GSLV-F05
-
సాయంత్రం 4.10 కి జీఎస్ఎల్వీ ఎఫ్05
-
శ్రీవారి పాదాల చెంత నమూనా రాకెట్కు పూజలు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం జీఎస్ఎల్వీ ఎఫ్05- నమూనా రాకెట్కు పూజలు నిర్వహించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) లాంచ్ వెహికల్ ప్రోగ్రాం డెరైక్టర్ ఎస్కే కనుంగో, శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రోగ్రాం డెరైక్టర్ సేతురామన్, సైంటిఫిక్ సెక్రటరీ పీజీ దివాకర్ ఆలయంలో పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్సెంటర్ (షార్) నుండి గురువారం సాయంత్రం 4.10 కి రాకెట్ను ప్రయోగించనున్నారు. ఇస్రో నిర్వహించే ప్రతి ప్రయోగానికి ముందు తిరుమలేశుని ఆలయంలో పూజలు నిర్వహించటం సంప్రదాయం. ఇందులో భాగంగా ఆలయ అధికారులు నమూనా రాకెట్ను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. -
జీఎస్ఎల్వీ ఎఫ్ 05 కౌంట్డౌన్ షురూ
శ్రీహరికోట (సూళ్లూరుపేట): జీఎస్ఎల్వీ ఎఫ్05 ఉపగ్రహ వాహకనౌక కౌంట్ డౌన్ ప్ర్రక్రియ ప్రారంభమైంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్05 ఉపగ్రహాన్ని గురువారం సాయంత్రం 4.10 ప్రయోగించనున్నారు. కాగా కౌంట్డౌన్ను పరిశీలించేందుకు ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్కుమార్ బుధవారం షార్కు విచ్చేశారు. రాకెట్కు తుది విడత తనిఖీలు నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయోజనిక్ దశతో మూడోసారి చేస్తున్న ప్రయోగం కాబట్టి శాస్త్రవేత్తలు అప్రమత్తంగా ఉన్నారు. -
జీఎస్ఎల్వీ ఎఫ్ 05కు నేటి నుంచి కౌంట్డౌన్