gajapati nagar
-
‘మద్యం అమ్మకాల్లో కాంగ్రెస్, టీడీపీ ఒక్కటే’
గజపతినగరం రూరల్: రాష్ట్రంలోని మద్యం అమ్మకాల్లో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఒకే విధానాన్ని అమలు చేస్తున్నాయని లోక్సత్తా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీషెట్టి బాబ్జీ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మద్యం అమ్మకాల విధానంలో కాం గ్రెస్, టీడీపీ ప్రభుత్వాలకు ఎటువంటి తేడా లేదన్నారు. తమిళనాడు తరహాలో మద్యం అమ్మకాలు చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట తప్పి లాటరీ పద్ధతి చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కొత్త పాలసీ ద్వారా మద్యం అమ్మకాలు చేపట్టడానికి సమయం చాలకపోతే ఇప్పుడున్న పాలసీని కొద్ది రోజులు పొడిగించి, తరువాత కొత్త పాలసీ అమలు చేయవచ్చున న్నారు. కానీ అవేవీ కాకుండా ప్రభుత్వం రాష్ట్రంలోని 4380 మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఇందులో 2300 మద్యం దుకాణాలకు లెసైన్స్ ఫీజు పెంచారని విమర్శించా రు. ఆయనతో పాటు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దేవర ఈశ్వర రావు, గజపతినగరం, బొండపల్లి మండలాల పార్టీ అధ్యక్షులు ఆరిశెట్టి రామకృష్ణ, ఎంఎస్ఎన్ రాజు ఉన్నారు. -
త్వరలోనే రాజన్న రాజ్యం
గజపతినగరం, న్యూస్లైన్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే.. వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ము ఖ్యమంత్రిని చేయూలని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శని వారం దత్తిరాజేరు మండలం దాసరిపేట సర్పంచ్, టీ డీపీ నాయకుడు పోరుపురెడ్డి తిరుపతితో పాటు వంద కుటుంబాలు కడుబండి నివాస గృహంలో వైఎస్సార్ సీపీలో చేరారుు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే పేదలకు సంక్షేమ పథకాలు పూర్తిస్థారుులో అందుతాయన్నారు. ప్రతి ఒక్కరూ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. తమ పార్టీ ప్లీనరీలో ప్రకటించిన ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, డ్వాక్రా రుణాల రద్దు, బెల్టు షాపుల ఎత్తివేత, తదితర పథకాల వల్ల పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. అనంతరం పార్టీలో చేరిన స ర్పంచ్ తిరుపతి, ఉప సర్పంచ్ హరి బంగారునాయు డు, వార్డు మెంబర్లు శనపతి కృష్ణ, బంకురు పార్వతి, దాసరి పద్మ, గంట తిరుపతి, దాసరి రా మకృష్ణ, గంట శ్రీనివాసరావు, తదితరులకు ఆయన కండువాలు వేసి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మానాపురం, వింద్యవాసి సర్పంచ్ చుక్క సన్యాసినాయుడు, కోళ్ల వెంకట సత్య శేష సాయి,గుడివాడ శ్రీనివాసరావు, పెద్దింటి మోహన్, తదితరులు పాల్గొన్నారు. -
మృత్యుశకటం
గజపతినగరం, న్యూస్లైన్: పెద్దపండగ. ఇంటినిండా చుట్టాలు, బంధువులతో సరదాగా గడపాల్సిన రెండు కుటుంబాల్లో లారీ రూపంలో విషాదం అలుముకుంది. గజపతినగరం మండలంలోని మధుపాడ జంక్షన్ వద్ద జాతీయరహదారిని ఆనుకుని ఉన్న ఎస్సీ కాలనీలో ఓ పూరిపాక పైకి లారీ దూసుకురావడంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. విశాఖపట్నం నుంచి సాలూరు వెళ్తున్న సిమెంట్ లోడు లారీ అదుపు తప్పి దూసుకు రావడంతో పాక దగ్గర సిమెంట్ దిమ్మైపై కూర్చుని మాట్లాడుకుంటున్న ఇద్దరు వ్యక్తులు లారీ కింద నలిగి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. గ్రామానికి చెందిన రజక వృత్తిదారుడు తామాడ అప్పన్న (42)ఎస్సీ కాల నీకి చెందిన నగర అసిరయ్య (35)లు గురువారం తెల్లవారు జామున పనుల్లోకి వెళ్లేందుకు వచ్చి టీ తాగుతూ కష్టసుఖాలు మాట్లాడుకుంటుండగా అంతలో సిమెంట్ లారీ అదుపు తప్పి దూసుకు వచ్చింది. అప్పన్న వెంట అతని కుమారుడు అనిల్ కూడా ఉన్నాడు. ఆకస్మికంగా లారీ తమ వైపు దూసుకు రావడంతో గమనించిన అప్పన్న కుమారుడిని దూరంగా విసిరివేయడంతో ప్రాణాలతో బయట పడ్డాడు. అప్పన్న,అసిరయ్యలు లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. మృతి చెందిన తామాడ అప్పన్నకు భార్య అప్పయ్యమ్మ, కుమార్తె లక్ష్మి, కుమారు అనిల్ ఉండగా, అసిరయ్యకు భార్య వెంకటలక్ష్మి, ఏడాది వయస్సు గల సునీల్ కుమార్లు ఉన్నారు. అప్పన్న పురిటిపెంట న్యూకాలనీలో లాండ్రీదుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తుండగా అసిరయ్యరైల్వే కాలనీలో గల గంగా భవాని వాటర్ ప్లాంట్లో వ్యాన్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆ కుటుంబాలకు జీవనాధారమైన ఇద్దరిని మృత్యువు కబళించడంతో ఆయా కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. శోకసంద్రంలో మునిగిన గ్రామం మృతుల కుటుంబాల రోదనలతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. పండగ సందర్భంగా ఇంటినిండా చుట్టాలు ఉండడంతో గజపతినగరం వెళ్లి బజారు చేసుకుని వస్తానని రోడ్డు మీదకు వెళ్లి మృత్యువాత పడ్డావా అంటూ అసిరయ్య భార్య వెంకటలక్ష్మి బోరున విలపించింది. పిల్లలను, నన్ను అనాథలను చేసి వెళ్లిపోయావా అంటూ విలపిస్తుంటే పలువురు కంటనీరు పెట్టారు. తామాడ అప్పన్న రోజూ లాగానే గజపతినగరం వెళ్లినప్పుడు వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి రోడ్డు మీదకు రాగానే మృత్యువాత పడడంతో భర్త సాయంత్రానికి ఇంటికి వస్తాడనుకుంటే ఇలా నన్ను,పిల్లలను అనాథలను చేసి పోయాడంటూ భార్య అప్పయ్యమ్మ విలపించింది. నాన్న ఏడని అప్పన్న పిల్లలు అడుగుతుంటే చుట్టుపక్కల వారి గుండెలు తల్లడిల్లాయి. సహాయక చర్యలు ఆలస్యం ... తెల్లవారు జామున లారీ పాకలోకి దూసుకు రావడంతో పక్కనే ఉన్న చెట్లు కూడా విరిగిపడ్డాయి. దీంతో ప్రమాదంలో లారీ కింద ఇరుక్కున్న మృత దేహాలను బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఉదయం జరిగిన ప్రమాదంలో మృత దేహాలను బయటకు తీసేందుకు మధ్యాహ్నం వరకు శ్రమించి క్రేన్ సహాయంతో లారీని పక్కకు తొలగించి బయటకు తీశారు. సంఘటనా స్థలానికి వచ్చిన సీఐ వి. చంద్రశేఖర్తో పాటు ఎస్సై. టి. కామేశ్వరరావు ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. మృతుల కుటుంబాలను మాజీ మంత్రి పడాల అరుణ, లోక్సత్తా నియోజకవర్గ ఇన్చార్జ్ బెవర ఈశ్వరరావు పరామర్శించి ఓదార్చారు.