Hi-Tech prostitution
-
మొయినాబాద్ ఫాంహౌస్లో హైటెక్ వ్యభిచారం
మొయినాబాద్: వ్యభిచారం నిర్వహిస్తున్న ఫాం హౌస్పై పోలీసులు దాడి చేసి 15మంది యువకులు, నలుగురు యువతులను పట్టుకున్నారు. ఈ ఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని కనకమామిడి శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆదివారం అర్థరాత్రి కనకమామిడి శివారులోని ఓ ఫాంహౌస్లో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడి చేయగా నాలుగు గదుల్లో నలుగురు యువతీయువకులు వ్యభిచారం చేస్తూ దొరికారు. మరో 11 మంది బయట మధ్య సేవిస్తూ దొరికారు. వీరంతా కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రలకు చెందిన వారిగా గుర్తించారు. ఫాంహౌస్ను ఆన్లైన్లో బుక్చేసుకుని ఇక్కడికి వచ్చారు. వారి వద్ద నుంచి 15 మద్యం బాటిళ్లు, రెండు కండోమ్ ప్యాకెట్లు, ఐదు కార్లు, 18 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం
-
హైటెక్ వేశ్య వాటిక నిర్వాహకుల అరెస్ట్
వేశ్య వాటిక నిర్వహిస్తున్న ఇద్దరిని ఇక్కడి కృష్ణరాజపురం(కేఆర్పురం) పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో మంజునాథ్, సుబ్రమణి ఉన్నట్లు ఇన్స్పెక్టర్ సంజీవరాయప్ప తెలిపారు. నిందితుల వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. మేడిహళ్లిలోని ఓ అద్దె ఇంటిలో వేశ్య వాటిక నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం రాత్రి మెరుపుదాడి నిర్వహించారు. ఆ సమయంలో నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. పశ్చిమబెంగాల్, ముంబయికి చెందిన తొమ్మిది మంది యువతులను రక్షించారు. వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. ఉద్యోగాలు కల్పిస్తామంటూ వారిని నమ్మించి పిలిపించుకున్నారని, అనంతరం వారిని నిర్బందించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
హైటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు
-
వ్యభిచార ముఠా గుట్టురట్టు
చందానగర్ : ఆన్లైన్ ద్వారా హైటెక్ తరహాలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ గెస్ట్హౌస్పై దాడి చేసిన సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) అధికారులు.. ఇద్దరు యువతులు సహా తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఓటీ ఓఎస్డీ కసిరెడ్డి గోవర్ధన్రెడ్డి కథనం మేరకు.. పాతబస్తీ వాసి మాలిక్ ముంబై, కోల్కతాల నుంచి యువతులను తీసుకొచ్చి ఏపీహెచ్బీ కాలనీలోని గ్రీన్ గెస్ట్హౌస్లో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. ఆన్లైన్లో విటులను ఆకర్షించి, ఒక రాత్రికి రూ.10 వేల చొప్పున వసూలు చేసేవాడు. దీనిపై కమిషనర్ సీవీ ఆనంద్కు సమాచారం అందడంతో, ఆయన ఆదేశాల మేరకు ఓఎస్డీ గోవర్ధన్రెడ్డి, ఇన్స్పెక్టర్ కుషాల్కర్, ఎస్సై రమేశ్ ఆదివారం గెస్ట్హౌస్పై దాడి చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన శుభంరాజ్ శర్మ (22), ప్రమోద్ పాటిల్(33), శ్రీరామమూర్తి (24), వెంకటేశ్వరరావు(29), రోషన్కుమార్ యాదవ్(27), రాజ్మిశ్రా(24)లతో పాటు టోలిచౌకికి చెందిన మజర్ ఉల్లాఖాన్ సమీర్(27) పట్టుబడ్డారు. వీరితో పాటు కోల్కతాకు చెందిన యువతులు రీముహజ్రా, తృప్తిదత్తాలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ల్యాప్టాప్, రూ.3 వేల నగదు, 8 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు మాలిక్ పరారీలో ఉండగా, పట్టుబడ్డ యువతులను రెస్క్యూహోమ్కు తరలించారు.