ఇక అడుగుకో బార్
బీచ్లలో మద్యం విక్రయాలకు లైసెన్స్
సాక్షి, అమరావతి: బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి మాటల స్ఫూర్తితో ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం అడుగుకో బార్కు అనుమతులు ఇచ్చేయనుంది. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో గల ఆహార పార్లర్స్లోను, బీచ్లలోనూ మద్యం విక్రయాలకు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా బార్ లైసెన్స్ ల నిబంధనల్లో సవరణలు తీసుకువస్తూ గురువారం జీవో జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం జీవో 470ను జారీ చేశారు. బీచ్ల్లోను, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎక్కడపడితే అక్కడ బార్లను తెరవడానికి వీలుగా కనీసం నిర్మాణ జాగాను తగ్గించేశారు. కనీసం 200 చదరపు మీటర్ల నిర్మాణ స్థలం ఉండాల్సి ఉండగా ఇప్పుడు బార్ల ఏర్పాటునకు కనీసం 100 చదరపు మీటర్లు ఉంటే చాలని నిబంధనల్లో సవరణలు చేశారు.
రెడీ టూ డ్రింక్...
జాతీయ రహదారుల వెంబడి మద్యం షాపులను వంద మీటర్ల లోపు ఉన్న వాటిని తొలగించాల్సిందిగా సుప్రీం కోర్టు కమిటీ రాష్ట్రాన్ని హెచ్చరిస్తుండగా... దాన్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా జాతీయ రహదారులకు వంద మీటర్ల లోపు బార్ లెసైన్సలు ఇచ్చేందుకు వీలుగా నిబంధనల్లో సవరణలు చేశారు. పర్యాటక కేంద్రాలుగా పేర్కొన్న బీచ్ల్లోను, ఇతర ప్రాంతాల్లోను విరివిగా బార్ లెసైన్సలను మంజూరు చేయనున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లలో స్థానిక పట్టణాభివృద్ధి సంస్థ నుంచి హోటల్కు లెసైన్స పొంది ఉన్న అన్నింటికీ కూడా బార్ లెసైన్సలను జారీ చేయనున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తినడానికి ఆహారం దొరికే ప్రతీ దుకాణం, ఆహార పార్లర్లలో మద్యం విక్రయాలకు లెసైన్సలను మంజూరు చేస్తారు.