారతీయులు నమ్ముతున్నారు. దేశ రక్షణకు సంబంధించినంతవరకు ప్రధాని మోదీనే సరైన నాయకుడని విశ్వసిస్తున్నారు. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ‘ఏబీపీ– సీ ఓటర్’ చేసిన ఒక సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 68% చైనాతోనే ఎక్కువ ముప్పని అభిప్రాయపడ్డారు. 32% మంది పాక్ ఎక్కువ ప్రమాదకారి అన్నారు. దేశం మోదీ నాయకత్వంలో సురక్షితంగా ఉంటుందని 72.6% ప్రజలు తేల్చిచెప్పారు. గల్వాన్ ఘటన నేపథ్యంలో చైనాకు సరైన బుద్ధి చెప్పేందుకు భారత ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుందా? అన్న ప్రశ్నకు 60% ప్రజలు లేదు అనే జవాబివ్వడం గమనార్హం. 39% మాత్రం సరైన చర్యలు తీసుకుందన్నారు. ఈ సమస్యపై మోదీ ప్రభుత్వమే సమర్ధవంతంగా వ్యవహరిస్తోందని 73.6% ప్రజలు పేర్కొన్నారు. ప్రస్తుత విపక్షం అధికారంలో ఉంటే మరింత సమర్ధంగా వ్యవహరించేదని 16.7% చెప్పగా, 9.6% మాత్రం అటు ప్రభుత్వానికి కానీ, ఇటు విపక్షానికి కానీ ఈ సమస్యను సరిగ్గా డీల్ చేసే సామర్ధ్యం లేదన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం కాదని అత్యధికులు అభిప్రాయపడ్డారు. రాహుల్గాంధీపై తమకు నమ్మకం లేదని 61% మంది చెప్పారు. 14.4% మంది మాత్రం దేశ రక్షణ విషయంలో రాహుల్పై విశ్వాసం ఉందన్నారు. భారతీయులు చైనా ఉత్పత్తులను బాయ్కాట్ చేస్తారని విశ్వసిస్తున్నట్లు 68% మంది చెప్పగా, మేడ్ ఇన్ చైనా ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని 31% స్పష్టం చేశారు. -
రాహుల్ గాంధీతో స్నేహం ఉంది: రాందేవ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పార్టీ ఉన్నతస్థాయి నేతలతో తనకు స్నేహపూర్వక సంబంధాలున్నాయని ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ పేర్కొన్నారు. ఏబీపీ న్యూస్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబా ఈ వివరాలు వెల్లడించారు. యోగా ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ.. ‘సోనియా, రాహుల్లు రోజూ యోగా చేస్తారు. రాహుల్తో నాకు స్నేహపూర్వక సం బంధాలున్నాయి’ అని పేర్కొన్నారు. రాహుల్ను రాందేవ్ ప్రశంసించడం ఇదే తొలిసారి కాదు. అయితే, యూపీ ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేనందున గ్రేటర్ నోయిడా నుంచి పతంజలి ఫుడ్, హెర్బల్ పార్క్ను తరలిస్తానంటూ హెచ్చరించిన కొద్ది రోజులకే రాహుల్ను ప్రశంసించారు. కాగా, 2011లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై అవినీతి వ్యతిరేక ఉద్యమంలో రాందేవ్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. -
కోపాన్ని నియంత్రించుకుంటే మనల్ని ఎవరూ గెలవలేరు
ధ్యాన భావన మనలో చాలామంది ఎదుర్కొనే ఒక తీవ్రమైన సమస్య... కోపం. జీవితంలో బాహ్యమైన సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. అవన్నీ చాలావరకు తాత్కాలికమైనవే. కానీ కోపం అన్నది అంతర్గతమైన సమస్య. అది ఎప్పుడూ మనతోనే ఉంటుంది. మన చివరి క్షణం వరకు. కోపం ఒక తీవ్రమైన సమస్య. ఎందుకంటే దాని వల్ల ఎన్నో దుష్ఫలితాలు కలిగే ప్రమాదం ఉంది. ఇటు కోపగించుకున్న వ్యక్తికీ బాధ కలుగుతుంది. అటు కోపానికి గురైన వ్యక్తికీ బాధ కలుగుతుంది. ఆ బాధ చేత్తో తీసేస్తే పోయేది కాదు. చాలాకాలం తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అది మనల్ని చలనం లేకుండా చేయడంతో ఎక్కువ సేపు పని చేయలేకపోతాము. కోపం వల్ల ద్వేషం కలుగుతుంది. ద్వేషం కారణంగా చక్కటి అనుబంధాలు కూడా వీగిపోతాయి. ఈ అనుబంధాలు, స్నేహ సంబంధాలు ఎన్నో ఏళ్ల సాంగత్యం వల్ల బలపడేవి. అలాంటివి, కొన్ని క్షణాల కోపంతో చిటికెలో మాయమైపోతాయి. ఒకసారి అనుబంధం వీగిపోతే, మళ్లీ దాన్ని భర్తీ చేసుకోవడం అసాధ్యం. కోపంలో ఎంత మాట పడితే అంతమాట అనేస్తాం. ముందూ వెనుకా ఆలోచించం. తర్వాత, అలా అనకుండా ఉండాల్సింది, అలా చేయకుండా ఉండాల్సింది అనుకుంటూ బాధపడిపోతుంటాం. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం? అదీకాక, కోపం ఉన్నచోటుకు ప్రశాంతత రాలేదు. ప్రశాంతత లేని చోట ఆధ్యాత్మిక ఎదుగుదల కుంటుపడుతుంది. స్పష్టంగా చెప్పాలంటే కోపం మనలో దూరే ఒక శక్తిమంతమైన శత్రువు. కోపం వచ్చిందంటే అర్థం, మన మనసు బలహీనపడిందని! క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం మనకు లేదని చెప్పకనే చెప్పినట్లు. అంటే కోపం ఒక వ్యాధి లక్షణం. మనసు బలహీనంగా ఉందని సూచించే లక్షణం. క్లిష్టమైన పరిస్థితులను మనసు ఎదుర్కోలేదని చెప్పే లక్షణం. అందుకని నేను కోపాన్ని అధిగమించాలంటే ముందుగా నాలోని ఈ బలహీనతలను అంగీకరించాలి. నాకు శక్తి లేదని ఒప్పుకోవాలి. కానీ, దురదృష్టవశాత్తూ నేను నా కోపాన్ని సమర్థించుకుంటూ వస్తున్నాను. ఎలా? ఎదుటివాళ్లను తప్పుపట్టడం ద్వారా. అంటే వాళ్ల ప్రవర్తనని, వాళ్ల మాటలని నిందించడం ద్వారా. ఎప్పుడైతే నా బలహీనతను నేను సమర్థించుకుంటానో, అప్పుడే నన్ను నేను మెరుగు పరుచుకోడానికి వీలు లేకుండా తలపులు మూసేస్తున్నాను. నా బలహీనత నుంచి నేను బయటికి వచ్చే మార్గాన్ని కోల్పోతున్నాను. అదే నేను నా బలహీనతను ఒప్పుకుంటే గనుక, ఒప్పుకునేంత సంకల్పశక్తి నాకు ఉంటే గనుక... నాకు నేను సలహా ఇచ్చుకోవడం ద్వారా నా మనసును నేను క్రమేపీ దృఢపరచుకోగలను. అలా నన్ను నేనే ఒక దృఢమైన వ్యక్తిగా, ఎటువంటి పరిస్థితి వచ్చినా కలత చెందకుండా ఉండే వ్యక్తిగా ఊహించుకుంటాను. నన్ను నేనే ఒక క్షమాగుణం ఉన్న వ్యక్తిగా భావించుకుంటాను. కోపానికి మందు క్షమ. అది చూపించి నన్ను నేను శాంతమూర్తిగా మార్చుకుంటాను. నేను దృఢంగా ఉన్నాననీ, ఎట్టి పరిస్థితుల్లోనూ చికాకు పడననీ, ఎవరూ నన్ను రెచ్చగొట్టలేరని; ఎదుటివారి ప్రవర్తన మీద నాకు అధికారం లేని మాట నిజమే కానీ, నన్ను నేను మాత్రం ప్రశాంతంగానే ఉంచుకుంటాననీ గట్టిగా నిర్ణయించుకుంటాను. - స్వామి పరమార్థానంద (తెలుగు: మద్దూరి రాజ్యశ్రీ)