gold silver price
-
బంగారం బాటలోనే వెండి: స్థిరంగా ధరలు
సెప్టెంబర్ ప్రారంభం నుంచి బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే ఈ రోజు (గురువారం) మాత్రం ఉలుకుపలుకు లేకుండా స్థిరంగా ఉన్నాయి. దీంతో ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు. ఈ కథనంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయని వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్లలో సెప్టెంబర్ 5న బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో తులం పసిడి ధరలు రూ. 66690 & రూ. 72760 వద్ద ఉన్నాయి. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్లలో కూడా ఉంటాయి.ఇక చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ కూడా గోల్డ్ రేటు స్థిరంగా ఉంది. కాబట్టి చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రా గోల్డ్ రేటు రూ. 66690, 24 క్యారెట్ల 10 గ్రా బంగారం ధర రూ. 72760గా ఉంది.దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధరలు రూ.66840 (22 క్యారెట్స్ 10గ్రా), రూ.72910 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధర ఈ రోజు స్థిరంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే దేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయని తెలుస్తోంది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు కూడా గురువారం (సెప్టెంబర్ 5) స్థిరంగా ఉన్నాయి. దీంతో నేడు కేజీ సిల్వర్ రేటు రూ. 90000 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. వెండి రేటు నిన్న మాదిరిగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇదే ధరలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా ఉంటాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
బంగారం, వెండి కొనేవారికి శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు
గత వారం రోజులుగా రోజురోజుకి బంగారం ధరలు తగ్గిపోతూనే ఉన్నాయి. ఈ రోజు ఏకంగా 10 గ్రాముల బంగారం ధరలు మునుపటి కంటే రూ. 600 నుంచి రూ. 660 వరకు తగ్గింది. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం & వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో చూసేద్దాం. ⭐ విజయవాడలో ఒక గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5260 కాగా, 24 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5738గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం రూ. 55260, 24 క్యారెట్ పసిడి ధర రూ. 57380గా ఉంది. ఇదే ధరలు తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, గుంటూరు, ప్రొద్దుటూరు, విశాఖపట్టణంలో కూడా ఉన్నాయి. ⭐ వెండి ధరల విషయానికి వస్తే విజయవాడలో 10 గ్రాముల వెండి రూ. 735. కావున ఒక కేజీ వెండి ధర రూ. 73500గా ఉంది. ఈ ధర నిన్నటి కంటే కూడా రూ. 2000 తక్కువ. నిన్న కేజీ వెండి ధర రూ. 75500గా ఉంది. వెండి కొనేవారికి ఇది పెద్ద శుభవార్త అనే చెప్పాలి. ఇదే ధరలు ఇతర తెలుగు రాష్ట్రాల్లో కూడా కొనసాగుతాయి. ⭐ దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర రూ. 5275 (1 గ్రామ్ 22 క్యారెట్), రూ. 5753 (1 గ్రామ్ 24 క్యారెట్). దీని ప్రకారం 10 గ్రాముల బంగారం ధరలు రూ. 52750 & రూ. 57530గా ఉన్నాయి. నిన్నటి పోలిస్తే ఈ ధరలు రూ. 600 & రూ. 660 తగ్గింది. ⭐ వెండి విషయానికి వస్తే.. ఒక గ్రామ్ వెండి రూ. 71. కావున 10 గ్రాముల వెండి రూ. 710, కేజీ ధర రూ. 71000గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు రూ. 2000 తక్కువ కావడం గమనార్హం. ⭐ చెన్నైలో పసిడి ధరల విషయానికి వస్తే.. ఒక గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5290 కాగా.. 24 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5771గా ఉంది. నిన్నటి కంటే ఏ రోజు ధరలు రూ. 660 & రూ. 720 తక్కువ. ⭐ వెండి ధర చెన్నైలో రూ. 73.50. అంటే 1 కేజీ వెండి ధర ఇక్కడ రూ. 75500. నిన్నటి కంటే ఈ రోజు వెండి ధర కేజీ మీద రూ. 2000 తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
భారం : బంగారం ధరలు మళ్లీ పైపైకి..
ముంబై : గతవారం భారీగా పడిపోయిన పసిడి ధరలు మళ్లీ భారమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్లోనూ బంగారం ధర పుంజుకుంది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో అంతర్జాతీయ మార్కెట్లో గతవారం 4.5 శాతం తగ్గిన బంగారం ధరలు డాలర్ బలహీనపడటంతో పైకెగిశాయి. ఎంసీఎక్స్లో సోమవారం పదిగ్రాముల బంగారం 306 రూపాయలు భారమై 52,533 రూపాయలకు పెరిగింది. ఇక కిలో వెండి ఏకంగా 1729 రూపాయలు పెరిగి 68,900 రూపాయలు పలికింది. కాగా కరోనా వైరస్ విజృంభణ, అమెరికా-చైనా ట్రేడ్వార్, అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకూ బంగారం ధరలు 28.4 శాతం పెరిగాయి. ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు రాబోయే రోజుల్లో పసిడి ధరల కదలికలను నిర్ణయిస్తాయని బులియన్ నిపుణులు చెబుతున్నారు. చదవండి : ఊరట : పసిడి నేలచూపులు -
తగ్గుతున్న వెండి, పసిడి ధరలు
-
తగ్గుతున్న వెండి, పసిడి ధరలు
ముంబయి : నిన్న మొన్నటి వరకూ పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. గత వారాంతంలో 500 రూపాయలకు పైగా పెరిగిన 10 గ్రాముల ధర సోమవారం ఉదయం 550 రూపాయల దాకా తగ్గింది. ప్రస్తుతం ఎంసీక్స్లో ధర 29,550 రూపాయలకు సమీపంలో ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర 2 డాలర్లు తగ్గి 1325 డాలర్లకు రావడం.. మన మార్కెట్లో రూపాయి.. రూపాయి దాకా బలపడటంతో 10 గ్రాముల బంగారం ధర తగ్గుతోంది. ఈవారంలో అమెరికా సెంట్రల్ బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్.. స్టిమ్యులస్ పాకేజీల ఉపసంహరణకు సంబంధించి నిర్ణయం తీసుకోనుంది అనే వార్త కూడా బంగారానికి ప్రతికూలంగా మారింది. స్టిమ్యులస్ ప్యాకేజీల ఉపసంహరణ వల్ల డాలర్ల ముద్రణ తగ్గుతుంది. గత ఐదేళ్లుగా ఇష్టానుసారం డాలర్లు ప్రింట్ చేయడం వల్ల బంగారం ధరకు రెక్కలు వచ్చాయి. ఇప్పుడు అదే కారణంతో ఔన్స్ ధర తగ్గుతూ వస్తోంది. 1900 డాలర్ల నుంచి 1300 డాలర్ల స్థాయికి వచ్చింది. బంగారం లాగే వెండి ధర కూడా పతనమవుతోంది. ప్రస్తుతం ఎంసీక్స్లో కేజీ ధర 1600 రూపాయల దాకా నష్టపోతూ 49 వేల రూపాయలకు సమీపంలో ట్రేడవువతోంది.