india vs england
-
భారత్తో టెస్టు సిరీస్.. ఇంగ్లండ్కు భారీ షాక్
స్వదేశంలో టీమిండియాతో టెస్టు సిరీస్కు ముందు ఇంగ్లండ్కు గట్టిఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ గాయం కారణంగా భారత్తో సిరీస్కు దూరమయ్యాడు. వుడ్ ప్రస్తుతం మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా అఫ్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో వుడ్ ఎడమ మోకాలికి గాయమైంది. దీంతో మ్యాచ్ మధ్యలోనే మైదానం నుంచి వుడ్ వైదొలిగాడు. అయితే అతడు కోలుకోవడానికి కనీసం నాలుగు నెలల సమయం పట్టనుంది. ఈ క్రమంలోనే టీమిండియాతో సిరీస్కు వుడ్ దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సైతం ధ్రువీకరించాడు. అతడు త్వరలోనే తన మోకాలికి శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు. ఈ ఏడాది జూలై ఆఖరిలో తిరిగి అతడు జట్టులోకి వచ్చే అవకాశముంది.కాగా మార్క్ వుడ్ కూడా తన గాయంపై అప్డేట్ ఇచ్చాడు. "గత ఏడాది ఆరంభం నుంచి ఎటువంటి విరామం లేకుండా అన్నిఫార్మాట్లలో ఇంగ్లండ్కు ప్రాతినిథ్యం వహించాను. కానీ దురదృష్టవశాత్తూ మళ్లీ గాయ పడటం నిజంగా నాకు చాలా బాధగా ఉంది.అయితే వీలైనంత త్వరగా గాయం నుంచి కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తాను. నాకు మద్దతుగా నిలిచిన వైద్యులు, కోచింగ్ స్టాప్, ఇంగ్లండ్ క్రికెట్, నా సహచరులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని వుడ్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.ఇదేమి తొలిసారి కాదు..కాగా మార్క్ వుడ్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉండడం ఇదేమి తొలిసారి కాదు. అతడు తన కెరీర్ ఆరంభం నుంచి గాయాలతో సావాసం చేస్తున్నాడు. గతేడాది ఆరంభంలో భారత్తో జరిగిన టెస్టు సిరీస్కు కూడా వుడ్ గాయం కారణంగా దూరమయ్యాడు.2019లో కూడా అతడు తన మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. ఇప్పుడు అతడు గాయం మళ్లీ తిరగబెట్టింది. దీంతో మరోసారి తన గాయానికి శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు. కాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో భాగంగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఈ టెస్టు సిరీస్ జరగనుంది. జూన్లో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.చదవండి: హార్దిక్ పాండ్యా కంటే అతడు ఎంతో బెటర్: పాక్ మాజీ కెప్టెన్ -
రోహిత్ శర్మకు బిగ్ షాక్.. టీమిండియా కెప్టెన్గా స్టార్ ప్లేయర్?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohitsharma) టెస్టు భవిష్యత్తు ప్రశ్నర్థకంగా మారింది. గతేడాదిగా టెస్టు క్రికెట్లో రోహిత్ శర్మ దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. అటు కెప్టెన్గా, ఇటు బ్యాటింగ్ పరంగా రోహిత్ పూర్తిగా తేలిపోతున్నాడు. గతేడాది ఆఖరిలో స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు వైట్వాష్కు గురైంది.స్వదేశంలో ప్రత్యర్ధి చేతిలో మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ వైట్వాష్ కావడం ఇదే మొదటి సారి. ఆ తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనూ రోహిత్ తీరు మారలేదు. తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాలతో దూరమైన హిట్మ్యాన్.. ఆ తర్వాతి మ్యాచ్లకు అందుబాటులోకి వచ్చాడు. తొలి టెస్టులో విజయం సాధించిన భారత్.. రోహిత్ వచ్చాక వరుసగా మూడు మ్యాచ్లలో ఓటమి చవిచూసింది.ఈ మూడు మ్యాచ్లలోనూ రోహిత్ తీవ్ర నిరాశపరిచాడు. దీంతో ఆఖరి టెస్టుకు భారత కెప్టెన్ తనంతంట తనే జట్టు నుంచి తప్పుకున్నాడు. అనంతరం స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో రోహిత్ పర్వాలేదన్పించాడు. తొలి వన్డేలో విఫలమైన ఈ ముంబైకర్.. ఆ తర్వాతి రెండో వన్డేలో మాత్రం విధ్వంసకర శతకంతో చెలరేగాడుఅయితే ఆ జోరును మూడో వన్డేలో కొనసాగించలేకపోయాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు రోహిత్ సిద్దమవుతున్నాడు. ఈ మెగా టోర్నీ తర్వాత శర్మ భవిష్యత్తుపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది. ఏదేమైనప్పటికి టెస్టుల్లో మాత్రం రోహిత్ కెరీర్ ముగిసినట్లేనని తాజా రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.కెప్టెన్గా బుమ్రా..?ఈ ఏడాది జూన్లో ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్కు హిట్మ్యాన్ను ఎంపిక చేసే అవకాశం లేదని పిటిఐ తమ నివేదికలో పేర్కొంది. అతడి స్ధానంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprith Bumrah)కు జట్టు పగ్గాలను అప్పగించాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం.కాగా బుమ్రా ప్రస్తుతం గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి సైతం అతడు దూరమయ్యాడు. బుమ్రా తిరిగి ఐపీఎల్-2025తో తిరిగి మైదానంలో అడుగపెట్టే అవకాశముంది. కాగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో బుమ్రా రెండు పర్యాయాలు భారత జట్టుకు నాయకత్వం వహించాడు.పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బుమ్రా సారథ్యంలోని భారత జట్టు 295 పరుగుల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. బుమ్రా మరోసారి సిడ్నీలో జరిగిన ఆఖరి టెస్టులో భారత జట్టు కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే ఈ మ్యాచ్లో బుమ్రా గాయం కారణంగా మధ్యలోనే వైదొలగడంతో టీమిండియా ఓటమి చవిచూసింది.ఒకే ఒక హాఫ్ సెంచరీ..గత 15 టెస్టు ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ 164 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ ఉంది. రోహిత్ గత 15 ఇన్నింగ్స్లో వరుసగా 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10 పరుగులు చేశాడు. చివరగా మెల్బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో 3 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 9 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. ఈ ఏడాది 14 టెస్టులాడిన రోహిత్.. 26 ఇన్నింగ్స్లో 24.76 సగటుతో 619 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మరో రెండు హాఫ్ సెంచరీలున్నాయి.చదవండి: రోహిత్, కోహ్లితో పాటు అతడికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ: భారత మాజీ క్రికెటర్ -
భారత్ ఆల్రౌండ్ షో.. మూడో వన్డేలో ఇంగ్లండ్ చిత్తు
అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్(England)తో జరిగిన మూడో వన్డేలో 142 పరుగుల తేడాతో భారత్(Teamindia) ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. 355 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 34.2 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌటైంది.లక్ష్య చేధనలో ఓపెనర్లు ఫిల్ సాల్ట్(23), డకెట్(34) తొలి వికెట్కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన టామ్ బాంటన్(38) కూడా కాసేపు దూకుడగా ఆడాడు. కానీ సాల్ట్, బాంటన్ ఔటయ్యాక ఇంగ్లండ్ వికెట్ల పతనం మొదలైంది. వరుస క్రమంలో వికెట్ల కోల్పోయి ఇంగ్లీష్ జట్టు వైట్ వాష్కు గురైంది. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సుందర్, కుల్దీప్ చెరో వికెట్ సాధించారు.శతక్కొట్టిన శుబ్మన్..ఇక తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బ్యాటర్లలో శుబ్మన్ గిల్ (102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లతో 112) సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లి(55 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 52), శ్రేయస్ అయ్యర్(64 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 78) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. మార్క్ వుడ్ రెండు, సకీబ్ మహమూద్, గస్ అట్కిన్సన్, జో రూట్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. కాగా ప్లేయర్ ఆఫ్ది సిరీస్, ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు రెండూ శుబ్మన్ గిల్కే దక్కాయి.ఛాంపియన్స్ ట్రోఫీకి సై..ఇక ఇంగ్లండ్ను స్వదేశంలో ఊడ్చేచిన భారత్కు ఛాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో కఠిన సవాలు ఎదురు కానుంది. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. భారత్ తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో తలపడనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టు ఫిబ్రవరి 15న దుబాయ్కు పయనం కానుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్చదవండి: SA vs PAK: పాక్ ప్లేయర్ల ఓవరాక్షన్.. సఫారీలు ఇచ్చిపడేశారుగా! వీడియో -
ఇంగ్లండ్కు ఊహించని షాక్.. అతడికి గాయం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ముందు ఇంగ్లండ్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ మెగా టోర్నీ ముంగిట ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్(Jos Butler) గాయపడ్డాడు. అహ్మదాబాద్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో బట్లర్ కుడి చేతి భుజానికి గాయమైంది.భారత ఇన్నింగ్స్ సందర్భంగా బంతిని ఆపే క్రమంలో జోస్ గాయపడ్డాడు. దీంతో అతడు నొప్పితో విల్లవిల్లాడు. అయితే నొప్పి తీవ్రంగా ఉండడంతో బట్లర్ మైదానాన్ని వీడాడు. అతడు తిరిగి మైదానంలోకి రాలేదు. ఈ క్రమంలో ఇంగ్లండ్ స్టాండిన్ కెప్టెన్గా హ్యారీ బ్రూక్ వ్యవహరిస్తున్నాడు.అదేవిధంగా బట్లర్కు సబ్స్ట్యూట్గా రెహాన్ ఆహ్మద్ ఫీల్డ్లోకి వచ్చాడు. కాగా అద్బుతమైన ఫామ్లో ఉన్న బట్లర్ గాయపడటం నిజంగా ఇంగ్లండ్కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఇప్పటికే యువ ఆటగాడు జాకబ్ బెతల్ గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేది అనుమానంగా మారగా.. తాజాగా బట్లర్ గాయం ఇంగ్లండ్ టీమ్ మెనెజ్మెంట్ను ఆందోళన కలిగిస్తోంది.అయితే బట్లర్ గాయం తీవ్రతపై ఇంగ్లండ్ క్రికెట్ ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ సన్నహాకాల్లో భాగంగా భారత్తో మూడు వన్డేల సిరీస్లో ఇంగ్లండ్ తలపడుతున్న సంగతి తెలిసిందే. తొలి రెండు వన్డేల్లో ఇంగ్లండ్ ఘోర పరాభావం చవిచూసింది.ఈ క్రమంలో ఆహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఇంగ్లీష్ జట్టు భావిస్తోంది. ఆఖరి మ్యాచ్లో కూడా భారత్ అదరగొడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది.39 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ శుబ్మన్ గిల్ సెంచరీతో మెరిశాడు. 92 బంతుల్లో తన 7వ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 64 బంతులు ఎదుర్కొన్న గిల్.. 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 112 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు శ్రేయస్ అయ్యర్(78), విరాట్ కోహ్లి(52) హాఫ్ సెంచరీలతో రాణించారు.ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఇంగ్లండ్ జట్టు:జోస్ బట్లర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, లియామ్ లివింగ్స్టోన్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, బెన్ డకెట్, బ్రైడన్ కార్స్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, జో రూట్చదవండి: IND vs ENG: శుబ్మన్ గిల్ అరుదైన రికార్డు.. తొలి భారత ప్లేయర్గా -
శుబ్మన్ గిల్ అరుదైన రికార్డు.. తొలి భారత ప్లేయర్గా
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ముందు టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్(Shubman Gill) అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ మెగా టోర్నీ సన్నహాకాల్లో భాగంగా స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో గిల్ దుమ్ములేపుతున్నాడు. తొలి రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలతో సత్తాచాటిన గిల్.. ఇప్పుడు అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో అద్బుతమైన శతకంతో మెరిశాడు.టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు గిల్ మరోసారి అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఆదిలోనే ఔటైనప్పటికి గిల్ మాత్రం కోహ్లితో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో గిల్ 92 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్లతో సాయంతో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. గిల్కు ఇది ఏడో వన్డే సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం 104 పరుగులతో గిల్ తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్లో శుబ్మన్ గిల్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.చరిత్ర సృష్టించిన గిల్..వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 2,500 పరుగుల మైలు రాయిని అందుకున్న భారత క్రికెటర్గా గిల్ నిలిచాడు. గిల్ కేవలం 50 ఇన్నింగ్స్లలో ఈ రికార్డును అందుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా మిడిలార్డర్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ పేరిట ఉండేది.అయ్యర్ 59 ఇన్నింగ్స్లలో ఈ ఫీట్ను సాధించాడు. తాజా మ్యాచ్తో అయ్యర్ అల్టైమ్ రికార్డును గిల్ బ్రేక్ చేశాడు. అదే విధంగా 50వ వన్డే మ్యాచ్లో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించాడు. కాగా శుబ్మన్ గిల్ ఇప్పటివరకు 50 వన్డేలు ఆడి 60.83 సగటుతో 2535 పరుగులు చేశాడు. అతడి ఇననింగ్స్లలో 7 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ, 16 ఆర్ధశతకాలు ఉన్నాయి.- Look at Rohit Sharma's reaction - Look at the crowd's reaction "They all know how aesthetically pleasing Shubman Gill is..."🔥💯• The Most Talented Youngster Everpic.twitter.com/UUJS2Ot6Vw— Gillfied⁷ (@Was_gill) February 12, 2025వన్డేల్లో అత్యంతవేగంగా 2500 పరుగులు చేసిన భారత ప్లేయర్లు వీరే..శుబ్మన్ గిల్- 50 ఇన్నింగ్స్లుశ్రేయాస్ అయ్యర్- 59 ఇన్నింగ్స్లుశిఖర్ ధావన్ -59 ఇన్నింగ్స్లుకేఎల్ రాహుల్-63 ఇన్నింగ్స్లువిరాట్ కోహ్లీ/నవ్జోత్ సిద్ధూ- 64 ఇన్నింగ్స్లుచదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్గా అరుదైన రికార్డు -
IND vs ENG 3rd ODI: మూడో వన్డేలో భారత్ ఘన విజయం
IND vs ENG 3rd Odi Live Updates: భారత్ ఘన విజయం..అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో 142 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయాన్ని అందుకుంది. దీంతో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. 357 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు.. 34.2 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది.భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణాచ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సుందర్, కుల్దీప్ చెరో వికెట్ సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో గాస్ అట్కినసన్(38), టామ్ బాంటన్(38) టాప్ స్కోరర్లగా నిలవగా.. డకెట్(34) మరోసారి దూకుడుగా ఆడాడు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులు చేసి భారత్ ఆలౌట్ అయింది. శుబ్మన్ గిల్(112) శతక్కొట్టగా.. విరాట్ కోహ్లి(52), శ్రేయస్ అయ్యర్(78) అర్ధ శతకాలతో రాణించారు. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్రాహుల్ సైతం 29 బంతుల్లోనే 40 పరుగులతో మెరిశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మార్క్ వుడ్ రెండు, సకీబ్ మహమూద్, గస్ అట్కిన్సన్, జో రూట్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఓటమి దిశగా ఇంగ్లండ్..ఇంగ్లండ్ వరుస క్రమంలో మూడు వికెట్లను కోల్పోయింది. తొలుత హ్యారీ బ్రూక్ను హర్షిత్ రాణా క్లీన్ బౌల్డ్ చేయగా.. ఆ తర్వాత లైమ్ లివింగ్ స్టోన్, అదిల్ రషీద్ పెవిలియన్కు చేరారు. 31 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 179/8ఇంగ్లండ్ ఐదో వికెట్ డౌన్..జోస్ బట్లర్ రూపంలో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన బట్లర్.. హర్షిత్ రాణా బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు.ఇంగ్లండ్ నాలుగో వికెట్ డౌన్..జో రూట్ రూపంలో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన రూట్.. అక్షర్ పటేల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ జోస్ బట్లర్ వచ్చాడు. 22 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 137/4మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్టామ్ బాంటన్ రూపంలో ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో కీపర్ కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి అతడు పెవిలియన్ చేరాడు. మొత్తం 41 బంతులు ఎదుర్కొని 38 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఇంగ్లండ్ స్కోరు: 126/3 (18). రూట్ 20 పరుగులతో ఉండగా.. హ్యారీ బ్రూక్ క్రీజులోకి వచ్చాడు.నిలకడగా ఆడుతున్న రూట్, బాంటన్ఇంగ్లండ్ బ్యాటర్లు టామ్ బాంటన్(25), జో రూట్(9) నిలకడగా ఆడుతున్నారు. 14 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 102/2ఇంగ్లండ్ రెండో వికెట్ డౌన్.. సాల్ట్ ఔట్ఫిల్ సాల్ట్ రూపంలో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన సాల్ట్.. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి జో రూట్ వచ్చాడు. 10 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 84/2. ఇంగ్లండ్ తొలి వికెట్ డౌన్..60 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడిన బెన్ డకెట్(32).. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి టామ్ బాంటన్ వచ్చాడు.టీమిండియా భారీ స్కోరుఇంగ్లండ్తో మూడో వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. శుబ్మన్ గిల్(112) శతక్కొట్టగా.. విరాట్ కోహ్లి(52), శ్రేయస్ అయ్యర్(78) అర్ధ శతకాలతో రాణించారు. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్రాహుల్ సైతం 29 బంతుల్లోనే 40 పరుగులతో మెరిశాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులు చేసి భారత్ ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మార్క్ వుడ్ రెండు, సకీబ్ మహమూద్, గస్ అట్కిన్సన్, జో రూట్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఎనిమిదో వికెట్గా వెనుదిరిగిన హర్షిత్ రాణాటెయిలెండర్ హర్షిత్ రాణా రూపంలో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. గస్ అట్కిన్సన్ బౌలింగ్లో బట్లర్కు క్యాచ్ ఇచ్చి అతడు పెవిలియన్ చేరాడు. 10 బంతుల్లో 13 పరుగులు చేసి నిష్క్రమించాడు. భారత్ స్కోరు: 353-8(49). అర్ష్దీప్ సింగ్ క్రీజులోకి వచ్చాడు.ఏడో వికెట్ డౌన్.. రాహుల్ నిష్క్రమణకేఎల్ రాహుల్ రూపంలో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ పేసర్ సకీబ్ మహమూద్ బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్(ఎల్బీడబ్ల్యూ)గా రాహుల్.. 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. హర్షిత్ రాణా క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 334-7(47).ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియాజో రూట్ బౌలింగ్లో అక్షర్ పటేల్ ఆరో వికెట్గా వెనుదిరిగాడు. 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టామ్ బాంటన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి రాగా.. కేఎల్ రాహుల్ 21 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 308-6(44). టీమిండియా ఐదో వికెట్ డౌన్.. పాండ్యా ఔట్టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన పాండ్యా.. అదిల్ రషీద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి అక్షర్ పటేల్ వచ్చాడు. 42 ఓవర్లకు భారత్ స్కోర్: 295/5అయ్యర్ ఔట్.. టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 78 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. అదిల్ రషీద్ బౌలింగ్లో ఔటయ్యాడు.క్రీజులోకి హార్దిక్ పాండ్యా వచ్చాడు. 40 ఓవర్లకు భారత్ స్కోర్: 275/4మూడో వికెట్ కోల్పోయిన టీమిండియాసెంచరీ వీరుడు శుబ్మన్ గిల్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఆదిల్ రషీద్ బౌలింగ్లో గిల్ బౌల్డ్ అయ్యాడు. 112 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. కేఎల్ రాహుల్ క్రీజులోకి రాగా.. శ్రేయస్ అయ్యర్ 52 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 227/3 (34.4) గిల్ సెంచరీ..అహ్మదాబాద్ వన్డేలో టీమిండియా ఓపెనర్ శుబ్మన్ గిల్ సెంచరీతో మెరిశాడు. 92 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్లతో సాయంతో గిల్ తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. గిల్కు ఇది ఏడో వన్డే సెంచరీ కావడం విశేషం. 31 ఓవర్లకు భారత్ స్కోర్: 213/2. క్రీజులో గిల్(104)తో పాటు శ్రేయస్ అయ్యర్(48) ఉన్నాడు.విరాట్ కోహ్లి ఔట్..విరాట్ కోహ్లి రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన కోహ్లి.. అదిల్ రషీద్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు.గిల్, కోహ్లి హాఫ్ సెంచరీలు..మూడో వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి(51), గిల్(60) అదరగొడుతున్నారు. వీరిద్దరూ ఈ మ్యాచ్లో తమ హాఫ్ సెంచరీలను పూర్తి చేస్తున్నారు. 18 ఓవర్లకు భారత్ స్కోర్: 120/1నిలకడగా ఆడుతున్న కోహ్లి, గిల్..16 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. కోహ్లి(41), గిల్(48) నిలకడగా ఆడుతున్నారు.10 ఓవర్లకు భారత్ స్కోర్: 52/110 ఓవర్లు ముగిసే టీమిండియా వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లి(17), శుబ్మన్ గిల్(28) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన టీమిండియాకెప్టెన్ రోహిత్ శర్మ రూపంలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. రెండో వన్డేల్లో విధ్వంసకర శతకం(119)తో చెలరేగిన రోహిత్.. తాజాగా ఒక్క పరుగుకే నిష్క్రమించాడు. మార్క్వుడ్ బౌలింగ్లో వికెట్ కీపర్ ఫిలిప్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కోహ్లి క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 8-1(2)అహ్మదాబాద్ వేదికగా మూడో వన్డేలో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈమ్యాచ్లో ఇంగ్లండ్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. జేమీ ఓవర్టన్ స్థానంలో టామ్ బాంటన్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు భారత్ మూడు మార్పులతో ఆడుతోంది. రవీంద్ర జడేజా, మహ్మద్ షమీలకు విశ్రాంతి ఇవ్వగా.. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ ముగ్గురి స్థానంలో వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చారు.కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్కు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. సూర్యకుమార్ సేన చేతిలో పొట్టి ఫార్మాట్ సిరీస్లో 4-1తో ఓడిపోయిన బట్లర్ బృందం.. వన్డే సిరీస్ను కూడా కోల్పోయింది.నాగ్పూర్, కటక్ వేదికలుగా జరిగిన తొలి రెండు వన్డేల్లో రోహిత్ సేన జయభేరి మోగించగా.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ 2-0తో ఓటమిపాలైంది. తాజాగా అహ్మదాబాద్ వేదికగా నామమాత్రపు మూడో వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. తుదిజట్లుటీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్.ఇంగ్లండ్ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), టామ్ బాంటన్, లియామ్ లివింగ్స్టోన్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సకీబ్ మహమూద్. -
ఇంగ్లండ్తో మూడో వన్డే.. భారీ రికార్డుకు చేరువలో రోహిత్
అహ్మదాబాద్ వేదికగా భారత్, ఇంగ్లండ్ (IND VS ENG 3rd ODI) మధ్య ఇవాళ (ఫిబ్రవరి 12) మూడో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఓ భారీ మైలురాయిని అధిగమించే అవకాశం ఉంది. నేటి మ్యాచ్లో హిట్మ్యాన్ మరో 13 పరుగులు చేస్తే, వన్డే క్రికెట్లో 11000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 10వ ఆటగాడిగా.. నాలుగో భారతీయ క్రికెటర్గా రికార్డు నెలకొల్పుతాడు. వన్డే క్రికెట్లో ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ (18426), కుమార సంగక్కర (14232), విరాట్ కోహ్లి (13911), రికీ పాంటింగ్ (13704), సనత్ జయసూర్య (13430), మహేళ జయవర్దనే (12650), ఇంజమామ్ ఉల్ హక్ (11739), జాక్ కల్లిస్ (11579), సౌరవ్ గంగూలీ (11363) మాత్రమే 11000 పరుగుల మైలురాయిని దాటారు.విరాట్ తర్వాత అత్యంత వేగంగా..!నేటి మ్యాచ్లో రోహిత్ 11000 పరుగుల మైలురాయిని తాకితే.. విరాట్ కోహ్లి (Virat Kohli) తర్వాత అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం రోహిత్ 259 వన్డే ఇన్నింగ్స్ల్లో 10987 పరుగులు చేశాడు. విరాట్.. 11000 పరుగుల మైలురాయిని తన 222వ ఇన్నింగ్స్లోనే అధిగమించాడు.సెంచరీ చేస్తే మరో రికార్డునేటి మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీ చేస్తే సచిన్ టెండూల్కర్ (100), విరాట్ కోహ్లి (81) తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీలు పూర్తి చేసిన మూడో భారత క్రికెటర్గా రికార్డుల్లోకెక్కుతాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన 10వ క్రికెటర్గా రికార్డు నెలకొల్పుతాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు సచిన్, విరాట్, పాంటింగ్ (71), సంగక్కర (63), కల్లిస్ (62), హాషిమ్ ఆమ్లా (55), జయవర్దనే (54), బ్రియాన్ లారా (53), జో రూట్ (52) మాత్రమే యాభై సెంచరీలు పూర్తి చేశారు. కాగా, ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. అంతకుముందు జరిగిన తొలి వన్డేలోనూ భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్లో రోహిత్ కేవలం 76 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్కు వన్డేల్లో ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. -
కటక్ నుంచి అహ్మదాబాద్కు టీమిండియా క్రికెటర్ల పయనం (ఫొటోలు)
-
కోహ్లి ఫామ్లోకి వస్తే భారత్కు తిరుగులేదు..
ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్ట్ నుండి పేలవమైన ఫామ్ కారణంగా వైదొలిగిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆ తర్వాత జరిగిన రంజీ ట్రోఫీ టోర్నమెంట్ లో కూడా ఆశించిన విధంగా రాణించలేక పోయాడు. ఈ నేపధ్యం లో ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ముందు రోహిత్ మళ్ళీ ఫామ్ లోకి రావడం చాల ముఖ్యమైన విషయం.వరుసగా పది ఇన్నింగ్స్ల లో ( తొమ్మిది టెస్టులు, ఒక వన్డే) విఫలమైన రోహిత్ చివరికి ఆదివారం కటక్లో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో తన మునుపటి ఫామ్ ని ప్రదర్శించి సిక్సర్ల మోత మోగించాడు. రోహిత్ కటక్ ప్రేక్షకులను నిజంగా అలరించాడు, 12 ఫోర్లు మరియు 7 సిక్సర్లు తో వన్డేల్లో తన 32వ సెంచరీ సాధించి, భారత్ ఈ మూడు మ్యాచ్ ల సిరీస్ చేజిక్కించుకునేందుకు తన వంతు పాత్ర పోషించాడు. జట్టు రధ సారధి లాగా ముందుండి నడిపించాడు.ఈ సెంచరీతో, రోహిత్ 30 ఏళ్లు నిండిన క్రికెటర్లలో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన భారత క్రికెటర్ గా రికార్డ్ నమోదు చేసాడు. లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ గతంలో 35 సెంచరీలు తో చేసిన రికార్డును రోహిత్ అధిగమించాడు. భారత్ తరపున ఓపెనర్గా అత్యధిక పరుగులు చేసిన వారి లో రోహిత్ ఇప్పుడు రెండో స్థానానికి చేరుకున్నాడు. రోహిత్ అన్ని ఫార్మాట్లలో ఓపెనర్గా 15,404 పరుగులు సాధించాడు. గతంలో సచిన్ టెండూల్కర్ 15,335 పరుగులతో సాధించిన మరో రికార్డును కూడా రోహిత్ ఈ మ్యాచ్ తో అధిగమించాడు. వీరేంద్ర సెహ్వాగ్ 15,758 పరుగులతో ఈ జాబితా లో అగ్ర స్థానం లో ఉన్నాడు. "చాలా సంవత్సరాలుగా నేను క్రికెట్ ఆడుతున్నాను. నేను ఏమి చేయాలో నాకు తెల్సు. నా నుండి ఏమి అవసరమో నాకు అర్థమైంది. పిచ్ లోకి వెళ్లి నేను చేసింది అదే" అని రోహిత్ మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు.రోహిత్ మళ్ళీ ఫామ్ లోకి రావడంతో భారత్ జట్టు మానేజిమెంట్ కి పెద్ద తలనొప్పి తగ్గింది. ఇక మూడో వన్డేలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా సెంచరి సాధించినట్టయితే ఛాంపియన్స్ ట్రోఫీ కి ముందు భారత్ బ్యాటింగ్ గాడి లో పడినట్టే. బ్యాటింగ్ స్థానం లో మార్పులుఅయితే భారత్ బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు పై పలువురు మాజీ ఆటగాళ్లు జట్టు మేనేజిమెంట్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ను వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ కంటే ముందుగా పంపడం పై పెద్ద దుమారమే చెలరేగుతోంది. టాప్ ఆర్డర్ బ్యాటర్ అయిన రాహుల్ జట్టు అవసరాల అనుగుణంగా బ్యాటింగ్ స్థానాన్ని మార్చడం పై జట్టు మేనేజిమెంట్ పలు విమర్శలు ఎదుర్కొంటోంది."అక్షర్ పటేల్ మళ్ళీ కెఎల్ రాహుల్ కంటే ముందుగా బ్యాటింగ్ రావడమేమిటి? నాకు మాటలు కూడా రావడం లేదు. రాహుల్ లాంటి నైపుణ్యమైన బాట్స్మన్ ని ఆరో స్థానానికి నెట్టడం చాల దారుణం. అక్షర్ను రాహుల్ కన్నా ముందుగా బ్యాటింగ్ పంపడం. అదీ ఇలాంటి పిచ్ పై సరైన నిర్ణయం కాదు, అని భారత్ మాజీ ఆటగాడు దొడ్డ గణేష్ వ్యాఖ్యానించాడు. -
రో‘హిట్స్’... భారత్దే సిరీస్
చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత శిబిరానికి గొప్ప శుభవార్త! క్రికెట్ను శ్వాసించే అభిమానులకు కచ్చితంగా ఇది తీపి కబురు! ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ(Rohit Sharma) ఫామ్లోకి వచ్చాడు. అట్లాంటి... ఇట్లాంటి... ఆటతో కాదు. 300 పైచిలుకు పరుగుల వేటలో భారత్ ఉండగా... తనశైలి రో‘హిట్స్’తో అలరిస్తూ, లక్ష్యాన్ని కరిగిస్తూ, శతకంతో కదంతొక్కాడు. అతని జోరుకు మైదానం హోరెత్తింది. పెద్ద లక్ష్యమే అయినా చిన్నబోయింది. ఇంకో మ్యాచ్ ఉండగానే వన్డే సిరీస్ కూడా టీమిండియా వశమైంది.కటక్: భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వరుసగా రెండు, మూడు మ్యాచ్లు విఫలమైనా... తక్కువ స్కోరుకు అవుటైనా... విమర్శకులు ఈ మధ్య నెట్టింట తెగ విరుచుకుపడుతున్నారు. ఆదివారం ‘హిట్మ్యాన్’ విరుచుకుపడ్డాడు. నోటితో కాదు... బ్యాట్తో! నెట్లో కాదు... మైదానంలో! అద్భుతమైన సెంచరీతో కొండంత లక్ష్యాన్ని టీమిండియా అలవోకగా ఛేదించేలా చేశాడు. దీంతో ఆఖరి పోరు మిగిలుండగానే వన్డే సిరీస్ కూడా భారత్ చేతికి చిక్కింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (56 బంతుల్లో 65; 10 ఫోర్లు), జో రూట్ (72 బంతుల్లో 69; 6 ఫోర్లు), లివింగ్స్టోన్ (32 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. బ్యాట్ గర్జిస్తున్న వేళ భారత బౌలర్లంతా పరుగులు సమరి్పంచుకుంటే... రవీంద్ర జడేజా (10–1–35–3) మాత్రం పూర్తి కోటా వేసి వికెట్లు తీసి పరుగుల వేగాన్ని అడ్డుకున్నాడు. అనంతరం కఠినమైన లక్ష్యమే అయినా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ రోహిత్ (90 బంతుల్లో 119; 12 ఫోర్లు, 7 సిక్స్లు) వీరోచిత శతకంతో భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ శుబ్మన్ గిల్ (52 బంతుల్లో 60; 9 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 44; 3 ఫోర్లు, 1 సిక్స్) ఇద్దరూ కెపె్టన్తో కలిసి ఇన్నింగ్స్ను నడిపించారు. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ను 2–0తో దక్కించుకుంది. చివరిదైన మూడో వన్డే ఈనెల 12న అహ్మదాబాద్లో జరుగుతుంది. డకెట్, రూట్... ఫిఫ్టీ–ఫిఫ్టీ ఇంగ్లండ్ ఓపెనర్లు సాల్ట్ (26; 2 ఫోర్లు, 1 సిక్స్), డకెట్ దూకుడుగా ఆడి తొలి వికెట్కు 81 పరుగులు జోడించారు. డకెట్ 36 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. అతడు అవుటయ్యాక రూట్, హ్యారీ బ్రూక్ (31; 3 ఫోర్లు, 1సిక్స్) నింపాదిగా ఆడటంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆద్యంతం సాఫీగా సాగిపోయింది. రూట్ 60 బంతుల్లో తన వన్డే కెరీర్లో 56వ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అనంతరం కెపె్టన్ బట్లర్ (34; 2 ఫోర్లు), లివింగ్స్టోన్ (32 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్లు)లు సైతం పరుగులు సాధించడంతో ఇంగ్లండ్ 300 పైచిలుకు స్కోరు చేయగలిగింది. షమీ, రాణా, పాండ్యా, వరుణ్ తలా ఒక వికెట్ తీశారు. 76 బంతుల్లో శతకం ఎంతటి బ్యాటింగ్ పిచ్ అయినా... 305 పరుగుల లక్ష్యం వన్డేల్లో అంత ఈజీ కానేకాదు. చక్కని శుభారంభం... కడదాకా ఓర్పుగా, నేర్పుగా ఒక బ్యాటరైనా క్రీజులో నిలిస్తేనే గెలుపు ఆశలుంటాయి. సరిగ్గా నాయకుడు రోహిత్ కూడా ఇదే చేశాడు. ఓపెనింగ్లో గిల్తో జతగా మొదట లక్ష్యానికి అనువైన ఆరంభమిచ్చాడు. దీంతో 6.2 ఓవర్లలోనే భారత్ స్కోరు 50 దాటింది. భారీ షాట్లతో విరుచుకుపడిన ‘హిట్మ్యాన్’ 30 బంతుల్లో అర్ధసెంచరీ సాధించగా, గిల్ 45బంతుల్లో పూర్తి చేశాడు. ఇద్దరి పట్టుదలతో 14వ ఓవర్లోనే జట్టు 100కు చేరుకుంది. తర్వాత గిల్ ని్రష్కమించినా, కోహ్లి (5) విఫలమైనా ... ఆ ప్రభావం ఇన్నింగ్స్పై పడకుండా అయ్యర్తో కలిసి ధాటిని కొనసాగిస్తూ టీమిండియాను లక్ష్యంవైపు నడిపించాడు. ఈ క్రమంలో 76 బంతుల్లో సెంచరీ సాధించాక భారీ షాట్కు యతి్నంచి అవుటయ్యాడు. అప్పుడు జట్టు స్కోరు 29.4 ఓవర్లలో 220/3. ఇక గెలిచేందుకు 125 బంతుల్లో 85 చేస్తే చాలు. ఈ పనిలో అక్షర్ పటేల్ (43 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు) అజేయంగా భాగమవడంతో 33 బంతులు మిగిలుండగానే భారత్ మ్యాచ్ నెగ్గింది.ఫ్లడ్లైట్లు మొరాయించడంతో... బారాబతి స్టేడియంలోని ఫ్లడ్లైట్లు మొరాయించడంతో ఆటకు అరగంటకు పైగానే అంతరాయం ఏర్పడింది. డేనైట్ వన్డేలు, టి20ల కోసం మైదానం చుట్టూరా... ఎనిమిది చోట్ల ఫ్లడ్లైట్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఒకదాంట్లో సమస్య వచ్చింది. భారీ లక్ష్యఛేదనకు దిగిన భారత్ 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ధనాధన్ వేగంతో 48 పరుగులు చేసింది. ఈ సమయంలో క్లాక్ టవర్ వద్ద వున్న ఫ్లడ్లైట్లు ఆగిపోయాయి. దీంతో 35 నిమిషాల పాటు మ్యాచ్ను నిలిపేసి లైట్లు వెలిగాకే తిరిగి మ్యాచ్ను నిర్వహించారు.స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) జడేజా (బి) వరుణ్ 26; డకెట్ (సి) పాండ్యా (బి) జడేజా 65; రూట్ (సి) కోహ్లి (బి) జడేజా 69; బ్రూక్ (సి) గిల్ (బి) రాణా 31; బట్లర్ (సి) గిల్ (బి) పాండ్యా 34; లివింగ్స్టోన్ (రనౌట్) 41; ఓవర్టన్ (సి) గిల్ (బి) జడేజా 6; అట్కిన్సన్ (సి) కోహ్లి (బి) షమీ 3; రషీద్ (రనౌట్) 14; మార్క్ వుడ్ (రనౌట్) 0; సఖిబ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 15; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 304. వికెట్ల పతనం: 1–81, 2–102, 3–168, 4–219, 5–248, 6–258, 7–272, 8–297, 9–304, 10–304. బౌలింగ్: షమీ 7.5–0–66–1, హర్షిత్ రాణా 9–0–62–1, పాండ్యా 7–0–53–1, వరుణ్ 10–0–54–1, జడేజా 10–1–35–3, అక్షర్ 6–0–32–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రషీద్ (బి) లివింగ్స్టోన్ 119; గిల్ (బి) ఓవర్టన్ 60; కోహ్లి (సి) సాల్ట్ (బి) రషీద్ 5; అయ్యర్ (రనౌట్) 44; అక్షర్ పటేల్ (నాటౌట్) 41; కేఎల్ రాహుల్ (సి) సాల్ట్ (బి) ఓవర్టన్ 10; పాండ్యా (సి) ఓవర్టన్ (బి) అట్కిన్సన్ 10; జడేజా (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 8; మొత్తం (44.3 ఓవర్లలో 6 వికెట్లకు) 308. వికెట్ల పతనం: 1–136, 2–150, 3–220, 4–258, 5–275, 6–286. బౌలింగ్: సఖిబ్ 6–0–36–0, అట్కిన్సన్ 7–0–65–1, మార్క్ వుడ్ 8–0–57–0, ఆదిల్ రషీద్ 10–0–78–1, ఓవర్టన్ 5–0– 27–2, లివింగ్స్టోన్ 7–0–29–1, రూట్ 1.3–0–15–0. -
IND Vs ENG: హిట్మ్యాన్ సూపర్ షో.. సిరీస్ టీమిండియా కైవసం
కటక్: ఇంగ్లండ్తో కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగి ఆడి జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. ఇంగ్లండ్ నిర్దేశించిన 305 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 44.3 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. రోహిత్ శర్మ వీరవిహారంతో టీమిండియా అవలీలగా విజయం సాధించింది. ఫలితంగా సిరీస్ను 2-0 తేడాతో ఇంకోమ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది టీమిండియా.హిట్మ్యాన్ సూపర్ షో..చాలాకాలం తర్వాత బ్యాటింగ్లో చెలరేగిన రోహిత్.. సెంచరీతో మెరిశాడు. గత కొంతకాలంగా ఫామ్ కోసం తంటాలు పడుతున్న హిట్ మ్యాన్.. తిరిగి సత్తా చాటాడు. తనపై వరుసగా వస్తున్న విమర్శలకు బ్యాట్తోనే సమాదానం చెప్పాడు రోహిత్. 76 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్లతో తనదైన శైలిలో రెచ్చిపోయి శతకం పూర్తి చేసుకున్నాడు. సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేయడం విశిషం. ఇది రోహిత్కు 18 నెలల తర్వాత వన్డేల్లో తొలి సెంచరీ. 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్లతో 119 పరుగులు చేశాడు రోహిత్. ఇది రోహిత్కు 32వ వన్డే శతకం.కోహ్లి విఫలం..శుభ్మన్ గిల్(60; 52 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) తో కలిసి భారీ ాభాగస్వామ్యాన్ని నెలకొల్పాడు రోహిత్. ఈ జోడి తొలి వికెట్కు 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత గిల్ తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో క్రీజ్లోకి వచ్చిన కోహ్లి(5) మరోసారి విఫలమయ్యాడు. 8 బంతుల్లో ఒక ఫోర్ కొట్టిన అనంతరం కోహ్లి ెపెవిలియన్ బాట పట్టాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్లో ాసాల్ట్ుకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు ివిరాట్.ఆకట్టుకున్న అయ్యర్కోహ్లి ఔటైన తర్వాత సెకండ్ డౌన్లోక్రీజ్లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఆకట్టుకున్నాడు. రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ను పరుగులు పెట్టించాడు. ఒకవైపు రోహిత్ దూకుడుగా ఆడుతుంటే అయ్యర్.. స్ట్రైక్రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్ను నడిపించాడు. ఈ జోడి 70 పరుగులు జోడించిన తర్వాత రోహిత్ మూడో వికెట్గా ఔటయ్యాడు.లివింగ్ స్టోన్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి రషీద్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో 220 పరుగుల వద్ద రోహిత్ రూపంలో టీమిండియా మూడో వికెట్ ను కోల్పోయింది. రోహిత్ ఔటైన స్వల్ప వ్యవధిలోనే అయ్యర్ సైతం పెవిలియన్ చేరాడు. 47 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 44 పరుగులు చేసిన అయ్యర్..రనౌట్ అయ్యాడు.నిరాశపరిచిన రాహుల్.. మెరిసిన అక్షర్ఫోర్త్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన కేఎల్ రాహుల్ మరోసారి నిరాశపరిచాడు. 14 బంతుల్లో 1 ఫోర్ సాయంతో 10 పరుగులు చేసిన రాహుల్.. జెమీ ఓవర్టాన్ బౌలింగ్ లో సాల్ట్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అక్షర్ పటేల్ మాత్రం బ్యాటింగ్ లో మెరిశాడు. ఆడపా దడపా షాట్లుకొడుతూ నిలకడగా బ్యాటింగ్ చేశాడు. 43 బంతుల్లో 4 ఫోర్లతో41 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు అక్షర్.అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్కు ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(26), బెన్ డకెట్(65)లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి 81 పరుగులు జత చేసిన తర్వాత సాల్ట్ తొలి ివికెట్ గా పెవిలియన్ చేరాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి సాల్ట్ ఔటయ్యాడు. అనంతరం జో రూట్ తో కలిసి ఇన్నింగ్స్ను ముందకు తీసుకెళ్లాడు డకెట్. అయితే వీరి భాగస్వామ్యం ఎంతో సేపో నిలవలేదు. డకెట్ను రవీంద్ర జడేజా పెవిలియన్ కు పంపాడు.ఆపై బ్రూక్(31), జాస్ బట్లర్(34)లు కాస్త ఫర్వాలేదనిపించారు. జో రూట్ 72 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేసి ఇన్నింగ్స్,ను చక్కదిద్దాడు. ఆఖరి ఓవర్ వరకూ లివింగ్స్టోన్(41) ఉండటంతో ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, షమీ, హర్షిత్ రానా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది.నాగ్పూర్లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసింది. ఇక నామమాత్రమైన మూడో వన్డే అహ్మదాబాద్లో బుధవారం జరుగనుంది. -
రెండో వన్డే: హిట్మ్యాన్ వీరవిహారం
కటక్: టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ వీరవిహారం చేశాడు. చాలాకాలం తర్వాత బ్యాటింగ్లో చెలరేగిన రోహిత్.. సెంచరీతో మెరిశాడు. గత కొంతకాలంగా ఫామ్ కోసం తంటాలు పడుతున్న హిట్ మ్యాన్.. తిరిగి సత్తా చాటాడు. తనపై వరుసగా వస్తున్న విమర్శలకు బ్యాట్తోనే సమాదానం చెప్పాడు రోహిత్. 76 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్లతో తనదైన శైలిలో రెచ్చిపోయి శతకం పూర్తి చేసుకున్నాడు. సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేయడం విశిషం. ఇది రోహిత్కు 18 నెలల తర్వాత వన్డేల్లో తొలిసారి సెంచరీ.కటక్లో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ నిర్దేశించిన 305 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో ఓపెనర్గా దిగిన రోహిత్,.. సొగసైన ఇన్నింగ్స్ ఆడాడు. శుభ్మన్ గిల్(60; 52 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ జోడి తొలి వికెట్కు 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత గిల్ తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో క్రీజ్లోకి వచ్చిన కోహ్లి(5) మరోసారి విఫలమయ్యాడు. రోహిత్ సెంచరీ చేసే సమయానికి టీమిండియా ఇంకా 119 పరుగులు చేయాల్సింది ఉంది. రోహిత్కు జతగా శ్రేయస్ అయ్యార్ క్రీజ్లో ఉన్నాడు. ఇది రోహిత్కు 32వ వన్డే శతకం. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్కు ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(26), బెన్ డకెట్(65)లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి 81 పరుగులు జత చేసిన తర్వాత సాల్ట్ తొలి ివికెట్ గా పెవిలియన్ చేరాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి సాల్ట్ ఔటయ్యాడు. అనంతరం జో రూట్ తో కలిసి ఇన్నింగ్స్ను ముందకు తీసుకెళ్లాడు డకెట్. అయితే వీరి భాగస్వామ్యం ఎంతో సేపో ినిలవలేదు. డకెట్ను రవీంద్ర జడేజా పెవిలియన్ కు పంపాడు.ఆపై బ్రూక్(31), జాస్ బట్లర్(34)లు కాస్త ఫర్వాలేదనిపించారు. జో రూట్ 72 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేసి ఇన్నింగ్స్,ను చక్కదిద్దాడు. ఆఖరి ఓవర్ వరకూ లివింగ్స్టోన్(41) ఉండటంతో ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, షమీ, హర్షిత్ రానా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది. -
రెండో వన్డే: టీమిండియా టార్గెట్ 305
కటక్: బారాబతి స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ 305 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్కు ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(26), బెన్ డకెట్(65)లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి 81 పరుగులు జత చేసిన తర్వాత సాల్ట్ తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి సాల్ట్ ఔటయ్యాడు. అనంతరం జో రూట్ తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు డకెట్. అయితే వీరి భాగస్వామ్యం ఎంతో సేపు నిలవలేదు. డకెట్ను రవీంద్ర జడేజా పెవిలియన్ కు పంపాడు.ఆపై బ్రూక్(31), జాస్ బట్లర్(34)లు కాస్త ఫర్వాలేదనిపించారు. జో రూట్ 72 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేసి ఇన్నింగ్స్,ను చక్కదిద్దాడు. ఆపై ఆఖరి ఓవర్ వరకూ లివింగ్స్టోన్(41) ఉండటంతో ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగుల గౌరవప్రదమైన స్కోరును బోర్డుపై ఉంచింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, షమీ, హర్షిత్ రానా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది.కాగా,తొలి వన్డేకు గాయం కారణంగా దూరమైన కోహ్లి.. పూర్తి ఫిట్నెస్ సాధించడంతో తిరిగి జట్టులోకి జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా ఈ మ్యాచ్తో వరుణ్ చక్రవర్తి భారత తరపున వన్డే అరంగేట్రం చేశాడు. టీ20ల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండడంతో వరుణ్కు వన్డేల్లో కూడా అవకాశం దక్కింది. కోహ్లి, వరుణ్ రాకతో జైశ్వాల్,కుల్దీప్ యాదవ్ బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది. మరోవైపు ఇంగ్లండ్ తమ జట్టులో మూడు మార్పులు చేసింది. గుస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, జేమీ ఓవర్టన్ తుది జట్టులోకి వచ్చారు. దీంతో జాకబ్ బెతల్, కార్స్, అర్చర్లకు ఇంగ్లండ్ మేనేెజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. -
ఇంగ్లండ్ రెండో వన్డే.. వరుణ్ చక్రవర్తి అరంగేట్రం! కోహ్లి వచ్చేశాడు
కటక్లోని బారాబతి స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్లు రెండో వన్డేలో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత తుది జట్టులో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి చోటు దక్కింది.తొలి వన్డేకు గాయం కారణంగా దూరమైన కోహ్లి.. పూర్తి ఫిట్నెస్ సాధించడంతో తిరిగి జట్టులోకి జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా ఈ మ్యాచ్తో వరుణ్ చక్రవర్తి భారత తరపున వన్డే అరంగేట్రం చేశాడు. టీ20ల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండడంతో వరుణ్కు వన్డేల్లో కూడా అవకాశం దక్కింది. కోహ్లి, వరుణ్ రాకతో జైశ్వాల్,కుల్దీప్ యాదవ్ బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది.మరోవైపు ఇంగ్లండ్ తమ జట్టులో మూడు మార్పులు చేసింది. గుస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, జేమీ ఓవర్టన్ తుది జట్టులోకి వచ్చారు. దీంతో జాకబ్ బెతల్, కార్స్, అర్చర్లకు ఇంగ్లండ్ మెనెజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది.తుది జట్లుఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జామీ ఓవర్టన్, గుస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తిచదవండి: SL vs AUS: చరిత్ర సృష్టించిన స్మిత్.. ప్రపంచంలో తొలి ప్లేయర్గా -
ఇంగ్లండ్తో రెండో వన్డే.. భారత జట్టులో కీలక మార్పులు! కింగ్, సింగ్ ఎంట్రీ?
కటక్ వేదికగా ఇంగ్లండ్తో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. తొలి వన్డేలో ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్.. ఈ మ్యాచ్లో కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. కటక్ వన్డేలో ఎలాగైనా గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను సొంతం చేసుకోవాలని భారత్ వ్యూహాలు రచిస్తోంది.మరోవైపు ఇంగ్లండ్ ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేయాలని యోచిస్తోంది. 2006 నుంచి భారత గడ్డపై 31 సార్లు భారత్తో తలపడిన ఇంగ్లండ్ 5 మ్యాచ్లే గెలిచి మరో 25 మ్యాచ్ల్లో ఓటమిచవిచూసింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.కింగ్ ఇన్.. జైశ్వాల్ ఔట్!మోకాలి గాయం కారణంగా తొలి వన్డేకు దూరమైన టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat kohli).. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దీంతో అతడు రెండో వన్డేలో ఆడనున్నాడు. ఈ విషయాన్ని భారత జట్టు వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ సైతం ధ్రువీకరించాడు. ఈ క్రమంలో ఓపెనర్ యశస్వి జైశ్వాల్పై వేటు పడనున్నట్లు తెలుస్తోంది.కటక్ మ్యాచ్తో వన్డేల్లో అరంగేట్రం చేసిన జైశ్వాల్.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కేవలం 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. దీంతో అతడిని పక్కన పెట్టి యథావిధిగా గిల్ను ఓపెనర్గా పంపాలని జట్టు మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. గిల్ స్దానంలో కోహ్లి బ్యాటింగ్కు వచ్చే అవకాశముంది.మరోవైపు ఈ మ్యాచ్లో యువపేసర్ అర్ష్దీప్ సింగ్ ఆడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్దం చేసేందుకు అర్ష్దీప్ను ఈ మ్యాచ్లో ఆడించాలని మెనెజ్మెంట్ నిర్ణయించందంట. దీంతో మరో యువ పేసర్ హర్షిత్ రాణా బెంచ్కే పరిమితమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.కటక్ వన్డేతో అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా 3 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. కానీ పరుగులు మాత్రం భారీ సమర్పించుకున్నాడు. అదేవిధంగా ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ను ఆడించాలని గంభీర్ అండ్ కో భావిస్తే కేఎల్ రాహుల్ బెంచ్కే పరిమితం కానున్నాడు.రోహిత్ ఫామ్లోకి వస్తాడా?కాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ అభిమానులను అందోళనకు గురిచేస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విఫలమైన రోహిత్.. ఇంగ్లండ్తో సిరీస్లో కూడా కూడా అదేతీరును కనబరుస్తున్నాడు. తొలి వన్డేలో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి హిట్మ్యాన్ ఔటయ్యాడు.ఈ క్రమంలో రోహిత్కు భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ మద్దతుగా నిలిచాడు. రోహిత్ శర్మ అద్బుతమైన ఆటగాడని, అతడి ఫామ్పై మాకు ఎటువంటి ఆందోళన లేదని కోటక్ అన్నారు. అదేవిధంగా ఈ సిరీస్ కంటే ముందు శ్రీలంకపై వన్డేల్లో రోహిత్ మెరుగ్గా రాణించాడని, తిరిగి తన ఫామ్ను అందుకుంటాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్ ),శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్/ రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్ ),సాల్ట్, రూట్, బ్రూక్, బెన్ డకెట్, లివింగ్స్టోన్, బెతెల్, కార్స్, ఆర్చర్, రషీద్, వుడ్.చదవండి: సిరీస్ విజయమే లక్ష్యంగా... -
శ్రేయాస్ జోరు మరి విరాట్ పరిస్థితి ఏమిటి?
ఇంగ్లండ్ తో గురువారం జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో నిజానికి భారత్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఆడే పరిస్థితి లేదు. దానికి ముందు రోజు రాత్రి వరకు దీని పై స్పష్టత లేదు. శ్రేయాస్ అయ్యర్ ఏదో సినిమా చూస్తూ నిబ్బరముగా ఉన్నాడు. ఈ లోగా కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి ఫోన్ వచ్చింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి గాయం కావడంతో అతను ఆడటం కష్టమని. అందువల్ల మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉండమని కోరాడు. దాంతో సినిమా ఆపేసి మ్యాచ్ కి ముందు విశ్రాంతి కోసం నిద్రకు ఉపక్రమించాడు శ్రేయాస్ అయ్యర్. "విరాట్ మోకాలి నొప్పి కారణంగా ఆడే అవకాశం లేనందున నువ్వు ఆడే అవసరం రావచ్చు అని కెప్టెన్ (రోహిత్ శర్మ) నుండి నాకు కాల్ వచ్చింది" అని అయ్యర్ స్వయంగా వెల్లడించాడు."నేను నా గదికి తిరిగి వెళ్లి వెంటనే నిద్ర పోయాను." గురువారం మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి అడుగు పెట్టే సమయానికి భారత్ 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో ఉంది. ఇంగ్లాండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్ మరియు సాకిబ్ మహమూద్ నిలకడగా బౌలింగ్ చేస్తూ భారత్ ని పరుగులు కొట్టకుండా నిల్వరిస్తున్నారు.ఆ దశలో రంగ ప్రవేశం చేసిన అయ్యర్ ఇంగ్లాండ్ బౌలర్ల సవాలును ఎదుర్కొన్నాడు. అయ్యర్ రెండు సిక్సర్లు, తొమ్మిది ఫోర్లతో 36 బంతుల్లో 59 పరుగులు చేశాడు. తన అద్భుతమైన ఎదురుదాడి ఇన్నింగ్స్తో మ్యాచ్ ని మలుపు తిప్పాడు. ఫలితంగా భారత్ తొలి వన్డేలో ఇంగ్లాండ్పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించగా, శ్రేయాస్ అయ్యర్ తన 19వ అర్ధ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్ లో మరో విషయం వెల్లడైంది. యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా వస్తే శుభ్మాన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ కి వస్తాడు. విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉంటాడు. ఎడమచేతి వాటం అక్షర్ తదుపరి బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది, ఆట స్థితిని బట్టి కే ఎల్ రాహుల్ లేదా హార్దిక్ పాండ్యా తర్వాత బ్యాటింగ్ చేస్తారు. అయితే కోహ్లీ గాయం లేకపోతే అయ్యర్ కి స్తానం లేదా అన్నది ఇక్కడ ప్రధానాంశం. "కోహ్లీ ఫిట్ గా ఉంటే అయ్యర్ ఆడటం సాధ్యం కాదన్న విషయం గురుంచే నేను తదేకంగా ఆలోచిస్తున్నాను. 2023 ప్రపంచ కప్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 500 కి పైగా పరుగులు చేసిన తొలి భారత్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్.అటువంటి నైపుణ్యం ఉన్న బ్యాట్స్మన్ ని మీరెలా బెంచ్ మీద కూర్చో బెట్ట గలరు? అని భారత్ మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా జట్టు మేనేజ్మెంట్ పై విరుచుకు పడ్డాడు. భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శ్రేయాస్ అయ్యర్ ని సమర్ధించాడు."శ్రేయస్ తన నైపుణ్యాన్ని ఇప్పటికే నిరూపించుకున్నాడు. అతను ప్రపంచ కప్లో పరుగుల ప్రవాహం సృష్టించాడు. ఒక ఆటగాడు ఇన్ని పరుగులు చేసినప్పుడు, అతనికి అవకాశాలు లభిస్తాయని భావించడంలో తప్పేం ఉంది. అతను అతని దృష్టిలో అత్యుత్తమ బ్యాట్స్మన్. అందుకే దేవుడు కూడా అలాగే భావించాడు. అతను చేసిన 50 పరుగులు, మ్యాచ్ రూపురేఖలను మార్చాయి," అని హర్భజన్ అయ్యర్ పై ప్రశంసలు కురిపించాడు. -
రోహిత్ ప్రాక్టీస్ ఆపేయ్.. ఫస్ట్ ఆ పనిచేయు: భారత మాజీ క్రికెటర్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) పేలవ ఫామ్తో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత రోహిత్ శర్మ ఆటతీరు పేలవంగా మారిపోయింది. టెస్టులు, వన్డేల్లో హిట్మ్యాన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో దారుణంగా విఫలమైన రోహిత్.. ఇప్పుడు ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో అదే తీరును కనబరుస్తున్నాడు.నాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఒకప్పుడు షార్ట్ పిచ్ బంతులను అలోవకగా సిక్సర్లగా మలిచిన రోహిత్.. ఇప్పుడు అదే బంతులకు ఔట్ అవుతుండడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రోహిత్ తన ఫామ్ను అందుకోవాలని సగటు భారత అభిమాని కోరుకుంటున్నాడు. ఈ క్రమంలో రోహిత్కు భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కీలక సూచనలు చేశాడు. రోహిత్ శర్మ తన రిథమ్ను తిరిగి పొందడానికి గతంలో తను ఆడిన వీడియోలు చూడాలని బంగర్ అభిప్రాయపడ్డాడు."రోహిత్ శర్మ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. తన కెరీర్లో పరుగులు చేయని దశను అనుభవిస్తున్నాడు. అయితే అతడు తన ఫామ్ను తిరిగి అందుకోవడానికి ఎక్కువగా నెట్స్లో శ్రమిస్తున్నాడు. కానీ కొన్నిసార్లు ఎక్కువగా సాధన చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. అతడు ఒంటరిగా ఉండి బ్యాటర్గా తన గత విజయాలను గుర్తు చేసుకోవాలి. గతంలో తన బ్యాటింగ్ చేసిన వీడియోలను చూడాలి. ప్రస్తుతం ఎక్కడ తప్పు జరుగుతుందో గుర్తించి సరిదిద్దుకోవాలి. కొన్ని సార్లు ఇలా చేయడం ఫలితాన్ని ఇస్తోంది. ఒక్కసారి రిథమ్ను అందుకొంటే చాలు. అంతేకానీ ఎక్కువగా ఆలోచించి నిరాశలో కూరుకుపోకూడదు" అని బంగర్ పేర్కొన్నాడు. కాగా కటక్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో వన్డే ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్లోనైనా రోహిత్ తన బ్యాట్కు పనిచేబుతాడో లేదో చూడాలి. కాగా ఈ మ్యాచ్కు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి అందుబాటులో ఉండనున్నాడు. గాయం కారణంగా తొలి వన్డేకు దూరమైన కోహ్లి.. ఇప్పుడు తన ఫిట్నెస్ను తిరిగిపొందాడు . ఈ విషయాన్ని భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ ధ్రువీకరించాడు. కింగ్ ఎంట్రీతో యశస్వి జైశ్వాల్పై వేటు పడే ఛాన్స్ ఉంది. రెండో వన్డేకు భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్చదవండి: SL vs AUS: సూపర్ మేన్ స్మిత్.. ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్! వీడియో వైరల్ -
పూరీ జగన్నాథుడిని దర్శించుకున్న భారత క్రికెటర్లు! వీడియో వైరల్
కటక్ వేదికగా ఇంగ్లండ్తో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఆదివారం(ఫిబ్రవరి 9) మధ్యహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి వన్డేలో పర్యాటక ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్.. రెండో వన్డేలోనూ అదే జోరును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే కటక్కు చేరుకున్న ఇరు జట్లు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్లో నిలబడాలని ఇంగ్లండ్ భావిస్తోంది.జగన్నాథుడిని దర్శించుకున్న భారత క్రికెటర్లు..ఈ క్రమంలో భారత క్రికెటర్లు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ పూరి జగన్నాథ స్వామిని దర్శించుకున్నారు. పోలీసులు భారీ భద్రత మధ్య భారత క్రికెటర్లను ఆలయంలోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన వీరికి అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.రోహిత్ ఫామ్ను అందుకుంటాడా?ఇక ఇది ఇలా ఉండగా.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన కనబరిచిన రోహిత్.. ఇప్పుడు ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో కూడా అదే తీరును కనబరిచాడు. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో హిట్మ్యాన్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఒకప్పుడు షార్ట్ పిచ్ బంతులను అలోవకగా సిక్సర్లగా మలిచిన రోహిత్.. ఇప్పుడు అదే బంతులకు తన వికెట్ను సమర్పించుకుంటున్నాడు. కనీసం రెండో వన్డేతోనైనా రోహిత్ తన ఫామ్లను అందుకోవాలని భావిస్తున్నారు.విరాట్ కోహ్లి ఇన్..!ఇక తొలి వన్డేకు గాయం కారంణంగా దూరమైన టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తిరిగి తన ఫిట్నెస్ను సాధించాడు. దీంతో అతడు రెండో వన్డేలో జట్టు సెలక్షన్కు అందుబాటులో ఉండనున్నాడు. కింగ్ కోహ్లి జట్టులోకి వస్తే.. ఓపెనర్ యశస్వి జైశ్వాల్పై వేటు పడే అవకాశముంది.నాగ్పూర్ వన్డేతో అరంగేట్రం చేసిన జైశ్వాల్ కేవలం 13 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. రెండో వన్డేలో భారత ఇన్నింగ్స్ను రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ డౌన్లో కోహ్లి బ్యాటింగ్కు రానున్నాడు.చదవండి: నాయకుడే ఇలా ఉంటే ఎలా?: రోహిత్పై కపిల్ దేవ్ వ్యాఖ్యలు Odisha: Indian cricket team players visited the Jagannath Temple in Puri to seek blessings pic.twitter.com/fXtNjbJSuP— IANS (@ians_india) February 8, 2025 -
శుబ్మన్ గిల్ కాదు.. ఫ్యూచర్ టీమిండియా కెప్టెన్ అతడే?!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం భారత క్రికెట్ జట్టు తమ సన్నాహాకాలను ప్రారంభించింది. ఈ మెగా టోర్నీ ప్రిపేరేషన్లో భాగంగా టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్లో తలపడుతోంది. ఇప్పటికే తొలి వన్డేలో పర్యాటక ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్.. మిగిలిన రెండు వన్డేలకు సిద్దమవుతోంది.ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఫిబ్రవరి 15న రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలోని భారత జట్టు దుబాయ్ పయనం కానుంది. ఈ మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తలపడనుంది. ఈ మ్యాచ్ కంటే ముందు టీమిండియా.. యూఏఈ లేదా బంగ్లాదేశ్తో వామాప్ మ్యాచ్ ఆడనుంది. కాగా ఈ మెగా ఈవెంట్ కోసం 15 మంది సభ్యులతో కూడిన పటిష్టమైన జట్టును అజిత్ అగర్కార్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అయితే వెన్ను గాయంతో బాధపడుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటుపై మాత్రం ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది.కెప్టెన్గా హార్దిక్..!ఇక ఇది ఇలా ఉండగా.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడంలో భారత్ విఫలమైతే రోహిత్ శర్మ స్ధానంలో వన్డే కెప్టెన్గా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం వన్డేల్లో రోహిత్ శర్మ డిప్యూటీగా స్టార్ ప్లేయర్ శుబ్మన్ గిల్(Shubman Gill) ఉన్నాడు. అయితే గిల్ను వైస్ కెప్టెన్గానే కొనసాగించి జట్టు పగ్గాలను మాత్రం హార్దిక్కు అప్పగించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. కాగా గతేడాది వరకు టీ20ల్లో టీమిండియా వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా కొనసాగాడు.రోహిత్ శర్మ గైర్హజారీలో చాలా మ్యాచ్ల్లో భారత కెప్టెన్గా పాండ్యా వ్యవహరించాడు. టీ20 వరల్డ్కప్-2024లో కూడా రోహిత్ శర్మ డిప్యూటీగా ఈ బరోడా ఆల్రౌండర్ ఉన్నాడు. కానీ రోహిత్ శర్మ రిటైరయ్యాక భారత టీ20 కెప్టెన్గా హార్దిక్ను కాదని సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేసి సెలక్షన్ కమిటీ అందరికి షాకిచ్చింది. అయితే సూర్య కెప్టెన్గా రాణిస్తున్నప్పటికి వ్యక్తిగత ప్రదర్శన పరంగా మాత్రం విఫలమవుతున్నాడు.రోహిత్ రిటైర్మెంట్..!కాగా ఈ మెగా టోర్నీ అనంతరం రోహిత్ శర్మ కూడా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్తలపై రోహిత్ శర్మ మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇంగ్లండ్తో తొలి వన్డేకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో రోహిత్కు ఇదే ప్రశ్న ఎదురైంది. "నా ప్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడటానికి ఇది సందర్భం కాదు. ప్రస్తుతం నా దృష్టి అంతా ఇంగ్లండ్ సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ పైనే ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం" అంటూ హిట్మ్యాన్ బదులిచ్చాడు. దీంతో రిటైర్మెంట్ పై క్లారిటీ ఇవ్వకుండా దాటవేసేలా రోహిత్ మాట్లాడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. రోహిత్ భవితవ్యం తేలాలంటే మరో నెల రోజులు అగాల్సిందే.చదవండి: IND vs ENG: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు.. -
'శుబ్మన్ గిల్ కూడా అలాంటివాడే.. అతడికి తిరుగు లేదు'
నాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్(England)తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్(Shubman Gill) అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 249 పరుగుల లక్ష్య చేధనలో గిల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో మూడో స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన గిల్ తొలుత ఆచితూచి ఆడాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ బౌలర్లను ఊతికారేశాడు. శ్రేయస్ అయ్యర్తో కలిసి భారత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 96 బంతుల్లో 87 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో శుబ్మన్ గిల్పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్ ఒక అద్బుతమైన ఆటగాడని, చాలా కాలం పాటు భారత క్రికెట్ జట్టులో కొనసాగుతాడని మంజ్రేకర్ కొనియాడాడు."భారత క్రికెట్లో ఎక్కువ కాలం కొనసాగగల క్రికెటర్లకు మేము ఓ పదాన్ని ఉపయోగిస్తాం. ‘లంబీ రేస్ కా ఘోడా’(సుదీర్ఘ దూరం పరిగెత్తగల గుర్రం). శుబ్మన్ గిల్ కూడా అలాంటివాడే! అంటూ ఎక్స్లో మంజ్రేకర్ రాసుకొచ్చాడు.ఓపెనింగ్ స్లాట్ త్యాగం..కాగా ఈ మ్యాచ్లో అరంగేట్ర ఆటగాడు యశస్వి జైశ్వాల్ కోసం గిల్ తన ఓపెనింగ్ స్ధానాన్ని త్యాగం చేశాడు. విరాట్ కోహ్లి జట్టులో లేకపోవడంతో మూడో స్ధానంలో గిల్ బ్యాటింగ్కు వచ్చాడు. తన బ్యాటింగ్ పొజిషేన్ అది కానప్పటికి గిల్ మాత్రం ప్రశాంతంగా ఉండి క్రీజులో ఇన్నింగ్స్ను ముందుకు నడ్పించాడు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్తో కలిసి విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ఒకవేళ రెండో వన్డేకు విరాట్ కోహ్లి అందుబాటులోకి వస్తే.. గిల్ మళ్లీ ఓపెనర్గానే బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.ఇక ఈ మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్పై గిల్ స్పందించాడు. "వైస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక నాపై ఎటువంటి ఒత్తిడి లేదు. నా బ్యాటింగ్లో కూడా ఎటువంటి మార్పు రాదు. కానీ మైదానంలో నా ఆలోచనలను రోహిత్ భాయ్కు షేర్ చేస్తాను. అదే విధంగా రోహిత్ ప్రణాళకలను కూడా నేను అడిగి తెలుసుకుంటాను.నా వ్యూహాలను కూడా అతడితో పంచుకుంటున్నాను. మ్యాచ్ గురించి ఏదైనా సలహా ఇవ్వాలనకుంటే, సంకోచించకుండా తనతో చెప్పమని రోహిత్ నాతో అన్నాడని" పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్లో గిల్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: కింగ్ వచ్చేస్తున్నాడు.. పాపం అతడు! ఒక్క మ్యాచ్కే వేటు -
కింగ్ వచ్చేస్తున్నాడు.. పాపం అతడు! ఒక్క మ్యాచ్కే వేటు
నాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్(England)తో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్కు గాయం కారణంగా దూరమైన భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat kohli).. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. తొలి వన్డేకు ముందు నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా కోహ్లి కూడి కాలి మోకాలికి గాయమైంది.దీంతో నాగ్పూర్ వన్డేకు అతడు దూరంగా ఉన్నాడు. అయితే కోహ్లి ఇప్పుడు గాయం నుంచి కోలుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు సమాచారం. దీంతో ఫిబ్రవరి 8న కటక్ వేదికగా జరగనున్న రెండో వన్డేకు అందుబాటులో ఉండనున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. "బుధవారం ప్రాక్టీస్ సందర్భంగా విరాట్ కోహ్లి కుడి కాలి మోకాలికి బంతి తాకింది. అయినప్పటికి అతడు తన ప్రాక్టీస్ను కొనసాగించాడు. ప్రాక్టీస్ సమయంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదు. కానీ శిక్షణ తర్వాత హూటల్కు వెళ్లాక అతడి మోకాలిలో వాపు కన్పించింది. దీంతో ముందు జాగ్రత్తగా అతడికి విశ్రాంతిని ఇచ్చాము. విరాట్ ప్రస్తుతం బాగానే ఉన్నాడు. అతడు కటక్ వన్డేలో ఆడే అవకాశం ఉందని" బీసీసీఐ అధికారి ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు.అదేవిధంగా కోహ్లి గాయంపై టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ సైతం అప్డేట్ ఇచ్చాడు. "విరాట్ భాయ్ గాయంపై ఎటువంటి ఆందోళన అవసరం లేదు. మా తర్వాతి గేమ్కు అతడు కచ్చితంగా అందుబాటులో ఉంటాడని" తొలి వన్డే అనంతరం గిల్ పేర్కొన్నాడు.జైశ్వాల్పై వేటు..ఇక విరాట్ కోహ్లి రెండో వన్డేకు అందుబాటులోకి వస్తే యువ ఆటగాడు యశస్వి జైశ్వాల్పై వేటు పడే అవకాశముంది. నాగ్పూర్ వన్డేతో అరంగేట్రం చేసిన జైశూ.. కేవలం 13 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో అతడిని పక్కన పెట్టి శుబ్మన్ గిల్ను యథావిధిగా ఓపెనర్గా పంపాలని టీమ్ మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వరుసగా మూడు, నాలుగు స్ధానాల్లో విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్కు వచ్చే ఛాన్స్ ఉంది.సచిన్ రికార్డుకు చేరువలో కోహ్లి..ఇక ఈ మ్యాచ్కు ముందు విరాట్ కోహ్లికి ఓ ప్రపంచరికార్డు ఊరిస్తోంది. కటక్ వన్డేలో కోహ్లి మరో 96 రన్స్ చేస్తే.. అత్యంతవేగంగా వన్డేల్లో 14,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా విరాట్ రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ తన 350వ వన్డే ఇన్నింగ్స్లో పాకిస్తాన్పై ఈ ఫీట్ను అందుకున్నాడు. కోహ్లి విషయానికి వస్తే.. 283 వన్డే ఇన్నింగ్స్లలో 58.18 సగటుతో 13906 పరుగులు చేశాడు.చదవండి: IND vs ENG: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు.. -
శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు..
నాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సత్తాచాటాడు. ఆరు నెలల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన అయ్యర్.. తన మెరుపు హాఫ్ సెంచరీతో అందరిని ఆకట్టుకున్నాడు. 249 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే యశస్వి జైశ్వాల్(15), రోహిత్ శర్మ(2) వికెట్లను కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన అయ్యర్ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. శుబ్మన్ గిల్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో అయ్యర్ 30 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్గా 36 బంతులు ఎదుర్కొన్న శ్రేయస్.. 9 ఫోర్లు, 2 సిక్స్లతో 59 పరుగులు చేసి ఔటయ్యాడు.అయ్యర్ అరుదైన ఫీట్..కాగా ఈ మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే క్రికెట్లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్ వచ్చి 50 కంటే ఎక్కువ సగటు, 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో వెయ్యికి పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా అయ్యర్ రికార్డులకెక్కాడు.ఇప్పటివరకు వరల్డ్ క్రికెట్లో నాలుగో స్దానంలో బ్యాటింగ్కు వచ్చిన ఎవరూ ఈ ఫీట్ సాధించలేదు. కానీ వేరే పొజిషేన్లో బ్యాటింగ్కు వచ్చి మాత్రం ఈ రికార్డును పలువురు సాధించారు. దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ క్వింటన్ డికాక్ ఓపెనర్గా, శుబ్మన్ గిల్(రెండో స్ధానం), ఏబీ డివిలియర్స్(ఐదో స్ధానం) ఈ ఘనతను సాధించారు.ఇంగ్లండ్ చిత్తు..ఇక ఈ మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను భారత్ చిత్తు చేసింది. ఇంగ్లండ్ నిర్ధేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 6 వికెట్లు కోల్పోయి కేవలం 38.4 ఓవర్లలోనే అందుకుంది. భారత బ్యాటర్లలో శుబ్మన్ గిల్(87), శ్రేయస్ అయ్యర్(59), అక్షర్ పటేల్(52) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సకీబ్ మహుమూద్, అదిల్ రషీద్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన 47.4 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్ (67 బంతుల్లో 52; 4 ఫోర్లు), జాకబ్ బెతెల్ (64 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేయగా...ఫిల్ సాల్ట్ (26 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్స్లు), డకెట్(32) దాటిగా ఆడారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా తలా మూడేసి వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే కటక్ వేదికగా ఫిబ్రవరి 9న జరగనుంది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన హర్షిత్ రాణా.. తొలి భారత ప్లేయర్గా -
చాలా సంతోషంగా ఉంది.. వారి వల్లే గెలిచాము: రోహిత్ శర్మ
ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా(Teamindia) అద్భుతమైన విజయంతో ఆరంభించింది. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్(England)ను భారత్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్(67 బంతుల్లో 4 ఫోర్లతో 52), జాకోబ్ బెతెల్(64 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 51) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలా మూడు వికెట్లు పడగొట్టగా.. మహమ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ సాధించారు.గిల్, అయ్యర్ మెరుపులు..అనంతరం 249 పరుగుల లక్ష్యాన్ని భారత్ 6 వికెట్లు కోల్పోయి కేవలం 38.4 ఓవర్లలోనే అందుకుంది. భారత బ్యాటర్లలో భ్మన్ గిల్(96 బంతుల్లో 14 ఫోర్లతో 87 ), అక్షర్ పటేల్(47 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 52 ) శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు.ఆదిలోనే కెప్టెన్ రోహిత్ శర్మ(2),యశస్వి జైస్వాల్(15) వికెట్లను భారత్ కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అయ్యర్.. ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. గిల్ ఓవైపు ఆచితూచి ఆడినప్పటికి.. అయ్యర్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. శ్రేయస్ ఔటైన తర్వాత గిల్ కూడా తన బ్యాట్కు పనిచెప్పాడు. అతడితో పాటు బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన అక్షర్ పటేల్ సైతం దూకుడుగా ఆడాడు. ఆఖరిలో రవీంద్ర జడేజా(12),హార్దిక్ పాండ్యా(9) ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) స్పందించాడు. ఈ మ్యాచ్లో తమ కుర్రాళ్ల ప్రదర్శనపై హిట్మ్యాన్ సంతోషం వ్యక్తం చేశాడు."తొలి మ్యాచ్లోనే విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత మేము ఈ ఫార్మాట్లో ఆడాము. వీలైనంత త్వరగా తిరిగి రీగ్రూప్ అయ్యి విజయం కోసం ఏమి చేయాలన్నదానిపై దృష్టి పెట్టాలనుకున్నాము. మా అంచనాలకు తగ్గట్టుగానే ఈ మ్యాచ్లో మేము రాణించాము. అయితే ఇంగ్లండ్ ఓపెనర్లు ఆరంభంలో దూకుడుగా ఆడి మాపై ఒత్తిడి పెంచారు. కానీ మా బౌలర్లు అద్బుతమైన కమ్బ్యాక్ ఇచ్చారు. ఇది సుదీర్ఘమైన ఫార్మాట్. ఈ ఫార్మాట్లో తిరిగి పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతీ మ్యాచ్లోనూ మలుపులు ఉంటాయి. అంతేతప్ప మ్యాచ్ మన చేతి నుంచి చేజారిపోయిందని కాదు. తిరిగి కమ్బ్యాక్ ఇచ్చే స్కిల్స్ మన వద్ద ఉండాలి. ఈ క్రెడిట్ మొత్తం మా బౌలర్లకే దక్కుతుంది. నిజంగా వారి వల్లే తిరిగి గేమ్లోకి వచ్చాము. మిడిలార్డర్లో లెఫ్ట్ హ్యాండర్ ఉండాలని భావించాము. అందుకే అక్షర్ పటేల్కు తుది జట్టులో ఛాన్స్ ఇచ్చాము.అక్షర్ పటేల్ బ్యాట్తో ఏమి చేయగలడో మనందరికి తెలిసిందే. అతడు తానెంటో మరోసారి నిరూపించాడు. శ్రేయస్ అయ్యర్ సైతం అద్భుతంగా ఆడాడు. గిల్, అయ్యర్ నెలకొల్పిన భాగస్వామ్యం చాలా కీలకంగా మారింది. ఛాపింయన్స్ ట్రోఫీ ముందు మాకు ఎటువంటి ప్రత్యేక ప్రణాళికలు లేవు. అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించి ముందుకు వెళ్లాలి అనుకుంటున్నామని" పోస్ట్ మ్యాచ్ప్రెజెంటేషన్లో రోహిత్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన హర్షిత్ రాణా.. తొలి భారత ప్లేయర్గా -
చరిత్ర సృష్టించిన హర్షిత్ రాణా.. తొలి భారత ప్లేయర్గా
నాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్ నిర్ధేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 6 వికెట్లు కోల్పోయి కేవలం 38.4 ఓవర్లలోనే అందుకుంది. భారత బ్యాటర్లలో భ్మన్ గిల్(96 బంతుల్లో 14 ఫోర్లతో 87 ), అక్షర్ పటేల్(47 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 52 ) శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 59) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సకీబ్ మహమూద్, రషీద్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. బెతల్, అర్చర్ చెరో వికెట్ను సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటైంది.కెప్టెన్ జోస్ బట్లర్ (67 బంతుల్లో 52; 4 ఫోర్లు), జాకబ్ బెతెల్ (64 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేయగా...ఫిల్ సాల్ట్ (26 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్స్లు), డకెట్(32) దూకుడగా ఆడారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా చెరో 3 వికెట్లు పడగొట్టారు. వీరిద్దరితో పాటు షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలా వికెట్ సాధించారు.చరిత్ర సృష్టించిన రాణా..ఇక ఈ మ్యాచ్తో భారత తరపున వన్డే అరంగేట్రం చేసిన యువ పేసర్ హర్షిత్ రాణా(Harshit Rana) పర్వాలేదన్పించాడు. అయితే తన మొదటి మూడు ఓవర్లలో మాత్రం రాణా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. రాణాను ఇంగ్లీష్ జట్టు ఓపెనర్లు ఫిల్ సాల్ట్, బెన్ డకెట్ ఊతికారేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఐదువ ఓవర్ వేసిన రాణా.. ఏకంగా 26 పరుగులు ఇచ్చాడు.కానీ ఆ తర్వాత మాత్రం ఈ కేకేఆర్ స్పీడ్ స్టార్ అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చాడు. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్లు బెన్ డకెట్, హ్యారీ బ్రూక్లను ఒకే ఓవర్లో పెవిలియన్కు పంపి తిరిగి భారత్ను గేమ్లోకి తీసుకొచ్చాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 7 ఓవర్లు బౌలింగ్ చేసిన రాణా.. 53 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు. ఈ క్రమంలో రాణా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. మూడు ఫార్మాట్లలో అరంగేట్రంలోనే మూడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన తొలి భారత ప్లేయర్గా రాణా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాలేదు. కాగా రాణా తన టీ20 అరంగేట్రం కూడా ఇంగ్లండ్పైనే చేశాడు. పుణే వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టీ20లో రాణా మూడు వికెట్లతో సత్తాచాటాడు. అంతకుముందు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై తన టెస్టు అరంగేట్రం చేశాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో రాణా 48 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఈ అరుదైన ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే రాణా ఓ చెత్త రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే అరంగేట్రంలో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న తొలి భారత బౌలర్గా రాణా నిలిచాడు. ఈ మ్యాచ్లో రాణా ఒకే ఓవర్లో ఏకంగా 26 పరుగులిచ్చాడు.చదవండి: శుబ్మన్, శ్రేయస్ సత్తా చాటగా... -
IND VS ENG 1st ODI: చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా
టీమిండియా (Team India) లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అంతర్జాతీయ క్రికెట్లో ఓ అరుదైన మైలురాయిని తాకాడు. నాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్తో (England) జరుగుతున్న తొలి వన్డేలో మూడు వికెట్లు తీసిన జడేజా.. అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. జడ్డూకు ముందు అనిల్ కుంబ్లే (953), రవిచంద్రన్ అశ్విన్ (765), హర్భజన్ సింగ్ (707), కపిల్ దేవ్ (687) మాత్రమే 600 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టారు. భారత్ తరఫున 600 వికెట్లు పడగొట్టిన తొలి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జడేజానే.ఏకైక భారత స్పిన్నర్ఈ ఘనత సాధించిన అనంతరం జడేజా మరో భారీ రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లతో పాటు 6000 పరుగులు చేసిన ఏకైక భారత స్పిన్నర్గా రికార్డు నెలకొల్పాడు. తాజా ప్రదర్శనతో జడ్డూ.. ఇంగ్లండ్పై వన్డేల్లో అత్యధిక వికెట్లు (43) సాధించిన బౌలర్గానూ రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్కు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ పేరిట ఉండేది. ఆండర్సన్ భారత్తో జరిగిన వన్డేల్లో 40 వికెట్లు తీశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు (198 మ్యాచ్ల్లో 223 వికెట్లు) తీసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ల జాబితాలో జడ్డూ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో లంక దిగ్గజం సనత్ జయసూర్య (445 మ్యాచ్ల్లో 323 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. షకీబ్ అల్ హసన్ (247 మ్యాచ్ల్లో 317), డేనియల్ వెటోరీ (295 మ్యాచ్ల్లో 305) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలి వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 248 పరుగులకే ఆలౌటైంది. రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ను చావుదెబ్బ కొట్టారు. షమీ, అక్షర్, కుల్దీప్ తలో వికెట్ తీశారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (52), జేకబ్ బేతెల్ (51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (32), ఫిలిప్ సాల్ట్ (43) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రూట్ 19, బ్రూక్ 0, లివింగ్స్టోన్ 5, కార్స్ 10, ఆదిల్ రషీద్ 8, సాకిబ్ మహమూద్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. -
జైశ్వాల్ కళ్లు చెదిరే క్యాచ్.. ఇంగ్లండ్ బ్యాటర్కు మైండ్ బ్లాంక్! వీడియో
నాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా అరంగేట్ర ఆటగాడు యశస్వి జైశ్వాల్(Yashasvi Jaiswal) సంచలన క్యాచ్తో మెరిశాడు. జైశూ అద్బుతమైన క్యాచ్తో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ను పెవిలియన్కు పంపాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పదో ఓవర్ వేసిన హర్షిత్ రాణా.. మూడో బంతిని బెన్ డకెట్కు షార్ట్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. డకెట్ పుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు.కానీ షాట్ మిస్టైమ్ కావడంతో బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని షార్ట్ మిడ్ వికెట్ దిశగా గాల్లోకి లేచింది. ఈ క్రమంలో మిడ్ వికెట్లో ఉన్న జైశ్వాల్ పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్నాడు. ఇక జైశ్వాల్ క్యాచ్ చూసిన ప్రతీ ఒక్కరూ బిత్తర పోయారు.వెంటనే సహచర ఆటగాళ్లు అతడి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. సూపర్ క్యాచ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. జైశ్వాల్తో పాటు హర్షిత్ రాణా వన్డేల్లో టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కాగా ఈ మ్యాచ్కు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి గాయం కారణంగా దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్లో కోహ్లి కూడి మోకాలికి గాయమైంది.తుది జట్లు..ఇండియా (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్(వికెట్కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(వికెట్కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జేకబ్ బేతెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్చదవండి: IND vs ENG1st Odi: ఇంగ్లండ్తో తొలి వన్డే.. భారత్కు భారీ షాక్YASHASVI JAISWAL TAKES A BLINDER ON DEBUT. 🤯- Harshit Rana has 2 early wickets. pic.twitter.com/GxnVvxDOta— Mufaddal Vohra (@mufaddal_vohra) February 6, 2025 -
ఇంగ్లండ్తో తొలి వన్డే.. భారత్కు భారీ షాక్
నాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్(England)తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat kohli) మెకాలి గాయం కారణంగా ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్లో కోహ్లికి గాయమైనట్లు టాస్ సందర్భంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.నిజంగా భారత్కు ఇది గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఛాంపియన్స్ ట్రోఫీ సన్నహాకాల్లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్తో కోహ్లి తన ఫామ్ను అందుకుంటాడని అంతా భావించారు. కానీ గాయం కారణంగా విరాట్కే బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది.అతడి స్దానంలో యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ వన్డేల్లో భారత తరపున అరంగేట్రం చేశాడు. జైశ్వాల్తో పాటు యువ పేసర్ హర్షిత్ రాణా వన్డేల్లోకి అడుగుపెట్టాడు. మహ్మద్ షమీతో పాటు కొత్త బంతిని రాణా పంచుకోనున్నాడు. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.సచిన్ రికార్డుపై కన్ను..కాగా విరాట్ కోహ్లి.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ వరల్డ్ రికార్డుకు చేరువలో ఉన్నాడు. కోహ్లి మరో 96 రన్స్ చేస్తే.. అత్యంతవేగంగా వన్డేల్లో 14,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా విరాట్ రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ తన 350వ వన్డే ఇన్నింగ్స్లో పాకిస్తాన్పై ఈ ఫీట్ను అందుకున్నాడు. కోహ్లి విషయానికి వస్తే.. 283 వన్డే ఇన్నింగ్స్లలో 58.18 సగటుతో 13906 పరుగులు చేశాడు. ఒకవేళ నాగ్పూర్ వన్డేలో కోహ్లి ఆడి ఉంటే సచిన్ రికార్డు బద్దులయ్యే అవకాశముండేంది.తుది జట్లు..ఇండియా (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్(వికెట్కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(వికెట్కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జేకబ్ బేతెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్చదవండి: Ind vs Eng 1st ODI: కోహ్లి దూరం.. జైస్వాల్తో పాటు అతడి అరంగేట్రం -
'బుమ్రా దూరమైతే అతడికి ఛాన్స్ ఇవ్వండి.. అద్భుతాలు సృష్టిస్తాడు'
టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) గాయం కారణంగా ఆటకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో గాయపడ్డ బుమ్రా.. స్వదేశంలో ఇంగ్లండ్తో టీ20, వన్డే సిరీస్లకు దూరమయ్యాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నప్పటికి అతడి ఆడేది అనుమానమే. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రీహాబిలిటేషన్లో ఉన్నాడు.కనీసం ఎంతవరకు కోలుకున్నాడనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. . ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా టీమ్ మెనెజ్మెంట్కు కీలక సూచనలు చేశాడు. బుమ్రాకు బ్యాకప్గా యవ పేసర్ హర్షిత్ రాణా(Harshit Rana)కు పరిగణలోకి తీసుకోవాలని, ఇంగ్లండ్తో జరిగే వన్డే సిరీస్లో అతడికి ఛాన్స్ ఇవ్వాలని చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు ఎంపికైన హర్షిత్ రాణా.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఇప్పటికే టీ20ల్లో అరంగేట్రం చేసిన రాణా, ఇంగ్లండ్ సిరీస్తో వన్డేల్లో కూడా అడుగుపెట్టే ఛాన్స్ ఉంది."బుమ్రా గాయంపై ఎటువంటి అప్డేట్ లేదు. పూర్తిగా ఇంగ్లండ్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అంతేకాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో మహ్మద్ సిరాజ్ కూడా లేడు. దీంతో హర్షిత్ రాణాను ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్దం చేయండి. ఇంగ్లండ్తో వన్డేల్లో అతడిని ఆడించేందుకు ప్రయత్నించండి. అదేవిధంగా అర్ష్దీప్ సింగ్ ఇప్పటివరకు కేవలం 8 వన్డేలు మాత్రమే ఆడాడు. అతడికి వన్డేల్లో ఎక్కువగా అనుభవం లేదు. మరోవైపు మహ్మద్ షమీ తన రీఎంట్రీలో అంత రిథమ్లో కన్పించడం లేదు. ఇంగ్లండ్తో ఆఖరి టీ20లో అతడు మూడు వికెట్లు పడగొట్టనప్పటికి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.ఒకవేళ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైతే భారత జట్టులో కేవలం ఇద్దరు పేసర్లు మాత్రమే మిగిలనున్నారు. ఇది జట్టుకు మంచిది కాదు. కాబట్టి బుమ్రా బ్యాకప్గా రాణాను సిద్దం చేయండి. అతడు అద్బుతాలు సృష్టిస్తాడు" అంటూ చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.కాగా రాణా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టీ20లో అరంగేట్రం చేశాడు. ఈ యువ పేసర్ శివమ్ దూబే స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబరిచాడు. తన టీ20 అరంగేట్రంలో వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. ఐపీఎల్తో పాటు దేశవాళీ క్రికెట్లో కూడా రాణాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ క్రమంలోనే రాణాను మూడవ పేసర్గా ఉపయోగించాలని చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇక ఇంగ్లండ్తో వన్డే సిరీస్ గురువారం నుంచి మొదలు కానుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి వన్డే నాగ్పూర్ వేదికగా జరగనుంది. అదేవిధంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. భారత్ తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో తలపడనుంది.జట్లుభారత్: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజాఇంగ్లండ్: హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జోరూట్, జాకోబ్ బెతెల్, లియామ్ లివింగ్స్టోన్, బ్రైడన్ కార్స్, జేమీ ఓవర్టన్, జోస్ బట్లర్, జేమీ స్మిత్, ఫిలిప్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, సకీబ్ మహ్మూద్, మార్క్ వుడ్.చదవండి: ‘చాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ కెప్టెన్సీకి నేను సిద్ధం’ -
IND vs ENG: 1 టికెట్ ప్లీజ్!
భువనేశ్వర్: కటక్ బారాబటి స్టేడియంలో ఈ నెల 9న జరగనున్న భారత్, ఇంగ్లాండ్ వన్డే క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి టికెట్ల విక్రయ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో చేరుకుని రాత్రంతా పడిగాపులు చేశారు. ఉదయం 9 గంటల నుంచి కౌంటర్లో విక్రయించే టిక్కెట్లు కోసం అర్ధరాత్రి నుంచి జనాలు చేరడంతో ఒకానొక సమయంలో తొక్కిసలాట పరిస్థితి చోటు చేసుకుంది. 4 కౌంటర్లు.. 12 వేల టికెట్లు టిక్కెట్ల విక్రయానికి 4 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు 12 వేల టికెట్లు విక్రయించారు. రద్దీ నియంత్రణ కోసం పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆన్లైన్లో టికెట్లు దక్కించుకోలేని క్రికెట్ అభిమానులు వాటిని ఆఫ్లైన్లో కొనాలని ఎగబాకడంతో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. స్పెషల్ ఎన్క్లోజర్, ఏసీ గ్యాలరీ, న్యూ పెవిలియన్, కార్పొరేట్ బాక్స్ టిక్కెట్ల గురప్రు గేట్ ప్రాంగణంలో టికెట్లు విక్రయించారు. మిగిలిన అన్ని గ్యాలరీ టికెట్లను కిల్ఖానా లేక్లోని 3 కౌంటర్లలో విక్రయానికి ఏర్పాట్లు చేశారు. తొలిసారిగా మహిళా ప్రేక్షకుల కోసం ప్రత్యేక కౌంటరు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బస్సులు.. బారాబటి స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ వన్డే మ్యాచ్ పురస్కరించుకుని కటక్ నగరంలో పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా స్టేడియం లోపల, వెలుపల గట్టి భద్రతా చర్యలు చేపడుతున్నారు. కటక్ నగర పాలక సంస్థ స్టేడియం పరిసరాల్లో సుందరీకరణ, పారిశుధ్యం, ఫాగింగ్ కార్యకలాపాలను చేపడుతోంది. ఈ మేరకు ఉన్నత స్థాయి సమావేశంలో మ్యాచ్ సన్నాహాలను సమీక్షించారు. కటక్ జిల్లా యంత్రాంగం, ఒడిశా క్రికెట్ అసోసియేషన్ (ఓసీఏ), ఒడిశా ఒలింపిక్ అసోసియేషన్, పోలీసు, ఆరోగ్య విభాగాలు, నగర పాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. -
భారత్తో వన్డే సిరీస్కు ముందు ఇంగ్లండ్కు బిగ్ షాక్
టీమిండియాతో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు వికెట్కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ తొలి రెండు మ్యాచ్లకు దూరం కానున్నాడని తెలుస్తుంది. జేమీ స్మిత్ భారత్తో ఇటీవల జరిగిన మూడో టీ20 సందర్భంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి అతను చికిత్స తీసుకుంటున్నాడు. తొలి వన్డేకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండగా.. జేమీ స్మిత్ ఇంకా కోలుకోలేదు. దీంతో అతను తొలి రెండు వన్డేలకు దూరం కానున్నాడని తెలుస్తుంది. అయితే ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. భారత్తో వన్డే సిరీస్లో స్మిత్ లేకపోయినా ఇంగ్లండ్కు మరో రెండు వికెట్కీపింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. కెప్టెన్ జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్లలో ఎవరో ఒకరు వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టవచ్చు. అయితే బట్లర్ గాయం నుంచి కోలుకున్న తర్వాత ఇప్పటివరకు వికెట్కీపింగ్ చేయలేదు. మరోవైపు సాల్ట్కు వన్డేల్లో పెద్దగా వికెట్కీపింగ్ చేసిన అనుభవం లేదు. మరి ఈ పరిస్థితుల్లో ఇంగ్లండ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందో వేచి చూడాలి.కాగా, భారత్తో తాజాగా ముగిసిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇంగ్లండ్ 1-4 తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో పరాభవం తర్వాత ఇంగ్లండ్ కోలుకోవాలని చూస్తుంది. ఫిబ్రవరి 6 నుంచి భారత్తో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఎలాగైనా కైవసం చేసుకోవాలని భావిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్కు ఇదే ఆఖరి వన్డే సిరీస్. ఈ సిరీస్లో సత్తా చాటి ఛాంపియన్స్ ట్రోఫీలోకి గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వాలని ఇంగ్లండ్ ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు ఇంగ్లండ్ వన్డే జట్టులో స్టార్ ఆటగాడు జో రూట్ చేరాడు. రూట్ చేరికతో ఇంగ్లండ్ బలం పెరుగుతుంది.ఫిబ్రవరి 6 నుంచి మొదలుభారత్తో తొలి వన్డే నాగ్పూర్ వేదికగా ఫిబ్రవరి 6న జరుగనుంది. అనంతరం ఫిబ్రవరి 9, 12 తేదీల్లో రెండు, మూడు వన్డేలు జరుగనున్నాయి. ఈ మ్యాచ్లకు కటక్, అహ్మదాబాద్ వేదికలు కానున్నాయి. ఈ మూడు మ్యాచ్లు మధ్యాహ్నం 1:30 గంటల నుంచి ప్రారంభమవుతాయి.భారత్తో వన్డే సిరీస్కు ఇంగ్లండ్ జట్టు..జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, జో రూట్, బెన్ డకెట్, జేకబ్ బేతెల్, లియామ్ లివింగ్స్టోన్, ఫిల్ సాల్ట్, జేమీ స్మిత్, బ్రైడన్ కార్స్, జేమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ -
చరిత్ర సృష్టించిన శివమ్ దూబే.. వరల్డ్లోనే తొలి ప్లేయర్గా
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టీ20లో భారత్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యచ్లో అభిషేక్ శర్మతో పాటు శివమ్ దూబే(Shivam Dube) కూడా ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు. తొలుత బ్యాటింగ్లో మెరుపు ఇన్నింగ్స్ (13 బంతుల్లో 30 పరుగులు) ఆడిన దూబే.. అనంతరం బౌలింగ్లో రెండు వికెట్లతో సత్తాచాటాడు. ఫిల్ సాల్ట్, జాకబ్ బెతల్ వంటి కీలక వికెట్లు పడగొట్టి భారత విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో దూబే ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దూబే వరల్డ్ రికార్డు..అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా 30 విజయాలు సాధించిన జట్టులో భాగమైన తొలి క్రికెటర్గా దూబే వరల్డ్ రికార్డు సృష్టించాడు. దూబేకు భారత్ తరపున ఇది వరుసగా 30వ టీ20 విజయం కావడం గమనార్హం. దూబే తన కెరీర్లో టీమిండియా తరపున ఇప్పటివరకు 35 టీ20లు ఆడాడు. 2019లో ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టీ20తో దూబే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు.ఈ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత అతడి ఐదో టీ20లో సైతం బంగ్లాదేశ్లో భారత్ ఓటమి చవిచూసింది. అప్పటి నుంచి దూబే ఆడిన ఏ టీ20 మ్యాచ్లోనూ టీమిండియా పరాజయం పాలవ్వలేదు. వరుసగా భారత్ 30 మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది.ఈ అరుదైన ఫీట్ సాధించిన దూబేకు ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ అభినందనలు తెలిపింది. "దూబే ఆడితే భారత్ గెలవాల్సిందే. దూబే ఆడిన 30 మ్యాచ్ల్లోనూ భారత్ వరుసగా విజయం సాధిచిందని సీఎస్కే ఎక్స్లో రాసుకొచ్చింది.కాగా ఇంగ్లండ్తో టీ20లకు దూబేకు తొలుత భారత జట్టులో చోటు దక్కలేదు. నితీశ్ కుమార్ రెడ్డి గాయపడడంతో దూబే జట్టులోకి వచ్చాడు. పుణే వేదికగా జరిగిన నాలుగో టీ20తో తుది జట్టులోకి వచ్చిన దూబే.. అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఆ మ్యాచ్లో కంకషన్కు గురికావడంతో బౌలింగ్ చేసే అవకాశం రాలేదు.ఆఖరి టీ20లో మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని ఈ ముంబై ఆటగాడు అందిపుచ్చుకున్నాడు. కాగా టీ20 సిరీస్ ముగియడంతో దూబే ముంబై తరపున రంజీల్లో ఆడనున్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. భారత్-ఇంగ్లండ్ మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ నాగ్పూర్ వేదికగా ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానుంది.జట్లుభారత్: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజాఇంగ్లండ్: హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జోరూట్, జాకోబ్ బెతెల్, లియామ్ లివింగ్స్టోన్, బ్రైడన్ కార్స్, జేమీ ఓవర్టన్, జోస్ బట్లర్, జేమీ స్మిత్, ఫిలిప్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, సకీబ్ మహ్మూద్, మార్క్ వుడ్.చదవండి: ఇంగ్లండ్తో తొలి వన్డే.. సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లి -
ఇంగ్లండ్తో తొలి వన్డే.. సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లి
స్వదేశంలో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇంగ్లండ్ను మట్టి కరిపించిన టీమిండియా.. ఇప్పుడు అదే జట్టుతో వన్డేల్లో తలపడేందుకు సిద్దమైంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నహాకాల్లో భాగంగా భారత జట్టు ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి వన్డే నాగ్పూర్ వేదికగా గురువారం(ఫిబ్రవరి 6) జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే నాగ్పూర్కు చేరుకున్న ఇరు జట్లు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ వన్డే సిరీస్కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులోకి తిరిగొచ్చారు. మరోవైపు ఇంగ్లండ్ జట్టులోకి సీనియర్ ఆటగాడు జో రూట్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ మ్యాచ్కు ముందు విరాట్ కోహ్లికి ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.సచిన్ రికార్డుపై కన్నేసిన కోహ్లి..నాగ్పూర్ వన్డేలో కోహ్లి మరో 96 రన్స్ చేస్తే.. అత్యంతవేగంగా వన్డేల్లో 14,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా విరాట్ రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ తన 350వ వన్డే ఇన్నింగ్స్లో పాకిస్తాన్పై ఈ ఫీట్ను అందుకున్నాడు. కోహ్లి విషయానికి వస్తే.. 283 వన్డే ఇన్నింగ్స్లలో 58.18 సగటుతో 13906 పరుగులు చేశాడు. సచిన్ తర్వాతి స్ధానంలో శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కర ఉన్నాడు. సంగ్కర 378 ఇన్నింగ్స్లలో 14,000 పరుగుల మైలు రాయిని సాధించాడు. ఈ క్రమంలో తొలి వన్డేల్లో వీరిద్దరి దిగ్గజాలను కోహ్లి అధిగమించే అవకాశముంది. కాగా వన్డే ప్రపంచకప్-2023 తర్వాత కోహ్లి కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడాడు. ఆ మూడు మ్యాచ్ల్లో 19.33 సగటుతో 58 (24, 14 మరియు 20)పరుగులు చేశాడు. అయితే కోహ్లి ప్రస్తుతం చెప్పుకొదగ్గ ఫామ్లో అయితే లేడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో తీవ్ర నిరాశపరిచిన కోహ్లి.. 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ బరిలోకి కూడా దిగాడు. అక్కడ కూడా కింగ్ కోహ్లి నిరాశపరిచాడు. కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో కనీసం ఇంగ్లండ్తో వన్డే సిరీస్తోనైనా కోహ్లి తన ఫామ్ను అందుకోవాలని అతడి అభిమానులు ఆశిస్తున్నారు.జట్లుభారత్: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజాఇంగ్లండ్: హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జోరూట్, జాకోబ్ బెతెల్, లియామ్ లివింగ్స్టోన్, బ్రైడన్ కార్స్, జేమీ ఓవర్టన్, జోస్ బట్లర్, జేమీ స్మిత్, ఫిలిప్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, సకీబ్ మహ్మూద్, మార్క్ వుడ్.చదవండి: సూర్యకుమార్.. అందుకు సమయం అసన్నమైంది: అశ్విన్ -
సూర్యకుమార్.. అందుకు సమయం అసన్నమైంది: అశ్విన్
ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్ను 4-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(suryakumar yadav) మాత్రం తన పేలవ ఫామ్తో తీవ్ర నిరాశపరిచాడు. దక్షిణాఫ్రికా సిరీస్లో విఫలమైన సూర్య.. ఇంగ్లండ్ సిరీస్లోనూ అదే తీరును కనబరిచాడు.ఐదు మ్యాచ్ల్లో మిస్టర్ 360 కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. అతడి చివరి ఐదు ఇన్నింగ్స్లో రెండు డకౌట్లు కూడా ఉండటం గమనార్హం. కెప్టెన్సీ పరంగా ఆకట్టుకుంటున్నప్పటికి.. వ్యక్తిగత ప్రదర్శన పరంగా పూర్తిగా ఈ ముంబైకర్ తేలిపోతున్నాడు. తన ఫేవరేట్ షాట్ల ఆడటంలో కూడా సూర్య విఫలమవుతున్నాడు.ఈ సిరీస్లో అన్ని మ్యాచ్ల్లోనూ సూర్య ఒకేలా ఔటయ్యాడు. దీంతో అతడిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ది కూడా ఇదే పరిస్థితి. దక్షిణాఫ్రికా సిరీస్లో వరుస సెంచరీలతో చెలరేగిన శాంసన్.. ఇంగ్లండ్పై మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఈ సిరీస్లో శాంసన్ కేవలం 51 పరుగులు (26,5,3,1,16) మాత్రమే చేశాడు. సంజూ షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో చాలా ఇబ్బంది పడ్డాడు. తొలి మూడు మ్యాచ్ల్లో జోఫ్రా అర్చర్ చేతికే సంజూ చిక్కాడు. అయితే ఆఖరి టీ20లో శాంసన్ చేతి వేలికి గాయం కావడంతో ఆరు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. అతడు తిరిగి మళ్లీ ఐపీఎల్-2025తో మైదానంలో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్, సంజూను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ తన బ్యాటింగ్ స్టైల్ను మార్చుకోవాల్సిన సమయం అసన్నమైందని అశ్విన్ అన్నాడు."సిరీస్ గెలిచినప్పటికి సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్ మాత్రం భారత్కు ప్రధాన సమస్యగా మారింది. ఈ సిరీస్లో అతడి కెప్టెన్సీ అద్భుతంగా ఉంది. అతడి కెప్టెన్సీలో ఎటువంటి లోపాలు లేవు. కానీ బ్యాటింగ్ పరంగా మెరుగ్గా రాణించాల్సిన అవసరముంది. మరోవైపు సంజూ శాంసన్ కూడా తన బ్యాటింగ్తో ఆకట్టుకోలేకపోయాడు.వీరిద్దిరూ ఒకే రకమైన బంతి, ఒకే ఫీల్డ్ పొజిషేన్లో ఔట్ అవ్వుతున్నారు. ఒకట్రెండు మ్యాచ్ల్లో ఇలా జరిగితే ఫర్వాలేదు. కానీ వీరిద్దరూ ప్రతీ మ్యాచ్లోనూ ఇదే తరహాలో తమ వికెట్లను కోల్పోతున్నారు. ఆటగాళ్లు స్వేఛ్చతో ఆడాలన్న విషయంతో నేను కూడా ఏకీభవిస్తాను. కానీ ఒకే తరహాలో ఔట్ అవుతున్నప్పుడు దానికి కొత్త సమాధానం కనుగొనాల్సిన బాధ్యత మీపై ఉంది. సూర్యకుమార్ యాదవ్ చాలా అనుభవం ఉన్న ఆటగాడు.బ్యాటింగ్లో భారత క్రికెట్ అప్రోచ్ను మార్చడంలో సూర్య భాగమయ్యాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ తన బ్యాటింగ్ విధానాన్ని కొద్దిగా మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నానని" అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: CT 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. హాట్కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు -
IND vs ENG: ఫిల్ సాల్ట్ వరల్డ్ రికార్డు..
ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్తో జరిగిన ఐదో టీ20లో 150 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పరాజయం పాలైంది. 248 పరుగుల భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం 97 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఓటమి పాలైనప్పటికి ఆ జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్ మాత్రం తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్లో మొదటి నాలుగు మ్యాచ్ల్లో విఫలమైన సాల్ట్.. ఐదో టీ20తో తన రిథమ్ను అందుకున్నాడు. భారీ లక్ష్య చేధనలో సాల్ట్ దూకుడుగా ఆడాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన మహ్మద్ షమీ బౌలింగ్లో సాల్ట్ ఏకంగా 17 పరుగులు రాబట్టి తన జట్టుకు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. కానీ సహచరుల నుంచి సపోర్ట్ లభించకపోవడంతో ఇంగ్లండ్ స్కోర్ బోర్డు మూడెంకెల మార్క్ దాటలేకపోయింది. సాల్ట్ మినహా వచ్చినవారు వచ్చినట్లగానే పెవిలియన్కు క్యూ కట్టారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, దూబే, అభిషేక్ శర్మ తలా రెండు వికెట్లు సాధించారు. ఈ మ్యాచ్లో కేవలం 23 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సాల్ట్.. 7 ఫోర్లు, 3 సిక్స్లతో 55 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో సాల్ట్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.సాల్ట్ అరుదైన ఘనత..అంతర్జాతీయ టీ20ల్లో ఒక ఇన్నింగ్స్లోని మొదటి బంతికే అత్యధిక సార్లు ఫోర్ కొట్టిన తొలి ఆటగాడిగా సాల్ట్ నిలిచాడు. ఇప్పటివరకు సాల్ట్ 37 సార్లు ఇన్నింగ్స్లోని తొలి బంతినే ఫోర్గా మలిచాడు. ప్రపంచంలోనే ఏ బ్యాటరూ ఈ ఫీట్ సాధించలేదు. ఓవరాల్గా సాల్ట్ తన కెరీర్లో ఇప్పటివరకు 43 టీ20లు ఆడి 1193 పరుగులు చేశాడు. ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున సాల్ట్ ఆడనున్నాడు.అభిషేక్ శర్మ విధ్వంసం..ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 37 బంతుల్లోనే తన రెండో టీ20 సెంచరీ మార్క్ను అందుకున్నాడు. వాంఖడేను అభిషేక్ తన బ్యాట్తో షేక్ చేశాడు. మార్క్ వుడ్, అర్చర్ వంటి ఫాస్ట్ బౌలర్లను సైతం ఈ పంజాబీ బ్యాటర్ ఓ ఆట ఆడేసికున్నాడు. ఓవరాల్గా 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్స్ లతో 135 పరుగులు చేసి ఔటయ్యాడు. అటు బౌలింగ్లోనూ రెండు వికెట్లతో అభిషేక్ సత్తాచాటాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
'నేను చూసిన బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే'.. అభిషేక్పై బట్లర్ ప్రశంసల జల్లు
టీమిండియాతో ఐదు టీ20ల సిరీస్ను ఇంగ్లండ్ ఘోర పరాభావంతో ముగించింది. ముంబై వేదికగా భారత్తో జరిగిన ఐదో టీ20లో 150 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్లో బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ ఇంగ్లండ్ తేలిపోయింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోర్ చేసింది.భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ( 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్స్ లతో 135) మెరుపు సెంచరీతో చెలరేగగా.. శివమ్ దూబే(30), తిలక్ వర్మ(24) పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 97 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లతో సత్తాచాటగా.. వరుణ్ చక్రవర్తి, దూబే, అభిషేక్ శర్మ తలా రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్(55) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్(Jos Buttler) స్పందించాడు. అద్బుత ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ(Abhishek Sharma)పై బట్లర్ సైతం ప్రశంసల వర్షం కురిపించాడు."ఈ సిరీస్ను కోల్పోవడం మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. . కానీ కొన్ని విభాగాల్లో మాత్రం మేము మెరుగ్గానే రాణించాము. ఈ ఓటమి నుంచి కచ్చితంగా కొన్ని పాఠాలు నేర్చుకుంటాము. స్వదేశంలో భారత జట్టుకు తిరుగులేదు. వారిని ఓడించడం అంత సులువు కాదు. ఈ సిరీస్లో మా బౌలర్లు బాగానే రాణించారు. ఆఖరికి ఈ హైస్కోరింగ్ మ్యాచ్లో కూడా బ్రైడన్ కార్స్, మార్క్ వుడ్ అద్బుతంగా రాణించారు. ఇక అభిషేక్ శర్మ గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. నేను ఇప్పటివరకు నా కెరీర్లో ఎంతో క్రికెట్ చూశాను. కానీ టీ20ల్లో అభిషేక్ శర్మ లాంటి విధ్వంసకర ఇన్నింగ్స్ను చూడడం ఇదే తొలిసారి. ఇక మా జట్టులోకి జో రూట్ తిరిగొచ్చాడు. అతడు ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. వన్డే సిరీస్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాము. టీ20 సిరీస్ తరహాలోనే ఇది కూడా హోరా హోరీగా సాగుతోంది" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్లో బట్లర్ పేర్కొన్నాడు. కాగా ఫిబ్రవరి 6 నుంచి నాగ్పూర్ వేదికగా ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. మరోవైపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, జైశ్వాల్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ ఇంగ్లండ్తో వన్డేలకు బరిలోకి దిగనున్నారు.ఇంగ్లండ్తో మూడు వన్డేలకు భారత జట్టురోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా.భారత్తో వన్డేలకు ఇంగ్లండ్ జట్టుజోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
ఎప్పటినుంచో కలలు కంటున్నా.. గర్వంగా ఉంది అభిషేక్: యువీ
ముంబై వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టీమిండియా 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు. తొలుత బ్యాటింగ్లో అద్బుతమైన సెంచరీతో చెలరేగిన అభిషేక్.. అనంతరం బౌలింగ్లోనూ రెండు వికెట్లతో సత్తాచాటాడు.అభిషేక్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఇంగ్లండ్ బౌలర్లను ఊతికారేశాడు. వాంఖడే స్టేడియంలో సిక్సర్ల వర్షం కుర్పించాడు. అతడి ఆపడం ప్రత్యర్ధి బౌలర్ల తరం కాలేదు. ఈ క్రమంలో కేవలం 37 బంతుల్లోనే తన రెండో టీ20 సెంచరీ మార్క్ను అందుకున్నాడు. భారత తరపున టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా అభి నిలిచాడు. ఓవరాల్గా 54 బంతులు ఎదుర్కొన్న శర్మ.. 7 ఫోర్లు, 13 సిక్స్ లతో 135 పరుగులు చేశాడు. తద్వారా టీ20ల్లో భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇక సంచలన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మపై తన మెంటార్, భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్(Yuvraj Singh) ప్రశంసల వర్షం కుర్పించాడు. "బాగా ఆడావు అభిషేక్ శర్మ! నిన్ను ఈ స్ధాయిలో చూడాలని ఎప్పటినుంచో కలలు కంటున్నాను! ఈ రోజు నాకు చాలా గర్వంగా ఉందంటూ" యువీ ఎక్స్లో రాసుకొచ్చాడు.యువీ మెంటార్గా..కాగా అభిషేక్ శర్మ కెరీర్ ఎదుగుదలలో యువరాజ్ది కీలక పాత్ర. అతడి గైడెన్స్లోనే అభిషేక్ ఇంతలా రాటు దేలాడు. ఈ పంజాబీ బ్యాటర్కు యువీ దగ్గరుండి మరి మెళకువలు నేర్పాడు. కొవిడ్-19 సమయంలో యువరాజ్.. అభిషేక్తో ఇతర పంజాబ్ యువ క్రికెటర్లు ప్రభ్సిమ్రాన్ సింగ్, అన్మోల్ప్రీత్ సింగ్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాడు. అప్పటి నుంచి యువీతో అభిషేక్ నిరంతరం టచ్లో ఉంటున్నాడు. అభిషేక్ తన నెట్ ప్రాక్టీస్ వీడియోలను ఎప్పటికప్పుడు యువీకి షేర్ చేస్తూ ఉంటాడు. అతడి బ్యాటింగ్ టెక్నిక్లో ఏదైనా సమస్య ఉంటే గుర్తించి యువరాజ్ వెంటనే సరిదిద్దుకునేలా సలహాలు ఇస్తాడు. ఈ విషయాన్ని అభిషేక్ చాలా సందర్బాల్లో స్వయంగా వెల్లడించాడు.అయితే, బాగా ఆడినప్పుడు ప్రశంసించడమే కాదు.. అనవసర తప్పిదాలు చేసినపుడు కాస్త ఘాటుగానే యువీ విమర్శస్తుంటాడు. కాగా 'ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్' అభిషేక్ శర్మ తన మెరుపు సెంచరీపై మ్యాచ్ అనంతరం స్పందించాడు. తన ఇన్నింగ్స్తో మెంటార్ యువరాజ్ సింగ్ సంతోషించంటాడని అభి చెప్పుకొచ్చాడు.వారిద్దిరి కోరిక ఇదే: అభిషేక్"ఈ సెంచరీ నాకు చాలా ప్రత్యేకమైనది. దేశం కోసం ఈ తరహా ప్రదర్శన చేయడం ఎప్పుడు గొప్ప అనుభూతిని ఇస్తుంది. నాదైనా రోజున తొలి బంతి నుంచే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తాను. మా కోచ్, కెప్టెన్ నాకు తొలి రోజు నుంచే ఎంతో సపోర్ట్గా ఉన్నారు. వారు ఎప్పుడూ నా నుంచి ఇటువంటి ప్రదర్శనే ఆశిస్తుంటారు. ప్రత్యర్థి బౌలర్లు 140-150కి.మీ కన్నా వేగంగా బౌలింగ్ చేస్తున్నప్పుడు, వాటిని ఆడేందుకు వాళ్ల కన్నా ఒక్క సెకెన్ ముందే సిద్ధంగా ఉండాలి. బంతిని సరిగ్గా అంచనా వేసి షాట్లు ఆడాను. వరల్డ్క్లాస్ బౌలర్ అర్చర్ బౌలింగ్లో కవర్స్ మీదగా కొట్టిన షాట్ నాకెంతో ప్రత్యేకం. అలాగే రషీద్ బౌలింగ్లో సిక్స్లు కొట్టడం కూడా బాగుంది. రషీద్ బౌలింగ్లో కొట్టిన స్ట్రెయిట్ డ్రైవ్.. యువీ పాజీ నుంచి నేర్చుకున్నాను.కాబట్టి యువీ ఈ రోజు సంతోషంగా ఉంటాడనుకుంటున్నా. అతను ఎప్పుడూ నేను 15 నుంచి 20 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేయాలని కోరుకునేవాడు. ఈ రోజు యువీ పాజీ కోరిక నేరవేర్చాను. గౌతీ భాయ్ కూడా ఇదే కోరుకునేవాడు. ఈ మ్యాచ్లో దానిని అమలు చేసి చూపించా అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్లో అభిషేక్ పేర్కొన్నాడు.చదవండి: వరల్డ్ రికార్డు.. వికెట్ కోల్పోకుండానే 376 కొట్టేశారు Abhishek Sharma all the shots from his spectacular innings! 🔥 pic.twitter.com/VflLAHiTRA— Keh Ke Peheno (@coolfunnytshirt) February 3, 2025 -
చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టీ20లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) విధ్వంసం సృష్టించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కళ్లు చెదిరే షాట్లతో మైదానాన్ని హోరెత్తించాడు. వాంఖడేలో సిక్సర్ల వర్షం కురిపించాడు. జోఫ్రా ఆర్చర్, మార్క్ ఉడ్ వంటి వరల్డ్క్లాస్ ఫాస్ట్ బౌలర్లను సైతం లెక్కచేయలేదు. ఈ క్రమంలో అభిషేక్ కేవలం 37 బంతల్లోనే తన రెండో టీ20 సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అంతకుముందు తన హాఫ్ సెంచరీని శర్మ కేవలం 17 బంతుల్లోనే అందుకున్నాడు.ఓవరాల్గా 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్స్ లతో 135 పరుగులు చేసి ఔటయ్యాడు. అటు బౌలింగ్లోనూ రెండు వికెట్లతో ఈ పంజాబీ క్రికెటర్ సత్తాచాటాడు. ఇక సెంచరీతో చెలరేగిన శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.అభిషేక్ సాధించిన రికార్డులు ఇవే..👉అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డులకెక్కాడు. ఈ రికార్డు ఇప్పటివరకు మరో టీమిండియా యువ ఆటగాడు శుబ్మన్ గిల్ పేరిట ఉండేది. గిల్ 2023లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో గిల్ 126 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్లో 135 పరుగులు చేసిన అభిషేక్.. గిల్ అల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.👉టీ20ల్లో భారత్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రస్దానంలో ఉన్నాడు. 2017లో శ్రీలంకపై హిట్మ్యాన్ కేవలం 35 బంతుల్లోనే శతకొట్టాడు.👉అంతర్జాతీయ టీ20 మ్యాచ్లో అత్యధిక సిక్స్లు బాదిన భారత బ్యాటర్గా అభిషేక్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండేది. 2017లో శ్రీలంకతో జరిగిన టీ20లో హిట్మ్యాన్ 10 సిక్సర్లు బాదాడు. తాజా మ్యాచ్లో 13 సిక్స్లు కొట్టిన అభిషేక్.. రోహిత్ అల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.బటీ20ల్లో ఇంగ్లండ్పై ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా అభిషేక్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ పేరిట ఉండేది. ఫించ్ ఇంగ్లండ్పై 47 బంతుల్లో సెంచరీ చేశాడు. ప్రస్తుత మ్యాచ్లో కేవలం 37 బంతుల్లోనే శతకం బాదిన శర్మ.. ఫించ్ రికార్డును బద్దలు కొట్టాడు.భారత్ విజయ భేరి..ఇక ఇంగ్లండ్తో సిరీస్ను భారత్ విజయంతో ముగించింది. ఆఖరి టీ20లో 150 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 247 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ(135)తో పాటు.. శివమ్ దూబే(30), తిలక్ వర్మ(24) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. వుడ్ రెండు, అర్చర్,రషీద్, ఓవర్టన్ తలా వికెట్ సాధించారు. అనంతరం లక్ష్య చేధనలో ఇంగ్లండ్ 97 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లతో సత్తాచాటగా.. వరుణ్ చక్రవర్తి, దూబే, అభిషేక్ శర్మ తలా రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్(55) టాప్ స్కోరర్గా నిలిచాడు. కాగా ఈ సిరీస్ను 4-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది.చదవండి: తొలి కల నెరవేరింది -
అభిషేక్ శర్మ విధ్వంసకర శతకం.. ఐదో టీ20లో టీమిండియా ఘన విజయం
స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ముంబై వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 2) జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో (54 బంతుల్లో 135; 7 ఫోర్లు, 13 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. భారత బౌలర్లు చెలరేగడంతో 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. తొలుత బ్యాట్తో విజృంభించిన అభిషేక్.. ఆతర్వాత బంతితోనూ రాణించి రెండు వికెట్లు తీశాడు. ఆల్రౌండ్ షోతో అదరగొట్టినందుకు గానూ అభిషేక్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించి 14 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు. రికార్డులు కొల్లగొట్టిన అభిషేక్ఈ మ్యాచ్లో విధ్వంసకర సెంచరీ సాధించిన అభిషేక్ పలు రికార్డులు కొల్లగొట్టాడు. టీ20ల్లో భారత్ తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ (17), రెండో వేగవంతమైన సెంచరీని (37) నమోదు చేశాడు. టీ20ల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రోహిత్ శర్మ (35 బంతుల్లో) పేరిట ఉండగా.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) పేరిట ఉంది. 17 మ్యాచ్ల టీ20 కెరీర్లో అభిషేక్కు ఇది రెండో సెంచరీ.ఈ మ్యాచ్లో అభిషేక్ సాధించిన మరిన్ని రికార్డులు..- టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక స్కోర్ (135).- టీ20లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు (13).- అభిషేక్ ధాటికి భారత్ పవర్ ప్లేల్లో అత్యధిక స్కోర్ (95/1) నమోదు చేసింది.టీ20ల్లో నాలుగో అత్యధిక స్కోర్ఈ మ్యాచ్లో భారత్ నమోదు చేసిన స్కోర్ (247/9) టీ20ల్లో నాలుగో అత్యధికం. ఈ మ్యాచ్లో భారత్ మరింత భారీ స్కోర్ సాధించాల్సింది. అభిషేక్ సెంచరీ పూర్తయ్యాక భారత్ స్కోర్ బాగా నెమ్మదించింది. వరుస క్రమంలో వికెట్లు పడిపోయాయి. ఆరంభంలో సంజూ శాంసన్ (7 బంతుల్లో 16; ఫోర్, 2 సిక్సర్లు).. మధ్యలో తిలక్ వర్మ (15 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), శివమ్ దూబే (13 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో సూర్యకుమార్ యాదవ్ (3 బంతుల్లో 2), హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 9; సిక్స్), రింకూ సింగ్ 6 బంతుల్లో 9; ఫోర్), అక్షర్ పటేల్ (11 బంతుల్లో 15; 2 ఫోర్లు), బిష్ణోయ్ (0) ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 3, మార్క్ వుడ్ 2, జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఆది నుంచే తడబడుతూ వచ్చింది. భారత బౌలర్లు ఫిల్ సాల్ట్ (23 బంతుల్లో 55; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా ఏ ఒక్కరిని కుదురుకోనివ్వలేదు. షమీ (2.3-0-25-3), వరుణ్ చక్రవరి (2-0-25-2), శివమ్ దూబే (2-0-11-2), అభిషేక్ శర్మ (1-0-3-2), రవి బిష్ణోయ్ (1-0-9-1) తలో చేయి వేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో కేవలం సాల్ట్, జేకబ్ బేతెల్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. టీ20ల్లో పరుగుల పరంగా (150) ఇంగ్లండ్కు ఇది భారీ పరాజయం.చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తిఈ మ్యాచ్లో రెండు వికెట్లు తీసిన వరుణ్.. ఓ ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక వికెట్లు (14) తీసిన స్పిన్ బౌలర్గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఓ ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు విండీస్ పేసర్ జేసన్ హోల్డర్ పేరిట ఉంది. 2022లో ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల సిరీస్లో హోల్డర్ 15 వికెట్లు పడగొట్టాడు.ఓ ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్ బౌలర్ రికార్డు వరుణ్కు ముందు ఐష్ సోధి (న్యూజిలాండ్) పేరిట ఉండింది. 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో సోధి 13 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ గతేడాది సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లోనూ 12 వికెట్లు పడగొట్టాడు. -
IND VS ENG 5th T20: అభిషేక్ శర్మ మహోగ్రరూపం.. 37 బంతుల్లోనే శతకం
ముంబై వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ కేవలం 17 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. భారత్ తరఫున టీ20ల్లో యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) తర్వాత ఇదే వేగవంతమైన హాఫ్ సెంచరీ. అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఈ మ్యాచ్లో భారత్ ఓ భారీ రికార్డు సాధించింది. పవర్ ప్లేల్లో (తొలి 6 ఓవర్లలో) తమ అత్యధిక స్కోర్ నమోదు చేసింది. అభిషేక్ విధ్వంసం ధాటికి భారత్ తొలి 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. ఈ మ్యాచ్కు ముందు పవర్ ప్లేల్లో టీమిండియా అత్యధిక స్కోర్ 82/2గా ఉండింది. 2021లో స్కాట్లాండ్పై భారత్ ఈ స్కోర్ చేసింది.టీ20 పవర్ ప్లేల్లో భారత్ అత్యధిక స్కోర్లు95/1 ఇంగ్లండ్పై (2025)82/2 స్కాట్లాండ్పై (2021)82/1 బంగ్లాదేశ్పై (2024)78/2 సౌతాఫ్రికాపై (2018)కాగా, ఈ మ్యాచ్లో అభిషేక్ విధ్వంసం హాఫ్ సెంచరీతో ఆగలేదు. హాఫ్ సెంచరీ తర్వాత అతను మరింత చెలరేగిపోయాడు. కేవలం 36 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా సూర్యకుమార్ యాదవ్ (2) క్రీజ్లో ఉన్నాడు. 10 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 143/2గా ఉంది. భారత ఇన్నింగ్స్లో సంజూ శాంసన్ 7 బంతుల్లో 16, తిలక్ వర్మ 15 బంతుల్లో 24 పరుగులు చేసి ఔటయ్యారు. తిలక్ కాస్త పర్వాలేదనిపించగా.. శాంసన్ వరుసగా ఐదో ఇన్నింగ్స్లో తక్కువ స్కోర్కే ఔటయ్యాడు.37 బంతుల్లో శతక్కొట్టిన అభిషేక్హాఫ్ సెంచరీ తర్వాత పేట్రేగిపోయిన అభిషేక్ శర్మ 37 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. టీ20ల్లో భారత్ తరఫున ఇది రెండో వేగవంతమైన శతకం. టీ20ల్లో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్మ్యాన్ 2017లో శ్రీలంకపై 35 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఓవరాల్గా టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. గతేడాది చౌహాన్ సైప్రస్పై కేవలం 27 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 15 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 194/5. అభిషేక్ (108), రింకూ సింగ్ (1) క్రీజ్లో ఉన్నారు. -
హర్షిత్ రాణా రంగప్రవేశం టీమిండియాకు శుభపరిణామం
పూణేలో ఇంగ్లాండ్తో శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్లో శివం దుబే స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్ గా అసాధారణ పరిస్థితుల్లో హర్షిత్ రాణా (Harshit Rana) భారత్ తరఫున తన టీ20 అరంగేట్రం చేసాడు. భారత్ క్రికెట్ జట్టు తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద దుమారాన్నే రేకెత్తించింది. ఒక ఆల్ రౌండర్ స్థానంలో పేసర్ను జట్టులోకి తీసుకోవడాన్ని క్రికెట్ నిపుణులు, ముఖ్యంగా ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు నిశితంగా విమర్శించారు. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ రూపొందించిన నియమావళికి విరుద్ధమని ఇంగ్లాండ్ నిపుణుల వాదన. దీనికి భారత్ మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వంటి వాళ్ళు కూడా సమర్ధించడం విశేషం. ఎందుకంటే ఐసీసీ నియమావళి ప్రకారం దూబే స్థానం లో 'లైక్-ఫర్-లైక్' ప్రత్యామ్యాయ ఆటగాడ్ని ఎంచుకోవాలి. రాణా రావడంతో భారత్ జట్టుకి మేలు చేకూరింది. అదనపు బౌలింగ్ ఆప్షన్ లభించింది.ఐసీసీ నియమావళి ప్రకారం కంకషన్ సబ్ స్టిట్యూట్ ఆటగాడిగా దాదాపు ఒకే తరహా ఆటగాళ్లను మాత్రమే ఎంచుకోవాలి. ఈ విషయం పై మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్, క్రికెట్ వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ భారత్ జట్టు నిర్ణయాన్ని దుయ్యబట్టారు. " ఐసీసీ నిబంధలు ప్రకారం కంకషన్ లేదా అనుమానిత కంకషన్కు గురైన ఆటగాడికి సమానమైన వారిని మాత్రమే ప్రత్యామ్నాయంగా జట్టులోకి తీసుకోవాలని పీటర్సన్ వ్యాఖ్యానించాడు. హర్షిత్ రాణా పూర్తి స్థాయి పేస్ బౌలర్ కాగా, దుబే బ్యాటింగ్ ఆల్ రౌండర్ కాబట్టి భారత్ ఈ మ్యాచ్ లో తప్పనిసరిగా 12 మంది ఆటగాళ్లతో పోటీ కి దిగిందని భావించాల్సి వస్తుందని పీటర్సన్ పేర్కొన్నాడు.అంతకుముందు శివమ్ దూబే 34 బంతుల్లో 53 పరుగులు చేశాడు. క్లిష్ట సమయంలో భారత్ ని ఆదుకుని జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించేందుకు తన వంతు పాత్ర పోషించాడు. భారత్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో జేమీ ఓవర్టన్ వేసిన బంతి హెల్మెట్కు తగలడం తో దూబే గాయం కారణంగా వైదొలిగాడు. దూబే స్తానం లో వచ్చిన రాణా నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ కి ప్రాతినిధ్యం వహించే రాణా ఇంగ్లాండ్ 12వ ఓవర్లో లియామ్ లివింగ్స్టోన్ను అవుట్ చేశాడు. ఆ తర్వాత 16వ ఓవర్లో జాకబ్ బెథెల్ను కేవలం 6 పరుగులకే వెనక్కి పంపి ఇంగ్లాండ్పై మరో దెబ్బ వేసాడు. 18వ ఓవర్లో జామీ ఓవర్టన్ను 19 పరుగులకు క్లీన్ బౌలింగ్ చేసి భారత్ కి విజయం ఖాయం చేశాడు. రాణా 33 పరుగులకు 3 వికెట్లు పడగొట్టి అంతర్జాతీయ క్రికెట్లో తనదైన శైలి లో అరంగ్రేటం చేసాడు.ఈ వివాదం ఎలా ఉన్న రాణా తన ఈ మ్యాచ్ లో తన ఆటతీరు చాల సంతృప్తినిచ్చిందని, తనకు కలల అరంగేట్రం లభించిందని చెప్పాడు. "ఇది నాకు ఇప్పటికీ కలల అరంగేట్రం. దుబే గాయంతో వైదొలగడం తో రెండు ఓవర్ల తర్వాత నేను కంకషన్ ప్రత్యామ్నాయంగా ఆడబోతున్నాని సమాచారం అందింది. నేను చాలా కాలంగా భారత్ జట్టు తరుఫున ఆడాలని ఎదురు చూస్తున్నాను. నా నైపుణ్యాన్ని నిరూపించుకోవాలనుకున్నాను. నేను ఐపీఎల్లో బాగానే బౌలింగ్ చేసాను.ఇక్కడ కూడా అదే రీతిలో ఆడుతున్నానని రాణా పూణే మ్యాచ్ అనంతరం చెప్పాడు.8వ ఓవర్లో మైదానంలోకి దిగిన రాణా, ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఇచ్చిన క్యాచ్ కూడా పట్టుకుని అతన్ని అవుట్ చేయడంలో కీలకమైన పాత్ర పోషించాడు. అయితే రాణాను ప్రత్యామ్నాయంగా ఎంపిక చేయడం చాలా మంది అభిమానులకు నచ్చలేదు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తన సోషల్ మీడియాలో ఈ విషయం పై స్పందిస్తూ “పార్ట్ టైమ్ బౌలింగ్ చేసే బ్యాట్స్మన్ స్థానంలో పూర్తి స్థాయి బౌలర్ అయిన రాణా ని ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించాడు. రమణ్దీప్ (సింగ్) దూబేకు సమానమైన ప్రత్నామ్యాయం అని వ్యాఖ్యానించాడు.దీని పై భారత్ మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా విమర్శించడం గమనార్హం. "ఇదేమీ ఆట? దూబే స్థానంలో రాణా ప్రత్నామ్యాయ అతగాడి రంగ ప్రవేశం చేయడం ఇది ఐపీఎల్ మ్యాచ్ లో సూపర్సబ్ వ్యవహారం లాగా ఉంది ”అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. ఈ వివాదం అటుంచితే ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ముందు హర్షిత్ రాణా రాణించడం భారత్ కి శుభపరిణామం. ఇప్పటికే భారత్ ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకోక పోవడం, సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ఫిటినెస్ పై అనుమానాలు రేకెత్తుతున్న సమయంలో రాణా రంగప్రవేశం భారత్ కి కొంత ఉపశమనాన్నిస్తుదనడంలో సందేహం లేదు. -
ఇంగ్లండ్తో ఐదో టీ20.. భారత జట్టులో కీలక మార్పులు! వారికి ఛాన్స్?
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ చివరి అంకానికి చేరుకుంది. ఈ సిరీస్లో ఆఖరి టీ20 ఇరు జట్ల మధ్య ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ను 4-1తో ముగించాలని భారత జట్టు భావిస్తుంటే.. ఇంగ్లండ్ మాత్రం విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. కాగా ఇప్పటికే ఐదు మ్యాచ్ల సిరీస్ను భారత్ ఇప్పటికే 3-1 తేడాతో సొంతం చేసుకుంది.ఈ క్రమంలో నామమాత్రపు మ్యాచ్ అయితే ఐదో టీ20లో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. నాలుగో టీ20కు దూరమైన స్టార్ పేసర్ మహ్మద్ షమీ తిరిగి జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లీష్ జట్టుతో వన్డే సిరీస్కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం అతడిని ఆడించాలని జట్టు మెనెజ్మెంట్ భావిస్తోంది. ఈ విషయాన్ని భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కల్ ధ్రువీకరించాడు.కాగా షమీ తుది జట్టులోకి వస్తే అర్ష్దీప్ సింగ్ బెంచ్కు పరిమితం కావాల్సి ఉంటుంది. మరోవైపు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వారిద్దరి స్ధానంలో రమణ్దీప్ సింగ్, హర్షిత్ రాణా తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. కాగా గత కంకషన్కు గురైన శివమ్ దూబే ప్రస్తుతం కోలుకోనున్నట్లు సమాచారం. అతడు వాంఖడే టీ20లో కూడా ఆడే సూచనలు కన్పిస్తున్నాయి.సూర్య, సంజూ మెరుస్తారా?ఇక పేలవ ఆట తీరుతో నిరాశపరుస్తున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఓపెనర్ సంజూ శాంసన్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఈ సిరీస్కు ముందు వరుస సెంచరీలతో సత్తాచాటిన శాంసన్.. స్వదేశంలో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఈ సిరీస్లో నాలుగు మ్యాచ్లు ఆడిన సంజూ కేవలం 35 పరుగులు మాత్రమే చేశాడు. నాలుగు మ్యాచ్ల్లో కూడా బౌన్సర్ బంతులకే సంజూ ఔట్ కావడం గమనార్హం. మరోవైపు సూర్యది కూడా అదే తీరు. సూర్యకుమార్ నాలుగు మ్యాచ్ల్లో 26 పరుగులే చేశాడు. దీంతో ఈ మ్యాచ్లో వీరిద్దరూ రాణించాల్సిన అవసరముంది. కాగా బ్యాటింగ్కు అనుకూలించే వాంఖడే స్టేడియంలో పరుగుల వరద పారే అవకాశముంది. టాస్ గెలిచిన కెప్టెన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది.ఐదో టీ20కు భారత తుది జట్టు(అంచనా): సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, రమణ్దీప్ సింగ్, శివమ్ దూబే, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీచదవండి: నా భార్య లైవ్ చూస్తోంది.. నేను ఆ విషయం చెప్పలేను: రోహిత్ శర్మ -
ఛాంపియన్స్ ట్రోఫీలో వారిద్దరిదే కీలక పాత్ర: గంభీర్
భారత సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat kohli) ఫామ్ లేమితో సతమతవుతున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో నిరాశపరిచిన రోకో ద్వయం.. పుష్కరకాలం తర్వాత ఆడిన రంజీ ట్రోఫీలోనూ అదే తీరును కనబరిచారు. ముంబై తరపున ఆడిన 31 పరుగులు చేయగా.. ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించిన కోహ్లి కేవలం ఆరు పరుగులు మాత్రమే చేశాడు.వీరిద్దరూ ఇప్పుడు ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్కు సిద్దమవుతున్నారు. ఆ తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడేందుకు యూఏఈకు పయనం కానున్నారు. ఈ క్రమంలో ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న వీరిద్దరికి భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ మద్దతుగా నిలిచాడు. ఈ సీనియర్ ద్వయం రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తాచాటుతారని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు."రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరూ డ్రెస్సింగ్ రూమ్కి ఎంతో విలువను చేకూర్చారు. ఒక డ్రెస్సింగ్ రూమ్కే కాకుండా భారత జట్టుకు కూడా పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ జోడీ కీలక పాత్ర పోషించనున్నారు. వీరిద్దరే కాకుండా జట్టులోని మొత్తం ఆటగాళ్లు రాబోయే మెగా టోర్నీలో సత్తాచాటాలని ఉవ్విళ్లరుతున్నారు. దేశానికి గౌరవం తీసుకురావాలనే తపన ప్రతీ ఒక్కరిలోనూ ఉంది" అని బీసీసీఐ నమన్ అవార్డుల కార్యక్రమంలో గంభీర్ పేర్కొన్నాడు.అదే విధంగా పాకిస్తాన్తో మ్యాచ్పై కూడా గంభీర్ స్పందించాడు. "ఛాంపియన్స్ ట్రోఫీలో ఫిబ్రవరి 23న పాకిస్తాన్తో జరిగే మ్యాచ్ ఒక్కటే మాకు ముఖ్యం కాదు. మొత్తం ఐదు లీగ్ మ్యాచ్లు మాకు ముఖ్యమే. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా దుబాయ్లో అడుగుపెట్టనున్నాము. పాకిస్తాన్తో జరిగే మ్యాచ్నే సీరియస్గా తీసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోలేము కాదా? మొత్తం అన్ని మ్యాచ్లను ఒకేలా చూస్తాము. వాస్తవానికి భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే హైప్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. కానీ మేము మాత్రం కేవలం సాధారణ గేమ్లానే చూస్తాము" అని గంభీర్ పేర్కొన్నాడు.కాగా ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ప్రారంభం కానుంది. అయితే భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్లో దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న అదే స్టేడియంలో దాయాది పాకిస్తాన్తో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచదవండి: 28 ఏళ్ల సుదీర్ఘ కెరీర్.. రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్ -
ఈజీ క్యాచ్ విడిచిపెట్టిన సంజూ.. గంభీర్ ఏమి చేశాడంటే?
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్(Sanju Samson) పేలవ ఫామ్ కొనసాగుతోంది. తొలి మూడు మ్యాచ్ల్లో నిరాశపరిచిన శాంసన్.. నాలుగో టీ20లో కూడా అదే తీరును కనబరిచాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి సకీబ్ మహమూద్ బౌలింగ్లో ఔటయ్యాడు. బ్యాటింగ్లోనే కాకుండా వికెట్ కీపింగ్లోనూ శాంసన్ నిరాశపరిచాడు. ఒక సులభమైన క్యాచ్ను శాంసన్ జారవిడిచాడు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 19 ఓవర్ వేసిన హర్షిత్ రాణా మూడో బంతిని ఫుల్ అండ్ ఔట్సైడ్ ఆఫ్ దిశగా ఓవర్టన్కు సంధించాడు. ఆ బంతిని ఓవర్టన్ భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి ఎడ్జ్ తీసుకుని ఫైన్ లెగ్ వైపు గాల్లోకి లేచింది. క్యాచ్ కోసం వరుణ్ చక్రవర్తి, శాంసన్ ఇద్దరూ పరిగెత్తారు. అయితే సంజూ సమయానికి చేరుకున్నప్పటికి సులభమైన క్యాచ్ అందుకోవడంలో విఫలమయ్యాడు. వాస్తవానికి చెప్పాలంటే వరుణ్ చక్రవర్తి అందుకోవాల్సిన క్యాచ్కు శాంసన్ మధ్యలోకి వెళ్లి జారవిడచాడు. దీంతో డౌగట్లో ఉన్న భారత హెడ్కోచ్ గౌతం గంభీర్(Goutham Gambhir) ఆసంతృప్తికి లోనయ్యాడు. గంభీర్ ముఖం చేయి వేసుకుని తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే ఓవర్టన్ క్యాచ్ అంత కాస్టలీగా మారలేదు. ఆ తర్వాతి ఓవర్లనే ఓవర్టన్ ఔటయ్యాడు.సిరీస్ భారత్ సొంతం..ఇక ఈ మ్యాచ్లో ఇంగ్లండ్పై 15 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే ఐదు టీ20ల సిరీస్ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.భారత టాపార్డర్ విఫలమైనప్పటికి హార్దిక్ పాండ్యా( 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 53), శివమ్ దూబే(34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 53), రింకూ సింగ్(30) రాణించారు. అనంతరం ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో కంకషన్ సబ్స్ట్యూట్గా వచ్చిన హర్షిత్ రాణా(Harshit Rana) మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా ఈ మ్యాచ్లో హర్షిత్ రాణా కంకషన్ సబ్గా రావడం కాస్త వివాదస్పదమైంది.చదవండి: Suryakumar Yadav: వారిద్దరి వల్లే గెలిచాము.. కానీ అది మాత్రం ఊహించలేదు pic.twitter.com/hCJEOR66Sa— rohitkohlirocks@123@ (@21OneTwo34) February 1, 2025 -
చరిత్ర సృష్టించిన సకీబ్ మహమూద్.. ప్రపంచంలోనే తొలి బౌలర్గా
పూణే వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లో 15 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఓటమి పాలైనప్పటకి ఆ జట్టు పేసర్ సకీబ్ మహమూద్ మాత్రం నిప్పులు చెరిగాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారత టాప్ ఆర్డర్ను కుప్ప కూల్చాడు.రెండో ఓవర్ వేసిన మహమూద్.. తొలి బంతికే సంజు శాంసన్ (1) వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఫామ్లో ఉన్న తిలక్ వర్మను గోల్డెన్ డక్గా పెవిలియన్కు పంపాడు. అదే ఓవర్లో చివరి బంతికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను సకీబ్ బోల్తా కొట్టించాడు.ఆ ఓవర్ను మూడు వికెట్లతో పాటు మెయిడిన్గా సకీబ్ ముగించాడు. ఈ క్రమంలో మహమూద్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. సకీబ్ సాధించిన రికార్డులు ఇవే..👉టీ20ల్లో భారత్పై ట్రిపుల్ వికెట్ మెయిడెన్ తొలి బౌలర్గా సకీబ్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఏ బౌలర్గా కూడా ఈ ఘనత సాధించలేదు. అంతేకాకుండా ఈ ఫీట్ సాధించిన తొలి ఇంగ్లీష్ బౌలర్ కూడా సకీబ్ కావడం గమనార్హం. ఇంతవరకు ఏ ఇంగ్లీష్ బౌలర్ కూడా ఇతర జట్లపై కూడా ఈ ఫీట్ సాధించలేదు.👉అదేవిధంగా ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ట్రిపుల్ వికెట్ మెయిడెన్ బౌలింగ్ చేసిన బౌలర్గా వెస్టిండీస్ మాజీ పేసర్ జెరోమ్ టేలర్తో కలిసి సంయుక్తంగా నిలిచాడు. 2007లో గ్కెబెర్హాలో దక్షిణాఫ్రికాపై రెండో ఓవర్లోనే జెరోమ్ టేలర్ ఈ ఫీట్ సాధించాడు.రాణించిన దూబే, హార్దిక్..కాగా ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా( 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 53), శివమ్ దూబే(34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు.ఇంగ్లండ్ బౌలర్లలో మహమూద్తో పాటు ఓవర్టన్ రెండు,రషీద్, కార్స్ తలా వికెట్ సాధించారు. ఇంగ్లండ్ 166 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో కంకషన్ సబ్స్ట్యూట్గా వచ్చిన హర్షిత్ రాణా(Harshit Rana) మూడు వికెట్లు సాధించారు.. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-1 తేడాతో సొంతం చేసుకుంది.చదవండి: అతడిని ఆడించడం అన్యాయం.. మాకు ఒక మాట కూడా చెప్పలేదు: బట్లర్ -
'అతడిని ఆడించడం అన్యాయం.. మాకు ఒక మాట కూడా చెప్పలేదు'
పుణే వేదికగా భారత్తో జరిగిన నాలుగో టీ20లో 15 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-1 తేడాతో ఇంగ్లండ్ కోల్పోయింది. 182 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లండ్ 166 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో కంకషన్ సబ్స్ట్యూట్గా వచ్చిన హర్షిత్ రాణా(Harshit Rana) మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా( 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 53), శివమ్ దూబే(34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఇక ఇది ఉండగా.. కంకషన్ సబ్స్ట్యూట్గా హర్షిత్ రాణా జట్టులోకి రావడం ప్రస్తుతం వివాదస్పదమైంది.అసలేం జరిగిందంటే ?భారత ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన జేమీ ఓవర్టన్ బౌలింగ్లో ఓ బంతి దూబే హెల్మెట్ బలంగా తాకింది. వెంటనే ప్రోటోకాల్ ప్రకారం ఫిజియో వచ్చి అతడిని పరీక్షించాను. అతడు అంతా బాగానే ఉందనడంతో ఫిజియో తిరిగి వెనక్కి వెళ్లిపోయాడు. కానీ దూబే మాత్రం ఫీల్డింగ్ రాలేదు. దూబే తన బ్యాటింగ్ను కూడా కొనసాగించాడు. కానీ ఫీల్డింగ్కు మాత్రం దూబే రాలేదు.అతడి స్ధానంలో హర్షిత్ రాణా కంకషన్ సబ్స్ట్యూట్గా బరిలోకి దిగాడు. కంకషన్ సబ్గా వచ్చిన రాణా మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ను దెబ్బతీశాడు. ఈ క్రమంలో హర్షిత్ రాణాకు కంకషన్ సబ్గా అవకాశమివ్వడంపై ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(jos buttler) తీవ్ర అగ్రహం వ్యక్తం చేశాడు. శివమ్ దూబే వంటి ఆటగాడికి హర్షిత్ రాణా ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదని బట్లర్ మండిపడ్డాడు.మేము అంగీకరించము.."ఇది ఏ మాత్రం సరైన రిప్లేస్ మెంట్ కాదు. దీన్ని మేము మేం ఏమాత్రం అంగీకరించం శివమ్ దూబే గంటకు 25 మైల్స్ వేగంతో బౌలింగ్ చేసినా.. హర్షిత్ రాణా తన బ్యాటింగ్ను మెరుగుపరుచుకున్నా మాకు అనవసరం. అది ఆటలో భాగం మాత్రమే. ఈ మ్యాచ్లో మేమే గెలవాల్సింది. ఈ నిర్ణయం వల్లే మేము గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయాము.మమ్మల్ని సంప్రదించకుండానే హర్షిత్ రాణాను కంకషన్ సబ్స్టిట్యూట్గా బరిలోకి దించారు. నేను బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు అతడిని మైదానంలో చూశాను. అతడు ఎవరికి బదులుగా ఆడుతున్నాడని అప్పుడే అంపైర్లకు అడిగాను. వారు కంకషన్ రిప్లేస్మెంట్ అని బదులిచ్చారు. అప్పుడే ఈ నిర్ణయాన్ని నేను వ్యతిరేకించాను. 'లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్’ కాదని చెప్పా. మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ నిర్ణయం తీసుకున్నారని అంపైర్లు చెప్పారు. క్లారిటీ కోసం జవగల్ శ్రీనాథ్తో కచ్చితంగా మాట్లాడుతాం అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో బట్లర్ పేర్కొన్నాడు.చదవండి: వారిద్దరి వల్లే గెలిచాము.. కానీ అది మాత్రం ఊహించలేదు: సూర్య -
వారిద్దరి వల్లే గెలిచాము.. కానీ అది మాత్రం ఊహించలేదు: సూర్య
భారత క్రికెట్ జట్టు మరో టీ20 సిరీస్ను తమ ఖాతాలో వేసుకుంది. పుణే వేదికగా జరిగిన నాలుగో టీ20లో ఇంగ్లండ్పై 15 పరుగుల తేడాతో టీమిండియా(Teamindia) విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే భారత్ 3-1 తేడాతో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా( 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 53), శివమ్ దూబే(34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో కంకషన్ సబ్స్ట్యూట్గా వచ్చిన హర్షిత్ రాణా(Harshit Rana) మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీతో మెరిసినప్పటకి ఫలితం లేకుండా పోయింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(suryakumar yadav) స్పందించాడు. అద్బుత ఇన్నింగ్స్లు ఆడిన దూబే, హార్దిక్ పాండ్యాలపై సూర్య ప్రశంసల వర్షం కురిపించాడు.ఈ విజయంలో జట్టులోని ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు. అదేవిధంగా మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులు మద్దతు అద్భుతంగా ఉంది. మా విజయాలు వెనక వారి సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది. 10 వికెట్లకే మూడు వికెట్లు కోల్పోయిన సమయంలో మేము వెనకంజ వేయాలని అనుకోలేదు. బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాలో మా కుర్రాళ్లకు బాగా తెలుసు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోవడం గట్టి ఎదురు దెబ్బే. నేను అస్సలు ఊహించలేదు. కానీ అక్కడ నుంచి మా బ్యాటర్లు ఆడిన విధానం నిజంగా అద్భుతం. హార్దిక్ పాండ్యా, దూబే ఆసాధరణ బ్యాటింగ్ చేశారు. వారిద్దరూ తమ అనుభవాన్ని చూపించారు. మేం ఎప్పుడూ మాట్లాడేది ఇదే. నెట్స్లో ఎలా ఆడుతారో, మ్యాచ్లో ఆలానే స్వేఛ్చగా ఆడాలని మా బాయ్స్కు చెబుతాం. మా ఆటగాళ్లు నెట్ సెషన్లలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారు నెట్ ప్రాక్టీస్లో ఆడినట్లే గేమ్లో కూడా ఆడుతున్నారు. కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. మేము సరైన దిశలోనే పయనిస్తున్నామని నేను భావిస్తున్నాను. పవర్ ప్లే తర్వాత(7 -10 ఓవర్ల మధ్య) పరుగులు సాధించడం అంత ఈజీ కాదు. ఇంగ్లండ్ పవర్ ప్లేలో దూకుడుగా ఆడినప్పటికి.. తర్వాత మేము కొన్ని వికెట్లు తీసి గేమ్ని మా నియంత్రణలోకి తీసుకున్నాము. దురదృష్టవశాత్తు శివమ్ దూబే ఫీల్డింగ్కు రాలేకపోయాడు. హర్షిత్ రాణా మూడువ సీమర్గా బరిలోకి దిగాడు. అతడు కూడా అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ముంబైలో జరిగే ఆఖరి టీ20లో కూడా మేము దుమ్ములేపుతాం అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: సబ్స్ట్యూట్గా వచ్చాడు.. గేమ్నే మార్చేశాడు! రూల్స్ ఏమి చెబుతున్నాయి? -
హార్దిక్, దూబే విధ్వంసం.. నిప్పులు చెరిగిన రాణా.. నాలుగో టీ20లో టీమిండియా విజయం
స్వదేశంలో ఇంగ్లండ్తో (England) జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ (Team India) మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. పూణే వేదికగా ఇవాళ (జనవరి 31) జరిగిన నాలుగో మ్యాచ్లో భారత్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ ఇంగ్లండ్పై టీ20 సిరీస్ గెలవడం ఇది వరుసగా ఐదుసారి. భారత్కు స్వదేశంలో ఇది వరుసగా 17వ సిరీస్ విజయం.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శివమ్ దూబే (Shivam Dube) (34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేసింది.12 పరుగుల వద్ద ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన భారత్ను హార్దిక్, దూబే మెరుపు ఇన్నింగ్స్లతో ఆదుకున్నారు.వీరికి ముందు అభిషేక్ శర్మ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, సిక్స్), రింకూ సింగ్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్లు ఆడారు. 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసిన భారత్.. చివరి ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్ను జేమీ ఓవర్టన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.భారత ఆటగాళ్లలో సంజూ శాంసన్ (1), తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0) దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3, జేమీ ఓవర్టన్ 2, బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ (51) అర్ద సెంచరీతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (39), ఫిలిప్ సాల్ట్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.బ్రూక్ క్రీజ్లో ఉండగా.. ఇంగ్లండ్ విజయం సాధించేలా కనిపించింది. అయితే వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్లో బ్రూక్తో పాటు బ్రైడన్ కార్స్ను ఔట్ చేసి తిరిగి భారత్ను గేమ్లోకి తెచ్చాడు. బ్రూక్, కార్స్ ఔటయ్యాక జేమీ ఓవర్టన్ కొద్ది సేపు భారత బౌలర్లను బయపెట్టాడు. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన శివమ్ దూబేకు కన్కషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన హర్షిత్ రాణా (Harshit Rana) మ్యాజిక్ చేశాడు. తన కెరీర్లో తొలి టీ20 ఆడిన హర్షిత్.. ఏకంగా మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ను చావుదెబ్బ కొట్టాడు. హర్షిత్.. ప్రమాదకరమైన లివింగ్స్టోన్ (9), జేకబ్ బేతెల్ (6), జేమీ ఓవర్టన్ (19) వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో హర్షిత్ 150 కిమీకు పైగా వేగంతో బంతులు సంధించడం విశేషం. హర్షిత్తో పాటు రవి బిష్ణోయ్ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ సిరీస్లో నామమాత్రపు ఐదో టీ20 ఫిబ్రవరి 2న ముంబైలో జరుగుతుంది. -
మళ్లీ అర్చర్ ట్రాప్లో చిక్కుకున్న శాంసన్.. వీడియో వైరల్
స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్ల్లో నిరాశపరిచిన శాంసన్.. ఇప్పుడు రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టీ20లో కూడా అదే తీరును కనబరిచాడు. ఓపెనర్గా వచ్చిన సంజూ.. ఆరు బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. జోఫ్రా అర్చర్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి అదిల్ రషీద్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాగా సంజూ మూడు మ్యాచ్లలోనూ అర్చర్ బౌలింగ్లోనే ఔట్ కావడం గమనార్హం.మూడు మ్యాచ్లలోనూ బౌన్సర్లతోనే అర్చర్ బోల్తా కొట్టించాడు. తొలి మ్యాచ్లో 26 పరుగులు చేసిన శాంసన్.. రెండో టీ20లో కేవలం 5 పరుగులు చేశాడు. మొత్తంగా మూడు టీ20ల్లో శాంసన్ కేవలం 34 పరుగులు మాత్రమే చేశాడు. అంతకుముందు దక్షిణాఫ్రికాతో సిరీస్లో రెండు వరుస సెంచరీలతో శాంసన్ చెలరేగిన సంగతి తెలిసిందే.ఐదేసిన వరుణ్..ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో మెరిశాడు. తన 4 ఓవర్ల కోటాలో 24 పరుగులిచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్(51) టాప్ స్కోరర్గా నిలవగా.. లివింగ్ స్టోన్(43), జోస్ బట్లర్(24) పరుగులతో రాణించారు.చదవండి: IND vs ENG: ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు.. 14 నెలల తర్వాత షమీ రీ ఎంట్రీpic.twitter.com/RIibDW354u— rohitkohlirocks@123@ (@21OneTwo34) January 28, 2025 -
చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. తొలి భారత బౌలర్గా
టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరోసారి తన మణికట్టు మయాజాలాన్ని మరోసారి ప్రదర్శించాడు. రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టీ20లో వరుణ్ ఐదు వికెట్లతో మెరిశాడు. ఇంగ్లండ్ బ్యాటర్లకు వరుణ్ బంతితో చుక్కలు చూపించాడు. అతడిని ఎదుర్కొవడం ఇంగ్లండ్ బ్యాటర్ల తరం కాలేదు.అద్బుతమైన గూగ్లీలతో ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. అతడి దెబ్బకు వరుస క్రమంలో ఇంగ్లండ్ వికెట్లు కోల్పోయింది. ఓవరాల్గా తన 4 ఓవర్ల కోటాలో 24 పరుగులిచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. వరుణ్కు ఇది తన టీ20 కెరీర్లో రెండో ఫైవ్ వికెట్ హాల్ కావడం గమనార్హం. తద్వారా వరుణ్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.వరుణ్ సాధించిన రికార్డులు ఇవే..👉వరుసగా రెండు టీ20 సిరీస్లలో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి భారత బౌలర్గా వరుణ్ రికార్డులకెక్కాడు. వరుణ్ ఈ సిరీస్ కంటే ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లోనూ ఐదు వికెట్లతో మెరిశాడు. ఇప్పుడు రాజ్కోట్ టీ20లో ఇంగ్లండ్పై ఐదు వికెట్లు సాధించాడు. దీంతో ఈ అరుదైన ఫీట్ను చక్రవర్తి తన ఖాతాలో వేసుకున్నాడు.👉అదే విధంగా వరుసగా రెండు టీ20 సిరీస్లలో పది లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా వరుణ్ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో 12 వికెట్లు పడగొట్టిన వరుణ్.. ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్లో తొలి మూడు టీ20లలోనే 10 వికెట్లు పడగొట్టాడు.👉అంతర్జాతీయ టీ20ల్లో రెండు ఫైవ్ వికెట్ల హాల్స్ సాధించిన మూడో భారత బౌలర్గా వరుణ్ నిలిచాడు. వరుణ్ కంటే ముందు కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ రెండు సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు.తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో మెరిశాడు. తన 4 ఓవర్ల కోటాలో 24 పరుగులిచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితోపాటు హార్దిక్ పాండ్యా రెండు, రవి బిష్ణోయ్ వికెట్ సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్(51) టాప్ స్కోరర్గా నిలవగా.. లివింగ్ స్టోన్(43), జోస్ బట్లర్(24) పరుగులతో రాణించారు. Double-wicket over 👌Completion of fifer for Varun Chakaravarthy 👌Updates ▶️ https://t.co/amaTrbtzzJ#TeamIndia | #INDvENG | @chakaravarthy29 | @IDFCFIRSTBank pic.twitter.com/ne0Ze0lppj— BCCI (@BCCI) January 28, 2025 -
ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు.. 14 నెలల తర్వాత షమీ రీ ఎంట్రీ
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ 14 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. రాజ్కోట్ వేదికగా ఇగ్లండ్తో జరుగుతున్న మూడో టీ20కు భారత తుది జట్టులో షమీ చోటు దక్కించుకున్నాడు. దీంతో అభిమానుల సదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. రాజ్కోట్ టీ20కు యువ పేసర్ అర్ష్దీప్ సింగ్కు టీమ్ మెనెజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. అతడి స్ధానంలోనే షమీ ప్లేయింగ్ ఎలెవన్లోకి వచ్చాడు.కాగా షమీ చివరిసారిగా వన్డే ప్రపంచకప్ 2023లో ఫైనల్ భారత్ తరపున ఆడాడు. భారత్ రన్నరప్గా నిలిచినప్పటికి షమీ తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత షమీ చీలమండ గాయంతో జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత తన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అనంతరం ఎన్సీఎలో చేరి ఫిట్నెస్ సాధించేందుకు షమీ తీవ్రంగా శ్రమించాడు.అతడు తిరిగి భారత జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడని భావించిన సమయంలో ఎడమ కాలి మడమలో మళ్లీ వాపు వచ్చింది. దీంతో అతడు రీ ఎంట్రీ అలస్యమైంది. అయితే అతడు తిరిగి కోలుకుని తొలుత దేశవాళీ క్రికెట్ ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్హాజారే ట్రోఫీలో షమీ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో షమీ చోటు దక్కించుకున్నాడు. అయితే తొలి రెండు టీ20ల్లో మాత్రం షమీ ఆడే అవకాశం లభించలేదు. ఎట్టకేలకు రాజ్కోట్ టీ20తో షమీ పునరాగమనం చేశాడు.తుది జట్లుఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, జామీ స్మిత్(వికెట్ కీపర్), జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్భారత్: సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), ధ్రువ్ జురెల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తిచదవండి: CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు సౌతాఫ్రికాకు షాక్.. -
రాజ్కోట్ టీ20లో టీమిండియా ఓటమి..
India vs England 3rd T20I Live Updates And Highlights: భారత్ ఓటమి.. రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టీ20లో 26 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో జామీ ఓవర్టన్ మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రైడన్ కార్స్, జోఫ్రా అర్చర్ తలా రెండు వికెట్లు సాధించారు.వీరిద్దరితో పాటు అదిల్ రషీద్, మార్క్ వుడ్ తలా వికెట్ సాధించారు. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(40) టాప్ స్కోరర్గా నిలవగా.. అభిషేక్ శర్మ(24), తిలక్ వర్మ(18) పర్వాలేదన్పించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో మెరిశాడు. తన 4 ఓవర్ల కోటాలో 24 పరుగులిచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్(51) టాప్ స్కోరర్గా నిలవగా.. లివింగ్ స్టోన్(43), జోస్ బట్లర్(24) పరుగులతో రాణించారు. ఈ విజయంతో ఇంగ్లండ్ సిరీస్ ఆశలను 2-1 సజీవంగా ఉంచుకుంది.ఆరో వికెట్ డౌన్.. అక్షర్ పటేల్ ఔట్అక్షర్ పటేల్ రూపంలో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. అర్చర్ బౌలింగ్లో ఔటయ్యాడు.17 ఓవర్లకు భారత్ స్కోర్:122/517 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. భారత్ విజయానికి 18 బంతుల్లో 50 పరుగులు కావాలి. క్రీజులో హార్దిక్ పాండ్యా(33),అక్షర్ పటేల్(15) ఉన్నారు.భారత్ ఐదో వికెట్ డౌన్..వాషింగ్టన్ సుందర్ రూపంలో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన సుందర్... జామీ ఓవర్టన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 12.1 ఓవర్లకు భారత్ స్కోర్: 85/4తిలక్ వర్మ ఔట్..తిలక్ వర్మ రూపంలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన వర్మ.. అదిల్ రషీద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 10 ఓవర్లకు భారత్ స్కోర్: 78/4సూర్యకుమార్ ఔట్..భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. మార్క్ వుడ్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో హార్దిక్ పాండ్యా వచ్చాడు. 6 ఓవర్లకు భారత్ స్కోర్: 51/3అభిషేక్ ఔట్..అభిషేక్ శర్మ రూపంలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన అభిషేక్.. బ్రైడన్ కార్స్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి తిలక్ వర్మ వచ్చాడు.తొలి వికెట్ డౌన్..టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. కేవలం మూడు పరుగులు మాత్రమే చేసిన సంజూ శాంసన్.. అర్చర్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. అభిషేక్ శర్మ(16) దూకుడుగా ఆడుతున్నాడు. 3 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 23/1ఐదేసిన వరుణ్.. భారత్ టార్గెట్ ఎంతంటే?రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టీ20లో భారత బౌలర్లు రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో మెరిశాడు. తన 4 ఓవర్ల కోటాలో 24 పరుగులిచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్(51) టాప్ స్కోరర్గా నిలవగా.. లివింగ్ స్టోన్(43), జోస్ బట్లర్(24) పరుగులతో రాణించారు.ఐదేసిన వరుణ్.. ఇంగ్లండ్ ఎనిమిదో వికెట్ డౌన్వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన చక్రవర్తి.. నాలుగో బంతికి కార్సే, ఐదో బంతికి అర్చర్న ఔట్ చేశాడు.వరుణ్ మ్యాజిక్.. ఒకే ఓవర్లలో రెండు వికెట్లువరుణ్ చక్రవర్తి మరోసారి తన స్పిన్ మయాజాలాన్ని మరోసారి ప్రదర్శించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన చక్రవర్తి.. మూడో బంతికి స్మిత్, నాలుగో బంతికి ఓవర్టన్ వరుస క్రమంలో ఔట్ చేశాడు.ఇంగ్లండ్ నాలుగో వికెట్ డౌన్..హ్యారీ బ్రూక్ రూపంలో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన బ్రూక్.. రవి బిష్ణోయ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి స్మిత్ వచ్చాడు. 13 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 108/4ఇంగ్లండ్ మూడో వికెట్ డౌన్..దూకుడుగా ఆడుతున్న బెన్ డకెట్(51) వికెట్ భారత్ ఎట్టకేలకు సాధించింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి డకెట్ తన వికెట్ను కోల్పోయాడు. క్రీజులోకి లైమ్ లివింగ్స్టోన్ వచ్చాడు.ఇంగ్లండ్ రెండో వికెట్ డౌన్.. బట్లర్ ఔట్జోస్ బట్లర్ రూపంలో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన బట్లర్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి హ్యారీ బ్రూక్ వచ్చాడు. 9 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 83/28 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 74/1ఇంగ్లండ్ ప్లేయర్లు బెన్ డకెట్(42), బట్లర్(23) దూకుడుగా ఆడుతున్నారు. 8 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 74/1దూకుడుగా ఆడుతున్న డకెట్..4 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(24) దూకుడుగా ఆడుతున్నాడు. అతడితో పాటు జోస్ బట్లర్(5) ఉన్నాడు.తొలి వికెట్ డౌన్..ఫిల్ సాల్ట్ రూపంలో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన సాల్ట్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ జోస్ బట్లర్ వచ్చాడు. 3 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 25/1బౌలింగ్ ఎంచుకున్న భారత్..రాజ్కోట్ వేదికగా మూడో టీ20లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు.రాజ్కోట్ టీ20లో యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ స్ధానంలో షమీ తుది జట్టులోకి వచ్చాడు. అర్ష్దీప్కు జట్టు మెనెజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. మరోవైపు ఇంగ్లండ్ తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. చెపాక్లో ఆడిన జట్టునే ఇంగ్లండ్ కొనసాగించింది.తుది జట్లుఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, జామీ స్మిత్(వికెట్ కీపర్), జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్భారత్: సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), ధ్రువ్ జురెల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తిచదవండి: ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా బుమ్రా -
భారత్తో మూడో టీ20.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
రాజ్కోట్ వేదికగా మంగళవారం(జనవరి 28) భారత్తో మూడో టీ20లో తలపడేందుకు ఇంగ్లండ్ సన్నదమవుతోంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమి చవిచూసిన ఇంగ్లండ్ జట్టు.. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్లో నిలవాలని భావిస్తోంది. ఇప్పటికే రాజ్కోట్కు చేరుకున్న బట్లర్ సేన సోమవారం నెట్స్లో తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో మూడో టీ20కు ఇంగ్లండ్ క్రికెట్ తమ తుది జట్టును ప్రకటించింది.తమ ప్లేయింగ్ ఎలెవన్లో ఇంగ్లండ్ ఎటువంటి మార్పులు చేయలేదు. చెపాక్ టీ20లో ఆడిన జట్టునే మూడో మ్యాచ్కు కూడా కొనసాగించారు. చివరి మ్యాచ్లో ఆకట్టుకున్న జేమీ స్మిత్, బ్రైడన్ కార్స్ తమ స్దానాలను సుస్థిరం చేసుకున్నారు. రెండో టీ20లో బ్రైడన్ కార్స్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. బ్యాటింగ్లో 31 పరుగులతో పాటు బౌలింగ్లో మూడు కీలక వికెట్లను కార్స్ తీసుకున్నాడు.అదే విధంగా తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన ఫిల్ సాల్ట్, బెన్ డకెట్లకు ఇంగ్లండ్ మెనెజ్మెంట్ మరో అవకాశమిచ్చింది. విధ్వంసకర ఆటగాడిగా పేరు గాంచిన సాల్ట్ తొలి రెండు టీ20ల్లో వరుసగా 0,6 పరుగులు మాత్రమే చేశాడు. డకెట్ది కూడా అదే తీరు. కోల్కతాలో 4 పరుగులు చేసిన డకెట్.. చెపాక్లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు.మరోవైపు లైమ్ లివింగ్ స్టోన్ కూడా తన మార్క్ను చూపించలేకపోతున్నాడు. మిడిలార్డర్లో అతడి వైఫల్యం ఇంగ్లండ్కు ప్రధాన సమస్యగా మారింది. ఈ మ్యాచ్లో వీరు రాణించకపోతే తదుపరి మ్యాచ్కు వేటు పడే ఛాన్స్ ఉంది. అయితే టాప్ క్లాస్ బ్యాటర్లు సైతం విఫలమకావడంతో కెప్టెన్ జోస్ బట్లర్పై ఒత్తడి పెరుగుతుంది.తొలి టీ20లో 68 పరుగులతో కెప్టెన్ నాక్ ఆడిన జోస్.. రెండో మ్యాచ్లోనూ 45 పరుగులతో రాణించాడు. కాగా ఈ సిరీస్లో ఇంగ్లండ్ ప్రస్తుతం 0-2తో వెనుకబడి ఉంది. ఇంగ్లండ్ జట్టు సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే రాజ్కోట్లో తప్పకగెలవాల్సిందే.ఇక మూడో టీ20లో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగే సూచనలు కన్పిస్తున్నాయి. ధ్రువ్ జురెల్ స్ధానంలో శివమ్ దూబే, రవి బిష్ణోయ్ ప్లేస్లో మహ్మద్ షమీ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కన్పిస్తోంది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, అర్ష్దీప్, వరుణ్ చక్రవర్తి అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. దీంతో మరోసారి ఇంగ్లీష్ జట్టుకు కఠిన సవాలు ఎదురుకానుంది.మూడో టీ20కు ఇంగ్లండ్ తుది జట్టుబెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్భారత తుది జట్టు(అంచనా)సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిచదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో మూడో టీ20.. భారత జట్టులోకి ఇద్దరు స్టార్ ప్లేయర్లు? -
ఇంగ్లండ్తో మూడో టీ20.. భారత జట్టులోకి ఇద్దరు స్టార్ ప్లేయర్లు?
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం స్వదేశంలో ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్తో తలపడుతోంది. ఇప్పటికే తొలి రెండు టీ20ల్లో విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు మూడో మ్యాచ్లో పర్యాటక జట్టును ఢీకొట్టేందుకు సిద్దమైంది. రాజ్కోట్ వేదికగా మంగళవారం భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తుంటే.. ఇంగ్లండ్ జట్టు మాత్రం ఎలాగైనా తిరిగి పుంజుకోవాలని పట్టుదలతో ఉంది. ఇక రాజ్కోట్ టీ20లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.శివమ్ దూబే రీఎంట్రీ?మూడో టీ20కు భారత తుది జట్టులో ఆల్రౌండర్ శివమ్ దూబే వచ్చే అవకాశముంది. చెపాక్ టీ20కు ముందు గాయం కారణంగా జట్టుకు దూరమైన నితీశ్కుమార్ స్ధానాన్ని దూబేతో బీసీసీఐ భర్తీ చేసింది. అయితే అప్పటికే దూబే రంజీ ట్రోఫీలో ఆడుతుండడంతో రెండో టీ20లో ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కలేకపోయాడు. రెండో టీ20 అనంతరం రాజ్కోట్లో జట్టుతో దూబే కలిశాడు.ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ స్దానంలో తుది జట్టులోకి దూబే రావడం ఖాయమని క్రికెట్ విశ్లేషుకులు అభిప్రాయపడుతున్నారు. కాగా దూబే టీ20 వరల్డ్కప్-2024 గెలిచిన జట్టులో సభ్యునిగా ఉన్నాడు. ఆ తర్వాత గాయం బారిన పడడంతో బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాతో సిరీస్లకు దూరమయ్యాడు. మళ్లీ ఇప్పుడు దాదాపు 6 నెలల భారత జట్టు తరపున ఆడేందుకు ఈ ముంబై ఆల్రౌండర్ సిద్దమయ్యాడు.మహ్మద్ షమీకి ఛాన్స్..ఇక తొలి రెండు టీ20లకు బెంచ్కే పరిమితమైన స్టార్ పేసర్ మహ్మద్ షమీ(Mohammad Shami) రాజ్కోట్ టీ20లో ఆడనున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజ్కోట్ వికెట్ సాధరణంగా పేస్ బౌలర్లకు అనుకూలిస్తోంది. ఈ క్రమంలోనే మూడో టీ20లో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని భారత జట్టు మెనెజ్మెంట్ భావిస్తోంది.స్పిన్నర్ రవి బిష్ణోయ్ను పక్కన పెట్టి షమీని తుది జట్టులోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. అయితే తొలి రెండు టీ20ల్లో షమీకి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదన్న విషయంపై ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ లేదు. కనీసం మూడో టీ20లో అయినా తమ ఆరాధ్య క్రికెటర్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.భారత తుది జట్టు(అంచనా)సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిచదవండి: అప్పట్లో ఒకడుండేవాడు.. ఇప్పుడు తిలక్ వర్మ!: భారత మాజీ క్రికెటర్ -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్.. ప్రపంచంలో తొలి ప్లేయర్గా
భారత్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో పర్యాటక ఇంగ్లండ్ జట్టు వరుసగా రెండో ఓటమి చవిచూసింది. శనివారం చెపాక్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో రెండు వికెట్ల తేడాతో ఇంగ్లండ పరాజయం పాలైంది. తొలి టీ20లో బ్యాటింగ్, బౌలింగ్లో తేలిపోయిన ఇంగ్లండ్.. రెండో టీ20లో మాత్రం గట్టి పోటీ ఇచ్చింది. ఆఖరి ఓవర్ ఉత్కంఠబరితంగా సాగిన ఈ మ్యాచ్లో తిలక్ వర్మ విరోచత పోరాటం వల్ల ఇంగ్లండ్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో కూడా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తన బ్యాట్కు పనిచెప్పాడు. 30 బంతుల్లో 3 ఫోర్లు, 2 భారీ సిక్సర్లతో 45 పరుగులు చేసి మరోసారి తృటిలో హాఫ్ సెంచరీ అవకాశాన్ని జోస్ కోల్పోయాడు. అయితే బట్లర్ హాఫ్ సెంచరీ సాధించకపోయినప్పటికి ఓ అరుదైన రికార్డును మాత్రం తన పేరిట లిఖించుకున్నాడు.పూరన్ రికార్డు బద్దలు..భారత్పై టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా జోస్ బట్లర్ రికార్డులకెక్కాడు. ఇంగ్లండ్ కెప్టెన్ టీ20ల్లో భారత్పై ఇప్పటివరకు 611 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్ పేరిట ఉండేది.పూరన్ టీ20ల్లో టీమిండియాపై 592 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో పూరన్ ఆల్టైమ్ రికార్డును బట్లర్ బ్రేక్ చేశాడు. అవేవిధంగా బట్లర టీ20ల్లో భారత్పై అత్యధికంగా 50+ స్కోర్లు సాధించిన రికార్డును నికోలస్ పూరన్తో కలిసి సంయుక్తంగా కలిగి ఉన్నాడు.టీ20ల్లో భారత్పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..జోస్ బట్లర్- 611నికోలస్ పూరన్- 592గ్లెన్ మాక్స్వెల్- 574డేవిడ్ మిల్లర్- 524ఆరోన్ ఫించ్- 500చదవండి: సంతోషంగా ఉంది.. అతడి వల్లే ఓడిపోయే మ్యాచ్లో గెలిచాము: సూర్య -
సంతోషంగా ఉంది.. అతడి వల్లే ఓడిపోయే మ్యాచ్లో గెలిచాము: సూర్య
చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో రెండు వికెట్ల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో తిలక్ వర్మ(Tilak Varma) తన అద్భుత ఇన్నింగ్స్తో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.తిలక్ 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 72 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విరోచిత పోరాటం ఫలితంగా 166 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 19.2 ఓవర్లలో చేధించింది. ఈ క్రమంలో తిలక్ వర్మ ఆసాదరణ బ్యాటింగ్పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) ప్రశంసల వర్షం కురిపించాడు."గేమ్ సాగిన తీరు నాకు కాస్త ఉపశమనం ఇచ్చింది. 160 ప్లస్ టార్గెట్ను సులువగానే ఛేదించవచ్చని భావించాం. కానీ ఇంగ్లండ్ పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఒక్కసారిగా మ్యాచ్ వారి వైపు మలుపు తిరిగింది. మేము గత రెండు, మూడు సిరీస్ల నుంచి ఓ అదనపు బ్యాటర్తో ఆడుతున్నాము. అదే బ్యాటర్ మాకు బంతితో రెండు లేదా మూడు ఓవర్లు బౌలింగ్ కూడా వేస్తున్నాడు. అందుకే ఈ మ్యాచ్లో వాషింగ్టన్ను ఆడించాము. అయితే గత మ్యాచ్లో దూకుడుగా ఆడినట్లే ఇక్కడ పరుగులు రాబట్టడం కుదరలేదు. కానీ ఎటువంటి పరిస్థితులలోనైనా ఆ అగ్రిసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ను కొనసాగించాలని ముందే నిర్ణయించుకున్నాము.ఈ మ్యాచ్లో మా బాయ్స్ చిన్న చిన్న భాగస్వామ్యాలను నెలకొల్పారు. మా విజయంలో ఆ భాగస్వామ్యాలు కీలక పాత్ర పోషించాయి. మ్యాచ్ మధ్యలో కాస్త నేను కంగారు పడ్డాను. ఇవన్నీ ఆటలో భాగమే అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. ఆ సమయంల తిలక్ వర్మ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.అతడు బ్యాటింగ్ చేసిన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అతడు బాధ్యత తీసుకుని జట్టును గెలిపించడం చాలా సంతోషంగా ఉంది. బిష్ణోయ్ కూడా ఈ రెండు మ్యాచ్ల్లో వికెట్ లెస్గా ఉండవచ్చు గానీ, అతడు నెట్స్లో చాలా కష్టపడుతున్నాడు.బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా ఎక్కువగా చేస్తున్నాడు. ఈ రోజు బంతితో రాణించికపోయిన బ్యాట్తో రవి తన వంతు సహకారం అందించాడు. అర్షదీప్ కూడా ఆఖరిలో విలువైన పరుగులు చేశాడు. మా కుర్రాళ్లు నాపై ఒత్తిడి తగ్గించారు. దీంతో నేను స్వేఛ్చగా వెళ్లి ఆడేందుకు మార్గం సుగమమైంది. సీనియర్లు, యువకులతో డ్రెస్సింగ్ రూమ్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. అందరూ ఒకే మాటపై ఉంటే ఫలితాలు కూడా సానుకూలంగా వస్తాయి’’ అని సూర్యకుమార్ పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. -
సూపర్ ఇన్నింగ్స్.. తిలక్కు సలాం కొట్టిన సూర్యకుమార్
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ(Tilak Varma) తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో తిలక్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. తన అద్బుతప్రదర్శనతో భారత్కు వరుసగా రెండో విజయాన్ని అందించాడు. సంజూ శాంసన్, అభిషేక్, సూర్య వంటి ప్రధాన ఆటగాళ్లు తేలిపోయిన చోట తిలక్ విరోచిత పోరాటం కనబరిచాడు. లక్ష్య చేధనలో క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికి తిలక్ మాత్రం టెయిలాండర్లతో కలిసి తన సూపర్ ఇన్నింగ్స్ను కొనసాగించాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన తిలక్ వర్మ.. ఆఖరివరకు క్రీజులో నిలబడి మ్యాచ్ను ముగించాడు.ఓవరాల్గా వర్మ 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 72 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విరోచిత పోరాటం ఫలితంగా 166 పరుగుల లక్ష్యాన్ని భారత్ 8 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో అందుకుంది. తద్వారా చెపాక్ టీ20లో 2 వికెట్ల తేడాతో టీమిండియా విజయాన్ని అందుకుంది. దీంతో ఐదు టీ20ల సిరీస్లో భారత జట్టు 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.సూర్య పిధా.. కాగా హైదరాబాదీ తిలక్ వర్మ అసాధారణ బ్యాటింగ్కు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) పిధా అయ్యాడు. విజయనంతరం గ్రౌండ్లోకి వచ్చిన సూర్య.. తిలక్ వద్దకు వెళ్లి తల వంచి మరి చప్పట్లు కొడుతూ అభినందించాడు. అందుకు తిలక్ కూడా సంతోషించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా తిలక్, సూర్యకు మంచి అనుబంధం ఉంది.వర్మ భారత జట్టులోకి రాకముందే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున సూర్యతో కలిసి ఆడాడు. ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసినఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (45; 30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలవగా.. బ్రైడన్ కార్సే (31; 17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లు), జేమీ స్మిత్ (22; 12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లు) రాణించారు.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించగా.. అర్ష్దీప్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 మంగళవారం (జనవరి 28) రాజ్కోట్లో జరగనుంది.చదవండి: IND vs ENG: తిలక్ వర్మ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా Tilak Verma with Suryakumar yadav after match yesterday at Chapeuk.!!!!- A beautiful Video, Mumbai Indians boy's..!!pic.twitter.com/y3Jcb2ou3G— MANU. (@Manojy9812) January 26, 2025 -
ఎస్ఆర్హెచ్కు గుడ్న్యూస్.. చెపాక్లో దుమ్ములేపిన ఆల్రౌండర్
చెన్నై వేదికగా భారత్తో జరిగిన రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఓటమి పాలైనప్పటికి ఆ జట్టు ఆల్రౌండర్ బ్రైడన్ కార్స్(Brydon Carse) తన అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ దుమ్ములేపాడు.ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన కార్స్.. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 17 బంతుల్లో 3 సిక్స్లు, ఒక ఫోర్త్తో 31 పరుగులు చేశాడు. 29 ఏళ్ల కార్స్ దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు. లేదంటే ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించిండేది. కార్స్ బౌలింగ్లోనూ సత్తాచాటాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 29 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.ఎస్ఆర్హెచ్కు గుడ్న్యూస్..కాగా బ్రైడన్ కార్స్ భారత గడ్డపై ఈ తరహా ప్రదర్శన చేయడం ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్కు గుడ్న్యూసే అని చెప్పాలి. ఎందుకంటే ఐపీఎల్-2025 మెగా వేలంలో కార్స్ను ఎస్ఆర్హెచ్ కేవలం రూ. కోటిరూపయాలకే సొంతం చేసుకుంది. భారత్ పిచ్లపై తొలిసారి ఆడినప్పటికి ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా అందరిని కార్స్ మెప్పించాడు. కార్స్ తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటివరకు కేవలం 5 టీ20లు మాత్రమే ఆడాడు.మొత్తంగా 9 వికెట్లు పడగొట్టాడు. ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో ఆడిన అనుభవం మాత్రం అతడికి ఉంది. సౌతాఫ్రికా టీ20, ది హండ్రెడ్, వైటాలిటీ బ్లాస్ట్లో ఈ ఇంగ్లండ్ ఆల్రౌండర్ ఆడాడు. కాగా ఎస్ఆర్హెచ్లో ఇప్పటికే నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, ప్యాట్ కమ్మిన్స్ వంటి అద్భుతమైన ఆల్రౌండర్లు ఉన్నారు. ఇప్పుడు కార్స్ రాకతో ఎస్ఆర్హెచ్ ఆల్రౌండ్ విభాగం మరింత పటిష్టంగా మారింది.ఐపీఎల్-2025కు ఎస్ఆర్హెచ్ జట్టు: పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్ , రాహుల్ చాహర్, ఆడమ్ జంపా , అథర్వ తైదే, అభినవ్ మనోహర్, సిమర్జిత్ సింగ్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, బ్రైడన్ కార్సే, కమిందు మెండిస్ , అనికేత్ వర్మ , ఎషాన్ మలింగ , సచిన్ బేబీ.చదవండి: IND vs ENG: తిలక్ వర్మ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
తిలక్ వర్మ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
చెపాక్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి టీమిండియా దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో భారత యువ ఆటగాడు తిలక్ వర్మ అత్యద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. లక్ష్య చేధనలో క్రమం తప్ప వికెట్లు పడినప్పటికి తిలక్ మాత్రం తన విరోచిత పోరాటం కనబరిచాడు. ఆఖరి వరకు క్రీజులో నిలబడి భారత్కు అద్బుతమైన విజయాన్ని అందించాడు.తిలక్ 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 72 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. దీంతో భారత్ 166 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇక మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ తిలక్ వర్మ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. తిలక్ వర్మ గత నాలుగు టీ20 ఇన్నింగ్స్లలో ఒక్కసారైనా ఔట్ కాకుండా మొత్తం 318 పరుగులు సాధించాడు.తద్వారా టీ20ల్లో రెండు డిస్మిసల్స్(ఔట్లు) మధ్య అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా తిలక్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ మార్క్ చాప్మన్ పేరిట ఉండేది. చాప్మాన్ టీ20ల్లో రెండు ఔట్ల మధ్య 271 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో చాప్మన్ రికార్డును ఈ హైదరాబాదీ బ్రేక్ చేశాడు.టీ20ల్లో రెండు ఔట్ల మధ్య అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..318 తిలక్ వర్మ (107*, 120*, 19*, 72*)271 మార్క్ చాప్మన్ (65*, 16*, 71*, 104*, 15)240 ఆరోన్ ఫించ్ (68*, 172)240 శ్రేయాస్ అయ్యర్ (57*, 74*, 73*, 36)239 డేవిడ్ వార్నర్ (100*, 60*, 57*, 2*, 20)ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (45; 30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలవగా.. బ్రైడన్ కార్సే (31; 17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లు), జేమీ స్మిత్ (22; 12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లు) దూకుడగా ఆడారు.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించగా.. అర్ష్దీప్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 మంగళవారం (జనవరి 28) రాజ్కోట్లో జరగనుంది.చదవండి: BCCI: టీమిండియాకు భారీ షాక్.. ఇంగ్లండ్ సిరీస్ నుంచి ఇద్దరు స్టార్లు ఔట్ -
వరుణ్ 'అందమైన మిస్టరీ స్పిన్నర్'.. వన్డేల్లో కూడా ఆడించాలి!
ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో భారత్ అగ్రశ్రేణి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో దేశంలోని క్రికెట్ అభిమానులందరూ అతని వారసుడు ఎవరు అని సందిగ్ధంలో పడ్డారు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఇంగ్లండ్తో జరిగిన తొలి టి20 మ్యాచ్ లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన మాయాజాలంతో ప్రత్యర్థి జట్టులోని అగ్రశ్రేణి బ్యాటర్లని బోల్తా కొట్టించిన తీరు చూస్తే అశ్విన్ కి తగ్గ వారసుడు దొరికాడని అతనిని అభినందించకుండా ఉండలేరు.చెపాక్లో జరిగిన రెండో టీ20లో వరుణ్ సత్తాచాటాడు. వరుణ్ చక్రవర్తి దేశవాళీ పోటీలలో తమిళ నాడు కి ప్రాతినిధ్యం వహిస్తాడు. వరుణ్ కి అశ్విన్ అభిమాన స్పిన్ బౌలర్ కావడమే కాక అతని నుంచే స్పిన్ బౌలింగ్ మెళకువలు నేర్చుకోవడం విశేషం.కర్ణాటక నుంచి చెన్నై కి..వరుణ్ పుట్టింది కర్ణాటకలోని బీదర్లో అయినప్పటికీ విద్యాభ్యాసమంతా చెన్నైలో జరిగింది. చెన్నై లోని సెయింట్ పాట్రిక్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. ఆ తర్వాత ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చర్లో బ్యాచలర్ డిగ్రీ పొందాడు.25 సంవత్సరాల వయసులో క్రికెట్ను కెరీర్ గా ఎంచుకొని ఆర్కిటెక్ట్ ఉద్యోగానికి రాజీనామా చేసాడు. కొద్దిగా ఆలస్యంగా క్రికెట్ లోకి వచ్చినప్పటికీ ఎంతో ఏకాగ్రతతో సాధన చేసి అనతికాలంలోనే దేశంలోనే అగ్రశ్రేణి స్పిన్నర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ లోని పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించి తన బౌలింగ్ కి మెళకువలు దిద్దుకొని దేశంలోనే ప్రధాన స్పిన్నర్లలో ఒకడిగా పేరు గడించాడు.వరుణ్ ని అడ్డుకోవడానికి ఇంగ్లండ్ వ్యూహం? ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టి20 మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టుపై గట్టి దెబ్బతీసాడు. రెండో టీ20లో 38 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఆరడుగుల ఎత్తు కూడా వరుణ్ కి బాగా కలిసి వచ్చింది. వరుణ్ బౌలింగ్ తీరు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ను సైతం ఆకట్టుకుంది. వరుణ్ ని వాన్ "అందమైన మిస్టరీ స్పిన్నర్" గా అభివర్ణించడం విశేషం. వరుణ్ ఇతర స్పిన్నర్ల లాగా బంతి ని ఎక్కువగా స్పిన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని లైన్ అండ్ లెంగ్త్ ఎప్పుడూ నిలకడ ఉంటుంది. స్టంప్స్ ని గురిపెట్టి చాలా స్థిరంగా, తెలివిగా బౌలింగ్ చేస్తాడు. వరుణ్ చక్రవర్తిపై ఒత్తిడి తీసుకురావడానికి ఇంగ్లాండ్ బ్యాటర్లు సరైన వ్యూహాన్ని రూపొందించాలి.. లేకపోతే అతను ఇంగ్లండ్ కి చాల ప్రమాదకరంగా పరిణమించే అవకాశముందని, హెచ్చరిక కూడా చేసాడు.భారత్ కి కొత్త ఆశలు వరుణ్ భారత్ తరుఫున 2021లో టి20 మ్యాచ్ ల్లో రంగ ప్రవేశం చేసాడు. ఇప్పటివరకు వరుణ్ చక్రవర్తి 15 టి20 లలో భారత్ కి ప్రాతినిధ్యం వహించి 24 వికెట్లు తీసుకున్నాడు. కోల్కతాలోని తొలి టి20 మ్యాచ్ లో వరుణ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికైనప్పటికీ, అర్ష్దీప్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ కూడా ఈ మ్యాచ్ లో కీలక పాత్ర పోషించారు, ఒక్కొక్కరు రెండేసి వికెట్లు తీసుకున్నారు.మొత్తానికి ఆస్ట్రేలియాలో చతికిలపడి నిస్తేజంగా ఉన్న భరత్ జట్టుకి వరుణ్ తన స్పిన్ మాయాజాలంతో కొత్త ఊపిరి పోసాడు. అయితే వరుణ్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకో లేకపోవడం బాధాకరం. మంచి ఫామ్ లో ఉన్న వరుణ్ ని భారత్ సెలెక్టర్లు సరైన రీతిలో ప్రోత్సహిస్తే జట్టుకి అశ్విన్ వంటి ఎంతో అనుభవం ఉన్న స్పిన్నర్ లేని కొరత కొంతవరకైనా తీరుతుంది.చదవండి: తిలక్ తడాఖా.. చెపాక్ టీ20లో భారత్ విజయం -
వరుణ్ స్పిన్ మ్యాజిక్.. హ్యారీ బ్రూక్ ఫ్యూజ్లు ఔట్
చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టీ20లో భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరోసారి తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శించాడు. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ను అద్బుతమైన బంతితో వరుణ్ బోల్తా కొట్టించాడు. చక్రవర్తి వేసిన బంతికి బ్రూక్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన చక్రవర్తి మూడో బంతిని అద్బుతమైన గూగ్లీగా సంధించాడు.బంతి పిచ్ అయిన వెంటనే షార్ప్గా టర్న్ అయింది. బంతి ఎటువైపు తిరుగుతుందో బ్రూక్ అంచనా వేయలేకపోయాడు. ఈ క్రమంలో బంతి హ్యారీ బ్రూక్ బ్యాట్, ప్యాడ్ గ్యాప్లో నుంచి వెళ్లి స్టంప్స్ను గిరాటేసింది. దీంతో బ్రూక్ చేసేదేమి లేక అలా నవ్వుతూ ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా తొలి టీ20లో ఇదే తరహాలో బ్రూక్ను వరుణ్ ఔట్ చేశాడు. ఇక రెండో టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్(45) టాప్ స్కోరర్గా నిలవగా.. బ్రైడన్ కార్సే(31), జేమీ స్మిత్(22) రాణించారు.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించగా.. అర్ష్దీప్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ తలా వికెట్ సాధించారు. కాగా తొలి టీ20లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే.చదవండి: BCCI: టీమిండియాకు భారీ షాక్.. ఇంగ్లండ్ సిరీస్ నుంచి ఇద్దరు స్టార్లు ఔట్ Through the gates! 🎯The in-form Varun Chakaravarthy strikes in his very first over ⚡️⚡️Follow The Match ▶️ https://t.co/6RwYIFWg7i#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank | @chakaravarthy29 pic.twitter.com/NddoPmTlDo— BCCI (@BCCI) January 25, 2025 -
తిలక్ వర్మ విరోచిత పోరాటం.. రెండో టీ20లో భారత్ విజయం
India vs England 2nd T20I Live Updates And Highlights: చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా రెండో టీ20లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి.తిలక్ సూపర్ ఇన్నింగ్స్..చెపాక్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యాన్ని భారత్ 8 వికెట్లు కోల్పోయి చేధించింది. టీమిండియా విజయంలో హైదరాబాదీ తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు. లక్ష్య చేధనలో క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటకి తిలక్ విరోచిత పోరాటం కనబరిచాడు.ఆఖరివరకు క్రీజుల ఉండి భారత్కు అద్బుతమైన విజయాన్ని అందించాడు. తిలక్ 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 72 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. భారత బ్యాటర్లలో తిలక్తో పాటు వాషింగ్టన్ సుందర్(26) రాణించాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్సే మూడు వికెట్లు పడగొట్టగా.. రషీద్, వుడ్, అర్చర్, ఓవర్టన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్(45) టాప్ స్కోరర్గా నిలవగా.. బ్రైడన్ కార్సే(31), జేమీ స్మిత్(22) రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించగా.. అర్ష్దీప్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ తలా వికెట్ సాధించారు.18 ఓవర్లకు భారత్ స్కోర్: 153/818 ఓవర్లు ముగిసే సరికి భారత్ 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. భారత విజయానికి కేవలం 12 బంతుల్లో 13 పరుగులు కావాలి.క్రీజులో తిలక్ వర్మ(63), రవి బిష్ణోయ్(5) ఉన్నారు.ఏడో వికెట్ డౌన్..టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన అక్షర్ పటేల్..లివింగ్ స్టోన్ బౌలింగ్లో ఔటయ్యాడు.భారత్ ఆరో వికెట్ డౌన్..వాషింగ్టన్ సుందర్ రూపంలో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన సుందర్.. బ్రైడన్ కార్సే బౌలింగ్లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు భారత్ స్కోర్: 119/6. భారత్ విజయానికి 6 ఓవర్లలో 47 పరుగులు కావాలి. క్రీజులో తిలక్ వర్మ(41), అక్షర్ పటేల్(1) ఉన్నారు.భారత్ ఐదో వికెట్ డౌన్.. పాండ్యా ఔట్టీమిండియా వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. 8వ ఓవర్లో బ్రైడన్ కార్సే బౌలింగ్లో ధ్రువ్ జురెల్(4) ఔట్ కాగా.. 9వ ఓవర్లో ఓవర్టన్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యా(7) ఔటయ్యాడు. 10 ఓవర్లకు భారత్ స్కోర్: 79/5మూడో వికెట్ డౌన్..58 పరుగులు వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. బ్రైడన్ కార్సే బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 7 ఓవర్లకు భారత్ స్కోర్: 63-3, క్రీజులో తిలక్వర్మ(27), ధ్రువ్ జురెల్(3)ఉన్నారు.భారత్ రెండో వికెట్ డౌన్..భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన సంజూ శాంసన్.. జోఫ్రా అర్చర్ బౌలింగ్లో స్మిత్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. 3 ఓవర్లకు భారత్ స్కోర్: 28/2తొలి వికెట్ డౌన్.. అభిషేక్ ఔట్అభిషేక్ శర్మ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన అభిషేక్.. మార్క్ వుడ్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. క్రీజులో తిలక్ వర్మ వచ్చాడు.భారత టార్గెట్ ఎంతంటే?చెపాక్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టీ20లో భారత బౌలర్లు రాణించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్(45) టాప్ స్కోరర్గా నిలవగా.. బ్రైడన్ కార్సే(31), జేమీ స్మిత్(22) రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించగా.. అర్ష్దీప్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ తలా వికెట్ సాధించారు.ఏడో వికెట్ డౌన్..ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన జెమ్మీ ఓవర్టన్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 16ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 136/7ఇంగ్లండ్ ఆరో వికెట్ డౌన్..104 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన జేమీ స్మిత్.. అభిషేక్ శర్మ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి కార్సే వచ్చాడు.ఐదో వికెట్ డౌన్..ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన లివింగ్ స్టోన్..అక్షర్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 94/5బట్లర్ ఔట్..బట్లర్ రూపంలో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన బట్లర్.. అక్షర్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి స్మిత్ వచ్చాడు. 9.3 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 77/4ఇంగ్లండ్ మూడో వికెట్ డౌన్.. ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన బ్రూక్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి లివింగ్స్టోన్వచ్చాడు. 7 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్:61/3ఇంగ్లండ్ రెండో వికెట్ డౌన్.. డకెట్ ఔట్బెన్ డకెట్ రూపంలో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 3 పరుగులు మాత్రమే చేసిన డకెట్.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి హ్యారీ బ్రూక్ వచ్చాడు. 4 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 35/2. క్రీజులో జోస్ బట్లర్(26), హ్యారీ బ్రూక్(1) ఉన్నారు.ఇంగ్లండ్ తొలి వికెట్ డౌన్..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్(4)ను అర్ష్దీప్ సింగ్ పెవిలియన్కు పంపాడు. క్రీజులోకి కెప్టెన్ జోస్ బట్లర్ వచ్చాడు. మొదటి ఓవరు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోర్: 8/1చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా రెండో టీ20లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసుకుంది. చెపాక్ టీ20లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. స్టార్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గాయం కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.అదేవిధంగా రింకూ సింగ్ కూడా ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. వీరిద్దరి స్ధానంలో ప్లేయింగ్ ఎలెవన్లోకి వాషింగ్టన్ సుందర్, ధ్రువ్జురెల్ వచ్చారు. అయితే ఈ మ్యాచ్లో కూడా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఆడటం లేదు. షమీ అందుబాటుపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. మరోవైపు ఇంగ్లండ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. గాస్ అట్కినసన్, బెతల్ స్ధానంలో బ్రైడన్ కార్సే, జామీ స్మిత్లు వచ్చారు.తుది జట్లు..భారత్: సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిఇంగ్లండ్: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్చదవండి: BCCI: టీమిండియాకు భారీ షాక్.. ఇంగ్లండ్ సిరీస్ నుంచి ఇద్దరు స్టార్లు ఔట్ -
టీమిండియాకు భారీ షాక్.. ఇంగ్లండ్ సిరీస్ నుంచి ఇద్దరు స్టార్లు ఔట్
చెన్నై వేదికగా రెండో టీ20లో తలపడేందుకు టీమిండియా, ఇంగ్లండ్ జట్లు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్కు ముందు భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత స్టార్ ఆల్రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, రింకూ సింగ్లు గాయాల బారిన పడ్డారు. ప్రాక్టీస్ సెషన్లో నితీశ్కు ప్రక్కెటెముకల(సైడ్ స్ట్రెయిన్) గాయానికి గురయ్యాడు. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో మిగిలిన మ్యాచ్లకు మొత్తానికి ఈ ఆంధ్ర ఆటగాడు దూరమయ్యాడు. మరోవైపు రింకూ సింగ్ ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో రింకూ రెండో, మూడో టీ20 నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధ్రువీకరించింది. "జనవరి 24న చెన్నైలో జరిగిన ప్రాక్టీస్ సెషన్లో ఆల్రౌండర్ నితీష్ రెడ్డి ప్రక్కెటెముకల నొప్పితో బాధపడ్డాడు. ఈ క్రమంలో ఐదు టీ20ల సిరీస్లో మిగిలిన మ్యాచ్లకు అతడు దూరమయ్యాడు. నితీశ్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి వెళ్లనున్నాడు.అదేవిధంగా తొలి టీ20లో ఫీల్డింగ్ చేస్తుండగా రింకూ సింగ్కు వెన్నునొప్పి వచ్చింది. అతడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు. రింకూ ప్రస్తుతం మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. అయితే అతడు ఈ సిరీస్లో రెండు, మూడు టీ20లకు దూరం కానున్నాడు" అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా నితీశ్, రింకూ స్ధానాలను బీసీసీఐ శివమ్ దూబే, రమణ్దీప్ సింగ్లతో భర్తీ చేసింది.ఇంగ్లండ్తో టీ20 సిరీస్కి అప్డేటడ్ భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రమణదీప్ సింగ్.చదవండి: WPL 2025: ఆర్సీబీకి బ్యాడ్ న్యూస్.. సీజన్ మెత్తానికి స్టార్ ప్లేయర్ దూరం -
ఇంగ్లండ్తో రెండో టీ20.. వరల్డ్ రికార్డుపై కన్నేసిన అర్ష్దీప్
చెన్నై వేదికగా ఇంగ్లండ్తో మూడో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్ శనివారం సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో కూడా ఆస్ట్రేలియాను చిత్తు చేసి సిరీస్లో ఆధిక్యం పెంచుకోవాలని భారత జట్టు యోచిస్తోంది.అందుకు తగ్గట్టు తమ ఆస్త్రశాస్త్రాలను భారత్ సిద్దం చేసుకుంది. ఇక చెపాక్ టీ20కు ముందు భారత యువ పేసర్ అర్ష్దీప్ సింగ్(Arshdeep Singh)ను ఓ వరల్డ్ రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్లో అర్ష్దీప్ మరో మూడు వికెట్లు పడగొడితే.. టీ20ల్లో అత్యంతవేగంగా 100 వికెట్ల మైలు రాయిని అందుకున్న ఫాస్ట్బౌలర్గా చరిత్ర సృష్టిస్తాడు. అర్ష్దీప్ ఇప్పటివరకు 61 మ్యాచ్లు ఆడి 97 వికెట్లు పడగొట్టాడు.ప్రస్తుతం ఈ రికార్డు పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ పేరిట ఉంది. రౌఫ్ 71 మ్యాచ్ల్లో వంద వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. చెపాక్ టీ20లో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు తీస్తే ఈ అరుదైన ఫీట్ను తన ఖాతాలో వేసుకుంటాడు. అర్ష్దీప్ ఉన్న ఫామ్లో రౌఫ్ రికార్డు బద్దలు అవ్వడం ఖాయం.తొలి టీ20లో కూడా ఈ పంజాబీ పేసర్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లను పడగొట్టాడు. ఈ క్రమంలో టీ20ల్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా అర్ష్దీప్(97) రికార్డులకెక్కాడు.టీ20ల్లో అత్యంతవేగంగా 100 వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్లు వీరే..హ్యారీస్ రౌఫ్ - పాకిస్తాన్ (71 మ్యాచ్లు)మార్క్ అడైర్-ఐర్లాండ్(72 మ్యాచ్లు)బిలాల్ ఖాన్-ఒమన్(72 మ్యాచ్లు)షాహీన్షా అఫ్రిది- పాకిస్తాన్(74 మ్యాచ్లు)లసిత్ మలింగ-శ్రీలంక(76 మ్యాచ్లు)చదవండి: ముంబైను చిత్తు చేసిన జమ్మూ కాశ్మీర్.. అంతా రోహిత్ వల్లే? -
రెండో టి20: జోరు మీదున్న టీమిండియా
ఇంగ్లండ్తో బోణీ అదిరింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో టీమిండియా సత్తా చాటుకుంది. ఇక సిరీస్లో పైచేయే మిగిలింది. వరుస మ్యాచ్ల విజయాలతో ప్రత్యర్థిని దెబ్బతీయాలని ఆతిథ్య భారత్ చూస్తోంది. తద్వారా సిరీస్ ఫలితం కోసం ఆఖరి పోరు (ఐదో టి20) దాకా లాక్కెళ్లడం ఎందుకని భావిస్తోంది. అయితే ఇది టి20 ఫార్మాట్.ఇందులో సొంతగడ్డ అనుకూలతలు, పర్యాటక జట్టుకు ప్రతికూలతలంటూ ఉండవు. ఒక్క ఓవర్ మార్చేస్తుంది. ఇక మెరుపు ఇన్నింగ్స్ తేల్చేస్తుంది. అలాంటి స్పీడ్ గేమ్లో మనదే ఆధిపత్యమనుకొని ఆదమరిస్తే అంతే సంగతి! ఐసీసీ ర్యాంకింగ్తో సంబంధం లేకుండా అంతర్జాతీయ క్రికెట్లోనే ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్ జట్లు ఎప్పుడైనా సరే టాప్–3 జట్లే! కాబట్టి బట్లర్ బృందాన్ని ఏమాత్రం తక్కువ అంచనా వేసినా భారత్ మూల్యం చెల్లించుకోక తప్పదు. పైగా ఐపీఎల్లో హార్డ్ హిట్టర్గా ఇక్కడి పిచ్లపై కెప్టెన్ బట్లర్కు చక్కని అవగాహన ఉంది. ఆ సంగతి సూర్యకుమార్ బృందం మర్చిపోకూడదు. ఈ నేపథ్యంలో నేడు జరిగే రెండో టి20లో భారత్, ఇంగ్లండ్ జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. చెన్నై: కోల్కతాలో జరిగిన తొలి టి20 మ్యాచ్లో ఇంగ్లండ్ బోల్తా పడింది. అలాగని ఒక్క మ్యాచ్తోనే పటిష్టమైన ఇంగ్లండ్ను తేలిగ్గా తీసుకోలేం. ఓపెనింగ్లో ఫిల్ సాల్ట్, మిడిలార్డర్లో హ్యారీ బ్రూక్, లివింగ్స్టోన్లు బ్యాట్ ఝుళిపిస్తే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు. ఈ ముగ్గురితో పాటు జోస్ బట్లర్కు ఇక్కడి పిచ్లు కొట్టిన పిండే! అతని విధ్వంసం కొన్ని ఓవర్లపాటే ఉన్నా ఆ ప్రభావం ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను గణనీయంగా మార్చేస్తుంది. బౌలింగ్లో పేస్ ఆల్రౌండర్ జోఫ్రా ఆర్చర్ మెరుగ్గా బౌలింగ్ చేశాడు. అట్కిన్సన్, మార్క్ వుడ్లతో పార్ట్టైమ్ బౌలర్గా లివింగ్స్టోన్ కూడా బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. గత మ్యాచ్లో విఫలమైనంత మాత్రాన జట్టు వెనుకబడదు. కచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచేందుకు, 1–1తో సమం చేసేందుకు బట్లర్ బృందం గట్టి పోరాటమే చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. షమీ ఆడేనా? భారత వెటరన్ సీమర్ షమీ గాయాల తర్వాత దేశవాళీ క్రికెట్లో బరిలోకి దిగాడు. ఫిట్నెస్ నిరూపించుకున్నాడు. అయితే అంతర్జాతీయ పోటీలకు మాత్రం నిరీక్షణ తప్పడం లేదు. ‘ఈడెన్’లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన భారత బృందం స్పిన్కు స్వర్గధామమైన ‘చెపాక్’లోనూ అదే ఎత్తుగడను కొనసాగిస్తే సీనియర్ పేసర్ డగౌట్కే పరిమితం కావొచ్చు. ఒకవేళ ఐదు మ్యాచ్ల సుదీర్ఘ సిరీస్లో అతన్ని దించాలనుకుంటే మాత్రం ‘ఈడెన్’లో ప్రభావం చూపలేకపోయిన స్పిన్నర్ రవి బిష్ణోయ్ని పక్కనబెట్టే అవకాశమైతే ఉంది. ఈ మార్పు మినహా గత జట్టే యథాతథంగా కొనసాగుతుంది. ఓపెనర్లు సంజూ సామ్సన్, అభిషేక్ శర్మ మంచి ఆరంభమే ఇచ్చారు. తక్కువ లక్ష్యమే కావడంతో మిగతా వారు పెద్దగా రాణించే చాన్స్ రాలేదు. సంజూ కూడా అభిషేక్లాగే భారీ ఇన్నింగ్స్ ఆడితే భారత బ్యాటింగ్ ఆర్డర్కు ఏ ఢోకా ఉండదు. నితీశ్ రెడ్డి, అక్షర్ పటేల్ దాకా అంతా దంచేసే వాళ్లే ఉన్నారు. ఓవర్కు పది పైచిలుకు పరుగులిచ్చినా హార్దిక్ పాండ్యా రెండు వికెట్లతో సత్తా చాటాడు. అర్ష్ దీప్ సింగ్ ఈ ఫార్మాట్లో తన ప్రాధాన్యం పెంచుకునే ప్రదర్శన చేస్తున్నాడు. స్పిన్తో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ఇంగ్లండ్ బలగాన్ని తిప్పేస్తుండటంతో బౌలింగ్ దళం కూడా దీటుగానే ఉంది.2 చెన్నైలో ఇప్పటి వరకు భారత జట్టు రెండు టి20లు ఆడింది. ఒక మ్యాచ్లో గెలిచి (2018లో వెస్టిండీస్పై ఆరు వికెట్ల తేడాతో)... మరో మ్యాచ్లో (2012లో న్యూజిలాండ్ చేతిలో ఒక పరుగు తేడాతో) ఓడిపోయింది.పిచ్, వాతావరణం గత ఈడెన్ పిచ్ సీమర్లకు, స్పిన్నర్లకు సమాన అవకాశమిచ్చిoది. కానీ ఇక్కడి చెపాక్ వికెట్ అలా కాదు. ఇది ఎప్పట్నుంచో స్పిన్ ఫ్రెండ్లీ పిచ్. వరుణ్, అక్షర్లతో పాటు రవి బిష్ణోయ్కు కలిసొచ్చే వేదికని చెప్పొచ్చు. మంచు ప్రభావం తప్ప వాన ముప్పయితే లేదు. -
ఇంగ్లండ్తో రెండో టీ20.. చెపాక్లోనైనా మహ్మద్ షమీ ఆడుతాడా?
కోల్కతాలో ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో ఘన విజయం సాధించిన భారత జట్టు.. ఇప్పుడు చెన్నై వేదికగా రెండో మ్యాచ్కు సిద్దమైంది. శనివారం చెన్నైలోని ఐకానిక్ ఎంఎ చిదంబరం స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్లు రెండో టీ20లో తలపడనున్నాయి.రాత్రి 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో కూడా పర్యాటక ఇంగ్లండ్ను చిత్తు చేసి సిరీస్ అధిక్యాన్ని పెంచుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు ఇంగ్లీష్ జట్టు చెన్నై టీ20లో ఎలాగైనా తిరిగిపుంజుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే చెన్నై చేరుకున్న ఇరు జట్లు నెట్స్లో తీవ్రంగా శ్రమించాయి.మహ్మద్ షమీ రీ ఎంట్రీ ఇస్తాడా?అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో అందరి అందరి కళ్లు సీనియర్ ఫాస్ట్బౌలర్ మహ్మద్ షమీపైనే ఉన్నాయి. గాయం కారణంగా ఏడాదికి పైగా ఆటకు దూరమై, ఎట్టకేలకు భారత జట్టులోకి పునరాగమనం చేసిన షమీ.. కోల్కతా వేదికగా జరిగిన టీ20లో ఆడుతాడని అంతా భావించారు. కానీ తుది జట్టులో మాత్రం షమీకి చోటు దక్కలేదు.అతడిని ఎందుకు పక్కన పెట్టారన్న విషయంపై జట్టు మెనెజ్మెంట్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. షమీ మళ్లీ గాయపడ్డాడా లేదా కావాలనే పక్కన పెట్టారన్న అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రెండో టీ20లో కూడా షమీ ఆడేది అనుమానంగానే మారింది. ఎందుకంటే చెపాక్ స్టేడియం సాధరణంగా స్పిన్కు అనుకూలిస్తోంది. దీంతో రెండో టీ20లో కూడా భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశముంది. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవిబిష్ణోయ్లు చెపాక్ టీ20లో కూడా ఆడే సూచనలు కన్పిస్తున్నాయి. ఒకవేళ తుది జట్టులో షమీకి ఛాన్స్ ఇవ్వాలని జట్టు మెనెజ్మెంట్ భావిస్తే పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ రెడ్డిపై వేటు వేసే ఛాన్స్ ఉంది. ఇక రెండో టీ20లో ఇంగ్లండ్ తమ తుది జట్టులో ఓ మార్పు చేసింది. గాస్ అట్కిన్సన్ స్ధానంలో బ్రైడన్ కార్సేకి ప్లేయింగ్ ఎలెవన్లో చోటుదక్కింది.టీమిండియాతో రెండో టీ20కి ఇంగ్లండ్ తుదిజట్టు:బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, జాకబ్ బెతెల్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.భారత్ తుది జట్టు(అంచనా): సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి/మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి -
CT 2025: అతడి కంటే బెటర్!.. నాకు చోటు దక్కాలి కదా!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ఎంపిక చేసిన భారత జట్టులో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్కు చోటు దక్కపోయిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వన్డే ఫార్మాట్లో అద్బుత ప్రదర్శన కనబరుస్తున్నప్పటికి సిరాజ్ను పక్కన పెట్టడం క్రీడా వర్గాల్లో చర్చానీయాంశమైంది.అతడి స్ధానంలో యువ పేసర్ అర్ష్దీప్ సింగ్కు సెలక్టర్లు అవకాశమిచ్చారు. కనీసం ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు కూడా ఈ హైదరాబాదీని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఇంగ్లండ్తో వన్డేలకు సిరాజ్ బదులుగా మరో యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రానాను ఎంపిక చేశారు.సెలక్టర్ల తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సిరాజ్ను తప్పిస్తూ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని కార్తీక సమర్ధించాడు.ఛాంపియన్స్ ట్రోఫీకి కోసం వెళ్లే జట్టులో లేకపోవడం కొంతవరకు బాధకారమనే చెప్పాలి. ఈ నిర్ణయం సిరాజ్ను నిరాశపరిచుండొచ్చు. కానీ జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. బుమ్రా, షమీ, అర్ష్దీప్లకు ఫాస్ట్ బౌలర్ల కోటాలో ఛాన్స్ ఇచ్చారు.వీరు ముగ్గురు వైట్బాల్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే ఇంగ్లండ్తో సిరీస్కు తనను కాదని హర్షిత్ రాణాను ఎంపిక చేయడం సిరాజ్ను మరింత బాధ కలిగించుంటుంది. ఈ సమయంలో సిరాజ్.. రాణా కంటే తన ఎంతో బెటర్ అని భావిస్తుండవచ్చు. ఇది అతడిని తనను తాను మరింత నిరూపించుకోవడానికి ప్రేరేపిస్తుంది.కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు ఎంపిక విషయంలో అజిత్ అగార్కర్, రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం సరైనదే అని క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. తన కెరీర్లో ఇప్పటివరకు 44 వన్డేలు ఆడిన సిరాజ్ 71 వికెట్లు పడగొట్టాడు. ఆసియాకప్-2023ను భారత్ కైవసం చేసుకోవడంలో సిరాజ్ది కీలక పాత్ర. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచదవండి: #Shardul Thakur: ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్.. కట్చేస్తే! సూపర్ సెంచరీ -
ఇప్పటికైనా అతడికి జట్టులో ఛాన్స్ ఇస్తారా? లేదా?: దినేశ్ కార్తీక్
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) తన రీఎంట్రీలో సత్తాచాటుతున్నాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లో తన స్పిన్ మాయాజాలంతో బెంబేలెత్తించిన వరుణ్.. ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్లోనూ అదే తీరును కనబరుస్తున్నాడు. కోల్కతా వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టాడు. హ్యారీ బ్రూక్, లివింగ్ స్టోన్, బట్లర్ వంటి కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ను దెబ్బ తీశాడు. ఈ క్రమంలో వరుణ్ చక్రవర్తిని ఉద్దేశించి భారత మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్(Dinesh Karthik) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి వరుణ్ చక్రవర్తిని ఎందుకు ఎంపిక చేయలేదని భారత సెలక్టర్లను కార్తీక్ ప్రశ్నించాడు.వరుణ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడని. అతడికి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు ఇచ్చిండాల్సందని దినేష్ అభిప్రాయపడ్డాడు. కాగా చక్రవర్తికి 15 మంది సభ్యల ప్రధాన జట్టులో చోటు దక్కలేదు. అతడిని ట్రావిలింగ్ రిజర్వ్గా బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. కాగా సరిగ్గా రెండు నెలల క్రితం వరుణ్ చక్రవర్తిని ఉద్దేశించి కార్తీక్ ఓ ట్వీట్ చేశాడు. "ఛాంపియన్స్ ట్రోఫీకి వరుణ్ను ఎంపిక చేయకపోతే అది భారత సెలక్టర్లు చేసిన ఘోర తప్పిదం అవుతుందని "ఎక్స్లో డీకే రాసుకొచ్చాడు. ఇప్పడు అదే విషయాన్ని మరోసారి హైలెట్ చేస్తూ చక్రవర్తిని ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి ఇప్పుడైనా తీసుకుంటారా? అని ట్వీట్ చేశాడు.నలుగురు స్పిన్నర్లతో..ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేసింది. గాయం నుంచి కోలుకున్న కుల్దీప్ యాదవ్ తిరిగి వచ్చాడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి అనుభవజ్ఞులైన మణికట్టు స్పిన్నర్లకు చోటు దక్కింది.ఈ క్రమంలోనే సెలక్టర్లు చక్రవర్తికి ప్రధాన జట్టులో చోటు ఇవ్వలేదు. కానీ చక్రవర్తి అంతర్జాతీయ క్రికెట్తో పాటు దేశవాళీ క్రికెట్లో కూడా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో చక్రవర్తి అదరగొట్టాడు. 2024-25 సీజన్లో వరుణ్ తమిళనాడు తరపున కేవలం ఆరు మ్యాచ్ల్లోనే నే 18 వికెట్లు పడగొట్టాడు.తొలి టీ20లో భారత్ ఘన విజయంఇక ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 68) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు తీశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 12.5 ఓవర్లలోనే చేధించింది. భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 34 బంతుల్లో 5 ఫోర్లు,8 సిక్స్లతో 79 పరుగులు చేసి శర్మ టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 జనవరి 25న చెన్నై వేదికగా జరగనుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచదవండి: అతడొక సూపర్స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్ -
బుమ్రా, భువనేశ్వర్ను దాటేసిన హార్దిక్ పాండ్యా..
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya ) ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో భారత బౌలర్గా పాండ్యా రికార్డులకెక్కాడు. బుధవారం కోల్కతా వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో రెండు వికెట్లు పడగొట్టిన హార్దిక్.. ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. హార్దిక్ ఇప్పటివరకు 111 మ్యాచ్లు ఆడి 91 వికెట్లు పడగొట్టాడు.ఈ క్రమంలో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్లను హార్దిక్ అధిగమించాడు. బుమ్రా 70 మ్యాచ్ల్లో 89 వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్ 87 మ్యాచ్ల్లో 90 వికెట్లు పడగొట్టాడు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ అగ్రస్ధానంలో ఉన్నాడు.అర్ష్దీప్ 61 మ్యాచ్ల్లో 97 వికెట్లు పడగొట్టాడు. అర్ష్దీప్ సైతం ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లోనే ఈ ఘనత సాధించడం గమనార్హం. అర్ష్దీప్ తర్వాత స్ధానంలో స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్(96) ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పర్యాటక ఇంగ్లండ్ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 68) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు తీశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 12.5 ఓవర్లలోనే చేధించింది. భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 34 బంతుల్లో 5 ఫోర్లు,8 సిక్స్లతో 79 పరుగులు చేసి భారత్కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 జనవరి 25న చెన్నై వేదికగా జరగనుంది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
మా బాయ్స్ అందరూ అద్బుతం.. గౌతీ భాయ్ చాలా సపోర్ట్గా ఉంటాడు: సూర్య
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా అద్భుతమైన విజయంతో ఆరంభించింది. కోల్కతా వేదికగా జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 12.5 ఓవర్లలోనే ఊదిపడేసింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ (34 బంతుల్లో 5 ఫోర్లు,8 సిక్స్లతో 79) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. సంజూ శాంసన్(20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 26), తిలక్ వర్మ(16 బంతుల్లో 3 ఫోర్లతో 19 నాటౌట్) రాణించారు.ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు తీయగా.. స్పిన్నర్ అదిల్ రషీద్ ఒక్క వికెట్ సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 68) టాప్ స్కోరర్గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు తీశారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(suryakumar yadav) స్పందించాడు. తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేసినందుకు సంతోషంగా ఉందని సూర్య చెప్పుకొచ్చాడు."సిరీస్ను విజయంతో ఆరంభించినందుకు సంతోషంగా ఉంది. మా విజయంలో టాస్ కూడా కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం మాకు సత్పలితాలను ఇచ్చింది. ఆరంభంలోనే అర్ష్దీప్ రెండు వికెట్లు పడగొట్టి మాకు ఒక ప్లాట్ ఫామ్ సెట్ చేశాడు.ఈ మ్యాచ్లో మా బౌలర్లందరూ తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేశారు. ఆ తర్వాత మా బ్యాటర్లు కూడా అద్బుతంగా ఆడారు. గత సిరీస్లో దక్షిణాఫ్రికాపై ఇదే తరహా బ్యాటింగ్ చేశాము. ముఖ్యంగా అభిషేక్ గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. అతడి సత్తా ఎంటో మాకు ముందే తెలుసు. ఇక కొత్త బంతితో బౌలింగ్ చేయాల్సిన బాధ్యత హార్దిక్ పాండ్యాపై ఉందని మాకు తెలుసు. అందుకే ముందు జాగ్రత్తగా అదనపు స్పిన్నర్తో బరిలోకి దిగాము. ముగ్గురు స్పిన్నర్లు కూడా ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. అర్ష్దీప్ సింగ్ అదనపు బాధ్యతలు తీసుకుని రాణిస్తున్నాడు. మాకు గౌతీ భాయ్(గౌతం గంభీర్) పూర్తి స్వేఛ్చను ఇచ్చాడు. మేము టీ20 వరల్డ్కప్-2024 కంటే కొంచెం భిన్నంగా ఆడాలనుకుంటున్నాము. ఫీల్డింగ్లో కూడా మేము చాలా మెరుగుపడ్డాము. అందుకోసం సెషన్లలో ఫీల్డింగ్ కోచ్తో కలిసి తీవ్రంగా శ్రమిస్తున్నాము. హాఫ్ ఛాన్స్లను కూడా క్యాచ్లగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాము" అని పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్(Teamindia) ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) అద్భుతమైన నాక్ ఆడాడు. 133 పరుగుల లక్ష్య చేధనలో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను శర్మ ఊచకోత కోశాడు. అతడిని ఆపడం ఇంగ్లండ్ బౌలర్ల తరం కాలేదు.ఈ క్రమంలో అభిషేక్ కేవలం 20 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 34 బంతుల్లు ఎదుర్కొన్న ఈ పంజాబీ బ్యాటర్ 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 79 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో విధ్వంసం సృష్టించిన అభిషేక్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.అభిషేక్ సాధించిన రికార్డులు ఇవే..👉భారత గడ్డపై టీ20 మ్యాచ్లో అత్యంత వేగవంతమైన ఇన్నింగ్స్ (70+ పరుగులు) ఆడిన ప్లేయర్గా అభిషేక్ రికార్డు సృష్టించాడు. ఇంతకముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ పేరిట ఉండేది. 2022లో గౌహతి వేదికగా భారత్తో జరిగిన టీ20 మ్యాచ్లో మిల్లర్ 225.53 స్ట్రైక్ రేట్తో అజేయంగా 106 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్లో 232.35 స్ట్రైక్ రేట్తో 79 పరుగులు చేసిన అభిషేక్.. మిల్లర్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేశాడు.👉రన్-ఛేజ్ సమయంలో టీ20 మ్యాచ్లో అత్యంత వేగంగా(70+ రన్స్) పరుగులు చేసిన భారత ఆటగాడిగా అభిషేక్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు కూడా యువరాజ్ పేరిట ఉండేది. 2013లో ఆస్ట్రేలియాపై యువరాజ్ సింగ్ 35 బంతుల్లో 77 పరుగులు (220.00 స్ట్రైక్ రేట్) చేయగా.. తాజా మ్యాచ్లో అభిషేక్ 34 బంతుల్లో 79 (232.35 స్ట్రైక్ రేట్) పరుగులు చేశాడు. దీంతో యువీ ఆల్టైమ్ రికార్డు బద్దులు అయింది.👉ఇంగ్లండ్ జట్టుపై టీ20 ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత్ బ్యాటర్ గా అభిషేక్ రికార్డులకెక్కాడు. గతంలో ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ పేరిట ఉండేది. 2007 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్పై యువీ 7 సిక్సర్ల బాదాడు. తాజా మ్యాచ్తో తన మెంటార్ యువరాజ్ ఆల్టైమ్ రికార్డును శర్మ బ్రేక్ చేశాడు. కాగా యువీ గైడెన్స్లోనే అభిషేక్ మరింత రాటుదేలాడు.👉టీ20ల్లో ఇంగ్లండ్పై భారత తరపున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ రికార్డును శర్మ బ్రేక్ చేశాడు. 2018లో మాంచెస్టర్లో జరిగిన టీ20లో ఇంగ్లండ్పై రాహుల్ 27 బంతుల్లోనే అర్ధ శతకం సాధించగా.. తాజా మ్యాచ్లో అభిషేక్ కేవలం 20 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. కాగా ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో యువరాజ్ సింగ్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్లో యువీ కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో మెరిశాడు.ఊది పడేసిన భారత్..ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించారు.ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 68 పరుగులు) టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 12.5 ఓవర్లలలోనే ఊదిపడేసింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మతో పాటు సంజూ శాంసన్(26), తిలక్ వర్మ(19 నాటౌట్) దూకుడుగా ఆడారు.చదవండి: ENG vs IND: ఆరంభం అదిరింది.. తొలి టీ20లో ఇంగ్లండ్ చిత్తు -
నితీశ్ కుమార్ కళ్లు చెదిరే క్యాచ్.. జోస్ బట్లర్! వీడియో వైరల్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి సంచలన క్యాచ్తో మెరిశాడు. నితీశ్ అద్బుతమైన క్యాచ్తో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ను పెవిలియన్కు పంపాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో తొలి బంతిని బట్లర్ సిక్సర్గా మలిచాడు. ఆ తర్వాత వెంటనే రెండో బంతిని వరుణ్.. బట్లర్కు షార్ట్-పిచ్డ్ డెలివరీ సంధిచాడు.ఆ బంతిని కూడా లెడ్ సైడ్ దిశగా బట్లర్ మరో భారీ షాట్కు ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి డీప్ స్క్వేర్ లెగ్ దిశగా గాల్లోకి లేచింది. ఈ క్రమంలో డీప్ స్క్వేర్ లెగ్లో ఉన్న నితీష్ కుమార్ రెడ్డి డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్నాడు. దీంతో బట్లర్(68) నిరాశతో పెవిలియన్కు చేరాడు. ఈ మ్యాచ్లో నితీశ్ మొత్తంగా రెండు క్యాచ్లను అందుకున్నాడు. నితీశ్ డైవింగ్ క్యాచ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత బౌలర్ల దాటికి కేవలం 132 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 68 పరుగులు) టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అర్ష్దీప్ సింగ్.. Runs in ✅Dives forward ✅Completes a superb catch ✅Superb work this is from Nitish Kumar Reddy! 👏 👏Follow The Match ▶️ https://t.co/4jwTIC5zzs#TeamIndia | #INDvENG | @NKReddy07 | @IDFCFIRSTBank pic.twitter.com/LsKP5QblJO— BCCI (@BCCI) January 22, 2025 -
కోల్కత్తా టీ-20లో భారత్ ఘన విజయం
కోల్కాతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. ఇంగ్లాండ్పై 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 133 పరుగుల టార్గెట్ను 12.5 ఓవర్లలోనే టీమిండియా ఛేదించింది. ఈ విజయంతో 5మ్యాచ్ల టీ20 సిరీస్లో 1-0 ఆధిక్యంలో భారత్ నిలిచింది. ఈ మ్యాచ్లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ 79(5 ఫోర్లు, 8 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు.స్కోర్లు: ఇంగ్లాండ్132(20) భారత్ 133/3(12.5)ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్.. భారత బౌలర్ల దాటికి కేవలం 132 పరుగులకే ఆలౌటైంది. తొలి ఓవర్లోనే విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ను ఔట్ చేసి అర్ష్దీప్ సింగ్ భారత్కు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు.ఆ తర్వాత మళ్లీ మూడో ఓవర్లో బెన్ డకెట్ను అర్ష్దీప్ పెవిలియన్కు పంపాడు. అనంతరం స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్లో హ్యారీ బ్రూక్, లివింగ్ స్టోన్ను ఔట్ చేసి ఇంగ్లండ్ను దెబ్బతీశాడు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి కెప్టెన్ జోస్ బట్లర్ మాత్రం అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 68 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఓవరాల్గా భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించారు.తుది జట్లుభారత్: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్ఇంగ్లండ్: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టతెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అర్ష్దీప్ సింగ్.. -
Ind Vs Eng 1st T20I: తుది జట్లు ఇవే.. షమీకి దక్కని చోటు
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు తెరలేచింది. ఈ సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్కు టీమిండియా స్టార్ ప్లేయర్ మహ్మద్ షమీ దూరమయ్యాడు.ఈ మ్యాచ్తో షమీ రీఎంట్రీ ఇస్తాడని అంతా భావించినప్పటికి.. జట్టు మెనెజ్మెంట్ తుది జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోలేదు. అతడు ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించనట్లు తెలుస్తోంది. రెండో టీ20కు షమీ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ మ్యాచ్లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి స్పిన్నర్ల కోటాలో చోటు దక్కించుకున్నారు.అయితే రెగ్యూలర్ ఫాస్ట్ బౌలర్ ఒక్క అర్ష్దీప్ సింగ్ ఒక్కడే ఉండడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లు నితీశ్ రెడ్డి, హార్దిక్ పాండ్యా అర్ష్దీప్తో పాటు బంతిని పంచుకునే అవకాశముంది. బ్యాటింగ్ లైనప్లో మాత్రం శాంసన్, అభిషేక్, రింకూ సింగ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు.తుది జట్లుభారత్: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్ఇంగ్లండ్: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టతెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ -
ఇంగ్లండ్తో తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే! అతడికి నో ఛాన్స్?
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టీ20 మరి కొన్ని గంటల్లో ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ఆస్త్రశస్రాలను సిద్దం చేసుకునున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదతో ఉన్నాయి. ఇప్పటికే తొలి టీ20 కోసం ఇంగ్లండ్ క్రికెట్ తమ తుది జట్టును ప్రకటించింది. జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, లివింగ్స్టోన్ వంటి విధ్వంసకర ఆటగాళ్లతో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కన్పిస్తోంది.బౌలింగ్ విభాగంలో కూడా మార్క్ వుడ్, ఆర్చర్, అదిల్ రషీద్ వంటి వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. దీంతో భారత ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇంగ్లండ్తో తొలి టీ20 కోసం భారత ప్లేయింగ్ ఎలెవన్ను టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Aswin) ఎంపిక చేశాడు. అశ్విన్ తన ఎంచుకున్న జట్టులో ఓపెనర్లగా ఎడమచేతి వాటం బ్యాటర్ అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్లకు అవకాశమిచ్చాడు.అదే విధంగా వరుసగా మూడు నాలుగు స్ధానాల్లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలకు చోటు దక్కింది. అయితే పరిస్థితుల బట్టి వీరిద్దరి బ్యాటింగ్ ఆర్డర్ మారే ఛాన్స్ ఉందని అశూ అభిప్రాయపడ్డాడు. ఫినిషర్లగా టాలిస్మానిక్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, డైనమిక్ బ్యాటర్ రింకు సింగ్లకు అశ్విన్ ఛాన్స్ ఇచ్చాడు. అదేవిధంగా ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్తో పాటు వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్,నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్ దక్కింది.అయితే తుది జట్టులో చోటు కోసం నితీశ్, వాషింగ్టన్ సుందర్ మధ్య పోటీ నెలకొందని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. ఫాస్ట్ బౌలర్లగా మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్ను ఎంపిక చేసిన అశ్విన్.. స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తిని పరిగణలోకి తీసుకున్నాడు. కాగా ఈ మ్యాచ్తో టీ20 అరంగేట్రం చేస్తుడనుకుంటున్న యువ పేసర్ హర్షిత్ రాణా(harshit rana)కు అశ్విన్ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ మ్యాచ్ సాయంత్రం 7: 00 గంటలకు ప్రారంభం కానుంది.అశ్విన్ ఎంపిక చేసిన భారత ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి/వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్ మరియు మహమ్మద్ షమీఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టతెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్చదవండి: జైస్వాల్కు చోటు.. తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు -
IND VS ENG 1st T20: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న టీమిండియా బౌలర్
టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. అర్షదీప్ ఇవాళ (జనవరి 22) ఇంగ్లండ్తో జరుగబోయే తొలి టీ20లో ఐదు వికెట్లు తీస్తే.. పొట్టి ఫార్మాట్లో భారత్ తరఫున 100 వికెట్లు తీసిన తొలి బౌలర్గా రికార్డుల్లోకెక్కుతాడు. అర్షదీప్ ఇప్పటివరకు 60 మ్యాచ్లు ఆడి 2 నాలుగు వికెట్ల ఘనతల సాయంతో 95 వికెట్లు తీశాడు. వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అర్షదీప్ కంటే ఓ వికెట్ అధికంగా తీసి భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. చహల్ 80 మ్యాచ్ల్లో 2 నాలుగు వికెట్ల ఘనతలు, ఓ ఐదు వికెట్ల ఘనత సాయంతో 96 వికెట్లు తీశాడు.టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు (టాప్-10)..యుజ్వేంద్ర చహల్-96అర్షదీప్ సింగ్-95భువనేశ్వర్ కుమార్-90జస్ప్రీత్ బుమ్రా-89హార్దిక్ పాండ్యా-89అశ్విన్-72కుల్దీప్ యాదవ్-69అక్షర్ పటేల్-65రవి బిష్ణోయ్-56రవీంద్ర జడేజా-54కాగా, భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. తొలి టీ20 కోల్కతా వేదికగా ఇవాళ రాత్రి 7 గంటలకు మొదలవుతుంది. భారత్, ఇంగ్లండ్ జట్లు ఇప్పటివరకు 24 టీ20ల్లో ఎదురెదురుపడ్డాయి. ఇందులో భారత్ 13 మ్యాచ్ల్లో నెగ్గగా.. ఇంగ్లండ్ 12 మ్యాచ్ల్లో గెలిచింది. భారత్ వేదికగా ఇరు జట్లు 11 మ్యాచ్ల్లో తలపడగా.. భారత్ 6, ఇంగ్లండ్ 5 మ్యాచ్ల్లో గెలుపొందాయి.తొలి టీ20కు వేదిక అయిన ఈడెన్ గార్డెన్స్లో భారత్ ఇప్పటివరకు 7 టీ20లు ఆడింది. ఇందులో భారత్ ఆరింట విజయాలు సాధించింది. ఒక్క మ్యాచ్లో మాత్రమే ఓటమిని ఎదుర్కొంది. ఆ ఒక్క ఓటమి భారత్ ఇంగ్లండ్ చేతుల్లోనే (2011) ఎదుర్కోవడం గమనార్హం.జట్ల బలాబలాల విషయానికొస్తే.. ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. ఇరు జట్లలో విధ్వంసకర బ్యాటర్లు ఉండటంతో పాటు మ్యాచ్ విన్నింగ్ బౌలర్లు ఉన్నారు. ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటర్లకు సహకరించనున్న నేపథ్యంలో తొలి టీ20లో పరుగుల వరద పారడం ఖాయం.భీకర ఫామ్లో తిలక్, సంజూటీమిండియా టాపార్డర్ బ్యాటర్లు తిలక్ వర్మ, సంజూ శాంసన్ భీకర ఫామ్లో ఉన్నారు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్ల సిరీస్లో వీరిద్దరూ చెలరేగిపోయారు. తిలక్ చివరి రెండు టీ20ల్లో మెరుపు సెంచరీలు చేయగా.. సంజూ మొదటి, నాలుగు మ్యాచ్ల్లో శతక్కొట్టాడు. సౌతాఫ్రికా సిరీస్కు ముందు బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లోనూ సంజూ సెంచరీ చేశాడు. సంజూ గత ఐదు టీ20ల్లో మూడు సెంచరీలు చేశాడు.ఇప్పటికే జట్టును ప్రకటించిన ఇంగ్లండ్తొలి టీ20 కోసం ఇంగ్లండ్ జట్టును నిన్ననే ప్రకటించారు. ఈ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉంది. కెప్టెన్ జోస్ బట్లర్తో పాటు ఫిల్ సాల్ట్ ఓపెనర్గా బరిలోకి దిగనున్నాడు. యువ ఆటగాడు జేకబ్ బేతెల్ తొలిసారి భారత్తో తలపడనున్నాడు.ఇంగ్లండ్ తుది జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, జేకబ్ బేతెల్, జేమీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్భారత తుది జట్టు (అంచనా): సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి -
బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు.. కోటక్కు ఇది అగ్ని పరీక్షే
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ బ్యాటర్లు ఘోరంగా విఫలమవడంతో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు పరిస్థితిని చక్కదిద్దేందుకు నడుం కట్టింది. ఈ చర్యల్లో భాగంగా దేశవాళీ పోటీల్లో క్రికెటరలందరూ పాల్గొనాలని, విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు పాటించాల్సిన మార్గదర్శకాలు విడుదల చేసింది. సౌరాష్ట్ర మాజీ బ్యాటర్ సితాన్షు కోటక్ను జట్టు బ్యాటింగ్ కోచ్గా నియమించింది.ఈ పదవికి పోటీ పడ్డ వాళ్ళు చాలామందే ఉన్నారు. ప్రఖ్యాత ఇంగ్లండ్ బ్యాటర్, వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ తన సోషల్ మీడియా ద్వారా బహిరంగంగా తన సంసిద్ధతను వ్యక్తం చేసాడు. అయితే బీసీసీఐ ముందే ఈ విషయం పై ఒక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ పోటీల్లో పరుగుల ప్రవాహం సృష్టించిన సితాన్షు కోటక్ను బ్యాటింగ్ కోచ్ గా నియమించింది. కోటక్ దేశవాళీ క్రికెట్లో 10,000 పరుగులు పైగా సాధించాడు కానీ అంతర్జాతీయ స్థాయిలో ఎప్పుడూ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు. 2013లో క్రికెట్ కి గుడ్ బై చెప్పిన తర్వాత, కోటక్ కోచింగ్ రంగంలోకి దిగి తన కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. 2020లో సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ టైటిల్ సాధించడానికి మార్గనిర్దేశం చేశాడు. 2019 నుండి నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కోచ్గా పనిచేశాడు. ఇటీవలి కాలంలో భారత్ వైట్-బాల్ సిరీస్లో వివిఎస్ లక్ష్మణ్కు సహాయ కోచ్గా సేవలందించాడు . బుధవారం ఇంగ్లాండ్తో స్వదేశంలో జరగబోయే టి20 సిరీస్తో కోటక్ తన బాధ్యతలు చేపట్టనున్నాడు. కోటక్ నియామకం తప్పనిసరిఇటీవల స్వదేశం, విదేశాలలో జరిగిన సిరీస్ల్లో భారత్ బ్యాటర్లు పేలవంగా ఆడిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన సిరీస్లో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ మినహా మిగిలిన ప్రధాన బ్యాటర్లు అందరూ ఘోరంగా విఫలమయ్యారు. అయితే అంతకుముందు స్వదేశంలో న్యూజిల్యాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో స్పిన్కు అనుకూలమైన పిచ్ ల పై సైతం భారత బ్యాటర్లు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఫలితంగా న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ లో భారత్ జట్టు 0-3 తేడాతో పరాజయం పాలైంది. అప్పుడే బీసీసీఐ బ్యాటింగ్ కోచ్ ని నియమించి వుంటే ఆస్ట్రేలియా సిరీస్ లో కొద్దిగా పరువు దక్కేది. ఈ నేపథ్యంలో కోటక్ నియామకం కొద్దిగా ఆలస్యమైనా సరైన నిర్ణయం గా కనిపిస్తోంది.బ్యాటింగ్ కోచ్గా అనుభవం..అంతర్జాతీయ స్థాయిలో భారత్ కి ఎప్పుడూ ప్రాతినిధ్యం వహించకపోయినా, కోటక్ రెండు దశాబ్దాల పాటు దేశవాళీ పోటీల్లో రాణించాడు. ఫస్ట్-క్లాస్ మరియు లిస్ట్ ఎ ఫార్మాట్లలో కలిపి 10,000 పైగా పరుగులు సాధించాడు. కోటక్ వార్విక్షైర్తో కౌంటీ క్రికెట్లో కూడా కొంతకాలం ఆడాడు. కోటక్ 130 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లలో 15 సెంచరీలు మరియు 55 అర్ధ సెంచరీలతో 41.76 సగటుతో 8,061 పరుగులు చేశాడు. ఇంకా 89 లిస్ట్ ఎ మ్యాచ్ లలో మూడు సెంచరీలు, 26 అర్ధ సెంచరీలతో 42.23 సగటుతో 3,083 పరుగులు సాధించాడు.అన్ని ఫార్మాట్లలో కోచింగ్ సమర్ధతకోటక్ బీసీసీఐ, వేల్స్ క్రికెట్ బోర్డు నుండి లెవల్ 1 మరియు లెవల్ 2 కోచింగ్ పరీక్షలు పూర్తిచేసాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో ఇండియా ఎ ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడంలో అనుభవం గడించిన కోటక్ కొంతకాలం భారత పరిమిత ఓవర్ల జట్టుకి సహకారం కూడా అందించాడు. కోటక్ ఐపీల్ లో 2016లో గుజరాత్ లయన్స్కు సహాయ కోచ్గా పనిచేశాడు. సురేష్ రైనా, ప్రస్తుత ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ వంటి ఆటగాళ్లతో కలిసి పనిచేసి రాటుదేలాడు.ఇటీవలి కాలంలో కోటక్ భారత జట్టుతో కలిసి పలు పర్యటనలకు వెళ్ళాడు. రాహుల్ ద్రవిడ్, గౌతం గంభీర్ అందుబాటులో లేని సమయంలో వీవీఎస్ లక్ష్మణ్ కి సహాయ కోచ్ గా పని చేశాడు. 2023లో జస్ప్రిత్ బుమ్రా నేతృత్వంలో భారత్ జట్టు ఐర్లాండ్ పర్యటనలో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడినప్పుడు కోటక్ ప్రధాన కోచ్గా ఉన్నాడు. అన్ని ఫార్మాట్ల అవసరాలకు అనుగుణంగా బ్యాటింగ్ లో మార్పులు చేయగల ప్రజ్ఞాపాటవాలు కోటక్ కి పుష్కలంగా ఉన్నాయి. అయితే జట్టులోని ఎంతో అనుభవజ్ఞులైన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి బ్యాట్స్మన్ కి కొత్తగా కోచింగ్ ఇవ్వాల్సిన అవసరమేమీ లేదు. పేస్ బౌలింగ్ అనుకూలంగా ఉండే ఆస్ట్రేలియా వంటి పిచ్ ల పై భారత్ బ్యాట్స్మన్ రాణించిన సందర్భాలు తక్కువే. అయితే ఇటీవల కాలంలో లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ వంటి హేమాహేమీలు వచ్చిన తర్వాత భారత బ్యాటర్లు విదేశీ పర్యటనలలో కూడా రాణించగలమని నిరూపించుకున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్ ల లో ఎదురుదెబ్బలు తగిలిన నేపథ్యంలో బీసీసీఐ జట్టు లోపాల్ని సరిదిద్దడానికి నడుం కట్టింది. ఇందులో భాగంగా కోటక్ ని బ్యాటింగ్ కోచ్ గా నియమించారు. అయితే ఇది సత్ఫలితాలను ఇస్తుందా లేదా అన్న విషయం రాబోయే ఇంగ్లాండ్ పర్యటన, ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్ తో తేలిపోతుంది. కోటక్ కి ఇది అగ్ని పరీక్షే! -
నేనేమి బాధ పడడం లేదు.. జట్టు చాలా బాగుంది: సూర్యకుమార్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ఎంపిక చేసిన భారత జట్టులో విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్కు చోటు దక్కపోయిన సంగతి తెలిసిందే. టీ20ల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న సూర్యకుమార్.. వన్డేల్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు.తనకు వచ్చిన అవకాశాలను సూర్య సద్వినియోగపరుచుకోలేకపోయాడు. దీంతో అతడిని వన్డే ఫార్మాట్కు సెలక్టర్లు పక్కన పెట్టారు. టీ20ల్లో భారత జట్టు రెగ్యూలర్ కెప్టెన్గా ఉన్నప్పటికి.. వన్డేలకు మాత్రం సూర్యను పరిగణలోకి తీసుకోవడం లేదు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి సూర్యను ఎంపిక చేయాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచించారు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని ఎంపిక చేయలేదు.తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కకపోవడంపై సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఇంగ్లండ్తో తొలి టీ20కు ముందు విలేకరుల సమావేశంలో సూర్యకుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కనందుకు మీరు బాధపడ్డారా? అన్న ప్రశ్న మిస్టర్ 360కు ఎదురైంది."నేనేమి బాధ పడడం లేదు. వన్డే ఫార్మాట్లో బాగా రాణించి ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉండేవాడిని. నేను ఆ పని చేయలేకపోయాను కాబట్టి నాకు అవకాశం దక్కలేదు. మన తప్పిదాన్ని అంగీకరించడం ముఖ్యం. అయితే నాకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయినందుకు బాధగా ఉంది. అదే నేను బాగా ఆడి ఉండే వన్డే జట్టులో కూడా కొనసాగేవాడిని. ఛాంపియన్స్ ట్రోపీకి ఎంపిక చేసిన జట్టు చాలా బాగుంది. జట్టులో ఉన్న వారంతా అద్భుతమైన ఆటగాళ్లు. వన్డే ఫార్మాట్లో భారత్ తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చారు. దేశవాళీ క్రికెట్లో కూడా రాణించారు. కాబట్టి వారందరూ జట్టు సెలక్షన్కు ఆర్హులే" అని ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్లో సూర్యకుమార్ పేర్కొన్నాడు.ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచదవండి: IND vs ENG: వరల్డ్ రికార్డుపై కన్నేసిన తిలక్ వర్మ.. -
వరల్డ్ రికార్డుపై కన్నేసిన తిలక్ వర్మ..
ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ బుధవారం(జనవరి 22) నుంచి ప్రారంభం కానుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ కోసం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు అన్ని విధాల సిద్దమైంది.వరల్డ్ రికార్డుపై కన్నేసిన తిలక్..ఇక ఈ మ్యాచ్కు ముందు టీమిండియా మిడిలార్డర్ ఆటగాడు, హైదరాబాదీ తిలక్ వర్మ(Tilak varma)ను ఓ వరల్డ్ రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్లో తిలక్ వర్మ సెంచరీ సాధిస్తే.. వరుసగా మూడు టీ20 ఇన్నింగ్స్లలో సెంచరీలు నమోదు చేసిన తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టిస్తాడు. 22 ఏళ్ల తిలక్ వర్మ గత నవంబర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో ఆఖరి రెండు మ్యాచ్లలోనూ సెంచరీలతో మెరిశాడు. ఆ తర్వాత తిలక్కు ఇదే తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్. ఈ మ్యాచ్లో యువ సంచలనం మరోసారి మూడంకెల స్కోరును అందుకోగల్గితే క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకుంటాడు. ఇప్పటివరకు ఏ క్రికెటర్ కూడా వరుసగా మూడు టీ20 ఇన్నింగ్స్లలో సెంచరీ మార్క్ను అందుకున్నారు.సంజూ శాంసన్, రూసో, ఫిల్ సాల్ట్ వంటి క్రికెటర్లు వరుసగా రెండు సెంచరీలు నమోదు చేసినప్పటికి.. మూడో సెంచరీని మాత్రం సాధించలేకపోయారు. ఇప్పుడు ఈ రేర్ ఫీట్ సాధించే అవకాశం తిలక్కు లభించింది. తిలక్ ఉన్న అద్భుతమైన ఫామ్లో ఈ అరుదైన రికార్డు సాధించడం పెద్ద కష్టం కాకపోవచ్చు.అతడు మూడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చే అవకాశముంది. గత సిరీస్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్ పొజిషేన్(ఫస్ట్ డౌన్)ను తిలక్కు త్యాగం చేశాడు. ఆ పొజిషేన్లోనే బ్యాటింగ్కు వచ్చి సెంచరీలతో మెరిశాడు తిలక్. ఆ సిరీస్ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ ఈ హైదరాబాదీ సత్తాచాటాడు. ఇప్పటివరకు భారత్ తరపున 20 టీ20లు ఆడిన వర్మ..51.33 సగటుతో 616 పరుగులు చేశాడు.ఇంగ్లండ్తో తొలి టీ20కి భారత తుదిజట్టు(అంచనా)సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.బెంచ్: వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయి.ఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టతెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్చదవండి: IND vs ENG: భారత్తో తొలి టీ20.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన! విధ్వంసకర వీరులకు చోటు -
భారత్తో తొలి టీ20.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు సర్వం సిద్దమైంది. బుధవారం(జనవరి 22) ఈడెన్గార్డెన్స్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కోల్కతాకు చేరుకున్న ఇరు జట్లు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి.తొలి టీ20లో ఎలాగైనా గెలిచి సిరీస్ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ క్రమంలో కోల్కతా టీ20కు ఇంగ్లండ్ క్రికెట్ తమ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించింది. మొదటి టీ20లో ఇంగ్లండ్ నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగనుంది. పేస్ బౌలర్లలో కోటాలో మార్క్వుడ్, జోఫ్రా ఆర్చర్, జామీ ఓవర్టన్, గుస్ అట్కిన్సన్లకు చోటు దక్కింది. శ్రీలంకతో మాంచెస్టర్ టెస్టు సందర్భంగా గాయపడిన మార్క్వుడ్ దాదాపు ఆరు నెలల తర్వాత మళ్లీ ఇంగ్లండ్ లైనప్లోకి తిరిగి వచ్చాడు. అదిల్ రషీద్ స్పెషలిస్ట్ స్పిన్నర్గా చోటు దక్కించుకున్నాడు. ఇక ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్లో ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, లివింగ్స్టోన్, హ్యారీ బ్రూక్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. అదేవిధంగా వికెట్ కీపర్గా కెప్టెన్ జోస్ బట్లర్ బదులుగా ఫిల్ సాల్ట్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది.మరోవైపు భారత్ తొలి టీ20లో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడే అవకాశముంది. మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్ స్పెషలిస్టు ఫాస్ట్ బౌలర్లగా ఉండగా.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వీరిద్దరితో పాటు బంతిని పంచుకోనున్నాడు. స్పిన్నర్లగా వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్కు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కే ఛాన్స్ ఉంది.ఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టతెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ Firepower with bat and ball 💥 Brendon McCullum has named the first white-ball team of his reign for tomorrow's opening IT20 v India 💪 pic.twitter.com/DSFdaWVPrB— England Cricket (@englandcricket) January 21, 2025 ఇంగ్లండ్తో తొలి టీ20కి భారత తుదిజట్టు(అంచనా)సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.బెంచ్: వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయి.చదవండి: ‘నా కుమారుడిపై పగబట్టారు.. కావాలనే తొక్కేస్తున్నారు’ -
ఇంగ్లండ్తో తొలి టీ20.. చరిత్రకు అడుగు దూరంలో సూర్య
స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడేందుకు సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) సారథ్యంలోని భారత జట్టు సిద్దమైంది. ఈ సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 బుధవారం(జనవరి 22) ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే కోల్కతాకు చేరుకున్న ఇంగ్లండ్, భారత జట్లు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి.ఇక తొలి టీ20కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ సెంచరీ సాధిస్తే.. ఇంగ్లండ్పై టీ20ల్లో రెండు శతకాలు నమోదు చేసిన తొలి బ్యాటర్గా రికార్డులకెక్కుతాడు. ఇంగ్లండ్పై సూర్య ఇప్పటికే ఓ టీ20 సెంచరీని నమోదు చేశాడు.సూర్యతో పాటు భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం సైతం ఇంగ్లండ్పై తలా ఓ టీ20 సెంచరీని బాదాడు. ఇప్పుడు కోల్కతా టీ20లో మిస్టర్ 360 సెంచరీతో మెరిస్తే ఈ ఇద్దరి దిగ్గజ క్రికెటర్లను అధిగమిస్తాడు. ఒకవేళ తొలి టీ20లో వీలు కాకపోయినా, సిరీస్ మధ్యలోనైనా ఈ రికార్డు బద్దులు అయ్యే అవకాశముంది.అదేవిధంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆసీస్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్, రోహిత్ శర్మ రికార్డును సమం చేస్తాడు. మాక్సీ, రోహిత్ ఇద్దరూ ఇప్పటివరకు 5 టీ20 సెంచరీలు నమోదు చేశారు. సూర్యకుమార్ ఖాతాలో ప్రస్తుతం 4 అంతర్జాతీయ టీ20 సెంచరీలు ఉన్నాయి.కాగా గత కొన్నేళ్ల నుంచి సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో భారత బ్యాటింగ్ యూనిట్కు వెన్నెముకగా నిలుస్తున్నాడు. ఇప్పటివరరకు 78 మ్యాచ్లు ఆడిన ఈ ముంబైకర్.. 40.8 సగటుతో 2570 పరుగులు చేశాడు.అతడి కెరీర్లో ఇప్పటివరకు 4 టీ20 సెంచరీలు ఉన్నాయి. అయితే గతేడాది ఆఖరిలో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్లో మాత్రం సూర్యకుమార్ నిరాశపరిచాడు. 3 మ్యాచ్ల సిరీస్లో కేవలం 8.67 సగటుతో కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్తో తన రిథమ్ను తిరిగి పొందాలని సూర్య భావిస్తున్నాడు.కాగా భారత్తో తొలి టీ20 కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించింది. నలుగురు పేస్ బౌలర్లతో ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది. అదేవిధంగా ఈ జట్టులో యువ సంచలనం జాకబ్ బెథెల్కు చోటు దక్కింది.ఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టతెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ఇంగ్లండ్తో తొలి టీ20కి భారత తుదిజట్టు(అంచనా)సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.బెంచ్: వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయి.చదవండి: ఇంగ్లండ్ వైస్ కెప్టెన్గా యువ క్రికెటర్.. ప్రకటించిన ఈసీబీ -
ఆ జట్టులో నితీశ్ రెడ్డి లేడు కారణం అదేనా
-
కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు.. టీమిండియా నయా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్
కోల్కతా: భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 180 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ 184 వికెట్లు తీయడంతో పాటు 1,712 పరుగులు కూడా సాధించాడు. ఇప్పుడు ఇంగ్లండ్తో జరగబోయే టి20 సిరీస్ కోసం అతను తొలిసారి వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. సుదీర్ఘ కాలం పాటు తనదైన బౌలింగ్, బ్యాటింగ్ శైలిని పోలిన రవీంద్ర జడేజా నీడలోనే ఉండిపోయిన అతను... ఇటీవలే కొన్ని అత్యుత్తమ ప్రదర్శనలతో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. దాదాపు 11 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఎంతో సాధించానని, ఇప్పుడు కొత్తగా తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అక్షర్ పటేల్ వ్యాఖ్యానించాడు. ‘భారత జట్టుకు సంబంధించి మూడు ఫార్మాట్లలో సంధి దశ నడుస్తోందనేది వాస్తవం. అయితే దీనిపై సెలక్టర్లే నిర్ణయం తీసుకుంటారు. నాకు సంబంధించి నేను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. అప్పగించిన పనిని సమర్థంగా చేయడమే నాకు తెలుసు. అలా చేస్తే చాలు జట్టులో స్థానం గురించి చింతించాల్సిన అవసరం ఉండదు. ఫార్మాట్ ఏదైనా అవకాశం లభించిన ప్రతీసారి ఆటను మెరుగుపర్చుకుంటూ ఉత్తమ ప్రదర్శన ఇస్తాను. జట్టులో నా స్థానం గురించి ఎప్పుడూ ఆందోళన చెందను’ అని అతను అన్నాడు. తాజాగా వైస్ కెప్టెన్సీతో కొంత బాధ్యత పెరిగిందనేది మాత్రం వాస్తవమని అక్షర్ అభిప్రాయపడ్డాడు. ‘టీమ్ నాయకత్వ బృందంలో నాకు కూడా అవకాశం దక్కడం సంతోషం. దీని వల్ల బాధ్యత మరింత పెరుగుతుంది. మన టి20 జట్టు స్థిరంగా ఉంది కాబట్టి కొత్తగా అనూహ్య నిర్ణయాలేమీ ఉండవు. అయితే మైదానంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది’ అని అతను చెప్పాడు. భారత జట్టులో ఓపెనర్లకు మాత్రమే వారి స్థానాల విషయంలో స్పష్టత ఉంటుందని, మూడు నుంచి ఏడో స్థానం వరకు బ్యాటర్లు ఎక్కడైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలని అతను అభిప్రాయ పడ్డాడు. ‘ఏడాది కాలంగా ఇది కొనసాగుతోంది. 3–7 బ్యాటర్లు మ్యాచ్లో ఆ సమయంలో ఉన్న పరిస్థితిని బట్టి ఎక్కడైనా ఆడాల్సి ఉంటుంది. దీని గురించి ఆటగాళ్లందరికీ ఇప్పటికే చెప్పేశాం’ అని పటేల్ వెల్లడించాడు. మరోవైపు ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం జట్టులో తాను ఎంపిక కాకపోవడంపై ఎలాంటి నిరాశ కలగలేదని... 15 మందిని ఎంపిక చేస్తారని, తనకు చోటు దక్కకపోవడం పెద్ద విషయం కాదని అక్షర్ స్పష్టం చేశాడు. ఆ సిరీస్లో భారత జట్టు ప్రదర్శన గురించి ఇప్పుడు చర్చ అనవసరమని, ఇప్పుడు కొత్తగా మళ్లీ మొదలు పెడుతున్నామని ఈ గుజరాత్ ఆల్రౌండర్ వ్యాఖ్యానించాడు. -
CT 2025: భారత జట్టు ప్రకటన.. సిరాజ్కు దక్కని చోటు.. నితీశ్ రెడ్డికి ఛాన్స్!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో భాగమయ్యే ఆటగాళ్ల పేర్ల((India Squad For Champions Trophy 2025)ను శనివారం వెల్లడించింది.సిరాజ్, సంజూకు మొండిచేయిటీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తో కలిసి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar) జట్టు వివరాలను మీడియాకు తెలిపాడు. ఈ టోర్నీలో రోహిత్ శర్మకు డిప్యూటీగా శుబ్మన్ గిల్ వ్యవహరించనున్నాడు. అదే విధంగా.. యశస్వి జైస్వాల్ తొలిసారిగా వన్డే జట్టులో చోటు దక్కించుకోగా.. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్కు మాత్రం సెలక్టర్లు మొండిచేయి చూపారు. అయితే, తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డికి మాత్రం ట్రావెలింగ్ రిజర్వ్స్లో చోటు దక్కింది. పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు బ్యాకప్గా అతడిని ఎంపిక చేశారు.బుమ్రా ఫిట్నెస్ సాధిస్తాడా? మరోవైపు.. స్పిన్నర్ల విభాగంలో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ చోటు దక్కించుకున్నారు. ఇక ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ ఆధారంగా ఈ టోర్నీలో ఆడేది లేనిది తేలుతుంది. పేసర్ల విభాగంలో షమీతో పాటు అర్ష్దీప్ సింగ్ స్థానం సంపాదించాడు. అయితే, అందరూ ఊహించినట్లుగా సంజూ శాంసన్కు మాత్రం ఈసారి ఈ జట్టులో చోటు దక్కలేదు.కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడి వెళ్లకుండా తటస్థ వేదికైన దుబాయ్లో తమ మ్యాచ్లు ఆడుతుంది. ఇందుకు ఐసీసీని బీసీసీఐ ఒప్పించగా.. ఐసీసీ జోక్యంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఈ మేరకు హైబ్రిడ్ విధానానికి అంగీకరించింది.ఎనిమిది జట్లుఇక ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ ఈ ఐసీసీ ఈవెంట్కు నేరుగా అర్హత సాధించగా.. భారత్లో జరిగిన వన్డే ప్రపంచకప్-2023లో అదరగొట్టిన ఏడు జట్లు తమ ప్రదర్శన ఆధారంగా చోటు దక్కించుకున్నాయి. వరల్డ్కప్ చాంపియన్ ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియాలతో పాటు.. న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఈ మెగా టోర్నీకి క్వాలిఫై అయ్యాయి.వన్డే ఫార్మాట్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా.. గ్రూప్-‘బి’లో ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఉన్నాయి.ఈ టోర్నమెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనుంది. దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 20న ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక చిరకాల ప్రత్యర్థులైన టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది. ఇక చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడనుంది. జనవరి 22 నుంచి ఇరుజట్ల మధ్య తొలి టీ20తో మెగా సమరం మొదలుకానుంది. జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2వ తేదీల్లో ఐదు టీ20లు.. ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో మూడు వన్డేల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ టీమిండియా- ఇంగ్లండ్కు ఈ వన్డే సిరీస్ ద్వారా చాంపియన్స్ ట్రోఫీకి ముందు మంచి ప్రాక్టీస్ లభించనుంది. ఇక ఇంగ్లండ్తో వన్డేలలో కూడా ఇదే జట్టు ఆడనుండగా.. బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా టీమ్లోకి వస్తాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనబోయే భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచాంపియన్స్ ట్రోఫీలో భారత్ షెడ్యూల్ ఇదేఫిబ్రవరి 20, 2025 (దుబాయ్)- బంగ్లాదేశ్ vs భారత్ఫిబ్రవరి 23, 2025 (దుబాయ్)- పాకిస్తాన్ vs భారత్మార్చి 2, 2025 (దుబాయ్) న్యూజిలాండ్ vs భారత్. -
అతడిని ఎందుకు సెలక్ట్ చేయలేదు?: భారత మాజీ క్రికెటర్ ఫైర్
ఆస్ట్రేలియా పర్యటనలో పరాభవం చవిచూసిన టీమిండియా.. తదుపరి సొంతగడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్కు సిద్ధమైంది. ఇంగ్లండ్(India vs England)తో ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లు ఆడనుంది. ఇరుజట్ల మధ్య జనవరి 22 నుంచి తొలి టీ20తో ఈ మెగా సమరం మొదలుకానుంది.ఈ సిరీస్తో షమీ రీఎంట్రీఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికే టీ20 సిరీస్కు తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఆడబోయే ఈ జట్టులో పదిహేను మందికి చోటు ఇచ్చినట్లు తెలిపింది. ఈ సిరీస్తో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ సుదీర్ఘ కాలం తర్వాత పునరాగమనం చేయనున్నాడు.స్టార్ క్రికెటర్లు దూరంవన్డే వరల్డ్కప్-2023 తర్వాత చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ.. దాదాపు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చేందుకు ముహూర్తం ఖరారైంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో టీ20లకు యశస్వి జైస్వాల్తో పాటు శుబ్మన్ గిల్, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ క్రికెటర్లు దూరమయ్యారు.బ్యాటర్ల కోటాలో సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్ చోటుదక్కించుకోగా.. వికెట్ కీపర్ల కోటాలో సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్లకు అవకాశం దక్కింది. ఇక ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉండగా.. బౌలింగ్ విభాగంలో పేసర్లు మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణాతో పాటు.. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి స్థానం సంపాదించారు.శివం దూబేకు దక్క ని చోటుఅయితే, ఈ జట్టులో భారత ఆల్రౌండర్, విధ్వంసకర వీరుడు శివం దూబే(Shivam Dube)కు మాత్రం చోటు దక్కలేదు. టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులో భాగం కావడంతో పాటు.. ఇటీవల దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడు దంచికొట్టాడు. అయినప్పటికీ సెలక్టర్లు దూబే పేరును పరిగణనలోకి తీసుకోలేదు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీరును విమర్శించాడు. ‘‘శివం దూబేకు ఏమైంది? నిజానికి రుతురాజ్ గైక్వాడ్ గురించి కూడా మాట్లాడాల్సి ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో తన బ్యాటింగ్ స్థానం(ఓపెనర్) దృష్ట్యా అతడిని ఎంపిక చేయడం వీలుకాకపోవచ్చు.అలాగే రజత్ పాటిదార్కు కూడా మొండిచేయి ఎదురైంది. కానీ.. శివం దూబేను ఎందుకు పక్కనపెట్టారో అర్థం కావడం లేదు. టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు. సౌతాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.టీ20 ప్రపంచకప్ చాంపియన్ను ఎందుకు సెలక్ట్ చేయలేదు?కాబట్టి జట్టు గెలిచినపుడు.. జట్టులోని ప్రతి సభ్యుడికి తమ క్రెడిట్ ఇవ్వాలి. వరల్డ్కప్ లీగ్ మ్యాచ్లలో ఫీల్డింగ్, బ్యాటింగ్ విషయంలో అతడిపై విమర్శలు వచ్చాయి. కానీ తర్వాత అతడు అన్నీ సరిదిద్దుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చాంపియన్ అయ్యాడు. అయినా.. ఎందుకు అతడిని టీ20 సిరీస్కు ఎంపిక చేయలేదు?’’ అని ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు. కాగా వెస్టిండీస్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో దూబే 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 27 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా చివరగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడింది. ఈ ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో కంగారూ జట్టు చేతిలో 3-1తో ఓడి.. పదేళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని చేజార్చుకుంది.చదవండి: అతడు లేకుంటే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మనమే గెలిచేవాళ్లం: అశ్విన్ -
IND vs ENG: బీసీసీఐ యూ టర్న్..! కేఎల్ రాహుల్కు నో రెస్ట్?
భారత క్రికెట్ జట్టు స్వదేశంలో ఇంగ్లండ్తో వైట్బాల్ సిరీస్లకు సిద్దమవుతోంది. ఈ వైట్బాల్ సిరీస్లలో భాగంగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలుత ఐదు టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. జనవరి 22న ఈడెన్గార్డెన్స్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.అనంతరం ఫిబ్రవరి 6 నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలవుతోంది. ఈ సిరీస్ల కోసం రెండు వెర్వేరు జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ సోమవారం(జనవరి 13) ప్రకటించే అవకాశముంది. అయితే ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు భావించారు.కానీ ఇప్పుడు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ తమ నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 దృష్ట్యా ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో రాహుల్ను ఆడించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-2 అనంతరం స్వదేశానికి చేరుకున్న రాహుల్ విశ్రాంతి తీసుకుంటున్నాడు.విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ మ్యాచ్లకు దూరంగా ఉన్న ఈ కర్ణాటక ఆటగాడు.. తిరిగి ఇంగ్లండ్తో వన్డే సిరీస్తో మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. కాగా రాహుల్కు వన్డేల్లో మంచి రికార్డు ఉంది. వన్డే ఫార్మాట్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రాహుల్ ఎనిమిదో స్ధానంలో కొనసాగుతున్నాడు.ఇప్పటివరకు 77 వన్డేలు ఆడిన రాహుల్.. 49.15 సగటుతో 2851 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 18 అర్ధ సెంచరీలు, ఏడు సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా మిడిలార్డర్లో భారత్కు వెన్నెముకగా రాహుల్ ఉంటాడు.తన వన్డే కెరీర్లో రాహుల్ 5 స్ధానంలో బ్యాటింగ్ వచ్చి ఏకంగా 1269 పరుగులు చేశాడు. కాగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి సైతం ఆడనున్నారు. అయితే ఈ సిరీస్కు భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరం కానున్నాడు.భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్..జనవరి 22- తొలి టీ20(కోల్కతా)జనవరి 25- రెండో టీ20(చెన్నై)జనవరి 28- మూడో టీ20(రాజ్కోట్)జనవరి 31- నాలుగో టీ20(పుణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20(ముంబై, వాంఖడే)ఈ సిరీస్లోని మ్యాచ్లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 6- తొలి వన్డే(నాగ్పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే(కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే(అహ్మదాబాద్ఛాంపియన్స్ ట్రోఫీలో భారత షెడ్యూల్..ఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ (దుబాయ్)ఫిబ్రవరి 23- పాకిస్తాన్ (దుబాయ్)మార్చి 2- న్యూజిలాండ్ (దుబాయ్)చదవండి: 'కోహ్లి వల్లే యువీ ముందుగా రిటైరయ్యాడు'.. ఉతప్ప సంచలన వ్యాఖ్యలు -
విరాట్ కోహ్లి కీలక నిర్ణయం.. తొలిసారిగా!?
ఫామ్ లేమితో సతమతవుతున్న టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat kohli) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోహ్లి తన కెరీర్లో మొదటిసారిగా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జూన్లో ఇంగ్లండ్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని కౌంటీల్లో ఆడేందుకు విరాట్ ఫిక్స్ అయినట్లు సమాచారం.వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా ఇంగ్లీష్ జట్టుతో భారత్ 5 మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. అక్కడ పరిస్థితులకు అలావాటు పడేందుకు ముందుగానే కోహ్లి ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టనున్నాడు. ఐపీఎల్ 2025 తర్వాత కౌంటీల్లో కోహ్లి భాగం కానున్నట్లు పలురిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఒకవేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ కు చేరుకోకపోతే కోహ్లికి కౌంటీల్లో ఎక్కువ మ్యాచ్లు ఆడడానికి ఛాన్స్ ఉంది. ఇంగ్లండ్ టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది.ఒకే ఒక సెంచరీ..కాగా కోహ్లి గత కొంతకాలంగా టెస్టు క్రికెట్లో పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో తీవ్ర నిరాశపరిచిన విరాట్.. అదే తీరును ఆస్ట్రేలియా పర్యటనలో సైతం కనబరిచాడు. తొలి టెస్టులో సెంచరీ చేసిన కోహ్లి.. వరుసగా నాలుగు మ్యాచ్ల్లో పూర్తిగా తేలిపోయాడు. సిరీస్ అసాంతం ఆఫ్సైడ్ బంతులను వెంటాడి తన వికెట్ను కోహ్లి కోల్పోయాడు.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో తొలి వన్డే.. వరల్డ్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లికోహ్లి 9 ఇన్నింగ్స్ ల్లో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఐసీసీ టెస్టు ర్యాకింగ్స్లో 12 ఏళ్ళ తర్వాత టాప్ 25 లో చోటు కోల్పోయాడు. ఈ క్రమంలో కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. కానీ కోహ్లి మాత్రం తన రిథమ్ను తిరిగి పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అంతకుతోడు భారత క్రికెట్ బోర్డు ఇప్పటికే ప్రతీ ఒక్క ప్లేయరూ దేశవాళీ క్రికెట్లో ఆడాలని ఆదేశాలు జారీ చేసింది. హెడ్కోచ్ గౌతం గంభీర్ కూడా టెస్టు జట్టులో ప్లేయర్లందరూ వీలైతే కచ్చితంగా ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఆడాలని సూచించాడు.ఈ క్రమంలోనే కోహ్లి 13 ఏళ్ల తర్వాత ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. అతడు చివరగా 2012లో ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడాడు. కాగా ఆస్ట్రేలియాతో సిరీస్ను 3-1 తేడాతో టీమిండియా చేజార్చుకుంది. బీజీటీ సిరీస్ భారత్ కోల్పోవడం పదేళ్ల తర్వాత ఇదే మొదటిసారి.చదవండి: ‘గంభీర్ ఒక మోసగాడు.. గెలిస్తే క్రెడిట్ నాదే అంటాడు.. కానీ’ -
వరల్డ్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లి
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో ఘోర వైఫల్యం తర్వాత టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి మరో కీలక పోరు సిదమవుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నాహాకాల్లో భాగంగా స్వదేశంలో ఇంగ్లండ్తో జరగనున్న వన్డే సిరీస్లో కింగ్ కోహ్లి ఆడనున్నాడు. తొలుత ఈ సిరీస్కు కోహ్లి దూరంగా ఉండాలని భావించినప్పటికి, ఛాంపియన్స్ ట్రోఫీ దృష్ట్యా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అతడితో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ వన్డే సిరీస్లో ఆడనున్నాడు. ఫిబ్రవరి 6న రాజ్కోట్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే మొదటి వన్డేకు ముందు విరాట్ కోహ్లిని ఓ అరుదైన ఫీట్ ఊరిస్తోంది.అరుదైన రికార్డుకు చేరువలో కోహ్లి..రాజ్కోట్ వన్డేలో కోహ్లి మరో 96 పరుగులు సాధిస్తే.. వన్డే క్రికెట్లో 300 కంటే తక్కువ ఇన్నింగ్స్లలో 14000 పరుగులు చేసిన తొలి క్రికెటర్గా రికార్డులకెక్కుతాడు. వన్డేల్లో దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర మాత్రమే 14,000 మార్క్ను అధిగమించారు.ఈ మైలు రాయిని అందుకోవడానికి సచిన్ 350 ఇన్నింగ్స్లు తీసుకోగా, సంగక్కర 378 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనతను సాధించాడు. మరోవైపు కోహ్లి 295 మ్యాచ్ల్లో 13906 పరుగులు చేశాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్ సిరీస్లో కోహ్లి ఈ ఘనత సాధించడం ఖాయమన్పిస్తోంది.ఆస్ట్రేలియాలో ఫెయిల్..కాగా ఆస్ట్రేలియా గడ్డపై అద్బుతమైన టెస్టు రికార్డు ఉన్న విరాట్.. ఈసారి మాత్రం తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో మొత్తం ఐదు మ్యాచ్లు ఆడిన కోహ్లి.. కేవలం 190 పరుగులు చేశాడు.పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీతో మెరిసిన కోహ్లి.. తర్వాత నాలుగు మ్యాచ్ల్లోనూ తీవ్ర నిరాశపరిచాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్తో సిరీస్లో ఎలా రాణిస్తాడో అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇంగ్లీష్ జట్టుతో వైట్బాల్ సిరీస్లకు భారత జట్టును ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది.భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్..జనవరి 22- తొలి టీ20(కోల్కతా)జనవరి 25- రెండో టీ20(చెన్నై)జనవరి 28- మూడో టీ20(రాజ్కోట్)జనవరి 31- నాలుగో టీ20(పుణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20(ముంబై, వాంఖడే)ఈ సిరీస్లోని మ్యాచ్లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 6- తొలి వన్డే(నాగ్పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే(కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే(అహ్మదాబాద్)ఛాంపియన్స్ ట్రోఫీలో భారత షెడ్యూల్..ఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ (దుబాయ్)ఫిబ్రవరి 23- పాకిస్తాన్ (దుబాయ్)మార్చి 2- న్యూజిలాండ్ (దుబాయ్) -
ఇంగ్లండ్తో వన్డే సిరీస్.. మనసు మార్చుకున్న రోహిత్, కోహ్లి!?
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ను కోల్పోయిన భారత జట్టు స్వదేశంలో మరో కీలక పోరుకు సిద్దమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ముందు టీమిండియా సొంతగడ్డపై ఇంగ్లండ్తో వైట్ బాల్ సిరీస్లలో తలపడనుంది. 5 టీ20లు, మూడు వన్డేల సిరీస్లో పర్యాటక జట్టుతో భారత్ ఆడనుంది. జనవరి 22న కోల్కతా వేదికగా జరగనున్న తొలి టీ20తో ఇంగ్లీష్ జట్టు భారత పర్యటన ప్రారంభం కానుంది.అయితే ఈ సిరీస్లకు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరం కానున్నాడు. ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు భావించినట్లు తెలుస్తోంది. అతడు నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు ధ్రువీకరించారు.జస్ప్రీత్ బుమ్రా గత కొంత కాలంగా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అతడికి విశ్రాంతి అవసరం. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతడు మళ్లీ ఐపీఎల్ కూడా ఆడనున్నాడు. కాబట్టి జస్ప్రీత్పై వర్క్లోడ్ తగ్గించాలని నిర్ణయించాము. అతడు ప్రస్తుతం టీ20లపై దృష్టి సారించడం లేదు. దీంతో ఇంగ్లండ్తో వైట్బాల్ సిరీస్లకు బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నామని సదరు బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.వన్డేల్లో ఆడనున్న రోహిత్-కోహ్లిఇక ఇంగ్లండ్తో జరగనున్న వన్డే సిరీస్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఆడనున్నారు. తొలుత వీరు విశ్రాంతి తీసుకుంటారని వార్తలు వినిపించినప్పటికి, ఛాంపియన్స్ ట్రోఫీ దృష్ట్యా ఈ సీనియర్ ద్వయం ఇంగ్లండ్తో వన్డేల్లో ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ ఇద్దరు దిగ్గజాలు ప్రస్తుతం పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో రోకో నిరాశపరిచారు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో ఆడి తమ రిథమ్ను పొందాలని కెప్టెన్, మాజీ కెప్టెన్ ఇద్దరూ భావిస్తున్నారు. అదేవిధంగా ఈ వన్డే సిరీస్తో వెటరన్ పేసర్ మహ్మద్ షమీ, స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.చదవండి: గంభీర్ ఇప్పటికైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి: టీమిండియా దిగ్గజం -
నితీశ్ రెడ్డి ఒక్కడే కాదు.. అతడూ జట్టులో ఉండాలి!
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్ ముంగిపునకు వచ్చింది. ఈ మెగా ఈవెంట్లో టీమిండియా తమ చివరి టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియాతో తలపడుతోంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy) ఆడేందుకు కంగారూ గడ్డపై అడుగుపెట్టి.. ఇప్పటికి నాలుగు టెస్టులు పూర్తి చేసుకుంది.పెర్త్లో జరిగిన తొలి టెస్టులో గెలిచి శుభారంభం చేసిన టీమిండియా.. తదుపరి అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో మాత్రం ఓడిపోయింది. అనంతరం బ్రిస్బేన్లో మూడో మ్యాచ్ను డ్రా చేసుకున్న భారత జట్టు.. మెల్బోర్న్ బాక్సింగ్ డే టెస్టులో దారుణంగా విఫలమైంది. ఆతిథ్య జట్టు చేతిలో 184 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంఫలితంగా ఆసీస్ టీమిండియాపై 2-1తో ఆధిక్యంలో నిలవగా.. రోహిత్ సేన డబ్ల్యూటీసీ(WTC) ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పటికే సౌతాఫ్రికా టైటిల్ పోరుకు అర్హత సాధించగా.. ఆస్ట్రేలియాకు మార్గం సుగమమైంది. ఏదేమైనా ఆసీస్లో టీమిండియా వైఫల్యం కొనసాగుతున్నప్పటికీ ఓ ఆణిముత్యం లాంటి ఆటగాడు దొరకడం సానుకూలాంశం.నితీశ్ రెడ్డి.. ఆణిముత్యం లాంటి ఆటగాడు అతడు మరెవరో కాదు.. నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy). ఆంధ్రప్రదేశ్కు చెందిన ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ తొలి టెస్టు నుంచే బ్యాట్ ఝులిపిస్తున్నాడు. మెల్బోర్న్ టెస్టులో ఏకంగా శతకం(114)తో సత్తా చాటాడు. తద్వారా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ)లో అత్యంత పిన్న వయసులోనే సెంచరీ చేసిన భారత బ్యాటర్గా 21 ఏళ్ల నితీశ్ రెడ్డి చరిత్ర సృష్టించాడు.ఈ నేపథ్యంలో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా నితీశ్ రెడ్డి టీమిండియా టెస్టు జట్టుతో పాతుకుపోవడం ఖాయమంటూ భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ప్రశంసించాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్తో టెస్టుల తర్వాత.. టీమిండియా 2025లో తొలుత ఇంగ్లండ్తో స్వదేశంలో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది.నితీశ్ రెడ్డితో పాటు అతడినీ ఎంపిక చేయండి!అనంతరం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 పూర్తి చేసుకుని.. జూన్లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఇంగ్లండ్తో నాలుగు టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నితీశ్ రెడ్డితో పాటు ఇంగ్లండ్ టూర్కు మరో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ను ఎంపిక చేయాలని మేనేజ్మెంట్కు సూచించాడు.‘‘మెల్బోర్న్ టెస్టు భారత క్రికెట్కు అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్ను ఇచ్చింది.. అతడి పేరు నితీశ్ కుమార్ రెడ్డి. ఐపీఎల్లో హైదరాబాద్ ఫ్రాంఛైజీ తరఫున అదరగొట్టడం ద్వారా భారత క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించిన ఈ కుర్రాడు.. నిజానికి ఫస్ట్క్లాస్ క్రికెట్లో అంత గొప్ప ఏమీ ఆడలేదు. క్రెడిట్ మొత్తం వారికేఅయినప్పటికీ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. అతడి బృందం నితీశ్ రెడ్డిపై నమ్మకం ఉంచినందుకు వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. సెలక్టర్ల నమ్మకాన్ని ఈ అబ్బాయి నిలబెట్టుకున్నాడు. ఇక మరో ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్(Venkatesh Iyer)పై కూడా సెలక్టర్లు దృష్టి సారించాలి.అతడు ఎడమచేతి వాటం బ్యాటర్ కావడం మరో సానుకూలాంశం. అయితే, బౌలింగ్ నైపుణ్యాలను కాస్త మెరుగుపరచుకోవాలి. అతడికి ఇప్పటికే ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం ఉంది. కాబట్టి అక్కడ అతడు టెస్టుల్లో రాణించగలడు’’ అని సునిల్ గావస్కర్ స్పోర్ట్స్ స్టార్కు రాసిన కాలమ్లో పేర్కొన్నాడు.కౌంటీల్లో ఆడిన వెంకటేశ్కాగా 2024లో ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్షిప్లో భాగంగా లంకాషైర్కు ప్రాతినిథ్యం వహించాడు వెంకటేశ్ అయ్యర్. మూడు మ్యాచ్లు ఆడి 116 పరుగులు చేశాడు. ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు తొమ్మిది టీ20లు, రెండు వన్డేలు ఆడిన వెంకటేశ్ అయ్యర్.. ఆయా ఫార్మాట్లలో 133, 24 పరుగులు చేశాడు. అదే విధంగా అంతర్జాతీయ టీ20లలో ఐదు వికెట్లు తీయగలిగాడు.చదవండి: అతడి కోసం పట్టుబట్టిన గంభీర్.. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు? -
రోహిత్, కోహ్లి, బుమ్రాకు విశ్రాంతి..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగే వన్డే సిరీస్లో టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి కల్పిస్తారని ప్రచారం జరుగుతుంది. వర్క్ లోడ్ కారణంగా బుమ్రాను పక్కకు పెట్టాలని భావిస్తున్న సెలెక్టర్లు.. ఫామ్లో లేని రోహిత్, విరాట్లను విశ్రాంతి పేరుతో తప్పిస్తారని తెలుస్తుంది. జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే రోహిత్, కోహ్లి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేది కూడా అనుమానంగానే కనిపిస్తుంది. వాస్తవానికి ఇంగ్లండ్తో వన్డే సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా ఉంది. అలాంటి ఈ సిరీస్కే రోహిత్, కోహ్లిలకు రెస్ట్ ఇస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలా ఆడిస్తారని అనుమానాలు వస్తున్నాయి. ఇంగ్లండ్తో వన్డే సిరీస్ ముగిసిన ఎనిమిది రోజుల గ్యాప్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. ఈ మెగా టోర్నీలో ఆడకముందు ఫామ్లో లేని రోహిత్, కోహ్లి ఇంగ్లండ్తో వన్డే సిరీస్ ఆడాలి. ఈ ఇద్దరు వన్డేలు ఆడి చాలాకాలం అవుతుంది. రోహిత్, కోహ్లి ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటే టీమిండియాకే నష్టం వాటిల్లుతుంది. టెస్ట్ల్లో ప్రస్తుతం రోహిత్, కోహ్లి మెడపై కత్తి వేలాడుతుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వీరిద్దరినీ వన్డేల నుంచి కూడా తప్పిస్తారేమో అనిపిస్తుంది.కాగా, భారత టెస్ట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఐదు మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 1-2 తేడాతో వెనుకపడి ఉంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరిదైన ఐదో టెస్ట్ జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. రోహిత్, కోహ్లి, బుమ్రా ప్రస్తుతం భారత టెస్ట్ జట్టులో భాగంగా ఉన్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా అరివీర భయంకరమైన ఫామ్లో ఉంటే రోహిత్, కోహ్లి దారుణంగా విఫలమవుతున్నారు. బుమ్రా ఇప్పటివరకు ఆడిన నాలుగు టెస్ట్ మ్యాచ్ల్లో 30 వికెట్లు తీసి సిరీస్లో లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్నాడు. ప్రస్తుతం బుమ్రాపై ఉన్న వర్క్ లోడ్ను బట్టి చూస్తే అతనికి విశ్రాంతినివ్వడం సమంజసమే అనిపిస్తుంది. ఫామ్లో లేక జట్టుకు భారమైన రోహిత్, కోహ్లిలను తదుపరి సిరీస్ ఆడించరంటే అది పరోక్షంగా తప్పించడమే అనుకోవాలి.బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనంతరం భారత్ జనవరి 22 నుంచి ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతుంది. ఐదు టీ20లు, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ భారత్లో పర్యటిస్తుంది.ఇంగ్లండ్ టూర్ ఆఫ్ ఇండియా షెడ్యూల్జనవరి 22- తొలి టీ20 (కోల్కతా)జనవరి 25- రెండో టీ20 (చెన్నై)జనవరి 28- మూడో టీ20 (రాజ్కోట్)జనవరి 31- నాలుగో టీ20 (పూణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20 (ముంబై)ఫిబ్రవరి 6- తొలి వన్డే (నాగ్పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే (కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే (అహ్మదాబాద్)ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ అనంతరం భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ (వన్డేలు) ఆడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత మ్యాచ్లు మినహా మిగతా మ్యాచ్లన్నీ పాకిస్తాన్లో జరుగుతాయి. మెగా టోర్నీలో భారత ఆడే మ్యాచ్లు దుబాయ్లో జరుగుతాయి.ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా షెడ్యూల్ ఇలా ఉండబోతుంది.ఫిబ్రవరి 20- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (దుబాయ్)ఫిబ్రవరి 23- ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (దుబాయ్)మార్చి 2- ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (దుబాయ్)గ్రూప్ దశలో ఫలితాల ఆధారంగా ఛాంపియన్స్ ట్రోఫీలో తదుపరి మ్యాచ్లు (సెమీస్, ఫైనల్) ఉంటాయి. -
T20 World Cup 2024: ఆసీస్ను పడగొట్టి సెమీఫైనల్కు
ఏడు నెలల క్రితం తగిలిన దెబ్బకు ఇప్పుడు కాస్త ఉపశమనం! ఫైనల్ కాకపోవచ్చు, ఫార్మాట్ వేరు కావచ్చు... కానీ ప్రపంచ కప్లో ఆ్రస్టేలియాను ఓడించడం అంటే సగటు భారత అభిమాని ఆనందాన్ని రెట్టింపు చేసే క్షణం! వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత మళ్లీ ఇప్పుడే తలపడిన మ్యాచ్లో టీమిండియా అలాంటి సంతోషాన్నే పంచింది. ఆసీస్ను చిత్తు చేసి సగర్వంగా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్తో భారత్ భారీ స్కోరుకు బాటలు వేస్తే మన బౌలర్లు సమర్థంగా లక్ష్యాన్ని కాపాడుకోగలిగారు. ఈ ఓటమితో ఆసీస్ సెమీఫైనల్ ఆశలు అడుగంటిపోగా... 2022 తరహాలోనే సెమీఫైనల్లో ఇంగ్లండ్తో పోరుకు టీమిండియా సిద్ధమైంది. గ్రాస్ ఐలెట్: టి20 వరల్డ్కప్లో వరుసగా రెండోసారి భారత్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. లీగ్ దశలో 3 మ్యాచ్లు నెగ్గిన టీమిండియా సూపర్–8లోనూ ఆడిన 3 మ్యాచ్లు గెలిచి అజేయంగా సెమీస్ చేరింది. సోమవారం జరిగిన మ్యాచ్లో భారత్ 24 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (41 బంతుల్లో 92; 7 ఫోర్లు, 8 సిక్స్లు) త్రుటిలో సెంచరీ అవకాశం చేజార్చుకున్నాడు. ఇతర బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (16 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్లు), దూబే (22 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ (17 బంతుల్లో 27 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు) కీలక పరుగులు సాధించారు. జట్టు ఇన్నింగ్స్లో రోహిత్ ఒక్కడే 15 బౌండరీలు బాదితే, మిగతా బ్యాటర్లు కలిపి 14 బౌండరీలు కొట్టారు. అనంతరం ఆ్రస్టేలియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులే చేయగలిగింది. ట్రవిస్ హెడ్ (43 బంతుల్లో 76; 9 ఫోర్లు, 4 సిక్స్లు) మినహా అంతా విఫలమయ్యారు. సమష్టి బ్యాటింగ్ ప్రదర్శన... రెండో ఓవర్లో కోహ్లి (0)ని హాజల్వుడ్ అవుట్ చేయడంతో ఆసీస్ సంబరపడింది. కానీ ఆ తర్వాత అసలు కథ మొదలైంది. రోహిత్ తన విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లందరికీ చుక్కలు చూపించాడు. స్టార్క్ ఓవర్లో 29 పరుగులు బాదిన అతను కమిన్స్ ఓవర్లో సిక్స్, 2 ఫోర్లు కొట్టి 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్ జోరు చూస్తే సెంచరీ లాంఛనమే అనిపించినా... చక్కటి యార్కర్తో స్టార్క్ రోహిత్ను బౌల్డ్ చేశాడు! తన తర్వాతి ఓవర్లో సూర్యనూ అతను వెనక్కి పంపించాడు. చివరి 5 ఓవర్లలో భారత్ను ఆసీస్ కట్టడి చేసింది. హెడ్ మెరుపులు... ఛేదనలో ఆసీస్ కూడా ఆరంభంలోనే వార్నర్ (6) వికెట్ కోల్పోయింది. అయితే హెడ్, మార్‡్ష ధాటిగా ఆడి రెండో వికెట్కు 48 బంతుల్లో 81 పరుగులు జోడించారు. హెడ్ 24 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అయితే అక్షర్ అద్భుత క్యాచ్కు మార్‡్ష వెనుదిరగడంతో ఆసీస్ పతనం మొదలైంది. 38 పరుగుల వ్యవధిలో జట్టు తర్వాతి 5 వికెట్లు కోల్పోయి ఓటమిని ఆహ్వానించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) స్టార్క్ 92; కోహ్లి (సి) డేవిడ్ (బి) హాజల్వుడ్ 0; పంత్ (సి) హాజల్వుడ్ (బి) స్టొయినిస్ 15; సూర్యకుమార్ (సి) వేడ్ (బి) స్టార్క్ 31; దూబే (సి) వార్నర్ (బి) స్టొయినిస్ 28; పాండ్యా (నాటౌట్) 27; జడేజా (నాటౌట్) 9; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–6, 2–93, 3–127, 4–159, 5–194. బౌలింగ్: స్టార్క్ 4–0–45–2, హాజల్వుడ్ 4–0–14–1, కమిన్స్ 4–0–48–0, జంపా 4–0–41 –0, స్టొయినిస్ 4–0–56–2. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) సూర్యకుమార్ (బి) అర్‡్షదీప్ 6; హెడ్ (సి) రోహిత్ (బి) బుమ్రా 76; మార్‡్ష (సి) అక్షర్ (బి) కుల్దీప్ 37; మ్యాక్స్వెల్ (బి) కుల్దీప్ 20; స్టొయినిస్ (సి) పాండ్యా (బి) అక్షర్ 2; డేవిడ్ (సి) బుమ్రా (బి) అర్‡్షదీప్ 15; వేడ్ (సి) కుల్దీప్ (బి) అర్‡్షదీప్ 1; కమిన్స్ (నాటౌట్) 11; స్టార్క్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–6, 2–87, 3–128, 4–135, 5–150, 6–153, 7–166. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–37–3, బుమ్రా 4–0–29–1, అక్షర్ పటేల్ 3–0–21–1, హార్దిక్ పాండ్యా 4–0–47–0, కుల్దీప్ యాదవ్ 4–0–24–2, జడేజా 1–0–17–0. ఒకే ఓవర్లో 29 పరుగులు... ఆసీస్ టాప్ బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రోహిత్ నాలుగు సిక్స్లు, ఒక ఫోర్తో పండగ చేసుకున్నాడు. ఈ ఓవర్ తొలి నాలుగు బంతుల్లో రోహిత్ వరుసగా 6, 6, 4, 6 కొట్టాడు. ఐదో బంతికి పరుగు రాకపోగా, తర్వాత స్టార్క్ ‘వైడ్’ వేశాడు. దాంతో అదనపు బంతిని కూడా రోహిత్ సిక్సర్గా మలిచాడు. -
బర్మింగ్హోమ్లో బర్నింగ్ మ్యాచ్
-
మేం గెలవడం వారికి ఇష్టం లేదు : ఇంగ్లండ్ ఓపెనర్
లండన్ : ఆస్ట్రేలియా చేతిలో ఓటమి అనంతరం ఇంగ్లండ్ జట్టు తమ దేశానికే చెందిన మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలను ఎదుర్కొంటుంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో సారథి మోర్గాన్ భయపడ్డాడని కెవిన్ పీటర్సన్ చురకలంటించగా.. వరల్డ్ కప్లో ఇంగ్లండ్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని మాజీ సారథి మైకేల్ వాన్ కామెంట్ చేశాడు. దీంతో ‘కొంతమందికి ఇంగ్లండ్ గెలవడం ఇష్టం లేదు. ఎప్పుడెప్పుడు ఓడిపోతుందా.. అంటూ జట్టుపై విమర్శలు చేయడానికి ఎదురుచూస్తున్నారు’ అని ఓపెనర్ బెయిర్స్టో స్పందించాడు. దీనిపై ఇన్స్టాగ్రామ్లో స్పందించిన మైకేల్ వాన్.. ‘బెయిర్ స్టోవి తప్పుడు ఆరోపణలు. ఇంతకుముందెన్నడూ లేనంత మద్దతు ప్రస్తుతం ఇంగ్లండ్కు లభిస్తుంది. అయితే నువ్వు, మీ జట్టు నిరాశ పరుస్తున్నారు. రెండు మ్యాచ్లు గెలిచి సెమీస్కు వెళ్లండి చాలు’ అని అన్నారు. బెయిర్స్టో వ్యాఖ్యలు దారుణమైనవి అని, ఇంగ్లండ్ ఓడిపోవాలని ఎవరూ అనుకోవడంలేదని అలా మాట్లాడటం భావ్యం కాదని పేర్కొన్నారు. -
రంగు మార్చడం అవసరమా..!
బర్మింగ్హామ్ : ప్రపంచకప్లో ఆదివారం ఇంగ్లండ్తో జరిగే పోరులో భారత జట్టు ధరించే ‘అవే’ జెర్సీని శుక్రవారం బీసీసీఐ విడుదల చేసింది. ముందు భాగంలో ముదురు నీలం రంగు... భుజాలు, వెనక భాగం పూర్తిగా నారింజ రంగుతో కనిపించేలా ఈ జెర్సీని ‘నైకీ’ సంస్థ డిజైన్ చేసింది. కొన్నాళ్ల క్రితం భారత్ ఉపయోగించిన ప్రాక్టీస్ డ్రెస్ పోలికలు ఇందులో కనిపిస్తున్నాయి. రేపు ఎడ్జ్బాస్టన్ మైదానంలో ఆతిథ్య ఇంగ్లండ్తో జరిగే మ్యాచ్లో భారత్ కొత్త జెర్సీతో బరిలోకి దిగుతుంది. ఫుట్బాల్ తరహాలో హోం, అవే మ్యాచ్లకు వేర్వేరు జెర్సీలను వేసుకునే సంప్రదాయాన్ని ఐసీసీ తొలిసారిగా ఈ ప్రపంచ కప్లో ప్రవేశపెట్టింది. భారత్, ఇంగ్లండ్ రెండు జట్లూ నీలి రంగునే వాడుతుండటంతో వాటి మధ్య తేడా చూపించేందుకు టీమిండియా ఆటగాళ్లు నారింజ రంగు జెర్సీని వేసుకోబోతున్నారు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ‘హోమ్’ టీమ్ కాగా, భారత్ను ‘అవే’ జట్టుగా నిర్ధారించారు. రంగు మార్చడం అవసరమా..! ప్రపంచ కప్లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లు చూసిన తర్వాత సగటు క్రికెట్ అభిమానికి వేర్వేరు జట్ల జెర్సీలు మనసులో ముద్రించుకుపోయే ఉంటాయి. భారత్, ఇంగ్లండ్ టీమ్ రంగులు పేరుకు ‘బ్లూ’ అయినా వీటి మధ్య ఎంతో తేడా ఉంది. అది స్పష్టంగా కనిపిస్తోంది కూడా. పైగా ఫుట్బాల్ తరహాలో ఆటగాళ్ల మధ్య గందరగోళానికి కారణమయ్యే ‘కలర్ క్లాషెస్’ క్రికెట్లో కనిపించదు. ఫుట్బాల్లో 22 మంది ఒకేసారి మైదానంలో ఉండటంతో పాటు సహచరుడికి పాస్లు అందిం చడం అతి కీలకమైన అంశం. కాబట్టి ఇబ్బంది లేకుండా పూర్తిగా భిన్నమైన రంగు జెర్సీలను ఆటగాళ్లు ధరిస్తారు. క్రికెట్లో ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా పిచ్ వదిలి రారు. ఎదురుగా కనిపించే సహచరుడితో సమన్వయం ఉంటే సరిపోతుంది. ఫీల్డింగ్ జట్టు దృష్టి కూడా ఇద్దరు బ్యాట్స్మెన్పైనే ఉంటుంది తప్ప ఇతర ఆటగాళ్లతో గందరగోళానికి తావు లేదు. మొత్తంగా ఈ జెర్సీ రంగు మార్పు వ్యవహారం పటాటోపం, హంగామా కోసం చేసినట్లనిపిస్తుంది. ఏదో ఒక సాకుతో కాస్త ఆకర్షణ తెచ్చే ప్రయత్నం చేయడం తప్ప వాస్తవంగా చూస్తే ఈ మార్పుకు ఎలాంటి అర్థం లేదు. Presenting #TeamIndia's Away Jersey 🤩🤩🇮🇳🇮🇳 What do you make of this one guys? #TeamIndia #CWC19 pic.twitter.com/TXLuWhD48Q — BCCI (@BCCI) June 28, 2019 -
అయ్యా..! జర జాగ్రత్త: రూట్
బర్మింగ్హామ్ : వరుసగా రెండు పరాజయాలతో డీలా పడ్డ జట్టు ఆటగాళ్లను ఇంగ్లండ్ బ్యాట్స్మన్ జో రూట్ అప్రమత్తం చేశాడు. సెమీస్ చేరాలంటే ఆదివారం భారత్తో, జూలై 3న న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లు నెగ్గాల్సి ఉన్న నేపథ్యంలో ఎడ్జ్బాస్టన్ వాతావరణాన్ని తట్టుకుంటూ ప్రశాంతంగా ఉండాలని సూచించాడు. తమకు ఇప్పటికీ సెమీస్ చేరగల సత్తా ఉందని, దానిని సాధిస్తే ఎలా చేరారన్నదానిని ఎవరూ పట్టించుకోరని వ్యాఖ్యానించాడు. రాబోయే మ్యాచ్లను క్వార్టర్ ఫైనల్స్గా పరిగణిస్తామని అతడు పేర్కొన్నాడు. ఇలాంటి కఠిన పరిస్థితి ఎప్పుడూ ఉంటుందని, కాకపోతే తమకు అనుకున్నదాని కంటే ముందుగానే వచ్చిందని రూట్ అభిప్రాయపడ్డాడు. -
‘ఇది మా ప్రపంచకప్.. వెనక్కి తగ్గే ముచ్చటే లేదు’
లండన్ : రెండు పరాజయాలు ప్రపంచకప్ నుంచి తమని తప్పించలేవని ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ తెలిపాడు. ఇది తమ ప్రపంచకప్ అని ధీమా వ్యక్తం చేశాడు. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 64 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఓటమి నుంచి ఇంగ్లండ్ గట్టెక్కించడానికి ఒంటిరి పోరాటం చేసిన స్టోక్స్(115 బంతుల్లో 89; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మిచెల్ స్టార్క్ అద్భుత యార్కర్కు క్లీన్బౌల్డై నిరాశగా పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో బ్యాట్ను తన్ని తన అసహనాన్ని ప్రదర్శించాడు. ఈ ఓటమి అనంతరం మాట్లాడుతూ.. ‘ ఇది మా ప్రపంచకప్. గత నాలుగేళ్లుగా మాకు లభించిన మద్దతు వెలకట్టలేనిది. ప్రపంచకప్ ఎంత కీలకమో మాకు తెలుసు. క్రికెట్లోనే ఇదో అద్భుత సమయం. (చదవండి : ఇంగ్లండ్కు ఛేజింగ్ చేతకాదు) ఈ మెగాటోర్నీకి దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం. వెనకడుగేసే ముచ్చటే లేదు. ఇది మా ప్రపంచకప్. ఎలాగైనా సాధిస్తాం. గెలపు కోసం ఒంటరిగా పోరాడినా ఫలితం దక్కనప్పుడు బాధ కలుగుతోంది. మా జట్టులోని ముగ్గురు, నలుగురు ఆటగాళ్లు చెలరేగితే మాకు తిరుగుండదు. తదుపరి మ్యాచ్లపై సరైన ప్రణాళికలు రచిస్తాం. గత రెండు మ్యాచ్ల్లో మా ప్రణాళికలు సరిగ్గా అమలు కాలేదు. ఇంగ్లండ్లో మాకు భారత్పై మంచి రికార్డు ఉంది. కానీ మేం మా అవకాశం కోసం ఎదురు చూస్తాం. బలమైన జట్టును ఢీకొంటున్నప్పుడు మన సాయశక్తుల ప్రదర్శన కనబర్చాలి. మేం మా శక్తిమేరకు పోరాడుతాం.’ అని స్టోక్స్ చెప్పుకొచ్చాడు.(చదవండి : ఆసీస్ విలాసం ఇంగ్లండ్ విలాపం) 👉 Finch's perfectly timed 4⃣ 👉 Behrendorff's 👌 delivery 👉 Starc's 🔥 inswinging yorker The #CWC19 contest between England and Australia was an absolute entertainer! Which of these moments will get your vote for @Nissan Play of the Day? VOTE HERE: https://t.co/yqTDMl6t9O pic.twitter.com/ORnF6VLgBz — ICC (@ICC) June 25, 2019 -
ఆరెంజ్ జెర్సీలో కోహ్లి సేన!
లండన్ : భారత క్రికెట్ జట్టు జెర్సీ మారనుంది. ఇప్పటి వరకు బ్లూ జెర్సీతో బరిలోకి దిగిన కోహ్లిసేన.. తొలిసారి ఆరెంజ్ జెర్సీ ధరించనుంది. అయితే ఇది కేవలం ఇంగ్లండ్తో జరిగే ప్రపంచకప్ మ్యాచ్కు మ్రాతమే. ఈ నెల 30న జరిగే ఈ మ్యాచ్కు కోహ్లిసేన ఆరెంజ్ జెర్సీలో అభిమానులను కనువిందు చేయనుంది. దీనికి కారణం ఇంగ్లండ్ జట్టే. ఈ ప్రపంచకప్కు ఆ జట్టు బ్లూ జెర్సీతో బరిలోకి దిగడం.. భారత్ జట్టు జెర్సీ రంగు కూడా అదే కావడంతో టీవీ ప్రేక్షకులు అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఐసీసీ.. జెర్సీ రంగులు క్లాష్ కాకుండా ఒక్కో జట్టుకు ప్రత్యామ్నాయ జెర్సీలకు అవకాశం ఇచ్చింది. ‘ఐసీసీ ఈవెంట్స్లో పాల్గొనే జట్లన్నీ విభిన్న రంగులున్న రెండు జెర్సీలను కలిగి ఉండాలి. ఈ విషయంలో ఆతిథ్య జట్టుకు మినహాయింపు ఉంది. ప్రత్యామ్నాయ రంగు ఎంపికలో జట్లదే పూర్తి స్వేచ్చ. కానీ ఒక రంగునే టోర్నీ మొత్తం కొనసాగించాలి. ఒకే రంగు జెర్సీ కలిగిన జట్లు తలపడినప్పడు మాత్రం ప్రత్యామ్నాయ జెర్సీని ఎంచుకోవాలి. ఈ విషయం ముందే తెలియజేయాలి’ అని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రపంచకప్ టోర్నీకి ఇంగ్లండ్ ఆతిథ్యమివ్వడంతో అదే జెర్సీతో బరిలోకి దిగుతుండగా భారత్ మాత్రం ఆరెంజ్ జెర్సీలో ఆడనుంది. వాస్తవానికి శనివారం జరిగే అఫ్గానిస్తాన్ మ్యాచ్కే భారత జట్టు జెర్సీ మారనుందని ప్రచారం జరిగింది. కానీ ఈ మ్యాచ్కు అఫ్గాన్ జట్టే ప్రత్యామ్నాయ జెర్సీతో బరిలోకి దిగుతుండటంతో భారత్ యధాతథంగా బ్లూజెర్సీలో ఆడనుంది. ఇక ఇప్పటికే బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు యెల్లో జెర్సీతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అలాగే పాకిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్కు కూడా ఆయా జట్లు జెర్సీలు మార్చుకోనున్నాయి. చదవండి : అయ్యో.. అది ఔటా? -
మూడు పరుగులు కొట్టలేక చేతులెత్తేశారు..
గుహవాటి: భారత మహిళలతో జరిగిన మూడు టీ20ల సిరీస్ను ఇంగ్లండ్ క్లీన్స్వీప్ చేసింది. శనివారం జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ మహిళలు పరుగు తేడాతో గెలిచి సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. కడవరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో భారత్ మహిళలు పరాజయం చవిచూశారు. చివరి ఓవర్లో భారత్ విజయానికి మూడు పరుగులు అవసరం కాగా, ఆ లక్ష్యాన్ని సాధించడంలో విఫలమయ్యారు. ఇంగ్లండ్ నిర్దేశించిన 120 పరుగుల లక్ష్య ఛేదనలో స్మృతీ మంధాన(58; 39 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీ సాధించగా, మిథాలీ రాజ్(30 నాటౌట్; 32 బంతుల్లో 4 ఫోర్లు) ఆకట్టుకోవడంతో భారత్ విజయం సాధిస్తుందనే అనుకున్నరంతా. అయితే ఇంగ్లండ్ అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్ను కట్టడి చేసింది. కేట్ క్రాస్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి మూడు బంతులకు పరుగులేమీ రాకపోగా, నాల్గో బంతికి భారతి ఫుల్మాలి ఔటైంది. దాంతో చివరి రెండు బంతుల్లో భారత్ మూడు పరుగులు సాధించాల్సి వచ్చింది. అయితే ఐదో బంతికి అనుజా పాటిల్ ఔట్ కాగా, చివరి బంతికి శిఖా పాండే పరుగు మాత్రమే చేశారు. ఫలితంగా భారత్ పరుగు తేడాతో ఓటమి పాలై సిరీస్లో వైట్వాష్ అయ్యింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ మహిళలు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేశారు.డానియల్లీ వ్యాట్(24), బీమౌంట్(29) అమీ ఎలెన్ జోన్స్(26), డంక్లీ బ్రౌన్( 14 నాటౌట్), ష్రబ్సోల్(10 నాటౌట్), హీథర్ నైట్(11) తలో చేయి వేసి పోరాడే స్కోరును భారత్ ముందుంచారు. అయితే భారత్ క్రీడాకారిణుల్లో మంధాన, మిథాలీ రాజ్ మినహా మిగతా వారు విఫలమయ్యారు. భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 118 పరుగులకే పరిమితం కావడంతో ఓటమి తప్పలేదు. -
అరే.. భయపడకండబ్బా! : మంధాన
గువాహటి : బ్యాటింగ్ చేసేటప్పుడు భయపడకుండా ఆడాలని టీమిండియా మహిళా టీ20 తాత్కాలిక కెప్టెన్ స్మృతి మంధాన సహచరులకు సూచించారు. గురువారం ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో భారత మహిళలు ఐదు వికెట్ల తేడాతో పరాజయం పొంది మూడు టీ20ల సిరీస్ను 2-0తో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ స్మృతి మంధాన మాట్లాడుతూ.. భయాన్ని పక్కనపెట్టి బ్యాటర్స్ బ్యాటింగ్ చేయాలని అభిప్రాయపడ్డారు. ‘దేశవాళి క్రికెట్లో ఎలా ఆడుతామో.. అంతర్జాతీయ క్రికెట్లో కూడా అలానే రాణించాలి. అలాంటప్పుడే భారీ స్కోర్లు చేయగలం. భయానికి, నిర్లక్ష్యానికి కొంత మాత్రమే తేడా. మా బ్యాటర్స్ది నిర్లక్ష్యమని నేను భావించడం లేదు. నాతో సహా మేం భయాన్ని వీడాల్సిన అవసరం ఉందని భావిస్తున్నా. అంతేకాకుండా మేం డాట్ బాల్స్ను కూడా తగ్గించుకోవాలి. సింగిల్స్తో స్ట్రైక్ రొటేట్ చేయడంపై కూడా దృష్టి పెట్టాలి. ఆడితే షాట్స్ లేకుంటే డాట్స్.. అన్న తరహాలో మా బ్యాటింగ్ ఉంది. ఇదే మాకు ప్రత్యర్థికి ఉన్న తేడా. దీన్ని ఎలాగైన మార్చుకుంటాం.’ అని వ్యాఖ్యానించారు. ఇక ఈ మ్యాచ్లో భారత్ నిర్దేశించిన 112 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఇంగ్లండ్ మహిళలు 19.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఫలితంగా మూడు టీ20ల సిరీస్ను ఇంకా మ్యాచ్ ఉండగానే 2-0తో కైవసం చేసుకున్నారు. భారత్తో జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ ఓపెనర్ డానియల్లీ వ్యాట్(64 నాటౌట్; 55 బంతుల్లో 6 ఫోర్లు) కడవరకూ క్రీజ్లో ఉండి విజయంలో ముఖ్య భూమిక పోషించారు. ఆమెకు జతగా లారెన్ విన్ఫీల్డ్(29; 23 బంతుల్లో 4 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించడంతో ఇంగ్లండ్ విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేశారు. భారత బ్యాటర్స్లో మిథాలీ రాజ్ చేసిన 20 పరుగులకే జట్టు తరఫున అత్యధిక స్కోరు. మంధాన(12), హర్లీన్ డియాల్(14), దీప్తి శర్మ(18), భారతి ఫుల్మాలి(18) ఇలా అంతా విఫలమయ్యారు. -
ఇంగ్లండ్దే టీ20 సిరీస్
గువాహటి: భారత మహిళలతో జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 112 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఇంగ్లండ్ మహిళలు 19.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఫలితంగా మూడు టీ20ల సిరీస్ను ఇంకా మ్యాచ్ ఉండగానే 2-0తో కైవసం చేసుకున్నారు. భారత్తో జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ ఓపెనర్ డానియల్లీ వ్యాట్(64 నాటౌట్; 55 బంతుల్లో 6 ఫోర్లు) కడవరకూ క్రీజ్లో ఉండి విజయంలో ముఖ్య భూమిక పోషించారు. ఆమెకు జతగా లారెన్ విన్ఫీల్డ్(29; 23 బంతుల్లో 4 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించడంతో ఇంగ్లండ్ విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేశారు. భారత బ్యాటర్స్లో మిథాలీ రాజ్ చేసిన 20 పరుగులకే జట్టు తరఫున అత్యధిక స్కోరు. మంధాన(12), హర్లీన్ డియాల్(14), దీప్తి శర్మ(18), భారతి ఫుల్మాలి(18) ఇలా అంతా విఫలమయ్యారు. ఐదుగురు క్రీడాకారిణులు సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో భారత్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రంట్ మూడు వికెట్లు సాధించగా, లిన్సే స్మిత్ రెండు వికెట్లు తీశారు. కేట్ క్రాస్, ష్రబ్సోల్లకు తలో వికెట్ దక్కింది. -
ఇంగ్లండ్ మహిళలతో టీ20లో భారత్ తడ‘బ్యాటు’
గువాహటి: మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టీ20లో భారత మహిళలు మరోసారి తడబాటుకు గురయ్యారు. తొలి టీ20లో బ్యాటింగ్లో ఘోరంగా విఫలమై ఓటమి చెందిన భారత మహిళల జట్టు.. రెండో టీ20లో కూడా అదే తరహా బ్యాటింగ్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల కోల్పోయి 111 పరుగులు చేశారు. భారత బ్యాటర్స్లో మిథాలీ రాజ్ చేసిన 20 పరుగులకే జట్టు తరఫున అత్యధిక స్కోరు కావడం గమనార్హం. మంధాన(12), హర్లీన్ డియాల్(14), దీప్తి శర్మ(18), భారతి ఫుల్మాలి(18) ఇలా అంతా విఫలమయ్యారు. ఐదుగురు క్రీడాకారిణులు సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో భారత్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రంట్ మూడు వికెట్లు సాధించగా, లిన్సే స్మిత్ రెండు వికెట్లు తీశారు. కేట్ క్రాస్, ష్రబ్సోల్లకు తలో వికెట్ దక్కింది. తొలి టీ20లో ఇంగ్లండ్ మహిళలు 41 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇక్కడ చదవండి: పరాజయ పరంపర ఆగేనా! -
తొలి మ్యాచ్లోనే మంధానకు చేదు అనుభవం!
గువాహటి : అస్సాంలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత మహిళా జట్టు పరాజయం పాలైంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక మంధాన సేన ఓటమి చవిచూసింది. దీంతో మూడు మ్యాచుల టీ20 సిరీస్లో 1-0 తేడాతో ఆతిథ్య జట్టు వెనుకబడింది. టీమిండియా బ్యాటర్లలో దీప్తి శర్మ(22), అరుంధతి రెడ్డి(18), శిఖా పాండే(23) మాత్రమే రాణించారు. కెప్టెన్ స్మృతి మంధాన(2) సహా సీనియర్ బ్యాటర్ మిథాలీ రాజ్(7) స్వల్ప స్కోరుకే పరిమితం కావడంతో.. భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 119 పరుగులు మాత్రమే చేసింది. రెండు విభాగాల్లో వైఫల్యం వల్లే మ్యాచ్ అనంతరం కెప్టెన్ మంధాన మాట్లాడుతూ.. ‘ 10 నుంచి 15 ఎక్స్ట్రా పరుగులు ఇచ్చాం. అదే విధంగా మాకు సరైన ఆరంభం కూడా లభించలేదు. బ్యాటింగ్, బౌలింగ్లో వైఫల్యం వల్లే ఓటమి పాలయ్యాం. అయితే అరుంధతి, దీప్తి శర్మ, శిఖాలు రాణించడంతో మెరుగైన స్కోరు సాధించాం. భవిష్యత్తు మ్యాచుల్లో ఈ అంశం మాకు సానుకూలంగా మారనుంది. గతం గురించి ఆలోచించకుండా జరుగనున్న మ్యాచులపై దృష్టి సారిస్తాం’ అని వ్యాఖ్యానించింది. కాగా టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ గాయం నుంచి కోలుకోకపోవడంతో... ఇంగ్లండ్తో స్వదేశంలో జరుగుతున్న టి20 జట్టుకు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తొలిసారిగా నాయకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. సోమవారం నాటి మ్యాచులో టాస్ గెలిచిన మంధాన ఇంగ్లండ్ జట్టును తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఆది నుంచి దూకుడుగా ఆడిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. బ్యాటర్స్ టామీ బూమంట్ (62), డేనియల్ వ్యాట్(35)తో కెప్టెన్ హెదర్ నైట్(40) రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. -
49 పరుగులకే సగం వికెట్లు కోల్పోయినా..
ముంబై: భారత మహిళలతో జరిగిన చివరిదైన మూడో వన్డేలో ఇంగ్లండ్ మహిళలు రెండు వికెట్ల తేడాతో గెలుపొందారు. భారత్ నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ మహిళలు 48.5 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఫలితంగా భారత్ చేతిలో వైట్వాష్ నుంచి తప్పించుకున్నారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ 49 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ హీథర్ నైట్(47), డానియల్లీ వ్యాట్(56)లు రాణించి జట్టు విజయంలో ప్రధాన భూమిక పోషించారు. వీరిద్దరూ 69 పరుగుల జత చేసి జట్టు పరిస్థితిని చక్కదిద్దారు. ఆపై వ్యాట్-ఎల్విస్ల జోడి 56 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ విజయాన్ని అందుకుంది. భారత బౌలర్లలో గోస్వామి మూడు వికెట్లు సాధించగా, పూనమ్ యాదవ్, శిఖా పాండేలు తలో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఓపెనర్ రోడ్రిగ్స్ డకౌట్గా పెవిలియన్ చేరినప్పటికీ, స్మృతీ మంధాన(66) మరోసారి మెరిశారు. ఆమెకు జతగా పూనమ్ రౌత్(56) రాణించడంతో భారత్ రెండో వికెట్కు 129 పరుగులు చేసింది. ఆ తర్వాత దీప్తి శర్మ(27 నాటౌట్), శిఖా పాండే(26)లు మాత్రమే రెండంకెల స్కోరును చేయడంతో భారత్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో కేథరిన్ బ్రంట్ ఐదు వికెట్లతో రాణించగా, స్కీవర్, ఎల్విస్, ష్రబ్సోల్లు తలో వికెట్ తీశారు. ఇప్పటికే భారత్ మహిళలు సిరీస్ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. వరుస రెండు వన్డేల్లో భారత్ మహిళలు విజయం సాధించి సిరీస్ను ముందుగానే చేజిక్కించుకున్నారు. ఇక్కడ చదవండి: భారత మహిళలదే వన్డే సిరీస్ -
మంధానకు కెప్టెన్సీ పగ్గాలు
ముంబై: రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో... ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్ల టి20 సిరీస్లో పాల్గొనే భారత మహిళల టి20 జట్టుకు స్మృతి మంధాన నాయకత్వం వహిస్తుంది. గువాహటిలో మార్చి 4, 7, 9వ తేదీల్లో ఇంగ్లండ్తో భారత్ మూడు టి20 మ్యాచ్లు ఆడుతుంది. భారత జట్టులో హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డి తన స్థానాన్ని నిలబెట్టుకుంది. భారత మహిళల టి20 జట్టు: స్మృతి మంధాన (కెప్టెన్), మిథాలీ రాజ్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, తానియా భాటియా (వికెట్ కీపర్), భారతి ఫుల్మాలి, అనూజా పాటిల్, శిఖా పాండే, కోమల్ జన్జాద్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్త్, రాధ యాదవ్, వేద కృష్ణమూర్తి, హర్లీన్ డియోల్. -
రెండో వన్డేలో ఏడు వికెట్ల తేడాతో భారత్ విజయం
-
భారత మహిళలదే వన్డే సిరీస్
ముంబై: ఐసీసీ చాంపియన్షిప్లో భాగంగా ఇంగ్లండ్ మహిళలతో జరిగిన రెండో వన్డేలో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత మహిళలు సిరీస్ను సొంతం చేసుకున్నారు. ఇంగ్లండ్ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళలు 41.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించారు. తద్వారా ఇంకా మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2-0తో కైవసం చేసుకున్నారు. భారత బ్యాటర్స్లో స్మృతీ మంధాన(63), మిధాలీ రాజ్(47 నాటౌట్), పూనమ్ రౌత్(32)లు రాణించి జట్టు ఘన విజయానికి తోడ్పడ్డారు. ఇంగ్లండ్ నిర్దేశించిన సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఆదిలోనే రోడ్రిగ్స్(0) వికెట్ను కోల్పోయింది. ఆ తరుణంలో మంధాన-పూనమ్ రౌత్ల జోడి రెండో వికెట్కు 73 పరుగులు జోడించారు. ఇక మూడో వికెట్కు మంధాన-మిధాలీ రాజ్ జోడి 66 పరుగుల్ని జత చేయడంతో భారత్ సునాయాసంగా గెలుపొందింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 43.3 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌటైంది. . ఇంగ్లండ్ మహిళల్లో నటలీ స్కీవర్(85) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. జులన్ గోస్వామి, శిఖా పాండేలు చెరో నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. మూడో వన్డే గురువారం జరుగనుంది. -
చెరో నాలుగు వికెట్లతో చెలరేగిపోయారు..
ముంబై: ఐసీసీ చాంపియన్షిప్లో భాగంగా భారత మహిళలతో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. జులన్ గోస్వామి, శిఖా పాండేల బౌలింగ్ ధాటికి విలవిల్లాడింది. వీరిద్దరూ చెరో నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. ఇంగ్లండ్ మహిళల్లో నటలీ స్కీవర్(85) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఓ దశలో 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో స్కీవర్ ఆదుకున్నారు. కాగా, భారత మహిళా బౌలర్ల విజృంభణకు మిగతా వారు వరుస పెట్టి క్యూకట్టారు. దాంతో ఇంగ్లండ్ 43.3 ఓవర్లలో 161 పరుగులకే చాపచుట్టేసింది. ప్రధానంగా జులన్, శిఖాల పదునైన బంతులకు ఇంగ్లండ్ దాసోహమైంది. మరొక బౌలర్ పూనమ్ యాదవ్కు రెండు వికెట్లు లభించాయి. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఇక్కడ చదవండి: ఏక్తా మాయాజాలం -
‘ఏక్తా’ ధాటికి ఇంగ్లండ్ ప్యాకప్
ముంబై: ఇంగ్లండ్తో జరిగిన తొలి మ్యాచ్లో భారత మహిళల జట్టు జయభేరి మోగించింది. ఐసీసీ చాంపియన్ షిప్లో భాగంగా ఇంగ్లండ్తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ తొలి మ్యాచ్లో మిథాలీ సేన 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పర్యాటక జట్టు స్పిన్ ఉచ్చులో చిక్కుకుపోయింది. టీమిండియా బౌలర్లు ఏక్తా బిస్త్(4/25), దీప్తి శర్మ(2/33), శిఖా పాండే(2/21), గోస్వామి(1/19)ల దెబ్బకు ఇంగ్లండ్ జట్టు 41 ఓవర్లలో 136 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ సారథి హెదర్ నైట్(39 నాటౌట్), ఆల్రౌండర్ సీవర్(44)లు మాత్రమే రాణించారు. ఏ దశలోనూ పర్యాటక జట్టను కోలుకోనీయకుండా ఆ జట్టు పతనాన్ని శాసించిన ఏక్తాబిస్త్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. రాణించిన మిథాలీ, రోడ్రిగ్స్ అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. స్మృతి మంధాన (24), రోడ్రిగ్స్ (48)లు తొలి వికెట్కు 69 పరుగులు జోడించారు. అనంతరం ఈ జోడిని ఎల్విస్ విడదీసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ(7) వెంటనే వేనుదిరగగా.. రోడ్రిగ్తో కలిసి మిథాలీ(44) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. అనంతరం ఇరువురు ఔటైన తర్వాత మిడిలార్డర్ చేతులెత్తేయడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. గాయం కారణంగా ఈ సిరీస్కు దూరమైన హర్మన్ ప్రీత్ స్థానంలో జట్టులోకి వచ్చిన హర్లీన్ డియోల్(2) పూర్తిగా నిరాశపరిచింది. చివర్లో తాన్యా భాటియా(25), గోస్వామి(30)లు రాణించడంతో టీమిండియా 202 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఎల్విస్, సీవిర్, సోఫీ ఎలెక్స్టోన్లు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ష్రబ్షోల్ ఒక్క వికెట్ దక్కించుకున్నారు. -
కెప్టెన్గా కోహ్లి రికార్డ్!
అడిలైడ్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్లో కోహ్లిసేన 31 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగు టెస్ట్ల సిరీస్ను ఘనంగా ఆరంభించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ల్లో కనీసం ఒక టెస్ట్ విజయం సాధించిన తొలి ఆసియా సారథిగా కోహ్లి చరిత్రకెక్కాడు. అంతేకాకుండా ఆసీస్ గడ్డపై సిరీస్ ఆరంభ మ్యాచ్ గెలిచిన భారత కెప్టెన్గా.. జట్టుగా అద్భుత ఫీట్ను సాధించారు. గతంలో భారత్ ఆసీస్ గడ్డపై ఐదు మ్యాచ్లు నెగ్గినప్పటికి ఎప్పుడు తొలి మ్యాచ్ను గెలవలేదు. 2008 పెర్త్ టెస్ట్ విజయానంతరం భారత్ ఆసీస్ గడ్డపై గెలుపొందడం విశేషం. ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత్ తొలి రెండు టెస్ట్లు ఓడి సిరీస్ చేజార్చుకున్నప్పటికి చివరి జోహన్నస్ బర్గ్ మ్యాచ్ గెలిచింది. ఈ సిరీస్లో కోహ్లి 6 ఇన్నింగ్స్ల్లో 47.67 సగటుతో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్గా నిలిచాడు. అలాగే ఇంగ్లండ్ సిరీస్లోను తొలి రెండు మ్యాచ్లు ఓడిన కోహ్లిసేన నాటింగ్హోమ్ టెస్ట్ను గెలిచింది. అనంతరం ఇంగ్లండ్ మరో రెండు మ్యాచ్లు గెలిచి 4-1 సిరీస్ను కైవసం చేసుకుంది. 2014లో ఇంగ్లండ్ గడ్డపై దారుణంగా విఫలమైన కోహ్లి.. ఈ సిరీస్ తన సత్తా చాటాడు. 10 ఇన్నింగ్స్లో 59.3 సగటుతో 593 పరుగలు చేశాడు. మిగతా బ్యాట్స్మెన్ నుంచి సహకారం లభించకపోవడంతో భారత్ సిరీస్ను కోల్పోయింది. అయితే ఆసీస్తో తాజా సిరీస్లో కోహ్లి బ్యాట్ మెరవకపోయినప్పటికీ.. పుజారా అద్భుత బ్యాటింగ్కు బౌలర్లు రాణించడంతో భారత్ విజయాన్నందుకుంది. టాస్ గెలిస్తే విజయం కోహ్లిదే.. విరాట్ కోహ్లి టాస్ గెలిస్తే.. మ్యాచ్ భారతే నెగ్గుతుంది. ఇప్పటి వరకు కోహ్లి సారథ్యం వహించిన టెస్ట్ మ్యాచ్ల్లో 20 సార్లు టాస్ గెలవగా.. ఇందులో భారత్ను 17 విజయాలు వరించాయి. మరో మూడు మ్యాచ్లు డ్రా అవ్వగా.. ఒక్క ఓటమి లేకపోవడం గమనార్హం. చదవండి: తొలి టెస్టులో టీమిండియా విజయం -
8 వికెట్ల తేడాతో భారత్ పరాజయం
-
టీ20 ప్రపంచకప్: హర్మన్ సేన కథ ముగిసింది!
మళ్లీ అదే తడబాటు.. అదే పొరబాటు.. అప్పుడు.. ఇప్పుడు బ్యాటింగ్ వైఫల్యమే.. భారత మహిళల చిరకాల కోరిక తీరకుండా చేసింది. గ్రూప్ దశలో తిరుగులేని విజయాలు సాధించి.. ఊరించిన హర్మన్ సేన సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో చతికిలపడింది. నాడు 2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టైటిల్ ముందు బోల్తాపడ్డ భారత మహిళలు.. నేడు టీ20 ప్రపంచకప్ సెమీస్లో చేతులెత్తేశారు. నార్త్ సాండ్(అంటిగ్వా) : ఇంగ్లండ్తో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన సెమీఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన హర్మన్ సేన ఇంగ్లండ్ బౌలర్ల దాటికి 19.3 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాట్స్వుమెన్స్లో స్మృతి మంధాన (34), జెమీమా రోడ్రిగ్స్(26)లవే టాప్ స్కోర్ సాధించారు. హార్డ్ హిట్టర్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ (16), కృష్ణమూర్తి (2), బాటియా (11)లు తీవ్రంగా నిరాశ పరిచారు. ఇక ఈ మ్యాచ్కు సీనియర్ క్రికెటర్, హైదరబాద్ స్టార్ మిథాలీ రాజ్ దూరం కావడం కూడా భారత్ను దెబ్బతీసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్.. అమీ జోన్స్ (53), నటాలీ సివర్ (51)లు అర్ధసెంచరీలతో చెలరేగడంతో 17.1 ఓవర్లలోనే విజయాన్నందుకుంది. భారత కాలమాన ప్రకారం ఆదివారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్.. ఆసీస్ను ఢీకొట్టనుంది. (చదవండి: మహిళా టీ20 ప్రపంచకప్: ఫైనల్లో ఆసీస్) -
మహిళా టీ20 ప్రపంచకప్: భారత్ ప్రత్యర్థి ఇంగ్లండ్
ప్రొవిడెన్స్ (గయానా) : మహిళా టీ20 ప్రపంచకప్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత మహిళలు సెమీస్లో ఇంగ్లండ్ను ఢీకొట్టనున్నారు. లీగ్ మ్యాచ్ల్లో వరుస విజయాలతో సత్తాచాటిన హర్మన్ సేన గ్రూప్-బి టాపర్గా సెమీస్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం జరిగిన గ్రూప్-ఏ చివరి లీగ్ మ్యాచ్లో వెస్టిండీస్, ఇంగ్లండ్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. అనంతరం విండీస్.. డాటిన్ (46),క్యాంప్బెల్లె (45)ల ఇన్నింగ్స్తో 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఈ గెలుపుతో విండీస్ సెమీస్లో ఆస్ట్రేలియాతో తలపడుతుండగా.. భారత్, ఇంగ్లండ్ను ఢీ కొట్టనుంది. ఇదే ఇంగ్లండ్తో 2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత మహిళలు ఒత్తిడిని అధిగమించలేక తృటిలో విజయాన్ని చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఇక మరోసారి సెమీస్లో ఇంగ్లండ్ను ఢీకొట్టబోతున్న హర్మన్ సేన అలాంటి తప్పిదాలు పునరావృతం చేయవద్దని భావిస్తోంది. ఇక భారత మహిళల్లో హర్మన్, మంధాన, మిథాలీ రాజ్లు బ్యాట్తో రాణిస్తుండగా.. స్పిన్ చతుష్టయం అనూజ పాటిల్, రాధా యాదవ్, పూనమ్ యాదవ్, దీప్తిశర్మలు బౌలింగ్లో రాణిస్తున్నారు. ఈ సారి ఎలాగైన టైటిల్ నెగ్గాలనే కసితో భారత మహిళలు బరిలోకి దిగుతున్నారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం సెమీస్ పోరు జరుగనుంది. -
కోహ్లి, ధావన్ భార్యల మధ్య గొడవ!
ముంబై : వెస్టిండీస్తో సొంతగడ్డపై 100వ విజయంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. సూయిదాగా మూవీ హిట్తో అతని సతీమణి అనుష్కశర్మలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అనుష్కశర్మకు సంబంధించి వచ్చిన వార్తలు ఇప్పుడు విరుష్క అభిమానులను కలవరపెడుతున్నాయి. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ భార్య అయేషా ముఖర్జీ, అనుష్కశర్మలు మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. ఎక్కడికెళ్లినా ఇద్దరు కలిసే వెళ్తుంటారు. అనేక మ్యాచ్ల్లో ఈ ఇద్దరు గ్యాలరీల్లో సందడి చేస్తూ తమ పార్టనర్స్కు మద్దతుగా నిలిచేవారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య మాటలు లేవని, ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని, అనుష్కశర్మపై అయేషా పీకలదాకా కోపం పెంచకుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. (చదవండి: భారత్ 100వ విజయం) వెస్టిండీస్తో జరిగే టెస్ట్ సిరీస్కు శిఖర్ ధావన్కు చోటు దక్కని విషయం తెలిసిందే. ఇదే అయేషా, అనుష్కశర్మల మధ్య గొడవకు కారణమని డైనిక్ జాగ్రన్ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. తన భర్తకు చోటు దక్కకపోవడానికి అనుష్కనే కారణమని అయేషా అగ్గి మీద గుగ్గిలమవుతుందని, ఇక జట్టుతో అనుష్క ఉన్నప్పుడు ఆమె జట్టు అంతర్గత సమావేశాలకు కూడా హాజరవుతుందని ఈ కథనం వివరించింది.అయేషా మాత్రం.. ఇవన్నీ గాలివార్తలనీ అలాంటి గొడవేమీ లేదనీ, తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని స్పష్టం చేశారు. బీసీసీఐ అధికారులు సైతం వారి మధ్య ఎలాంటి గొడవ లేదన్నారు. ఇంగ్లండ్తో రెండో వన్డే సందర్భంగా విరాట్ ఆ ఇద్దరికి పాస్లు ఏర్పాటు చేశాడని చెప్పారు. అనుష్కశర్మ మాత్రం ఇంకా స్పందించలేదు. ఇంగ్లండ్ పర్యటనలో దారుణంగా విఫలమైన ధావన్.. ఆసియాకప్లో రాణించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన విషయం తెలిసిందే. (హర్భజన్ ఇంత దురహంకారమా?) -
కనీసం చెప్పలేదు: మురళీ విజయ్ ఆవేదన
న్యూఢిల్లీ: భారత క్రికెట్లో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. జట్టు ఎంపికలో టీమిండియా వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే కరుణ్ నాయర్, సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పెదవి విరచగా.. తాజాగా ఆ జాబితాలో ఓపెనర్ మురళీ విజయ్ కూడా చేరాడు. వెస్టిండీస్తో టెస్టు సిరీస్ కోసం ఇటీవల ఎంపిక చేసిన జట్టు నుంచి కరుణ్ నాయర్ను పక్కకు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై కరుణ నాయర్తో పాటు హర్భజన్ సింగ్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే గత నెలలో ఇంగ్లండ్ వేదికగా ముగిసిన టెస్టు సిరీస్లో తనను జట్టు నుంచి తప్పించే క్రమంలో కనీసం సెలక్టర్లు ఒక్క మాట కూడా చెప్పలేదని ఓపెనర్ మురళీ విజయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ చీఫ్ సెలక్టర్ కానీ మిగతా ఎవరూ కూడా నన్ను తప్పించే విషయం చెప్పలేదు. మూడో టెస్టులో నన్ను ఉన్నపళంగా తప్పించారు. అంత వరకూ ఓకే. కానీ నాకు సమాచారం ఇవ్వలేదు. నేను జట్టుతో పాటు ఉన్నప్పటికీ ఎందుకు ఇలా చేశారో నాకు తెలీదు. దానిపై ఇప్పటికీ టీమిండియా సెలక్టర్లు ఎవ్వరూ మాట్లాడలేదు. తుది జట్టులో ఒక ఆటగాడ్ని తప్పించే క్రమంలో కనీసం ఎందుకు తప్పిస్తున్నామో చెప్పడం ధర్మం. ఒకవేళ ఇలా చేబితే మనకు ఒక ప్రణాళిక అనేది ఉంటుంది’ అని విజయ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్ల్లో కలిపి 26 పరుగులు మాత్రమే చేసిన మురళీ విజయ్ను మూడో టెస్టు నుంచి తప్పించారు. ఆపై నాలుగు, ఐదు టెస్టుల్లో సైతం అతనికి చోటు దక్కలేదు. కాగా, దీనిపై తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం బాధ కల్గించిందని విజయ్ తాజాగా పేర్కొన్నాడు. -
‘ఇక ధోనిపై అంచనాలు తగ్గించుకోండి’
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై అభిమానులు అంచనాలు తగ్గించుకోవాలని క్రికెట్ విశ్లేషకుడు, మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు. ఒక బ్యాట్స్మన్గా ప్రపంచ స్థాయిలో పోటీ ఇవ్వలేకపోతున్నాడని తెలిపిన మంజ్రేకర్.. అతనికి మ్యాచ్లను ఘనంగా ముగించే సత్తా కూడా సన్నగిల్లిందన్నాడు. అయితే వచ్చే వరల్డ్కప్ వరకూ అతన్నే కొనసాగించాలని, కాకపోతే ధోనికి ప్రత్యామ్నాయంగా మరొకరిని సిద్ధం చేయాలన్నాడు. ‘ఆసియాకప్ ఫైనల్లో ధోని మరింత కింద స్థానంలో వచ్చి ఉండే బాగుండేది. ధోని కన్నా ముందు కేదార్ జాదవ్ రావాల్సింది. అతడు ఫామ్లో ఉన్నాడు. పూర్తి స్థాయి బ్యాట్స్మన్. ఇక ధోనిపై అభిమానులు అంచనాలు తగ్గించుకోవాలి. అతనో అద్భుత వికెట్ కీపర్. వేగంగా స్టంపింగ్ చేస్తాడు. అతనిలాంటి అనుభవం ఉన్న వ్యక్తి విరాట్ కోహ్లీకి అవసరం. అతడి బ్యాటింగ్ మాత్రం సమస్యగా మారింది’ అని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. మరొకవైపు ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు టెస్టు సిరీస్ను 1-4 తేడాతో కోల్పోవడంపై మంజ్రేకర్ మరొకసారి పెదవి విరిచాడు. అసలు ప్రస్తుత భారత జట్టు బ్యాటింగ్లో అమోఘంగా ఉంటే, ఇంగ్లండ్ పిచ్లపై మాత్రం కనీసం పోరాటం ఇవ్వలేకపోయిందన్నాడు. ఇక్కడ బౌలింగ్ విభాగంలో టీమిండియా ఆకట్టుకుంటే, అందుకు భిన్నంగా మన బ్యాటింగ్ సాగిందన్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో చతికిలబడటానికి పేలవమైన బ్యాటింగ్ టెక్నికే కారణమన్నాడు. -
సింగ్ సిక్సర్ల విధ్వంసానికి 11 ఏళ్లు!
హైదరాబాద్ : ఒకే ఓవర్లో ఆరు సిక్స్ లు... ఈ మాట వినగానే ముందు గుర్తొచ్చేది విధ్వంసకర బ్యాట్స్మన్ యువరాజ్ సింగ్. 2007 ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ వేస్తున్న వేళ, సిక్సర్ల మోత మోగించిన యువీ పెను సంచలనం సృష్టించాడు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఇదే రోజు డర్భన్ వేదికగా యువీ బ్రాడ్ బౌలింగ్ను చీల్చిచెండాడాడు. ఈ విధ్వంసానికి యావత్ క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. అప్పటికే ప్రస్తుత టీమిండియా హెడ్కోచ్ రవిశాస్త్రి, హెర్ష్లీ గిబ్స్లు ఈ ఘనతను అందుకున్నా.. అంతగా ఆదరణ పొందలేదు. రవిశాస్త్రి దేశవాళి క్రికెట్లో ఈ ఘనత సాధించగా.. గిబ్స్ చిన్నదేశంపై అంతర్జాతీయ మ్యాచ్లోనే ఈ ఫీట్ను నెలకొల్పాడు. కానీ యువరాజ్ సింగ్ క్రికెట్ పుట్టిన దేశం ఇంగ్లండ్పైనే ఈ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్లో యువీ కేవలం 16 బంతుల్లోనే 58 పరుగులు చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. -
11 ఏళ్ల క్రితం ఇదే రోజు ...!
-
విరాట్ సేనకు ఇయాన్ చాపెల్ వార్నింగ్!
సిడ్నీ: మరో రెండు నెలల్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లబోతున్న టీమిండియా క్రికెట్ జట్టు ఇప్పుడే బ్యాటింగ్ లోపాలు సరిదిద్దుకునే పనిలో పడాలని, ఒకవేళ కాని పక్షంలో విరాట్ సేనకు ఘోర పరాభవం తప్పదని ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ హెచ్చరించాడు. ఇంగ్లండ్ పర్యటన ఆధారంగా టీమిండియా బ్యాటింగ్ శైలిని విశ్లేషించిన చాపెల్.. అదే సమయంలో తమ బౌలింగ్ విభాగం ఎంత పటిష్ఠంగా ఉందో చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చే ముందే టీమిండియా తమ బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకోవాలన్నాడు. లేదంటే సొంతగడ్డపై చురకత్తుల్లాంటి బంతులు విసిరే ఆసీస్ బౌలర్లను ఎదుర్కోవడం కష్టమేనని పేర్కొన్నాడు. ఆసీస్తో సిరీస్ను తేలిగ్గా తీసుకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నాడు. 'ఆస్ట్రేలియాలో అడుగు పెట్టకముందే టీమిండియా బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకోవాలి. స్టీవ్స్మిత్, డేవిడ్ వార్నర్ లేని ఆసీస్ బ్యాటింగ్ ప్రశ్నార్ధకంగానే కనిపించినా బౌలింగ్ మాత్రం ధీటుగా ఉంటుంది. మిచెల్ స్టార్క్, హేజిల్వుడ్, ప్యాట్ కమిన్స్లు సిరీస్ ఆసాంతం ఫిట్నెస్తో ఉంటే విరాట్ సేనను చిరాకు తెప్పిస్తారు’ అని ఇయాన్ చాపెల్ విశ్లేషించాడు. ఇంగ్లండ్లో బంతి గమనం గాలిలో ఉంటే ఆసీస్లో అదనపు బౌన్స్ సైతం తోడవుతుందని, దాంతో తమ బౌలింగ్ యూనిట్ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదన్నాడు. నవంబర్ 21 నుంచి జనవరి 18 వరకు ఆసీస్ గడ్డపై భారత్ 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది. -
‘ఇక రవిశాస్త్రిని తొలగించండి’
ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రిని తొలగించాలని మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ డిమాండ్ చేశాడు. ఆస్ట్రేలియా సిరీస్కు ముందే అతడిని పదవి నుంచి తొలగిస్తే మంచిదన్నాడు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో భారత్ ఘోర పరాజయం కావడంతో రవిశాస్త్రిపై విమర్శలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. భారత మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి పని తీరును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిలో భాగంగా మాట్లాడిన చేతన్ చౌహాన్..‘ఆస్ట్రేలియా పర్యటనకు ముందే రవిశాస్త్రిని ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి తొలగించాలి. శాస్త్రి అద్భుత క్రికెట్ వ్యాఖ్యాత. అతడిని ఆ పని చేసేందుకే అనుమతించాలి’ అని సూచించారు. ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లి సేన మెరుగైన ఆట తీరును కనబరచడంలో విఫలమైందన్నాడు. రెండు జట్లు బలాబలాల్లో సమానంగా ఉన్నా ఇంగ్లండ్ టెయిలెండర్లను ఔట్ చేయడంలో టీమిండియా విఫలమైందన్నారు. భారత క్రికెట్ జట్లలో కోహ్లి సేన అత్యుత్తమం అన్న రవిశాస్త్రి మాటలను చేతన్ వ్యతిరేకించాడు. ‘దాన్ని నేను అంగీకరించను. 1980ల్లోని భారత జట్టే ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక జట్టు’ అని చౌహాన్ పేర్కొన్నాడు. -
సామ్ కరణే దెబ్బకొట్టాడు: రవిశాస్త్రి
న్యూఢిల్లీ : టెస్ట్ సిరీస్లో భారత్ విజయవకాశాలపై ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరణ్ దెబ్బకొట్టాడని టీమిండియా హెడ్కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భారత్ 4-1తో సిరీస్ కోల్పోయిన విషయం తెలిసిందే. ఓ వెబ్సైట్తో మాట్లాడుతూ.. ‘మేం మరీ దారుణంగా విఫలమవ్వలేదు. కానీ ప్రయత్నించాం. ఇంగ్లండ్ గెలుపు క్రెడిట్ మాత్రం సామ్ కరణ్దే. అతను మ్యాన్ ఆఫ్ ది సిరీస్కు అర్హుడని విరాట్, నేను అనుకున్నాం. ఇంగ్లండ్ కన్నా కరణే మమ్మల్ని దెబ్బతీశాడు. తొలి టెస్ట్ ఎడ్జ్బాస్టన్లో క్లిష్ట స్థితిలో ఉన్న ఇంగ్లండ్ను బ్యాట్తో రాణించి గట్టెంక్కించాడు. ఇక నాలుగో టెస్ట్లో సైతం ఆల్రౌండ్ ప్రదర్శనతో మా విజయాన్ని లాగేశాడు. కీలక సమయాల్లో అటు బ్యాట్తో ఇటు బంతితో మెరిసాడు. ఇదే ఇరు జట్లలో ఉన్న వ్యత్యాసం. భారత జట్టు ఇంకా ప్రపంచ నెం.1నే. మేం ఎలా పోరాడామో ఇంగ్లండ్కు తెలుసు. మీడియాకు తెలుసు. మన అభిమానులకు తెలుసు. మా అంతరాత్మకు కూడా తెలుసు.’ అని వ్యాఖ్యానించాడు. విమర్శలపై స్పందిస్తూ.. తాము జట్టుకు ఏంచేశామో తమకు తెలుసని, ఈ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. ‘ ప్రజలు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మా బాధ్యతలు మాకు తెలుసు. మేం నిజాయితీగానే మా బాధ్యతలు నిర్వర్తించాం. ఈ విమర్శల పట్ల మేం బాధపడటం లేదు. గత మూడేళ్లుగా జట్టు సాధించిన విజయాలేంటో అందరికి తెలుసు.’ అని చెప్పుకొచ్చాడు. -
ధోనిని అధిగమించిన పంత్
లండన్ : ఇంగ్లండ్తో జరిగిన చివరి టెస్ట్లో టీమిండియా యువకెరటం, వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుత శతకంతో రెచ్చిపోయిన విషయం తెలిసిందే. పంత్ ఆడుతోంది టెస్ట్ క్రికెటా లేక టీ20నా అన్నట్లు అతని బ్యాటింగ్ సాగింది. 14 ఫోర్లు, 3 సిక్స్లతో 114 పరుగులతో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక పరుగులు, సెంచరీ సాధించిన తొలి భారత వికెట్ కీపర్గా పంత్ రికార్డు నమోదు చేశాడు. సీనియర్ వికెట్ కీపర్ ధోని(92)ని పంత్ అధిగమించాడు. అంతేకాకుండా సిక్స్తో సెంచరీ పూర్తి చేసి ఇలా తొలి టెస్టు సెంచరీని పూర్తి చేసుకున్న నాలుగో భారత క్రికెటర్గా గుర్తింపు పొందాడు. గతంలో కపిల్ దేవ్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్లు తమ తొలి సెంచరీని సిక్స్తో సాధించారు. టెస్టులోని 4వ ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్ కూడా రిషభ్ పంతే కావడం విశేషం. వికెట్ కీపర్గా సెంచరీ సాధించిన రెండో పిన్నవయస్కుడిగా పంత్ నిలిచాడు. అతని అద్భుత ప్రదర్శనకు మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ ముగ్దులయ్యారు. ‘సిక్స్తో సెంచరీ సాధించి ఆకట్టుకున్నావ్ పంత్’ అని సెహ్వాగ్ కొనియాడగా.. దూకుడుకు సరికొత్త నిర్వచనం చెప్పావని సచిన్ కితాబిచ్చాడు. (చదవండి: ఓడినా అసలు మజా లభించింది: కోహ్లి) Opened account in Test Cricket with a 6, first century in Test Cricket with a 6. Very impressive young man- Rishabh Pant. A brilliant innings from KL Rahul as well. Shining light amidst a difficult tour. — Virender Sehwag (@virendersehwag) September 11, 2018 Fantastic display of controlled aggression by @klrahul11 and @RishabPant777. This partnership is just one of the many fascinating moments this Test Series has provided us with. Test cricket at its absolute best. #ENGvIND pic.twitter.com/bN3WzdEDUb — Sachin Tendulkar (@sachin_rt) September 11, 2018 చదవండి: ఆశలు రేపి.. ఆవిరి చేసి! -
ఓడినా అసలు మజా లభించింది: కోహ్లి
లండన్ : ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ కోల్పోయినా అసలు సిసలు టెస్ట్ క్రికెట్ మజా లభించిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. చివరి టెస్ట్లో విజయంపై ఆశలు రేపినా భారత్కు 118 పరుగుల అపజయమే లభించింది. దీంతో 5 టెస్ట్ల సిరీస్ ఇంగ్లండ్ 4-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ..‘ఇంగ్లండ్ మా కంటే మెరుగ్గా రాణించింది. లార్డ్స్ టెస్ట్ మినహా మేం మిగతా మ్యాచ్లు బాగానే ఆడాం. మాకు లభించిన అవకాశాలను అందుకోలేకపోయాం. ఓడినా ఈ సిరీస్ హోరాహోరిగా సాగింది. అసలైన టెస్ట్ క్రికెట్ మజాను ఈ సిరీస్ అందించింది. రాహుల్, పంత్ల బ్యాటింగ్ అద్భుతం. పంత్ పోరాటపటిమ ఆకట్టుకుంది. అతనిపై మాకు నమ్మకం ఉంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు భారత్ భవిష్యత్తు. సామ్ కరణ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్కు అర్హుడు. తొలి, నాలుగో టెస్ట్లో అతను ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కష్ట సమయాల్లో తన జట్టును ఆదుకున్నాడు. ఇరు జట్లు విజయం కోసం పోటీపడటంతో అభిమానుల మ్యాచ్ చూసేందుకు వచ్చారు.’ అని తెలిపాడు.( చదవండి: టీమిండియాపై కుక్ అరుదైన ఫీట్) ఇక ఈ మ్యాచ్తో ఘనంగా అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ గురించి కోహ్లి మాట్లాడుతూ.. అతని కెరీర్ గొప్పగా సాగింది. అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నాడు. భారత్ రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్ లోకేశ్ రాహుల్ (224 బంతుల్లో 149; 20 ఫోర్లు, 1 సిక్స్), వికెట్ కీపర్ రిషభ్ పంత్ (146 బంతుల్లో 114; 15 ఫోర్లు, 4 సిక్స్లు) దూకుడైన, అద్భుత శతకాలతో విజయంపై ఆశలు రేకెత్తాయి. కానీ కీలక సమయంలో ఆదిల్ రషీద్ (2/63) చక్కటి బంతితో రాహుల్ను ఔట్ చేసి భారత్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఆ వెంటనే పంత్నూ సైతం పెవిలియన్ పంపి ఆతిథ్య జట్టు విజయానికి ఊపిరి పోశాడు.17 పరుగుల తేడాతో చివరి నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ 345 పరుగులకు ఆలౌటై 118 పరుగులతో ఓటమి మూటగట్టుకుంది. ఈ సిరీస్లో బ్యాట్తో మెరిసిన కోహ్లి కెప్టెన్సీ విఫలమయ్యాడని, తుది జట్టు ఎంపిక చేయడంలో తడబడ్డాడని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. చదవండి: ఆశలు రేపి... ఆవిరి చేసి! -
పోరాడి ఓడిన భారత్
-
పోరాడి ఓడిన భారత్... రాహుల్, పంత్ పోరాటం వృథా
లండన్ : ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టెస్ట్లో టీమిండియా పరాజయాం పాలైంది.118 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. దీంతో ఐదు టెస్ట్ల సిరీస్ను ఇంగ్లీష్ జట్టు 4-1తో సొంతం చేసుకుంది. భారత బ్యాట్సమెన్స్లో కేఎల్ రాహుల్ (149), రిషబ్ పంత్ (114) వీరోచిత సెంచరీలతో పోరాడినా.. మిగతా వారంతా విఫలమవ్వడంతో ఓటమి తప్పలేదు. రెండు పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ టీమిండియాను రాహుల్, పంత్ ధ్వయం ఆదుకున్నారు. వీరిద్దరు ఆరోవికెట్కు 204 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ దశలో విజయం వైపు వెళ్తున్న ఈ జోడిని రషీద్ అవుడ్ చేయడంతో వీరి పోరాటానికి తెరపడింది. దీంతో తరువాత వచ్చిన వారు కూడా వెంటనే అవుట్ అవ్వడంతో ఇంగ్లండ్ విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ మూడు, రషీద్, కరన్ రెండేసి వికెట్లతో రాణించారు. -
వారెవ్వా రిషబ్.. సూపర్ సెంచరీ
లండన్: ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టెస్ట్లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ సెంచరీతో చెలరేగాడు. దీంతో ఓటమి అంచుల్లోకి వెళ్లిన టీమిండియా అద్భుత పోరాట పటిమన ప్రదర్శిస్తొంది. కేవలం రెండు పరుగులకే ధావన్, కోహ్లి, పుజారా వికెట్లు కోల్పొయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్.. ప్రస్తుతం 298/5తో నిలిచి గెలుపు దిశగా పయనిస్తోంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ మెరుపు ఇన్సింగ్స్తో (142), యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్(101, 118 బంతుల్లో) సెంచరీలతో చెలరేగిపోయారు. మొదటి నుంచి దూకుడుగా ఆడిన పంత్ ఇంగ్లండ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఈ క్రమంలో కెరీర్లో మొదటి శతకానికి అందుకున్నాడు. ప్రస్తుతం ఇండియా విజయానికి ఇంకా 166 పరుగులు చేయాల్సిఉంది. చివరి సెషన్ కాబట్టి వికెట్లు కాపాడుకుంటూ ఇదే వేగాన్ని కొనసాగిస్తే భారత్కు అద్భుత విజయం దక్కుతుంది. -
రాహుల్ వీరోచితం పోరాటం.. భారత్ నిలిచేనా?
లండన్ : ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టెస్ట్లో ఓటమి నుంచి తప్పించుకునేందుకు భారత్ తీవ్రంగా పోరాడుతోంది. 464 పరుగుల భారీ లక్ష్యంతో చివరి రోజు బరిలోకి దిగిన భారత్.. లంచ్ సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (116, 136 బంతుల్లో 17 పోర్లు, 1 సిక్సు)తో వీరోచితంగా ఒంటరి పోరాటం చేస్తున్నాడు. కళ్లుచెదిరే షాట్లతో అలరించిన రాహుల్ ఈ సీరిస్లో తొలి శతకం నమోదు చేశాడు. ప్రస్తుతం క్రీజ్లో రాహుల్తో పాటు, రిషబ్ పంత్ (18) క్రీజ్లో ఉన్నాడు. మొదటి ఇన్సింగ్స్లో హాఫ్ సెంచరీతో రాణించిన విహారి రెండో ఇన్సింగ్స్లో డకౌట్గా వెనుదిరిగి తీవ్రంగా నిరిశపరిచాడు. రహానే 37 పరుగులుతో కొంతసేపు రాహుల్కు అండగా నిలిచాడు. భారత్ ఇంకా 285 పరుగులు వెనుకబడి ఉంది. ఈ తరుణంలో చివరి టెస్ట్ను కనీసం డ్రాతో ముగించాలని టీమిండియా పోరాడుతోంది. ప్రధాన బ్యాట్సమెన్ అందరూ అవుట్ కావడంతో టెయిలెండర్లు ఎంత మేరకు నిలుస్తారో వేచి చూడాలి. -
కానుకగా 33 బీర్ బాటిళ్లు..
లండన్: టీమిండియాతో ఆఖరి టెస్టు మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్కు క్రికెటర్ అలెస్టర్ కుక్ బీర్ బాటిళ్లను కానుకగా అందుకున్నాడు. అంతర్జాతీయ టెస్టు కెరీర్లో 33 శతకాలు సాధించిన కుక్కు 33 బీర్ బాటిళ్లను మీడియా ప్రతినిధులు కానుకగా అందజేశారు. అంతేకాదు ఒక్కో బాటిల్పై ఒక్కో మెసేజ్ను రాసి కుక్కు అందించారు. అనంతరం కుక్ వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఐదో టెస్టులో భాగంగా సోమవారం నాలుగో రోజు ఆటలో కుక్ శతకం సాధించిన తర్వాత మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు కుక్ జవాబులిచ్చే క్రమంలో ఒక వ్యక్తి కుక్ వద్దకు పెట్టె పట్టుకుని వెళ్లి సదరు కానుకను అందజేశాడు. గత కొన్నేళ్లుగా కెప్టెన్గా, ఆటగాడిగా ఇంగ్లండ్కు చేసిన సేవలకు గాను కుక్కు బీర్ బాటిళ్లను అందజేశారు. ‘రిటైర్మెంట్ ప్రకటించిన మీకు మా అందరి తరఫు నుంచి చిన్న కానుక. గతంలో మీరు ఒకసారి మాట్లాడుతూ ‘నేను వైన్ డ్రింకర్ను కాదు బీర్ మ్యాన్’ అని చెప్పారు. అది దృష్టిలో పెట్టుకునే మీకు 33 బీర్ బాటిళ్లను కానుకగా అందజేస్తున్నాం. ఒక్కో బాటిల్పై ఒక్కో మీడియాకు చెందిన ప్రతినిధి మీ కోసం ప్రత్యేకమైన మెసేజ్ రాశారు’ అని అతను తెలిపాడు. -
కేఎల్ రాహుల్కి బెన్ స్టోక్స్ సాయం..
లండన్: ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ పేరు చెబితే ఆటతోపాటు వివాదాలే గుర్తొస్తాయి. ఏడాది క్రితం బ్రిస్టర్ బార్ ముందు పడిన గొడవ కళ్ల ముందు మెదులుతూనే ఉంది. అప్పటి నుంచి స్టోక్స్ అంటేనే కాస్త జాగ్రత్తగా చూస్తున్నారంతా. కానీ టీమిండియాతో జరుగుతున్న ఐదో టెస్టు సందర్భంగా స్టోక్స్ క్రీడా స్ఫూర్తి చాటాడు. ఓవల్ టెస్టులో భారత్ ఇన్నింగ్స్ సమయంలో కేఎల్ రాహుల్కు స్టోక్స్ సాయం చేసి తనలో ఓ జెంటిల్మన్ కూడా ఉన్నాడని నిరూపించుకున్నాడు. స్టోక్స్ బౌలింగ్లో డిఫెన్స్ ఆడిన రాహుల్ పరుగు కోసం ప్రయత్నించాడు. పరుగెత్తే క్రమంలో అతడి పాదానికి ఉన్న షూ ఊడిపోయింది. దీంతో రాహుల్ ఒక కాలికి షూ లేకుండానే రన్నింగ్ చేశాడు. బౌలింగ్ చేసి తిరిగి బౌలర్ ఎండ్కు వెళ్తున్న స్టోక్స్...షూ కింద పడిపోవడం చూసి వెనక్కి వెళ్లాడు. షూ తీసుకొని లేస్ సరిచేసి రాహుల్ చేతికి అందించాడు. బెన్ స్టోక్స్ చేసిన పనికి రాహుల్ మాత్రమే కాకుండా క్రికెట్ అభిమానులు కూడా ఫిదా అయ్యారు. ఐదో టెస్టులో టీమిండియా ఓటమి దిశగా పయనిస్తోంది. ఇంగ్లండ్ బౌలర్లు విజృంభించి బౌలింగ్ చేయడంతో ఆఖరి రోజు భారత బ్యాట్స్మన్ అసాధారణంగా పోరాడ్సిలిందే. నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. శిఖర్ ధావన్(1), చతేశ్వర పుజారా(0), విరాట్ కోహ్లి(0)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. ఓటమి అంచున! -
కేఎల్ రాహుల్కి బెన్ స్టోక్స్ సాయం..
-
టీమిండియాపై అరుదైన ఫీట్!
లండన్ : భారత్తో జరుగుతున్న చివరి టెస్ట్లో ఇంగ్లండ్ ఓపెనర్ అలిస్టర్ కుక్ అరుదైన గణంకాలను నమోదు చేశాడు. ఈ మ్యాచ్తో ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ క్రికెట్ కెరీర్కు గుడ్బై చెబుతున్న విషయం తెలిసిందే. అయితే భారత్పైనే అరంగేట్రం చేసిన కుక్ చివరి మ్యాచ్ కూడా అదే జట్టుతో ఆడటం విశేషం. అరంగేట్ర మ్యాచ్లోనే సెంచరీతో చెలరేగిన కుక్.. చివరి మ్యాచ్లోనూ సెంచరీ సాధించాడు. తద్వారా అరంగేట్ర, కెరీర్ చివరి టెస్టులోనూ సెంచరీ చేసిన ఐదో క్రికెటర్గా గుర్తింపు పొందాడు. గతంలో రెగీ డఫ్ (ఆస్ట్రేలియా), పోన్స్ఫర్డ్ (ఆస్ట్రేలియా), గ్రెగ్ చాపెల్ (ఆస్ట్రేలియా), అజహరుద్దీన్ (భారత్) ఈ ఘనతను సాధించారు. రెగీ డఫ్ 1902లో ఇంగ్లండ్పై అరంగేట్ర మ్యాచ్లో (32,104) పరుగులు చేశాడు. చివరి మ్యాచ్ అదే ఇంగ్లండ్పై 1905లో (146, రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయలేదు) చేశాడు. బిల్ పోన్స్ఫర్డ్ 1924లో ఇంగ్లండ్పై అరంగేట్ర మ్యాచ్లో (110,27).. చివరి మ్యాచ్(1934)లో అదే ఇంగ్లండ్పై (266,22) పరుగులు సాధించాడు. గ్రెగ్ చాపెల్ ఇంగ్లండ్పై (1970) అరంగేట్ర మ్యాచ్లో (108 పరుగులు, రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయలేదు).. చివరి మ్యాచ్(1984)లో పాకిస్తాన్పై (182, రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయలేదు) పరుగులు చేశాడు. అజహరుద్దీన్ ఇంగ్లండ్పై అరంగేట్ర మ్యాచ్ (1984)లో (110, రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయలేదు).. లాస్ట్ మ్యాచ్(2000)లో దక్షిణాఫ్రికాపై (9,102) పరుగులు సాధించాడు. ఇక 2006లో భారత్పై నాగ్పూర్లో తన తొలి టెస్ట్ ఆడిన కుక్ అందులోనూ (60,104 నాటౌట్), అర్ధశతకం, శతకం సాధించాడు. ఇప్పుడు చివరి మ్యాచ్లోనూ(71,147)లతో అదే గణంకాలను పునరావృతం చేశాడు. ఇలాంటి అరుదైన ఫీట్ నమోదు చేసిన ఏకైక క్రికెటర్ కుక్ ఒక్కడే కావడం గమనార్హం. టాప్-5లో కుక్.. టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కుక్ (12,472) పరుగులతో ఐదో స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఎడమ చేతివాటం బ్యాట్స్మన్గా కుక్ రికార్డు నెలకొల్పాడు. సంగక్కర (శ్రీలంక–12,400) పేరిట ఉన్న రికార్డును అతను తిరగరాశాడు. అత్యధిక పరుగుల జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 15921 తొలి స్థానంలో ఉండగా.. రికీ పాంటింగ్ (13378), జాక్వస్ కల్లీస్(13289), రాహుల్ ద్రవిడ్ (13288)లు కుక్ కన్నా ముందున్నారు. ‘‘గడిచిన ఈ నాలుగు రోజులు నిజమా.. కలనా అనిపిస్తోంది. ఇక్కడున్న నా స్నేహితులు కొంత మంది గత నాలుగురోజులుగా నన్ను ట్రీట్ చేసిన విధానం అత్యద్భుతం. ఇక నా బ్యాటింగ్ చివరి ఓవర్స్లో నా అభిమానుల పాటలు చాలా ప్రత్యేకం’’ - అలిస్టర్ కుక్ చదవండి: ఓటమి అంచున కోహ్లి సేన -
కుమ్మెసిన కుక్.. భారత్ ముందు భారీ టార్గెట్
లండన్ : ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టెస్ట్లో ఇంగ్లండ్ రెండో ఇన్సింగ్స్లో 423 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో భారత్కు 464 పరుగుల భారీ టార్గెట్ను నిర్ధేశించింది. 114/2 తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ మొదటి నుంచి భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కుక్ తన చివరి ఇన్సింగ్స్ లో 147 పరుగులతో వీరోచిత సెంచరీతో చెలరేగాడు. మరో ఆటగాడు జో రూట్ తనదైన శైలిలో రెచ్చిపోయి 125 పరుగులు సాధించాడు. క్రీజ్లో పాతుకుపోయిన వీరిద్దరిని ఆంధ్రా ఆటగాడు హనుమ విహారి వరుస బంతుల్లో అవుడ్ చేశాడు. చివర్లో బేయిర్స్టో 37 పరుగులతో రాణించాడు. దీంతో రెండో ఇన్సింగ్స్లో ఇంగ్లండ్ ఎనిమిది వికెట్లు నష్టానికి 423 పరుగుల సాధించి డిక్లేర్ చేసింది. మొదటి ఇన్సింగ్స్లోని 40 పరుగుల ఆధిక్యంతో కలుపుకుని భారత్ ముందు 464 పరుగుల భారీ టార్గెట్ను ఉంచింది. భారత బౌలర్లలో విహారి, జడేజా మూడేసి వికెట్లతో రాణించారు. రేపు చివరి రోజు కావడంతో భారమంతా బ్యాట్స్మెన్పైనే ఉంది. ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కుని రేపంతా నిలడబితే టెస్ట్ను డ్రాగా ముగించే అవకాశం ఉంటుంది. -
అఖరి ఇన్సింగ్స్లో కుక్ సెంచరీ
లండన్ : భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఆఖరి టెస్ట్లో ఇంగ్లండ్ ఆటగాడు అలెస్టర్ కుక్ అద్భుత శతకంతో చెలరేగాడు. చివరి టెస్ట్ మ్యాచ్లో కుక్ శతకం సాధించి తన కెరీర్లో 33వ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ సందర్భంగా కుక్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. విహారి వేసిన ఇన్సింగ్స్ 70వ ఓవర్లో సింగిల్ ద్వారా కుక్ 100 పరుగుల మార్కును అందుకున్నాడు. అతని సెంచరీ పూర్తి చేయగానే స్టేడియం చప్పట్లతో హోరెత్తింది. 2006లో నాగపూర్ టెస్ట్ ద్వారా భారత్పై తన అరంగ్రేటం మ్యాచ్లో సెంచరీతో కదంతొక్కిన కుక్.. తన చివరి మ్యాచ్లో కూడా భారత్పై సెంచరీతో చెలరేగిపోయాడు. 2006లో నాగపూర్లో జరిగిన టెస్ట్లో కుక్ 104 పరుగులతో నాటౌట్గా నిలిచిన విషయం తెలిసిందే. 114/2 తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ మొదటి నుంచి భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కుక్-రూట్ జోడి క్రీజ్లో పాతుకుపోయి ఎడాపెడా బౌండరీలతో చెలరేగిపోయారు. మరో ఆటగాడు రూట్ కూడా సెంచరీ దిశగా వెళ్తున్నాడు. లంచ్ విరామం సమయానికి ఇంగ్లండ్ 243/2తో పటిష్టమైన స్థితిలో నిలిచింది. క్రీజ్లో కుక్ (103), రూట్ (93) ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 283 పరుగుల ఆధిక్యంతో ఉంది. -
‘మ్యాచ్కు ముందు ద్రవిడ్తో చాలాసేపు మాట్లాడా’
లండన్: ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా చివరి మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన తెలుగు కుర్రాడు హనుమ విహారి తొలి మ్యాచ్లోనే ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త తడబడినా.. కుదురుకున్నాక స్వేచ్ఛగా ఆడాడు. చక్కటి డిఫెన్స్, టెక్నిక్తో ఇంగ్లండ్డ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. టెస్టు అరంగేట్రం మ్యాచ్లోనే విహారి(56; 124 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీ సాధించి.. ఇంగ్లండ్ గడ్డ మీద ఈ ఘనత సాధించిన ద్రవిడ్, గంగూలీల సరసన నిలిచాడు. అరంగేట్రం చేయబోతున్న విషయం మ్యాచ్ ప్రారంభానికి ముందు రోజే తనకు తెలిసిందని విహారి తెలిపాడు. వెంటనే ఇండియా-ఏ కోచ్ రాహుల్ ద్రవిడ్కు ఫోన్ కాల్ చేసి ఇదే విషయం చెప్పానన్నాడు. చాలాసేపు ద్రవిడ్తో మాట్లాడిన తనకు కొన్ని సలహాలు ఇచ్చాడని, అలా మాట్లాడటం వల్ల మ్యాచ్కు ముందు తనపై ఒత్తిడి తగ్గిందని విహారి తెలిపాడు. ‘నీకు నైపుణ్యం ఉంది, మంచి ఆలోచనా విధానం, టెంపర్మెంట్ ఉంది. బరిలో దిగి ఆటను ఆస్వాదించు’ అని ద్రవిడ్ చెప్పాడని విహారి తెలిపాడు. ఇండియా-ఏ తరఫున రాణించడంతోపాటు ద్రవిడ్ సూచనలు తనను మెరుగైన ఆటగాడిగా మార్చాయని హనుమ విహారి పేర్కొన్నాడు. -
టీమిండియా విదేశీ సిరీస్లు గెలవాలంటే..
బెంగళూరు: నాణ్యమైన బ్యాట్స్మెన్లతో పాటు బలమైన బౌలింగ్ లైనప్ ప్రస్తుత టీమిండియా క్రికెట్ జట్టు సొంతమని ఆసీస్ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. కానీ విదేశాల్లో మ్యాచ్లకు వచ్చేసరికి భారత క్రికెట్ జట్టు మానసిక స్థైర్యాన్ని కోల్పోతుందని పేర్కొన్నాడు. టీమిండియా విదేశీ సిరీస్లను గెలవాలంటే ముందుగా మానసికంగా మరింత ధృడంగా తయారు కావాలన్నాడు. ఈ క్రమంలోనే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై గిల్క్రిస్ట్ ప్రశంసలు కురిపించాడు. ‘ విదేశీ సిరీస్లు ఎవరికైనా సవాల్తో కూడుకున్నవే. భారత జట్టు బౌలింగ్ యూనిట్, బ్యాటింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉంది. విరాట్ కోహ్లి వంటి ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్మన్ భారత జట్టులో ఉన్నాడు. విదేశాల్లో సిరీస్లను గెలిచే సత్తా భారత జట్టుకు ఉంది. కాకపోతే ఇక్కడ తగినంత మానసిక ధృడత్వం కావాలి’ అని గిల్క్రిస్ట్ పేర్కొన్నాడు. మరొకవైపు ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్ను టీమిండియా కోల్పోవడంపై మాట్లాడటానికి గిల్క్రిస్ట్ నిరాకరించాడు. ఈ సిరీస్ లైవ్ను తాను చూడలేదని, కేవలం హైలెట్స్ మాత్రమే చూశానన్నాడు. దాంతో సిరీస్లో టీమిండియా ఓవరాల్ ప్రదర్శనపై కామెంట్ చేయడం సరైనది కాదన్నాడు. కాకపోతే భారత జట్టు చిరస్మరణీయమైన విజయాలు సాధించడంలో కెప్టెన్ కోహ్లి పాత్ర ప్రధానమన్నాడు. జట్టును సానుకూల ధోరణితో కోహ్లి నడిపించే తీరు అద్భుతంగా ఉందన్నాడు. తనకు కోహ్లిలో నచ్చేది అతని దూకుడేనని గిల్క్రిస్ట్ పేర్కొన్నాడు. -
కోహ్లి ప్రపంచంలోనే ఓ చెత్త సమీక్షకుడు
లండన్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రపంచంలోనే ఓ గొప్ప బ్యాట్స్మెన్.. కానీ ప్రంపంచంలోనే ఓ చెత్త రివ్యూయర్ కూడా అతనే అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డారు. భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ నేపథ్యంలో వాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో కెప్టెన్ కోహ్లి అప్పుడే రెండు డీఆర్ఎస్(డిసిషన్ రివ్యూ సిస్టమ్)లను వృథా చేశాడు. రెండింట్లో భారత్కు ఫలితం ప్రతికూలంగానే వచ్చింది. దీంతో వాన్ ‘ విరాట్ ప్రపంచంలోనే ఓ గొప్ప బ్యాట్స్మన్. కానీ నిజమేంటంటే ప్రపంచంలోనే ఓ చెత్త రివ్యూయర్ కూడా అతనే’ అని ట్వీట్ చేశాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో జడేజా వేసిన 10వ ఓవర్ రెండో బంతి ఆ జట్టు ఓపెనర్ జెన్నింగ్స్ ప్యాడ్స్కు తగిలింది. దీంతో వెంటనే సమీక్ష కోరిన భారత కెప్టెన్కు నిరాశే ఎదురైంది. బంతి ఔట్ స్టంప్స్కు వెళ్లినట్లు రిప్లేలో స్పష్టం అయింది. మళ్లీ 12వ ఓవర్లో అదే జడేజా వేసిన బంతి కుక్ ప్యాడ్లకు తాకింది. మళ్లీ కోహ్లి సమీక్ష కోరి భంగపడ్డాడు. దీంతో రెండు రివ్యూలు వృథా అయ్యాయి. ఇక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ కుదురుగా ఆడుతోంది. ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. చదవండి : భారత్- ఇంగ్లండ్ సిరీస్ ముచ్చట్లు -
జడేజాను ముందే తీసుకోవాల్సింది!
లండన్: ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టెస్ట్లో ఒంటరి పోరాటంతో భారత్ను గట్టెక్కించిన ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సామ్యానుడి నుంచి దిగ్గజాల వరకు అతని పోరాటాన్ని కొనియాడుతున్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్లో టాప్ ఆర్డర్ చేతులెత్తేయగా.. మిడిలార్డర్లో బ్యాటింగ్కు వచ్చిన జడేజా యువ ఆటగాడు విహారితో కలిసి 77 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి భారత్ను ఆదుకున్నాడు. విహారి వికెట్ అనంతరం అవతలి బ్యాట్స్మెన్కు అవకాశమివ్వకుండా డబుల్స్, బౌండరీలు బాదేందుకు ఉత్సాహం చూపాడు. ఈ క్రమంలో 113 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న జడేజా... ఇషాంత్ (4), షమీ (1), బుమ్రా (0) సాయంతో 55 పరుగులు జోడించడం విశేషం. దీంతోనే భారత్ 292 పరుగులు చేయగలిగింది. జడేజా (156 బంతుల్లో 86; 11 ఫోర్లు, 1 సిక్స్, నాటౌట్) ఇన్నింగ్స్తో ఇంగ్లండ్ ఆధిపత్యానికి గండిపడింది. ఇక అంతకు ముందు బంతితో నాలుగు వికెట్లు సాధించిన జడేజాను ముందు మ్యాచ్లే ఆడిపిస్తే సిరీస్ ఫలితం వేరేలా ఉండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జడేజా ఆటను టీమిండియా సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ కొనియాడాడు. ‘వెల్డన్ జడేజా.. నీవు ముందే ఈ సిరీస్లో ఆడుంటే ఫలితం మరోలా ఉండేది. 4 వికెట్లతో పాటు అద్భత హాఫ్ సెంచరీ సాధించావు.. అలాగే రాణించు’ అని ట్విటర్లో ప్రశంసించాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ సైతం జడేజా ప్రదర్శనను కొనియాడాడు. ‘ జడేజా ఆటతీరు ఆకట్టుకుంది. అన్ని సమయాల్లో అతన్ని ఆడించాలని భారత్ ఎలా గ్రహిస్తుందో.. గొప్ప నైపుణ్యం కలిగిన ఆటగాడు’ అని ట్వీట్ చేశారు. భారత ఆటగాళ్లు ఆర్పీసింగ్ సైతం బంతితో, బ్యాట్తో రాణించిన జడేజాను కొనియాడాడు. ఇక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ కుదురుగా ఆడుతోంది. ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. Well done @imjadeja should have played earlier in the series things could have been different.. 4 wickets and a brilliant 50.. keep going pal — Harbhajan Turbanator (@harbhajan_singh) September 9, 2018 Love the way @imjadeja plays the game ... Somehow India have to find a way to play him all the time ... Great skills ... #ENGvIND — Michael Vaughan (@MichaelVaughan) September 9, 2018 చదవండి: ఎటువైపో ఈ ‘టెస్టు’ -
ద్రవిడ్, గంగూలీ తర్వాత విహారే!
లండన్ : ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టెస్ట్లో తెలుగు క్రికెటర్ హను విహారి అరుదైన రికార్డ్ను నమోదు చేశాడు. ఈ మ్యాచ్తోనే టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన ఈ యువక్రికెటర్ క్లిష్ట సమయంలో హాఫ్ సెంచరీ సాధించి భారత్ను గట్టెక్కించాడు. దీంతో అరంగేట్రపు మ్యాచ్లో హాఫ్ సెంచరీ సాధించిన 26వ భారత క్రికెటర్గా విహారి గుర్తింపు పొందాడు. ఈ మధ్యకాలంలో ఈ ఘనతను టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా శ్రీలంకపై అందుకున్నాడు. అతని స్థానంలోనే తుది జట్టులోకి వచ్చిన విహారి సైతం ఈ జాబితాలో చేరడం విశేషం. ఇంగ్లండ్ గడ్డపై అరంగేట్ర మ్యాచ్లో హాఫ్ సెంచరీ సాధించిన మూడో భారత క్రికెటర్గా విహారి నిలిచాడు. 1996లో లార్డ్స్ టెస్ట్లో సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్లు ఈ ఘనతను అందుకున్నారు. 104 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన విహారి ఇంగ్లండ్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడు. అంతేకాదు జడేజాతో కలిసి ఈ సిరీస్లో అత్యధిక పరుగుల (73) మిడిలార్డర్ భాగస్వామ్యం నెలకొల్పారు. మరోవైపు జడేజా(86) సైతం సూపర్ ఇన్నింగ్స్తొ పోరాడటంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 292 పరుగులు చేయగలిగింది. -
చివరి టెస్ట్: అండర్సన్కు షాక్!
లండన్: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్ట్లో కెప్టెన్ విరాట్ కోహ్లితో వాగ్వాదానికి దిగిన ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్స్న్పై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నారు. ఐసీసీ క్రీడా నియమావళిని ఉల్లంఘించిన నేపథ్యంలో అతనికి మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించారు. క్రమశిక్షణా చర్యల కింద ఒక డీమెరిట్ పాయింట్ను కూడా వేశారు. ఓవల్ వేదికగా జరగుతున్న చివరి టెస్ట్ రెండో రోజు ఆటలో అంపైర్ నిర్ణయంపై అండర్సన్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు కోహ్లితో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. అసలేం జరిగిందంటే.. భారత ఇన్నింగ్స్లో అండర్సన్ వేసిన 29వ ఓవర్లో బంతి విరాట్ కోహ్లి ప్యాడ్లను తాకింది. దీంతో ఆండర్సన్ వెంటనే అప్పీల్ చేయడంతో అంపైర్ కుమార ధర్మసేన నాటౌట్గా ప్రకటించాడు. అనంతరం రివ్యూ కోరిన నిరాశే ఎదురైంది. దీంతో ఆగ్రహానికి లోనైన అండర్సన్ అంపైర్ ధర్మసేనతో పాటు విరాట్ కోహ్లితో గొడవ పడ్డాడు. ఇది ఐసీసీ నియమావళి 2.1.5కు విరుద్దం కావడంతో మ్యాచ్ రిఫరీ జరిమానా విధిస్తూ చర్యలు తీసుకున్నారు. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో తెలుగు క్రికెటర్ విహారి(25), జడేజా(5)లు ఆడుతున్నారు. ఇంకా భారత్ 158 పరుగుల వెనుకంజలో ఉంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ను 332 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. -
కోహ్లి, అండర్సన్ల మధ్య ఏం జరిగింది?
లండన్: ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా టీమిండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు శుక్రవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో రెండో రోజైన శనివారం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ సంఘటన ఇన్నింగ్స్ 29వ ఓవర్లో చోటు చేసుకుంది. ఇందుకు కారణం కెప్టెన్ విరాట్ కోహ్లిని అంపైర్ కుమార ధర్మసేన నాటౌట్గా ప్రకటించడమే. అండర్సన్ వేసిన ఇన్నింగ్స్ 29వ ఓవర్లో బంతి విరాట్ కోహ్లి ప్యాడ్లను తాకింది. దీంతో అండర్సన్ వెంటనే అప్పీల్ చేసినా అంపైర్ ధర్మసేన అతని అప్పీల్ను తిరస్కరించాడు. కానీ, బంతి వికెట్లను తాకుతుందని భావించిన ఆండర్సన్ రివ్యూ కోరాడు. రివ్యూలో బంతి వికెట్లకు తాకే అవకాశం ఉన్నట్లు కనిపించినా.. థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని ఫీల్డ్ అంపైర్కు వదిలేశాడు. దీంతో ధర్మసేన తన నిర్ణయానికే కట్టుబడి ఉండడంతో బెన్ఫిట్ ఆఫ్ డౌట్ కింద కోహ్లి నాటౌట్గా నిలిచాడు. దీంతో అంఫైర్ ధర్మసేన దగ్గరకు వెళ్లి కోపంగా మాట్లాడిన జేమ్స్ అండర్సన్.. ఆ తర్వాత విరాట్ కోహ్లి వద్దకు వెళ్లి కోపంతో ఊగిపోయాడు. దానికి కోహ్లి కూడా అంతే వేగంగా స్పందించడంతో అంఫైర్ ధర్మసేన కలగజేసుకుని ఇద్దరు ఆటగాళ్లకు సర్దిచెప్పాడు. పట్టు చేజారినట్టే! -
మేము కూడా దేశం కోసమే ఆడాం: గంగూలీ
కోల్కతా: టీమిండియా క్రికెట్ జట్టులో గతంలోనూ గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఇప్పుడు ఉన్న జట్టులా అతి తక్కువ సమయంలో అత్యధిక విజయాలను సాధించలేదంటూ టీమిండియా కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ మండిపడ్డారు. ‘అవి అజ్ఞానంతో చేసిన వ్యాఖ్యలు. రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భారత మాజీ క్రికెటర్ చేతన్ శర్మ, నేను, ఎంఎస్ ధోని లాంటి వాళ్లం భారత్ తరఫున ఆడాం. అన్ని తరాల వాళ్లం దేశం కోసమే ఆడాము. ఇప్పుడు అలాగే విరాట్ కోహ్లి ఆడుతున్నాడు. మేమందరమూ టీమిండియాకు చెందిన వాళ్లమే. ఆయా సమయాల్లో మేమందరమూ ప్రాతినిధ్యం వహిస్తూ ఆడాము. ఒక తరంతో మరొక తరం క్రికెటర్లని పోల్చుతూ మాట్లాడడం సరికాదు. నేను కూడా చాలా మాట్లాడగలను. కానీ అలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు కదా. భారత్ కోసం విరాట్ సేన కష్టపడే ఆడుతోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుత భారత క్రికెట్ జట్టు ప్రయాణం అద్భుతంగా ఉంది. మంచి విజయాలు సాధిస్తున్నారు. మూడేళ్లలో టీమిండియా విదేశాల్లో 9 మ్యాచులు, మూడు సిరీస్లు గెలిచింది. చివరి 15-20 ఏళ్లలో ఇంతటి తక్కువ సమయంలో ఇన్ని విజయాలు సాధించిన జట్టుని నేను చూడలేదు. గత జట్లలో గొప్ప ఆటగాళ్లు కూడా ఉన్నారు’ అని రవిశాస్త్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై పలువురు మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను సునీల్ గావస్కర్ కూడా విమర్శించిన విషయం తెలిసిందే. తాను జట్టులో ఉన్న సమయంలో వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో విజయాలు సాధించామని ఆయన గుర్తు చేశారు. -
టెస్టు మ్యాచ్కు హాజరైన మాల్యా
లండన్: భారత్లో బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్లో ఉంటున్న వ్యాపార వేత్త విజయ్ మాల్యా శుక్రవారం భారత్-ఇంగ్లండ్ టెస్టుకు హాజరయ్యారు. ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్-ఇంగ్లండ్ మధ్య లండన్ వేదికగా చివరి టెస్టు నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ను వీక్షించేందుకు విజయ్ మాల్యా నేరుగా స్టేడియానికి వచ్చారు. గత ఏడాది ఇంగ్లండ్లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ జరిగిన సమయంలోనూ భారత్ ఆడిన ప్రతి మ్యాచ్కు మాల్యా హాజరయ్యారు. ప్రస్తుతం కోహ్లి సేన ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆగస్టు 1న తొలి టెస్టు ప్రారంభమయ్యే ముందు టీమిండియాను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని కోరగా వారు తిరస్కరించారు. దీంతో మాల్యాకు కోహ్లి సేనను కలిసే అవకాశం దక్కలేదు. ఈ క్రమంలో మాల్యా లండన్ వేదికగా ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలి రోజు మ్యాచ్కు హాజరయ్యాడు. మ్యాచ్ ప్రారంభానికి కొద్ది సమయం ముందు మాల్యా స్టేడియం లోపలికి వెళ్లాడు. దీనికి సంబంధించిన దశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: చివర్లో చమక్... -
గొప్ప వ్యక్తిని పెళ్లి చేసుకున్నా: అనుష్క
ముంబై : ప్రపంచంలోనే ఓ గొప్ప వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని బాలీవుడ్ నటి, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సతీమణి అనుష్కశర్మ పేర్కొన్నారు. ఆమె తాజా చిత్రం సూయి దగా ప్రమోషన్స్లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్ర ప్రమోషన్స్ ఏమోగానీ ఆమె ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. చిత్రంలోని కొన్ని సీన్స్లోని అనుష్క యాక్టింగ్కు సంబంధించిన మేమ్స్ నెటిజన్లకు నవ్వులు పూయిస్తున్నాయి. మరోవైపు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లి శతకం బాదినా ఈమె పేరే వినిపిస్తోంది. రెండో టెస్ట్ విజయానంతరం కోహ్లి మాట్లాడుతూ విజయానికి కారణం తన సతీమణి అనుష్క శర్మనేనని, ఈ విజయాన్ని ఆమెకు అంకితమిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాస్త విరామం దొరికిన ఈ బాలీవుడ్ భామ ఇంగ్లండ్లో ప్రత్యక్షమవుతోంది. స్వయంగా మ్యాచ్లకు హాజరవుతూ తన భర్తను ప్రోత్సాహిస్తున్నారు. కోహ్లి ఏమో సెంచరీ అనంతరం ఓ ఫ్లయింగ్ కిస్స్తో తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. ఇలా ఇద్దరు తమ ప్రొఫెషన్స్తో ఎంతో బిజీగా ఉన్నప్పటికి సమయం దొరికినప్పుడల్లా ఒకరిపై ఒకరికి ఉన్న వారి ప్రేమను చాటుకుంటున్నారు. సూయి ధాగా తొలి సాంగ్ విడుదల సందర్భంగా జైపూర్లో అభిమానులు విరాట్ కోహ్లి నామస్మరణం జపించారు. ఈ రెస్పాన్స్కు అనుష్క స్పందిస్తూ.. అతన్ని అందరూ ప్రేమిస్తారు.. నేను కూడా ప్రేమిస్తానని, ఎవరూ మరిచిపోలేరని నవ్వుతూ సంతోషం వ్యక్తం చేశారు. -
చివరి టెస్ట్: కుక్కు ఘనస్వాగతం
లండన్ : భారత్తో జరుగుతున్న చివరి టెస్ట్లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ఓపెనర్ అలిస్టర్ కుక్కు ఘనస్వాగతం లభించింది. కుక్ ఈ మ్యాచ్తో అతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రేక్షకుల కరతాల ధ్వనుల మధ్య.. అలిస్టర్ కుక్ మైదానంలోకి రాగా.. సముచిత గౌరవం కల్పిస్తూ టీమిండియా క్రికెటర్లు ఓ వరుసలో నిలబడి ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ట్వీట్ చేయగా.. యావత్ క్రీడా అభిమానులు కుక్ను కొనియాడుతున్నారు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఆరో స్థానం, సెంచరీల్లో టాప్–10లో చోటు, నిర్విరామంగా 159 టెస్టులు ఆడిన క్రమశిక్షణ కుక్కే సొంతం. ఇప్పటికే సిరీస్ నెగ్గిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్ నెగ్గి కుక్ను విజయంతో సాగనంపాలని ఉవ్విళ్లురుతోంది. మరోవైపు సిరీస్ చేజారిన కోహ్లి సేన ఎలాగైనా మ్యాచ్ నెగ్గి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. చదవండి: అలిస్టర్ కుక్ అల్విదా -
కుక్చివరి టెస్ట్: మైదానంలో ఘనస్వాగతం
-
ఇంగ్లండ్తో టెస్ట్: తెలుగోడి అరంగేట్రం
లండన్: ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టెస్టుతో మన తెలుగు కుర్రాడు హనుమ విహారి టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. చివరి టెస్ట్కు రెండు మార్పులతో బరిలోకి దిగుతున్న కోహ్లి సేన హార్దిక్ పాండ్యా స్థానంలో విహారి, రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో రవీంద్ర జడేజాలను తీసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్కు ముందు కెప్టెన్ విరాట్ కోహ్లి యువ ఆటగాడు విహారికి క్యాప్ అందజేశాడు. ట్రిపుల్ సెంచరీ హీరో కరుణ్ నాయర్ను పక్కనపెట్టి మరి విహారిని ఎంపిక చేయడం విశేషం. ఇక భారత్ తరపున టెస్ట్ ఆడుతున్న 292వ ఆటగాడిగా విహారి గుర్తింపు పొందాడు. నాలుగో టెస్ట్లో అంతగా ప్రభావం చూపని అశ్విన్ అంత అనుకున్నట్లే తొలిగించి జడేజాకు అవకాశం కల్పించారు. మరో బ్యాట్స్మన్ అవసరమని భావించిన జట్టు యాజమాన్యం మంచి ఫామ్లో ఉన్న విహారికి అవకాశం కల్పించింది. పృథ్వీ షాకు అవకాశం ఇస్తారని భావించగా టీమ్ మరోసారి రాహుల్, ధావన్లపై నమ్మకం ఉంచింది. ఇంగ్లండ్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. గత మ్యాచ్లో గాయంతో కీపింగ్కు దూరంగా ఉన్న బెయిర్ స్టో ఈ మ్యాచ్లో కీపింగ్ చేయనున్నాడు. భారత్ : కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, పుజారా, రహానే, హనుమ విహారి, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, షమీ, బుమ్రా. ఇంగ్లండ్: రూట్ (కెప్టెన్), కుక్, జెన్నింగ్స్, అలీ, బెయిర్స్టో, స్టోక్స్, బట్లర్, కరన్, రషీద్, బ్రాడ్, అండర్సన్. కాకినాడలో జననం టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్న విహారి పూర్తి పేరు గాదె హనుమ విహారి. 1993 అక్టోబర్ 13న కాకినాడలో జన్మించాడు. తండ్రి సత్యనారాయణ సింగరేణిలో సూపరింటెండెంట్గా పని చేస్తుండడంతో పుట్టిన కొద్ది రోజులకే విహారి అక్కడికి వెళ్లిపోయాడు. మూడో తరగతి వరకు గోదావరిఖని, మణుగూరులలోను, ఆ తరువాత హైదరాబాద్లోను చదువు కొనసాగించాడు. చదవండి: టీమిండియాలో ‘విహారం’ -
కేఎల్ రాహుల్పై వేటు?
లండన్: ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా శుక్రవారం నుంచి ఆరంభమయ్యే చివరి టెస్టు మ్యాచ్లో టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా అరంగేట్రం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన టీమిండియా.. జట్టులో సమతుల్యత లేకపోవడం వల్లే ఓటమి పాలైనట్లు భావిస్తోంది. ఇంగ్లీషు గడ్డపై జరుగుతున్న టెస్టు సిరిస్ ఆరంభం నుంచీ భారత ఓపెనర్లు వరుసగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓపెనింగ్ జోడీగా సీనియర్ ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్తో పాటు కేఎల్ రాహుల్ని కూడా జట్టు మేనేజ్మెంట్ పరీక్షించింది. అయితే, ఓపెనింగ్ స్లాట్లో ఈ ముగ్గురూ పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పటి వరకు మూడు టెస్టులాడిన శిఖర్ ధావన్.. ఆరు ఇన్నింగ్స్లో కలిపి చేసిన పరుగులు 158. ఇందులో ధావన్ అత్యధిక స్కోరు 44. ఇక కేఎల్ రాహుల్ కూడా మూడు టెస్టుల్లో చేసిన పరుగులు 96కాగా.. అత్యధిక స్కోరు 36గా ఉంది. మరో ఓపెనర్ మురళీ విజయ్ ఆడిన రెండు టెస్టుల్లో చేసిన పరుగులు 26కాగా.. అత్యధిక స్కోరు 20. దాంతో ఐదు టెస్టులో రాహుల్ను పక్కకు పెట్టి.. పృథ్వీషాకు అవకాశం ఇవ్వాలని జట్టే మేనేజ్మెంట్ యోచిస్తోంది. -
కుక్ ఆల్టైం జట్టులో మనోళ్లు లేరు!
సౌతాంప్టన్ : ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్పై భారత అభిమానుల ఆగ్రహంగా ఉన్నారు. కోహ్లి సేనతో జరిగే చివరి టెస్ట్తో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెబుతున్నట్టు ప్రకటించిన ఈ ఇంగ్లీష్ ఆటగాడు.. 11 మంది సభ్యులతో కూడిన తన ఆల్టైమ్ టెస్ట్ జట్టును ప్రకటించాడు. తనతో కలిసి ఆడిన ఆటగాళ్లు, ప్రత్యర్థి ఆటగాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ జట్టు ఎంపిక చేసినట్లు తెలిపాడు. తన జట్టులో ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు మిస్సయ్యారని, వారందరికీ క్షమాపణలు కోరుతున్నట్లు పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ రిలీజ్ చేసింది. ఈ జట్టులో భారత క్రికెటర్ ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. ఇదే భారత అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. తన ఆల్టైమ్ టీమ్ కెప్టెన్గా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రహమ్ గూచ్ను సూచించిన కుక్.. అతనికి ఓపెనింగ్ జంటగా ఆసీస్ మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ను ఎంపిక చేశాడు. ఇక బ్యాట్స్మన్గా దిగ్గజ ఆటగాళ్లు బ్రియన్ లారా(వెస్టిండీస్), రికీ పాంటింగ్(ఆసీస్), ఏబీ డివిలియర్స్, జాక్వస్ కల్లీస్ (దక్షిణాఫ్రికా), కుమార సంగక్కర(శ్రీలంక)లను పేర్కొన్నాడు. బౌలర్స్గా ఇద్దరు స్పిన్నర్లు ముత్తయ్య మురళిదరణ్(శ్రీలంక), షేన్ వాట్సన్(ఆసీస్)లతో పేసర్స్ జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్), గ్లేన్ మెక్గ్రాత్ (ఆసీస్)లను ఎంపిక చేశాడు. ఇక ఇంగ్లండ్ తరపున టెస్టుల్లో 32 సెంచరీలతో అత్యధిక పరుగులు 12,254 చేసిన తొలి ఆటగాడిగా కుక్ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లిసేన 5 టెస్టుల సిరీస్ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో కోల్పోయిన విషయం తెలిసిందే. చివరి టెస్ట్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. -
క్రికెటర్ల కన్నా వారే రియల్ హీరోలు: గంభీర్
న్యూఢిల్లీ : క్రికెటర్ల కన్నా ఇతర ఆటగాళ్లే రియల్ హీరోలని టీమిండియా సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఏ మాత్రం పేరు, డబ్బులు రాకున్నా క్రికెటేతర ఆటగాళ్లు ఎన్నో సమస్యల మధ్య విజయాలు సాధిస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా ఏషియన్ గేమ్స్లో భారత్ పతాకాన్ని రెపరెపలాడించి అథ్లెట్స్ రియల్ హీరోలు అని అభివర్ణించారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘క్రికెటేతర ఆటగాళ్లు ఆర్థికంగా, సౌకర్యాల పరంగా చాలా ఇబ్బంది పడుతారు. కానీ పతకాలు సాధించకపోతే ప్రజలు వారిని అసలు గుర్తించడం లేదు. ఏషియన్ గేమ్స్లో భారత అథ్లెట్స్ అదరగొట్టారు. 69 పతకాలతో చరిత్ర సృష్టించారు. కానీ భారత్లో క్రికెట్కు ఉన్న ఆదరణ ఇతర క్రీడలకు లేదు. క్రికెటరేతర ఆటగాళ్లకు అన్ని ప్రతికూల అంశాలే. స్వప్న బర్మను చూస్తే రియల్ హీరోలు ఎవరో తెలుస్తోంది. నన్ను ఎవరైన ప్రశ్నిస్తే క్రికెటర్ల కన్నా వారే గొప్పవారని చెబుతా. క్రికెటర్లే కాకుండా దేశం తరపున ఇతర ఆటగాళ్లు సైతం రాణిస్తున్నారు. వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సాహం అందించాలి’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. చదవండి: ఆ ‘స్వప్నం’ వెనుక ది వాల్ -
రవిశాస్త్రినే బాధ్యత వహించాలి: గంగూలీ
న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ను ఇంకా మ్యాచ్ ఉండగానే కోల్పోవడంపై భారత క్రికెట్ జట్టు ప్రదర్శనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే భారత బ్యాటింగ్ లైనప్పై సునీల్ గావస్కర్ సందేహం వ్యక్తం చేయగా, తాజాగా సౌరవ్ గంగూలీ పెదవి విప్పాడు. అసలు ఈ సిరీస్ ఓటమికి బాధ్యత ఎవరిదంటూ ప్రశ్నను లేవనెత్తిన గంగూలీ.. టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రినే పూర్తిస్థాయి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందన్నాడు. ఆటగాళ్లలో ఆత్మస్థైర్యం పూర్తిగా సన్నగిల్లడంతోనే వారి బ్యాటింగ్ తీసికట్టుగా మారిందన్న గంగూలీ.. వారిలో ఆత్మవిశ్వాసం నింపాల్సిన బాధ్యత కోచ్దేనన్నాడు. ఈ క్రమంలోనే రవిశాస్త్రితో పాటు బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నాడు. ‘ఇంగ్లండ్ గడ్డపై విరాట్ కోహ్లి మాత్రమే రాణిస్తున్నాడు. జట్టులో మిగిలిన వాళ్ల పరిస్థితి ఏంటి..? వాళ్లు ఎందుకు బ్యాటింగ్లో వరుసగా విఫలమవుతున్నారు..? ఈ ప్రశ్నకి సరైన సమాధానం దొరక్కపోతే.. భారత్ జట్టు ఎప్పటికీ దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్లను గెలవలేదు. 2011 నుంచి చూస్తే ఈ మూడు దేశాల్లో భారత్ జట్టు వరుసగా సిరీస్లను చేజార్చుకుంటూనే వస్తోంది. విరాట్ కోహ్లి చక్కగా ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొంటున్నాడు. కానీ.. మిగతా వాళ్లు తడబడుతున్నారు. వారిలో ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లినట్లు కనిపిస్తోంది. గతంలో చతేశ్వర పుజారా, అజింక్యా రహానె బాగా ఆడారు. కానీ.. ఈ సిరీస్లో వాళ్లు కూడా ఒత్తిడిలోనే కనిపిస్తున్నారు. ఆటగాళ్లలో ఆత్మస్థైర్యం నింపాల్సిన బాధ్యత కోచ్లది. కానీ.. వారు విఫలమయ్యారు. కాబట్టి.. తాజా టెస్టు సిరీస్ లో ఓటమికి కోచ్ రవిశాస్త్రితో పాటు సంజయ్ బంగర్లు బాధ్యత వహించాలి’ అని సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. -
ఆ వార్తలు ఆవు పేడతో సమానం: రవిశాస్త్రి
సౌతాంప్టన్: భారత క్రికెట్ ప్రధాన కోచ్ రవిశాస్త్రితో డేటింగ్ వార్తలను ఇప్పటికే బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ ఖండించిన సంగతి తెలిసిందే. అవన్నీ గాలి వార్తలంటూ ఒక్క ముక్కలో నిమ్రత్ కొట్టిపారేయగా, తాజాగా రవిశాస్త్రి స్పందించాడు. అసలు ఆ వార్తలు ఎటువంటి ప్రామాణికం లేదన్న రవిశాస్త్రి.. ఇలా తప్పుడు ప్రచారం చేయడం ఆవు పేడతో సమానమంటూ ఘాటుగా బదులిచ్చాడు. ‘ ఇందులో చెప్పడానికి ఏమీ లేదు. నిమ్రత్తో డేటింగ్, ప్రేమాయణ అంటూ వార్తలు ప్రచురించారు. ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు. నా దృష్టిలో ఆ వార్త ఆవు పేడతో సమానం’ అని రవిశాస్త్రి అసహనం ప్రదర్శించాడు. ప్రింట్ మోడల్గా కెరీర్ను ఆరంభించిన నిమ్రత్ కౌర్.. మ్యూజిక్ వీడియోల ద్వారా పాపులర్ అయ్యారు. అలాగే పలు బాలీవుడ్ సినిమాల్లో నటించారు. పలు అవార్డులు సొంతం చేసుకున్న ‘లంచ్ బాక్స్’ మూవీలో నటించారామె. ప్రస్తుతం రవిశాస్త్రితో డేటింగ్ వార్తలతో ఆమె మళ్లీ హాట్ టాపిక్ అయ్యారు. నిమ్రత్తో రవిశాస్త్రి డేటింగ్ చేస్తున్నట్లు ముంబై మిర్రర్ ఓ కథనంలో పేర్కొంది. ప్రముఖ కార్ల కంపెనీ ‘ఆడి’కి సంయుక్తంగా బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న వీరిద్దరూ.. ఈ కారు ప్రచార కార్యక్రమంలో భాగంగా కలిసినప్పుడు ప్రేమలో పడ్డారని తెలిపింది. ఆ క్రమంలోనే ఈ జంట గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నట్లు తన వార్తలో స్పష్టం చేసింది. రవిశాస్త్రితో డేటింగ్.. స్పందించిన నటి రవిశాస్త్రి మళ్లీ ప్రేమలో పడ్డాడా?