పట్టాలు తప్పిన డూన్ ఎక్స్ప్రెస్
లక్నో: హౌరా-డెహరాడూన్ ల మధ్య నడిచే డూన్ ఎక్స్ ప్రెస్ ఉత్తరప్రదేశ్ లోని జఫర్ గంజ్ రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
అంబేద్కర్నగర్ జిల్లా జాఫర్గంజ్ స్టేషన్ సమీపంలో ఘటనలో 8 కోచ్లు పట్టాలు తప్పాయి. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం కారణంగా ఉత్తరప్రదేశ్ లోని పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిందని రైల్వే అధికారులు తెలిపారు.