breaking news
india vs england
-
బుమ్రా మూడు మ్యాచ్లు ఆడితే తప్పేంటి? విమర్శకులకు భువీ కౌంటర్
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వర్క్లోడ్ మెనెజ్మెంట్లో భాగంగా కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడటంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ముగిసిన ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో తొలి టెస్టు ఆడిన బుమ్రా రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్నాడు.ఆ తర్వాత మళ్లీ మూడు, నాలుగు టెస్టుల్లో ఆడాడు. ఈ క్రమంలో కీలకమైన ఆఖరి టెస్టుకు బుమ్రా దూరమయ్యాడు. ఐదో టెస్టుకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడాన్ని చాలా మంది మాజీలు తప్పుబట్టారు.వర్క్లోడ్ ఉన్నప్పటికి ముఖ్యమైన మ్యాచ్కు ఎలా విశ్రాంతి ఇస్తారని, ముందే మూడు మ్యాచ్లు మాత్రమే ఆడాతాడని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో బుమ్రా తన సహచర పేసర్ భువనేశ్వర్ కుమార్ మద్దతుగా నిలిచాడు. బుమ్రా 5 టెస్టుల్లో మూడు ఆడినా ఎటువంటి సమస్యలేదు అని భువీ అన్నారు."జస్ప్రీత్ బుమ్రా గత కొన్ని సంవత్సరాలుగా అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నాడు. ప్రతీ ఫార్మాట్లోనూ తన బెస్ట్ను ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. మిగితా వారితో పోలిస్తే బుమ్రా బౌలింగ్ యాక్షన్ కాస్త భిన్నంగా ఉంటుంది. అటువంటి యాక్షన్ ఉన్నప్పుడు బుమ్రానే కాదు మరొకరైనా గాయాల బారిన పడొచ్చు. బుమ్రా ఎల్లప్పుడూ క్లిష్టమైన పరిస్థితుల్లో బౌలింగ్ చేస్తాడు.ఇది అతడిపై మానసిక, శారీరక ఒత్తిడిని కలుగుజేస్తుంది. బుమ్రా లాంటి బౌలర్ సేవలను సుదీర్ఘ కాలం పాటు ఉపయోగించుకోవాలంటే, కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. అతడు ఇంగ్లండ్ సిరీస్లో ఐదు మ్యాచ్లలో మూడింట మాత్రమే ఆడడం నాకేమి తప్పు అన్పించలేదు. ఒక ఆటగాడు మొత్తం ఐదు మ్యాచ్లు ఆడకపోవచ్చు, కానీ ఆడిన మూడు మ్యాచ్లలో తన ప్రభావాన్ని చూపితే చాలు. బుమ్రా కూడా అంతే. ఆడిన మూడు మ్యాచ్లలోనూ తన ఇంపాక్ట్ చూపించాడు" అని పాడ్కాస్ట్ టాక్ విత్ మన్వేంద్రకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భువనేశ్వర్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిన బుమ్రా 14 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.చదవండి: Independence Day: కోహ్లి అలా.. గంభీర్ ఇలా.. పోస్ట్ వైరల్ -
గిల్ ఒక అత్యద్బుతం.. వారిద్దరూ కూడా నిజంగా గ్రేట్: యువరాజ్
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో కెప్టెన్గా, బ్యాటర్గా గిల్ వందకు వంద మార్క్లు కొట్టేశాడు. కెప్టెన్గా తన తొలి సిరీస్లోనే అందరని ఆకట్టుకున్నాడు.అతడి సారథ్యంలోని భారత జట్టు ఐదు మ్యాచ్ల సిరీస్ను 2-2 సమం చేసింది. అదేవిధంగా ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో గిల్ 754 లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో గిల్పై టీమిండియా లెజెండరీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్ వంటి కఠిన పరిస్థితుల్లో జట్టును బాగా నడిపించాడని గిల్ను యువీ కొనియాడాడు. కాగా గిల్ రోల్ మోడల్ యువీనే కావడం విశేషం."ఇంగ్లండ్ టూర్కు ముందు గిల్ విదేశీ రికార్డులపై ఎన్నో సందేహాలు, ప్రశ్నలు ఉండేవి. కానీ వాటిన్నటిని ఒక్క సిరీస్తో చెరిపేశాడు. కెప్టెన్ అయ్యాక అతడు ఇంగ్లండ్ వంటి కఠిన పరిస్థితుల్లో ఏకంగా నాలుగు టెస్టు సెంచరీలు చేశాడు. కెప్టెన్గా తన తొలి టెస్టు సిరీస్లో ఈ విధమైన ప్రదర్శన కనబరిచడం నిజంగా అత్యద్బుతం. ఓవల్లో చారిత్రత్మక విజయం సాధించిన భారత జట్టు పట్ల చాలా గర్వంగా ఉంది. డ్రా అయినప్పటికి సిరీస్ మనదేనని భావిస్తున్నాను. ఎందుకంటే ఇది యువ భారత జట్టు. ఇంగ్లండ్ వంటి జట్టుతో సిరీస్ డ్రా చేయడం అంత సులువు కాదు. అదేవిధంగా జడేజా, వాషింగ్టన్ సుందర్లు కూడా అద్బుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. చాలా రోజుల తర్వాత ఇద్దరూ భారత బ్యాటర్లు సెంచరీలు చేసి మ్యాచ్ను డ్రా ముగించడం చూశాను. జడేజా ఎప్పటి నుంచో జట్టుకు తన సేవలను అందిస్తున్నాడు. కానీ సుందర్ మాత్రం ఈ తరహా ప్రదర్శన చేయడం చాలా గ్రేట్" అని యువరాజ్ ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: కెప్టెన్గా రుతురాజ్పై వేటు.. జట్టులో పృథ్వీషాకు చోటు -
టెస్ట్ క్రికెట్లో సరికొత్త చరిత్ర
డిజిటల్ వీక్షణకు సంబంధించి టెస్ట్ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించబడింది. భారత్, ఇంగ్లండ్ మధ్య టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ-2025లో భాగంగా జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ను (చివరి రోజు ఓ దశలో) ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫాం JioHotstar ద్వారా రికార్డు స్థాయిలో 13 మిలియన్ మంది వీక్షించారు. డిజిటల్ వీక్షణలో ఇది ఆల్టైమ్ రికార్డు. గతంలో ఏ టెస్ట్ మ్యాచ్కు ఒకేసారి ఇంత వ్యూయర్షిప్ దక్కలేదు. ఈ మ్యాచ్ డిజిటల్ వ్యూయర్షిప్ రికార్డులను తిరగరాసింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్లో భారత్ ఇంగ్లండ్ను 6 పరుగుల స్వల్ప తేడాతో ఓడించి 5 మ్యాచ్ల సిరీస్ను 2-2తో డ్రా చేసుకుంది. చివరి రోజు (ఆగస్ట్ 4) ఇంగ్లండ్ గెలుపుకు 35 పరుగులు అవసరమైన దశలో (చేతిలో 4 వికెట్లు ఉండగా) భారత పేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుతం చేశాడు. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డి (3 వికెట్లు తీసి) టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.రికార్డులు బద్దలుటెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ-2025లో ఒక్కో మ్యాచ్ ఒక్కో ప్రత్యేక అనుభూతిని మిగిల్చింది. ఈ సిరీస్లోని ఐదు మ్యాచ్లు చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగాయి. టెస్ట్ క్రికెట్లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. దీన్ని బట్టి చూస్తే భారత్, ఇంగ్లండ్ మధ్య పోటీ ఏ రేంజ్లో సాగిందో ఇట్టే అర్దమవుతుంది.నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ సిరీస్ను విశ్వవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు వేర్వేరు మాధ్యమాల ద్వారా రికార్డు స్థాయిలో వీక్షించారు. డిజిటల్కు సంబంధించి ఈ సిరీస్ ఆల్టైమ్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సిరీస్ను జియో హాట్స్టార్ ద్వారా 170 మిలియన్లకు పైగా వీక్షించారు. డిజిటల్ ప్లాట్ఫాం చరిత్రలో ఏ టెస్ట్ సిరీస్ను ఇంత మంది వీక్షించలేదు. డిజిటల్లో అత్యధిక రీచ్ను దక్కించుకున్న సిరీస్గా టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ-2025 చరిత్రలో నిలిచిపోతుంది. -
'సిరాజ్ ఒక పోరాట యోధుడు'.. హైదరాబాదీపై పాక్ దిగ్గజం ప్రశంసలు
ఓవల్లో టెస్టులో ఇంగ్లండ్పై అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్పై పాక్ లెజెండరీ పేసర్ వసీం అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. సిరాజ్ ఇక సపోర్ట్ బౌలర్ కాదని, ప్రధాన పేసర్ అని అక్రమ్ కొనియాడాడు.ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ చివరి మ్యాచ్లో సిరాజ్ అద్బుతం చేశాడు. రెండు ఇన్నింగ్స్లలో తొమ్మిది వికెట్లు పడగొట్టి భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్ను 2-2తో భారత్ సమం చేసింది. ఓవరాల్గా ఈ సిరీస్లో సిరాజ్(23) లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. అంతేకాకుండా సిరాజ్ సిరీస్ మొత్తంగా 1000 పైగా బంతులను బౌలింగ్ చేసి తన ఫిట్నెస్ ఎంటో చాటిచెప్పాడు."సిరాజ్కు తపన, పట్టుదల ఎక్కువ. ఓవల్ టెస్టులో సిరాజ్ ప్రదర్శన గురుంచి ఎంత చెప్పుకొన్న తక్కువే అవుతోంది. నిజంగా అతడు అద్బుతం చేశాడు. ఐదు టెస్టుల్లో దాదాపు 186 ఓవర్లు బౌలింగ్ చేసి, ఆఖరి రోజు కూడా అంతే ఉత్సాహంగా ఉండటం నిజంగా గ్రేట్. అతడు శారీరకంగా, మానసికంగా శారీరకంగా చాలా దృడంగా ఉన్నాడు.సిరాజ్ ఇకపై కేవలం సపోర్ట్ బౌలర్ కాదు. బుమ్రా గైర్హజరీలో భారత పేసర్ పేస్ ఎటాక్ను సిరాజ్ లీడ్ చేస్తున్నాడు. హ్యారీ బ్రూక్ క్యాచ్ను సిరాజ్ విడిచిపెట్టినప్పటికి, తన ఏకాగ్రతను, ఆత్మవిశ్వాసాన్ని ఏ మాత్రం కోల్పోలేదు. అది ఒక పోరాట యోధుడి లక్షణం.టెస్ట్ క్రికెట్ ఎప్పటికీ తన ఉనికిని కోల్పోదు. నేను పనిలో ఉన్నప్పుడు క్రికెట్ చాలా అరుదుగా చూస్తూ ఉంటాను. కానీ ఆఖరి రోజు ఆటను చూసేందుకు టీవీకి అతుక్కుపోయాను" అని టెలికాం ఆసియా స్పోర్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆక్రమ్ పేర్కొన్నాడు.చదవండి: ఆసియాకప్-2025కు శుబ్మన్ గిల్ దూరం!? -
అతడొక రియల్ హీరో.. భారత క్రికెట్కు అటువంటి వారే కావాలి: కపిల్ దేవ్
ఆండర్సన్- టెండూల్కర్ ట్రోఫీ 2025లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో సిరాజ్ మొత్తంగా 23 వికెట్లతో సత్తాచాటాడు. తొలి నాలుగు మ్యాచ్లు పక్కన పెడితే ఆఖరి టెస్టులో సిరాజ్ ప్రదర్శన గురించి ఎంత చెప్పుకొన్న తక్కువే.చారిత్రత్మక ఓవల్ మైదానంలో సిరాజ్ మియా బంతితో మ్యాజిక్ చేశాడు. ఈ మ్యాచ్లో తొమ్మిది వికెట్లు పడగొట్టి భారత జట్టు మరుపురాని విజయాన్ని అందించాడు. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు కావాల్సిన సమయంలో సిరాజ్ వేసిన బంతులు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి.ఈ మ్యాచ్ ముగిసి దాదాపు ఆరు రోజులు అవుతున్నప్పటికి సిరాజ్ ప్రదర్శనను ఎవరూ మర్చిపోలేకపోతున్నారు. ఈ క్రమంలో సిరాజ్పై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించారు. సిరాజ్ లాంటి బౌలర్లు భారత జట్టుకు మరింత మంది కావాలని ఆయన అన్నారు."సిరాజ్ రియల్ హీరో. అతడు తన బౌలింగ్ సిద్దాంతాన్ని నమ్ముకున్నాడు. అతిగా ఏదీ ప్రయత్నించలేదు. సరైన లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేయడం, ముఖ్యంగా ఆఫ్ స్టంప్ చుట్టూ బంతులు వేస్తూ ప్రత్యర్ధిని బెంబెలెత్తించాడు. జస్ప్రీత్ బుమ్రా గైర్హజరీలో బౌలింగ్ ఎటాక్ను లీడ్ చేశాడు. భారత క్రికెట్కు సిరాజ్ లాంటి వాళ్లు మరి కొంతమంది అవసరం. ఆఖరి రోజు ఆటలో సిరాజ్ చాలా కన్ఫిడెన్స్గా ఉన్నాడు. జట్టు గెలుపు బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. డేంజరస్ బ్యాటర్ జేమీ స్మిత్ను ఔట్ చేసి టీమిండియా శిబిరంలో ఉత్సాహన్ని నింపాడు. సిరాజ్ నాలుగో రోజు ఆటలో ఒక క్యాచ్ వదిలేసాడు. కానీ ఆ తర్వాత బౌలింగ్లో తన సత్తాచూపించాడు. అతడిలో కనీసం ఒత్తిడి కన్పించలేదు. ఇది కొంతమందికే సాధ్యమని" కపిల్దేవ్ మిడ్ డే కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ పేర్కొన్నారు.చదవండి: IND-A vs AUS-A: టీమిండియా ఘోర ఓటమి.. 73 పరుగులకే ఆలౌట్ -
ఆ జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్(Shubman Gill) కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో ఆడేందుకు గిల్ సిద్దమయ్యాడు. స్వదేశంలో వెస్టిండీస్, సౌతాఫ్రికాలతో టెస్టు సిరీస్లను దృష్టిలో పెట్టుకుని గిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నార్త్జోన్ కెప్టెన్గా గిల్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. తాజాగా ప్రకటించిన జట్టులో గిల్తో పాటు యువ పేసర్లు అర్ష్దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్ కూడా చోటు దక్కించుకున్నారు. గిల్కు డిప్యూటీగా అంకిత్ కుమార్ ఎంపికయ్యాడు.ఇంగ్లండ్పై గడ్డపై అదుర్స్..ఇంగ్లండ్పై శుబ్మన్ గిల్ కెప్టెన్గా, ఆటగాడిగా అదరగొట్టాడు. ఈ పంజాబ్ ఆటగాడు కెప్టెన్గా తన తొలి సిరీస్లో మంచి మార్క్లు కొట్టేశాడు. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్ను గిల్ సారథ్యంలోని భారత జట్టు 2-2తో సమం చేసింది. సిరీస్ సమంగా ముగియడంలో గిల్ది కీలక పాత్ర.ఈ సిరీస్లో గిల్ పరుగులు వరద పారించాడు. ఐదు మ్యాచ్లలో 75.40 సగటుతో 754 పరుగులు చేసి గిల్ ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా నిలిచాడు. ఎడ్జ్బాస్టన్లో జరిగిన రెండో టెస్టులో గిల్(261) ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. అదే మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో 161 పరుగులు చేశాడు.ఒక టెస్టు మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్గా గిల్(430) నిలిచాడు. గిల్ ఇంకా ఇంగ్లండ్లోనే ఉన్నాడు. త్వరలోనే భారత్కు రానున్న గిల్.. ఈ నెల ఆఖరిలో జరగనున్న దులీప్ ట్రోఫీలో ఆడనున్నాడు. ఆగష్టు 28- 31వరకు జరగనున్న తొలి క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్జోన్తో నార్త్ జోన్ తలపడనుంది.ఒకవేళ నార్త్ జోన్ సెమీఫైనల్కు చేరిన గిల్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఆసియాకప్లో కూడా గిల్ ఆడనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నుంచి అంతర్జాతీయ సిరీస్లలో గిల్ బీజీబీజీగా గడపనున్నాడు. తొలుత ఆసియాకప్, ఆతర్వాత వెస్టిండీస్తో టెస్టు సిరీస్, ఆస్ట్రేలియాతో వైట్బాల్ సిరీస్లలో ఆడనున్నాడు. ఆసీస్ టూర్ ముగిసిన వెంటనే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో సౌతాఫ్రికాతో భారత్ తలపడనుంది.దులిప్ ట్రోఫీ-2025కి నార్త్జోన్ జట్టు ఇదేశుభమన్ గిల్ (కెప్టెన్), శుభమ్ ఖజురియా, అంకిత్ కుమార్ (వైస్ కెప్టెన్), ఆయుష్ బదోని, యశ్ ధుల్, అంకిత్ కల్సి, నిశాంత్ సింధు, సాహిల్ లోత్రా, మయాంక్ దాగర్, యుధ్వీర్ సింగ్ చరక్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఆకిబ్ నబీ, కన్హయ్య వాధావాన్.చదవండి: IND vs WI: అతడి ఖేల్ ఖతం.. శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీ పక్కా! -
అతడి ఖేల్ ఖతం.. శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీ పక్కా!
ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన టీమిండియా వెటరన్ కరుణ్ నాయర్పై వేటు పడనుందా? అంటే అవును అనే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. ఒక్క ఛాన్స్ అంటూ ఏడేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులో రీ ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్.. తన పేలవ ప్రదర్శనలతో నిరాశపరిచాడు. ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో నాయర్ మొత్తంగా నాలుగు మ్యాచ్లు ఆడి కేవలం 205 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిపై వేటు వేసేందుకు అజిత్ అగర్కారర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సిద్దమైనట్లు తెలుస్తోంది.శ్రేయస్ రీ ఎంట్రీ.. అతడి స్ధానంలో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు చోటు ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఆక్టోబర్లో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్తో అయ్యర్ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయ్యర్ చివరగా టెస్టుల్లో భారత తరపున 2024లో ఇంగ్లండ్పై ఆడాడు.ఆ తర్వాత జట్టుతో పాటు సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో కూడా తన స్ధానాన్ని అయ్యర్ కోల్పోయాడు. అయితే దేశవాళీ టోర్నీలో అద్బుతంగా రాణించి తిరిగి జాతీయ జట్టులోకి ఈ ముంబైకర్ వచ్చాడు. కానీ కేవలం వన్డే జట్టులో మాత్రమే అతడికి చోటు దక్కింది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025ను భారత్ సొంతం చేసుకోవడంలో అయ్యర్ది కీలక పాత్ర. ఆ తర్వాత ఐపీఎల్లో కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతడిని ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం అయ్యర్ బదులుగా కరుణ్ నాయర్కు అవకాశమిచ్చారు. కరుణ్ నాయర్ తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. ఈ క్రమంలో సెలక్టర్లు మళ్లీ అయ్యర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయ్యర్ లాంటి ప్లేయర్ కావాలి..భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో అయ్యర్ లాంటి అనుభవజ్ఞుడైన మిడిలార్డర్ బ్యాటర్ అవసరం. అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో మాకు లోటు స్పష్టంగా కన్పించింది. స్పిన్నర్లను శ్రేయస్ అయ్యర్ అద్బుతంగా ఆడగలడుజ స్వదేశంలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్లో స్పిన్ బాగా ఆడిగలిగే ఆటగాళ్లు కీలకంగా మారనున్నారు. దీంతో అయ్యర్ను కచ్చితంగా సెలక్టర్లు ఎంపిక చేస్తారని" ఓ బీసీసీఐ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు.శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు 14 టెస్టులు ఆడి 36.86 సగటుతో 811 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీతో పాటు ఐదు ఆర్ధ శతకాలు ఉన్నాయి.చదవండి: టీమిండియా స్టార్ ప్లేయర్కు గాయం.. కీలక టోర్నీకి దూరం? -
కరుణ్ నాయర్ కంటే సుదర్శన్ బెటరా? ఇద్దరికి ఎన్ని మార్కులంటే?
ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ-2025లో పరుగుల వరద పారింది. భారత్, ఇంగ్లండ్ జట్లు కలిపి 7000 కంటే ఎక్కువ పరుగులు సాధించారు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే సిరీస్లో 7000 పైగా పరుగులు చేయడం ఇది రెండో సారి మాత్రమే. కానీ టీమిండియా తరపున మూడో స్దానంలో బ్యాటింగ్కు వచ్చిన వారు మాత్రం ఈ రన్ ఫీస్ట్లో తమ మార్క్ చూపించలేకపోయారు. సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ ఆ స్ధానంలో బ్యాటింగ్ చేసి 241 పరుగులు మాత్రమే సాధించారు.నిరాశపరిచిన నాయర్..ఎనిమిదేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేసిన కరుణ్ నాయర్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఈ సిరీస్లో నాయర్ రెండు వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేసాడు. మొత్తంగా నాలుగు మ్యాచ్లు ఆడి కేవలం 205 పరుగులు మాత్రమే చేశాడు.మరోవైపు సుదర్శన్ కూడా పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. కానీ ఇది అతడికి తొలి టెస్టు సిరీస్. మొత్తంగా మూడు మ్యాచ్లు ఆడిన సుదర్శన్ 23.33 సగటుతో 140 పరుగులు మాత్రమే చేశాడు. కానీ అనుభవజ్ఞుడైన కరుణ్ నుంచి మాత్రం అభిమానులు మెరుగైన ప్రదర్శనను ఆశించారు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ వీరిద్దరి ప్రదర్శనకు మార్క్లు వేశాడు. కరుణ్ నాయర్ కంటే సాయిసుదర్శన్కు ఇర్ఫాన్ పఠాన్ మెరుగైన రేటింగ్ ఇచ్చాడు.పదికి నాలుగు.."ఇంగ్లండ్ పర్యటనలో కరుణ్ నాయర్ ప్రదర్శనకు పదికి నాలుగు మార్కులు వేస్తాను. సిరీస్ అంతటా అతడు మరీ అంత పేలవమైన ప్రదర్శనలు కనబరచలేదు. అతడు తనకు లభించిన ఆరంభాలను భారీ స్కోర్లగా మలుచుకోలేకపోయాడు. ఒకే ఒక హాఫ్ సెంచరీతో సిరీస్ను ముగించాడు. ఈ సిరీస్లో అతడికి చాలా అవకాశాలు లభించాయి. క్రికెట్ అతడికి ఖచ్చితంగా రెండవ అవకాశమిచ్చేందని చెప్పాలి. కానీ దానిని అతడు ఉపయోగించుకోలేకపోయాడు. ముఖ్యంగా లార్డ్స్ టెస్టులో భారత్ను గెలిపించే ఛాన్స్ అతడికి ఉండేది. కానీ అక్కడ కూడా అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఆ మ్యాచ్లో అతడు క్రీజులో కుదురుకున్నట్లు కన్పించాడు. కానీ సడన్గా పేలవ షాట్ ఆడి ఔటయ్యాడు. బౌన్సర్ బంతులకు అతడు కొంచెం ఇబ్బంది పడుతున్నాడు.పదికి ఐదు.."సాయిసుదర్శన్కు పదికి ఐదు మార్క్లు ఇవ్వాలనుకుంటున్నాను. అతడి బ్యాటింగ్ టెక్నిక్ అద్బుతంగా ఉంటుంది. అతడు తన బ్యాటింగ్లో బలహీనతలను అధిగమించాడు. తొలి టెస్టులో కంటే మిగితా మ్యాచ్ల్లో కాస్త మెరుగ్గా కన్పించాడు. అతడికి లభించిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకునేవాడు. కానీ ఈసారి అలా చేయలేకపోయాడు. అయితే సాయి అన్ని మ్యాచ్లు ఆడి ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవని నేను అనుకుంటున్నాను తన యూట్యూబ్ ఛానల్లో పఠాన్ పేర్కొన్నాడు. -
ICC rankings: రఫ్ఫాడించిన సిరాజ్.. ఏకంగా 12 స్థానాలు జంప్
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్.. ఇప్పుడు ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాకింగ్స్లోనూ సత్తాచాటాడు. సిరాజ్ మియా తన కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంక్ను సాధించాడు. సిరాజ్ 674 రేటింగ్ పాయింట్లతో ఏకంగా 12 స్ధానాలు ఎగబాకి 15వ ర్యాంక్కు చేరుకున్నాడు. ఈ హైదరాబాదీ టెస్టు బౌలర్ల ర్యాకింగ్స్లో టాప్ 15లో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి.దుమ్ములేపిన సిరాజ్..ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో ఈ భారత ఫాస్ట్ బౌలర్ సంచలన ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా ఓవల్ టెస్టులో టీమిండియా చారిత్రత్మక విజయం సాధించడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఆఖరి టెస్టులో సిరాజ్ తొమ్మది వికెట్లు పడగొట్టి భారత్కు మరుపురాని విజయాన్ని అందించాడు. మొత్తంగా ఈ సిరీస్లో 23 సిరాజ్ వికెట్లతో సత్తాచాటాడు. ఇందులో రెండు ఫైవ్ వికెట్ల హాల్స్ కూడా ఉన్నాయి.ప్రసిద్ద్ అదుర్స్..ఇక ఓవల్ టెస్టులో సిరాజ్తో పాటు మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబరిచిన ప్రసిద్ద్ కృష్ణ సైతం తన ర్యాంక్ను మెరుగుపరుచుకున్నాడు. ప్రసిద్ద్ ఏకంగా 25 స్థానాలు ఎగబాకి 59వ ర్యాంక్కు చేరుకున్నాడు. ప్రసిద్ద్ ఐదో టెస్టులో మొత్తంగా ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే తన కెరీర్ బెస్ట్ ర్యాంక్ను కృష్ణ సాధించాడు. కాగా బౌలర్ల ర్యాకింగ్స్లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(889) అగ్రస్దానంలో కొనసాగుతుండగా.. కగిసో రబాడ రెండో స్దానంలో నిలిచాడు.టాప్-5 లోకి జైశ్వాల్..ఇక ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ టాప్ 5లోకి తిరిగొచ్చాడు. ఇంగ్లండ్తో ఐదో టెస్టులో జైశ్వాల్ అద్బుత సెంచరీతో మెరిశాడు. అదేవిధంగా ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్లలో విఫలమైన శుబ్మన్ గిల్ నాలుగు స్ధానాలు దిగజారి 13వ ర్యాంక్కు పడిపోయాడు.చదవండి: IND vs ENG: వ్యాజ్లెన్ వాడారు.. గిల్ సేనపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు -
Rishabh Pant: ఆటలో ధీరుడు.. గుణంలో కర్ణుడు
టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో, మానవత్వం ప్రదర్శించడంలోనూ అంతే దూకుడుగా ఉంటాడు. ఇటీవల ఇంగ్లండ్ గడ్డపై పాదం ఫ్రాక్చర్ అయినా బరిలోకి దిగి యావత్ క్రికెట్ ప్రపంచంచే జేజేలు పలికించుకున్న పంత్.. తాజాగా ఓ చర్య ద్వారా గొప్ప మానవతావాది అని నిరూపించుకున్నాడు.కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్ జిల్లాలోని రబ్కవి గ్రామానికి చెందిన జ్యోతి కనబుర్ మఠ్ అనే విద్యార్థిని చదువుకు ఆర్దిక సాయం చేసి తన గొప్ప మనసును చాటుకున్నాడు. జ్యోతి 12వ తరగతిలో 85 శాతం మార్కులు సాధించింది. BCA చదవాలన్న ఆశతో ఉన్న ఆమెకు రూ. 40,000 ఫీజు కట్టలేని పరిస్థితి ఏర్పడింది. తండ్రి టీ కొట్టు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో, రిషబ్ పంత్ స్పందించి జులై 17న నేరుగా కాలేజీకి ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించాడు. “నీ కలలు నిజమవ్వాలి” అంటూ ఆమెకు భరోసా ఇచ్చాడు.పంత్ చేసిన ఈ పనికి యావత్ మానవాళి జేజేలు కొడుతుంది. ఆటలో ధీరుడు, గుణంలో కర్ణుడు అంటూ ఆకాశానికెత్తుతుంది. రియల్ హీరో అంటూ కొనియాడుతుంది. వాస్తవానికి పంత్కు ఇలాంటి దానాలు కొత్త కాదు. గతంలో చాలా సందర్భాల్లో పేదలకు ఆర్దిక సాయం చేశాడు. రిషబ్ పంత్ ఫౌండేషన్ ద్వారా తనకు వచ్చే ఆదాయంలో 10 శాతం పేదలకు పంచి పెడుతున్నాడు. విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో అవసరమైన వారికి తగు సాయం చేస్తుంటాడు.గతంలో ఓ సందర్భంలో పంత్ మాట్లాడుతూ.. క్రికెట్ వల్ల నాకు లభించిన ప్రతిదానికి నేను కృతజ్ఞుడిని. ఇప్పుడు సమాజానికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నానని అన్నాడు.తన ఆటతీరుతో విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను మెప్పించిన పంత్.. తన మానవతా గుణంతో దేశ ప్రజల మనసులు గెలుచుకుంటున్నాడు. సమాజానికి సేవ చేయాలనే తపనతో ఉన్న పంత్ చర్యలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. కాగా, తాజాగా ముగిసిన టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అయితే దురదృష్టవశాత్తు నాలుగో టెస్ట్ సందర్భంగా గాయపడి చివరి మ్యాచ్కు దూరమయ్యాడు. నాలుగో టెస్ట్లో పాదం ఫ్రాక్చర్ అయినా పంత్ బ్యాటింగ్కు దిగి అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్లో పంత్ 7 ఇన్నింగ్స్ల్లో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సాయంతో 479 పరుగులు చేసి, ఆరో లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ సిరీస్ను భారత్ 2-2తో సమం చేసుకుంది. -
చరిత్ర సృష్టించిన జో రూట్.. టెస్ట్ క్రికెట్లో తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్లో ఓ సింగిల్ బౌలర్ బౌలింగ్లో 600 పరుగులు సాధించిన తొలి బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రూట్.. టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజాపై ఈ ఘనత సాధించాడు. తాజాగా ముగిసిన టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో రూట్ ఈ ఫీట్ను నమోదు చేశాడు. రూట్ జడేజా బౌలింగ్లో ఇప్పటివరకు 602 పరుగులు సాధించాడు. ప్రపంచంలో ఏ బ్యాటర్ ఓ సింగిల్ బౌలర్ బౌలింగ్లో ఇన్ని పరుగులు సాధించలేదు. ఈ జాబితాలో రూట్ తర్వాతి స్థానంలో స్టీవ్ స్మిత్ ఉన్నాడు. స్మిత్ ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో 577 పరుగులు చేశాడు. రూట్, స్మిత్ తర్వాతి స్థానంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఉన్నాడు. కోహ్లి ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయోన్ బౌలింగ్లో 573 పరుగులు సాధించాడు.కాగా, టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ-2025లో రూట్-జడేజా మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. ఈ సిరీస్లో జడేజా రూట్ను ఒక్కసారే (నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్) ఔట్ చేసినా ఇరువురి మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్లుగా సాగింది. అంకెల ప్రకారం చూస్తే జడేజాపై రూట్ పైచేయి సాధించినట్లు కనిపించినా, జడ్డూను ఎదుర్కొనేందుకు రూట్ ఇబ్బంది పడ్డాడు. వాస్తవంగా ఉపఖండలో జడేజాను ఎదుర్కోవడం రూట్కు కత్తి మీద సాము అవుతుంది. స్పిన్కు అనుకూలించే పిచ్లపై జడేజా బౌలింగ్లో రూట్ చాలా ఇబ్బంది పడ్డాడు. జడ్డూ తన కెరీర్లో రూట్ను మొత్తం 9 సార్లు ఔట్ చేశాడు. తద్వారా ఓ బ్యాటర్ను అత్యధిక సార్లు ఔట్ చేసిన బౌలర్గానూ రికార్డు కలిగి ఉన్నాడు.ఇదిలా ఉంటే, తాజాగా ముగిసిన టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ డ్రాగా ముగిసింది. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలో రెండు మ్యాచ్లు గెలువగా.. ఓ మ్యాచ్ డ్రా అయ్యింది. హోరాహోరీగా సాగిన ఈ సిరీస్లో ఇంగ్లండ్ 1,3 టెస్ట్లు గెలువగా.. భారత్ 2,5 మ్యాచ్ల్లో విజయం సాధించింది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఐదో టెస్ట్లో భారత్ 6 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించింది.ఈ మ్యాచ్ చివరి రోజు భారత్ 35 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవాల్సి ఉండగా.. సిరాజ్ అద్భుతం చేశాడు. ఇంగ్లండ్ చేతిలో ఉండిన 4 వికెట్లలో 3 వికెట్లు తీసి భారత్కు చిరస్మరణీయ విజయాన్నందించాడు.374 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓ దశలో పటిష్ట స్థితిలో (301/3) ఉన్నప్పటికీ.. భారత బౌలర్లు మ్యాచ్పై ఆశలు వదులుకోకుండా వీరోచితంగా పోరాడారు. ముఖ్యంగా సిరాజ్ ఓటమిని ఒప్పుకునే ప్రసక్తే లేదన్నట్లు ముందుకు సాగాడు. అతనికి ప్రసిద్ద్ సహకరించాడు. వీరిద్దరు కలిపి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో 9 వికెట్లు తీశారు. సెకెండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు సహా మ్యాచ్ మొత్తంలో 9 వికెట్లు తీసిన సిరాజ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
టీమిండియా గెలుస్తుందని నాకు ముందే తెలుసు: సౌరవ్ గంగూలీ
లండన్లోని ది ఓవల్లో ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా 6 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్కంఠభరితంగా ఐదో రోజు ఆటలో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ మ్యాజిక్ చేశాడు. ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు కావల్సిన నేపథ్యంలో సిరాజ్ బంతితో ప్రత్యర్ధి జట్టును బోల్తా కొట్టించాడు. చివరి రోజు ఆటలో మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ను దెబ్బతీశాడు. అతడితో పాటు ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ సాధించాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో సిరాజ్ 9 వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్ 8 వికెట్లు సాధించాడు. కాగా ఓవల్లో చారిత్రత్మక విజయం సాధించిన భారత జట్టు సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆఖరి టెస్టులో గెలిచి భారత్ సిరీస్ సమం చేస్తుందని తనకు ముందే తెలుసని టీమిండిమా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు."నాలుగవ రోజు ఆట ముగిసిన తర్వాత టీమిండియా గెలుస్తుందనే నమ్మకం నాకు కలిగింది. పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంది. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేశారు" అని గంగూలీ ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అదేవిధంగా ఉత్కంఠపోరులో విజయం తర్వాత భారత జట్టును కొనియాడుతూ గంగూలీ ఓ ట్విట్ కూడాచేశాడు."అసాధారణ సిరీస్. అమోఘమైన ఫలితం. జడేజా, వాషింగ్టన్ సుందర్, రిషభ్ పంత్, సిరాజ్... అందరూ నిలకడగా ఆడారు. భారత జట్టు విజయాల ఆకలితో ఉన్నట్లు మనవాళ్లు తమ ఆటతీరుతో నిరూపించారు" దాదా ఎక్స్లో రాసుకొచ్చారు.చదవండి: మా బ్యాటర్లు భయపడ్డారు.. కానీ అతడు ఉండుంటే గెలిచేవాళ్లం: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
ఇక్కడున్నా బిర్యానీ తక్కువే.. ఆ ఫుడ్ అసలే తినడు: సిరాజ్ సోదరుడు
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీని టీమిండియా సమం చేయడంలో మహ్మద్ సిరాజ్ది కీలక పాత్ర. ఈ ట్రోఫీలో భాగంగా ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్టులో సిరాజ్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఓటమి తప్పదనుకున్న చోట సిరాజ్ తన బౌలింగ్తో మ్యాజిక్ చేశాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు పడగొట్టి భారత జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో సిరాజ్ మియా తొమ్మిది వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు.ఒకే ఒక్కడు.. ఈ ఒక్క మ్యాచ్లోనే కాదు సిరీస్ అసాంతం మహ్మద్ సిరాజ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా సిరాజ్ ఫిట్నెస్ గురుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది. ఈ సిరీస్లో తన సహచర ఆటగాళ్లు ఫిట్నెస్ సమస్యలతో ఒకట్రెండు మ్యాచ్లకు దూరమైనప్పటికి.. సిరాజ్ మాత్రం అలుపెరుగని యోధుడిలా అన్ని మ్యాచ్లల్లోనూ ఆడాడు. ఇంగ్లండ్ - భారత్ టెస్టు సిరీస్లో ఐదు మ్యాచ్లు ఆడిన ఏకైక బౌలర్గా సిరాజ్ నిలిచాడు. ఎటువంటి వర్క్ లోడ్ భావించకుండా ఈ సిరీస్లో దాదాపు వెయ్యికి పైగా బంతులు వేశాడు. ఎన్నో లాంగ్ స్పెల్స్ కూడా బౌలింగ్ చేశాడు. కానీ ఎప్పుడూ కూడా సిరాజ్ అలిసిపోయినట్లు కన్పించలేదు. తాజాగా మహ్మద్ సిరాజ్ ఫిట్నెస్ సీక్రెట్ను అతడి సోదరుడు మొహమ్మద్ ఇస్మాయిల్ భయటపెట్టాడు."సిరాజ్ తన ఫిట్నెస్పై ఎక్కువగా దృష్టి సారిస్తాడు. అతడు జంక్ ఫుడ్కు దూరంగా ఉంటాడు. సరైన డైట్ ప్లాన్ను పాటిస్తాడు. సిరాజ్ హైదరాబాద్లో ఉన్నా కూడా బిర్యానీని చాలా అరుదుగా తింటాడు. అది కూడా ఇంట్లో తాయారు చేస్తే తింటాడు. కానీ పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్ల జోలికి అస్సలు పోడు. తన శరీరం పట్ల చాలా క్రమశిక్షణతో ఉంటాడు" అని ఇస్మాయిల్ ఇండియా టూడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్లో సిరాజ్ మొత్తంగా 23 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు ఫైవ్ వికెట్ హాల్స్ ఉన్నాయి.చదవండి: ‘డ్రా’ అయినందుకే ఇంత సంబరమా?.. అవును.. కొన్ని పొరపాట్లున్నా.. -
'మా బ్యాటర్లు భయపడ్డారు.. కానీ అతడు ఉండుంటే గెలిచేవాళ్లం'
క్రికెట్ అభిమానులను దాదాపు నెల రోజుల పాటు అలరించిన ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీకి సోమవారం(ఆగస్టు 4)తో ఎండ్ కార్డ్ పడింది. ఈ ట్రోఫీలో భాగంగా ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లండ్పై భారత్ 6 పరుగుల తేడాతో ఉత్కంఠభరితమైన విజయాన్ని సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ 2-2తో సమమైంది.ఈ విజయంలో భారత పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ కీలక పాత్ర పోషించారు. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు అవసరమవ్వగా.. భారత్ గెలుపునకు 4 వికెట్లు కావాల్సి ఉండేది. ఈ సమయంలో సిరాజ్, ప్రసిద్ద్ అద్బుతం చేసి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. అయితే భారత చేతిలో ఓటమిని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు జీర్ణించుకుకోలేకపోతున్నారు. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆడుంటే ఓవల్ టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించేందని వాన్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ టోర్నీ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన బెన్ స్టోక్స్ ఆఖరి టెస్టు భుజం గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్దానంలో ఓలీ పోప్ కెప్టెన్గా వ్యవహరించాడు."బెన్ స్టోక్స్ ఆడకపోవడమే ఆఖరి టెస్టులో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. ఒకవేళ అతడు జట్టులో ఉండి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది. అతడు జట్టును మానసికంగా సిద్దం చేయడంలో కీలక పాత్ర పోషించేవాడు. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ బ్యాటర్లు భయపడ్డారు. ఒక చిన్న భాగస్వామ్యం వచ్చి వుంటే వారు గెలిచేవారు. కానీ అలా చేయలేకపోయారు. స్పష్టంగా వారిలో తీవ్ర ఒత్తడి కన్పించింది. భారీ షాట్లకు ప్రయత్నించి తమ వికెట్లను కోల్పోయారు" అని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్ పేర్కొన్నాడు. కాగా 374 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లండ్ 367 పరుగులకు ఆలౌటైంది.చదవండి: కన్నీటిపర్యంతమైన గంభీర్.... గూస్బంప్స్ తెప్పించేశారు భయ్యా! వీడియో వైరల్ -
ఇంగ్లండ్తో సిరీస్ ముగిసింది.. టీమిండియా తదుపరి షెడ్యూల్ ఇదే..!
ఇంగ్లండ్లో జరిగిన ఐదు మ్యాచ్ల టెండూల్కర్-ఆండర్సన్ టెస్ట్ సిరీస్ నిన్నటితో (ఆగస్ట్ 5) ముగిసింది. ఈ సిరీస్ వీరోచితమైన పోరాటాల తర్వాత 2-2తో సమమైంది. చివరిదైన ఐదో టెస్ట్ హోరాహోరీగా సాగి అభిమానులకు కావాల్సినంత మజాను అందజేసింది. ఈ మ్యాచ్లో భారత్ ఇంగ్లండ్ను 6 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది.నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా తదుపరి ఆడబోయే మ్యాచ్లపై ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. టీమిండియా మళ్లీ ఎప్పుడు బరిలోకి దిగుతుందని ఫ్యాన్స్ శోధించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టీమిండియా తదుపరి షెడ్యూల్ను మీ ముందుంచుతున్నాము.టెండూల్కర్-ఆండర్సన్ టెస్ట్ సిరీస్ తర్వాత టీమిండియా నెలకు పైగా బ్రేక్ తీసుకుంటుంది. తదుపరి మ్యాచ్ను వచ్చే నెల 10న ఆసియా కప్లో భాగంగా యూఏఈతో ఆడనుంది. ఈసారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో అబుదాబీ, దుబాయ్ల్లో జరుగనుంది. ఈ ఖండాంతర టోర్నీలో భారత్ రెండో మ్యాచ్ను చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఆడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్లో జరుగనుంది. అనంతరం భారత్ సెప్టెంబర్ 19న ఒమన్తో అబుదాబీలో పోటీపడనుంది. ఆసియా కప్ గ్రూప్ దశలో భారత్ ఈ మూడు మ్యాచ్లు ఆడనుంది.ఆసియా కప్ సూపర్-4 స్టేజీలో మ్యాచ్లు (భారత్ గ్రూప్-ఏలో ఉంది)B1 vs B2 - 20 సెప్టెంబర్ 2025, దుబాయ్A1 vs A2 - 21 సెప్టెంబర్ 2025, దుబాయ్A2 vs B1 - 23 సెప్టెంబర్ 2025, అబుదాబిA1 vs B2 - 24 సెప్టెంబర్ 2025, దుబాయ్A2 vs B2 - 25 సెప్టెంబర్ 2025, దుబాయ్A1 vs B1 - 26 సెప్టెంబర్ 2025, దుబాయ్సెప్టెంబర్ 28- ఫైనల్ (దుబాయ్)భారత్ వర్సెస్ వెస్టిండీస్ (స్వదేశంలో)అక్టోబర్ 2-6: తొలి టెస్ట్, అహ్మదాబాద్అక్టోబర్ 10-14: రెండో టెస్ట్, ఢిల్లీభారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (ఆస్ట్రేలియాలో)అక్టోబర్ 19: తొలి వన్డే, పెర్త్అక్టోబర్ 23: రెండో వన్డే, అడిలైడ్అక్టోబర్ 25: మూడో వన్డే, సిడ్నీఅక్టోబర్ 29: మొదటి టీ20 కాన్బెర్రాఅక్టోబర్ 31: రెండో టీ20, మెల్బోర్న్నవంబర్ 2: మూడో టీ20, హోబర్ట్నవంబర్ 6: నాలుగో టీ20, కర్రారానవంబర్ 8: ఐదో టీ20, బ్రిస్బేన్భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (స్వదేశంలో)నవంబర్ 14-18: తొలి టెస్ట్, కోల్కతానవంబర్ 22-26: రెండో టెస్ట్, గౌహతినవంబర్ 30: తొలి వన్డే, రాంచీడిసెంబర్ 3: రెండో వన్డే, రాయ్పూర్డిసెంబర్ 6: మూడో వన్డే, వైజాగ్డిసెంబర్ 9: తొలి టీ20, కటక్డిసెంబర్ 11: రెండో టీ20, చండీఘడ్డిసెంబర్ 14: మూడో టీ20, ధర్మశాలడిసెంబర్ 17:నాలుగో టీ20, లక్నోడిసెంబర్ 19: ఐదో టీ20, అహ్మదాబాద్ -
టీమిండియా సరికొత్త చరిత్ర.. రికార్డుల జాతర
ఇంగ్లండ్తో జరిగిన టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ-2025 రికార్డులకు అడ్డాగా మారింది. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో చాలా రికార్డులు తిరగరాయబడ్డాయి. వీటిలో సింహభాగం భారత్, భారత్ ఆటగాళ్ల ఖాతాలో పడ్డాయి. జట్టు పరంగా టీమిండియా ఓ సరికొత్త రికార్డు నెలకొల్పింది.ఓ టెస్ట్ సిరీస్లో ఆస్ట్రేలియా తర్వాత రెండో అత్యధిక పరుగులు నమోదు చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈ సిరీస్లో భారత్ 42.32 సగటున 3809 పరుగులు చేసింది. 1989 యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా అత్యధికంగా 3877 పరుగులు చేసింది. తాజా సిరీస్లో భారత్ కేవలం 5 టెస్ట్ల్లోనే ఈ పరుగులు చేయగా.. ఆసీస్ నాటి యాషెస్ సిరీస్లో 6 టెస్ట్లు ఆడి భారత్ కంటే కేవలం 68 పరుగులే ఎక్కువ చేసింది.ఈ రికార్డుతో పాటు టెండూల్కర్-ఆండర్సన్ సిరీస్ మరిన్ని రికార్డులకు వేదికైంది. ఆ రికార్డులపై ఓ లుక్కేద్దాం.భారత్-ఇంగ్లండ్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక పరుగులు- శుభ్మన్ గిల్ (5 మ్యాచ్ల్లో 754 పరుగులు). గతంలో ఈ రికార్డు గ్రహం గూచ్ (752) పేరిట ఉండేది.ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్- శుభ్మన్ గిల్. గతంలో ఈ రికార్డు సునీల్ గవాస్కర్ (732) పేరిట ఉండేది.SENA దేశాల్లో జరిగిన సిరీస్ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్: శుభ్మన్ గిల్, గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లి (692) పేరిట ఉండేది.టెస్ట్ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన భారత కెప్టెన్: శుభ్మన్ గిల్ (269 ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో). గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లి (254) పేరిట ఉండేది.SENA దేశాల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సిన ఆసియా కెప్టెన్: శుభ్మన్ గిల్. గతంలో ఈ రికార్డు తిలకరత్నే దిల్షన్ (193) పేరిట ఉండేది.ఓ టెస్ట్ మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన పర్యాటక బ్యాటర్: శుభ్మన్ గిల్ (430, ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో 269+161). గతంలో ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ (426) పేరిట ఉండేది.ఒకే టెస్ట్లో సెంచరీ, 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి ఇంగ్లండ్ కెప్టెన్: బెన్ స్టోక్స్ (నాలుగో టెస్ట్)ఒకే టెస్ట్లో రెండు సెంచరీలు చేసిన తొలి భారత వికెట్కీపర్: రిషబ్ పంత్ (హెడింగ్లే టెస్ట్)టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకిన జో రూట్: ఈ సిరీస్లో రూట్ ద్రవిడ్, కల్లిస్, రికీ పాంటింగ్లను అధిగమించి టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ లిస్ట్లో సచిన్ టెండూల్కర్ టాప్లో ఉన్నాడు.వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో 6000 పరుగులు చేసిన తొలి బ్యాటర్: జో రూట్SENA దేశాల్లో 150 వికెట్లు తీసిన తొలి ఆసియా బౌలర్: బుమ్రా (61 ఇన్నింగ్స్ల్లో)ఓ సిరీస్లో రెండో అత్యధిక పరుగులు (ఇరు జట్లు): ఈ సిరీస్లో భారత్, ఇంగ్లండ్ కలిపి 7000 పైచిలుకు పరుగులు నమోదు చేశాయి. 1993 యాషెస్ సిరీస్లో మాత్రమే ఈ ఘనత నమోదైంది.భారత్ అత్యల్ప, అతి భారీ విజయాలు (పరుగుల పరంగా): భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యల్ప, అతి భారీ విజయాలు ఈ సిరీస్లోనే నమోదయ్యాయి. ఈ సిరీస్లోని ఓవల్ టెస్ట్లో భారత్ 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందగా.. ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో 336 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. -
చిరస్మరణీయ విజయం.. ఇంగ్లండ్ను వెనక్కు నెట్టిన టీమిండియా
ఓవల్ టెస్ట్ విజయానంతరం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (2025-27) పాయింట్ల పట్టికలో భారత్ ఇంగ్లండ్ను వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లండ్ నాలుగో స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్కు ముందు భారత్ నాలుగో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ మూడో ప్లేస్లో ఉండింది.ఈ మ్యాచ్ విజయానంతరం భారత్ విజయాల శాతం 46.67గా ఉండగా.. ఇంగ్లండ్ విన్నింగ్ పర్సంటేజ్ 43.33కు పడిపోయింది. ఆస్ట్రేలియా (100), శ్రీలంక (66.67) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. 16.67 విజయాల శాతంతో బంగ్లాదేశ్ ఐదో ప్లేస్లో ఉంది. వెస్టిండీస్ ఈ సైకిల్లో ఆడిన మూడు మ్యాచ్ల్లో ఓడి ఆరో స్థానంలో ఉంది. న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా ఈ సైకిల్లో ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.కాగా, ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్లో పర్యటించిన భారత జట్టు 2-2తో సిరీస్ను సమం చేసుకుంది. 1, 3 టెస్ట్ మ్యాచ్లు ఇంగ్లండ్ గెలువగా.. భారత్ 2, 5 మ్యాచ్ల్లో విజయాలు సాధించింది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. డబ్ల్యూటీసీలో భారత్ తదుపరి టెస్ట్ సిరీస్ వెస్టిండీస్తో ఆడనుంది. రెండు మ్యాచ్ల ఈ సిరీస్ భారత్ వేదికగా ఆక్టోబర్ 2 నుంచి ప్రారంభమవుతుంది. తొలి టెస్ట్ అహ్మదాబాద్లో, రెండో టెస్ట్ (అక్టోబర్ 10 నుంచి) ఢిల్లీలో జరుగనున్నాయి.ఇదిలా ఉంటే, హోరాహోరీగా సాగిన ఓవల్ టెస్ట్లో భారత్ 6 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ చివరి రోజు భారత్ 35 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని చిరస్మరణీయ విజయం సాధించింది. భారత బౌలర్లలో సిరాజ్ మ్యాజిక్ చేసి ఇంగ్లండ్ చేతిలో ఉండిన 4 వికెట్లలో 3 వికెట్లు తీశాడు. ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ పడగొట్టాడు.374 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓ దశలో పటిష్ట స్థితిలో (301/3) ఉన్నప్పటికీ.. భారత బౌలర్లు మ్యాచ్పై ఆశలు వదులుకోకుండా వీరోచితంగా పోరాడారు. ముఖ్యంగా సిరాజ్ ఓటమిని ఒప్పుకునే ప్రసక్తే లేదన్నట్లు ముందుకు సాగాడు. అతనికి ప్రసిద్ద్ సహకరించాడు. వీరిద్దరు కలిపి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో 9 వికెట్లు తీశారు. సెకెండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు సహా మ్యాచ్ మొత్తంలో 9 వికెట్లు తీసిన సిరాజ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
దేశమే సర్వస్వం.. దేనికి వెనకాడం.. పంత్ భావోద్వేగ పోస్ట్
క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ టెస్ట్ మ్యాచ్లలో ఇది ఒకటి. ఓవల్ వేదికగా జరిగిన హోరాహోరీ సమరంలో ఇంగ్లండ్పై భారత్ 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని మునివేళ్లపై నిలబెట్టింది. ఆట చివరి రోజు భారత బౌలర్లు ధీరత్వాన్ని ప్రదర్శించి 35 పరుగుల స్వల్ప లక్ష్నాన్ని విజయవంతంగా కాపాడుకున్నారు. ఇంగ్లండ్ చేతిలో 4 వికెట్లుండగా.. సిరాజ్ 3 వికెట్లు తీసి ప్రత్యర్థి నోటి కాడి గెలుపును లాగేసుకున్నాడు. ప్రసిద్ద్ కృష్ణ తన వంతుగా ఓ వికెట్ తీశాడు.374 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓ దశలో పటిష్టమైన స్థితిలో (301/3) ఉన్నప్పటికీ.. భారత బౌలర్లు మ్యాచ్పై ఆశలు వదులుకోకుండా వీరోచితంగా పోరాడారు. ముఖ్యంగా సిరాజ్ ఓటమిని ఒప్పుకునే ప్రసక్తే లేదన్నట్లు ముందుకు సాగాడు. ఈ గెలుపులో సిరాజ్ది ప్రధానపాత్ర. ఈ హైదరాబాదీ పేసర్ అసలుసిసలైన పోరాట యోధుడిలా పోరాడి భారత్కు చిరస్మరణీయ విజయాన్నందించాడు. రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు సహా, మ్యాచ్ మొత్తంలో తొమ్మిది వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.కాగా, ఈ గెలుపు అనంతరం గాయపడిన టీమిండియా హీరో రిషబ్ పంత్ స్పందించాడు. ఇన్స్టా వేదికగా భావోద్వేగమైన పోస్ట్ పెట్టాడు. ఈ సిరీస్లో నాలుగో టెస్ట్ సందర్భంగా గాయపడి, ఐదో టెస్ట్కు దూరంగా ఉన్న పంత్.. టీమిండియా సాధించిన విజయాన్ని పొగడ్తలతో ముంచెత్తాడు. సహచరులను కొనియాడాడు. తన జట్టు పట్ల గర్వంగా ఉన్నానని అన్నాడు. దేశమే సర్వస్వమని తెలిపాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించేప్పుడు సర్వ శక్తులు ఒడ్డి పోరాడతామని అన్నాడు. దేనికి వెనుకాడేది లేదని స్పష్టం చేశాడు.పంత్ మాటల్లో.. ఈ ఇంగ్లండ్ పర్యటన మా నుంచి చాలా అడిగింది. అంతకుమించి తిరిగి ఇచ్చింది. ఈ జట్టు పట్ల చాలా గర్వంగా ఉంది. యువ ఆటగాళ్లు పరిస్థితులకు తగ్గట్టుగా పోరాడిన తీరు అమోఘంగా ఉంది. దేశానికి ప్రాతినిథ్యం వహించడం మాకు సర్వస్వం. ఇది మాలోని ప్రతి విషయాన్ని వెలికి తీస్తుంది. దీనికి మేము గర్వపడుతున్నాము.మా అద్భుతమైన సహాయక సిబ్బందికి, సిరీస్ ఆధ్యాంతం మాకు అండగా నిలబడిన అభిమానులకు ధన్యవాదాలు. ఈ జట్టు ఆకలితో ఉంది. ఐక్యంగా ఉంది. సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత భారత క్రికెట్ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తుంది.కాగా, ఈ సిరీస్లో రిషబ్ పంత్ టీమిండియాకు వైస్ కెప్టెన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో అతను అరివీర భయంకరమైన ఫామ్లో ఉండగా గాయపడ్డాడు. 7 ఇన్నింగ్స్ల్లో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సాయంతో 479 పరుగులు చేశాడు. నాలుగో టెస్ట్లో క్రిస్ వోక్స్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ చేయబోగా పంత్ పాదం ఫ్రాక్చర్కు గురైంది. పాదం ఫ్రాక్చర్ అయినా పంత్ ఆ మ్యాచ్లో బ్యాటింగ్కు దిగి దేశానికి ఆడటమంటే తనకేంటో ప్రపంచం మొత్తానికి నిరూపించాడు. ఆ ఇన్నింగ్స్లో పంత్ కుంటుతూనే హాఫ్ సెంచరీ చేయడం విశేషం. ఓవల్ టెస్ట్లో విజయంతో భారత్ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 2-2తో సమం చేసుకుంది. -
కొన్ని గెలుస్తాం.. కొన్ని ఓడతాం.. కానీ, ఎప్పటికీ లొంగిపోము: గంభీర్
ఓవల్ టెస్ట్లో టీమిండియా చారిత్రక విజయం సాధించిన అనంతరం జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్లను పొగడ్తలతో ముంచెత్తుతూ సోషల్మీడియాలో ఓ కదిలించే పోస్ట్ పెట్టాడు. కొన్ని గెలుస్తాం.. కొన్ని ఓడతాం.. కానీ, ఎప్పటికీ లొంగిపోము. వెల్డన్ బాయ్స్ అంటూ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు. ఈ మెసేజ్తో పాటు గంభీర్ టీమిండియా ఆటగాళ్లు విజయదరహాసంతో ఉన్న పలు ఫోటోలను పోస్ట్ చేశాడు. గంభీర్ చేసిన ఈ పోస్ట్ సోషల్మీడియాలో వైరలవుతోంది.కాగా, ఇంగ్లండ్ సిరీస్ ఆధ్యాంతం టీమిండియా చూపించిన పోరాటస్పూర్తిలో గంభీర్ ప్రధానపాత్ర పోషించాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆశలు వదులుకోకూడదంటూ (Never give up) ఆటగాళ్లలో కసిని రగిల్చాడు. మనది యంగ్ టీమ్ కాదు, గన్ టీమ్ అంటూ ఆటగాళ్లలో ఉత్తేజాన్ని నింపాడు. ఆటగాళ్లను ప్రతి విషయంలో దగ్గరుండి ప్రోత్సహించాడు. కొందరు ఆటగాళ్లు (ఆకాశ్దీప్, జైస్వాల్) విఫలమైప్పుడు వెనకేసుకొచ్చి సత్ఫలితాలు రాబట్టాడు.అవసరమైనప్పుడు దండించాడు. మంచి ప్రదర్శన చేసినప్పుడు ముద్దులతో ముంచెత్తాడు. మొత్తంగా ఈ సిరీస్లో టీమిండియా ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనకు స్పూర్తిదాతగా నిలిచాడు. ఓవల్ టెస్ట్ విజయం తర్వాత గంభీర్లోని చిన్నపిల్లాడు బయటికి వచ్చాడు. విజయగర్వంతో ఊగిపోతూ ఎగిరి గంతులేశాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ను ముద్దులతో ముంచెత్తాడు. టీమిండియా మొత్తాన్ని తీవ్ర భావోద్వేగంతో ఆలింగనం చేసుకున్నాడు. ముఖ్యంగా సిరాజ్పై ప్రశంసలపై వర్షం కురిపించాడు. అతన్ని కెప్టెన్తో పాటు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చోబెట్టి కొత్త ఆనవాయితీకి తెరలేపాడు.ఓవల్ టెస్ట్లో సిరాజ్ చారిత్రక స్పెల్తో భారత్కు అపురూప విజయాన్నందించాడు. చివరి రోజు 35 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవాల్సి ఉండగా.. సిరాజ్ మియా మ్యాజిక్ చేశాడు. ఇంగ్లండ్ చేతిలో 4 వికెట్లుండగా.. 3 వికెట్లు తీసి వారి నోటి కాడి విజయాన్ని లాక్కున్నాడు.ఈ మ్యాచ్ మొత్తం అద్బుతమైన పోరాటాలతో సాగింది. తొలుత భారత్ స్వల్ప స్కోర్కే ఔటైనా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని ఇంగ్లండ్ను కూడా ఓ మోస్తరు స్కోర్కే పరిమితం చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో భారత్ బ్యాటర్లు అద్భుతమే చేశారు. జైస్వాల్, ఆకాశ్దీప్, జడేజా, సుందర్ సూపర్ ఇన్నింగ్స్లు ఆడి భారత్కు భారీ స్కోర్ అందించారు. అనంతరం 374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓ దశలో పటిష్ట స్థితిలో (301/3) ఉన్నప్పటికీ భారత బౌలర్లు మ్యాచ్పై ఆశలను వదులుకోకుండా పోరాడారు. ఇంగ్లండ్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లపై ప్రతాపం చూపించారు. సిరాజ్, ప్రసిద్ద్ నిరుత్సాహపడకుండా వారు చేయాల్సిందంతా చేసి సత్పలితాన్ని రాబట్టారు. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్ను 2-2తో డ్రా చేసుకుంది. -
IND Vs ENG: జో జీతా వహి సిరాజ్
సిరీస్లో ఐదు టెస్టులూ చివరి వరకు ఆడిన ఏకైక పేస్ బౌలర్. ఏకంగా 1113 బంతులు... సిరీస్ తొలిరోజు నుంచి చివరిరోజు వరకు బౌలింగ్లో అదే వేగం, అంతే తీవ్రత... ప్రతీ బంతి వేసే సమయంలో 100 శాతం ఇవ్వాలనే తపన... చేసే పని భారంగా అనిపించలేదు... సుదీర్ఘ సిరీస్లో విశ్రాంతి తీసుకోలేదు. గాయంతో తప్పుకోలేదు, మ్యాచ్ మధ్యలో ఫిట్నెస్ సమస్యలతో ఒక్కసారి కూడా బౌలింగ్కు దూరం కాలేదు... చివరకు అద్భుత రీతిలో మ్యాచ్ను గెలిపించే వరకు ఆగిపోలేదు... ఇలాంటి పోరాటతత్వం, పట్టుదల హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్కే సాధ్యమైంది. 185.3 ఓవర్ల బౌలింగ్ తర్వాత కూడా అతను అలసిపోకుండా ఇప్పుడు మళ్లీ బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండి ‘సై’ అంటున్నాడు. ఈ సిరీస్లో అతని ప్రదర్శనను ప్రశంసించనివారు లేరు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు అథర్టన్, మైకేల్ వాన్, నాసిర్ హుస్సేన్ మాటల్లో చెప్పాలంటే సిరాజ్ సింహంలా పోరాడిన ఒక ‘లయన్ హార్ట్’ బౌలర్. అసలు అతను సిరీస్ ఆసాంతం ఒకే తరహాలో అంతే దూకుడుతో ఎలా బౌలింగ్ చేస్తున్నాడో వారికి కూడా ఆశ్చర్యపర్చింది. ‘దేశం తరఫున ఆడటం అనేదే ఒక ఆటగాడికి లభించే ఎంతో గొప్ప అవకాశం. అలాంటప్పుడు నేను ఎన్ని ఓవర్లు వేశాను, ఎంత ఎక్కువగా కష్టపడుతున్నాను అన్నది అస్సలు పట్టించుకోవాల్సిన విషయమే కాదు. నాలో సత్తా ఉన్నంత వరకు బౌలింగ్ చేస్తూనే ఉంటాను. అదృష్టవశాత్తూ ఇప్పుడు కూడా నేను ఫిట్గా ఉన్నాను’... చివరి టెస్టు ముగిసిన తర్వాత భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ వ్యాఖ్య ఇది. ముందుండి నడిపిస్తూ... టాప్ పేసర్ బుమ్రా మూడు టెస్టులే ఆడతాడని ఖాయమయ్యాక సహజంగానే సీనియర్ అయిన సిరాజ్పై ఎక్కువ బాధ్యత నిలిచింది. దానిని అతను సమర్థంగా నిర్వర్తించాడు. జట్టుకు అవసరమైన ప్రతీ సందర్భంలోనూ సిరాజ్ నేనున్నానంటూ ముందుకు వచ్చాడు. కొత్త బంతి ఇస్తే దానిని సమర్థంగా ఉపయోగించాడు. కాస్త పాతబడిన బంతిని అప్పగిస్తే డ్యూక్ బంతులను వాడుకుంటూ స్వింగ్లో చెలరేగడం అతనికే చెల్లింది. కెప్టెన్ గిల్ అయితే ఇక చాలు బౌలింగ్ చేయలేడు అనిపించిన సమయాల్లో కూడా మళ్లీ సిరాజ్కే బంతిని అప్పగించాడు. కాస్త ఘాటుగా చెప్పాలంటే చెరకు మిషన్లో చెరకు గడను చివరి వరకు వాడుతూ పిప్పి చేసినట్లుగా సిరాజ్ను గిల్ ఉపయోగించుకున్నాడు. అయినా సరే ఎక్కడా తగ్గకుండా కీలక సమయాల్లో కీలక వికెట్లతో భారత్ మ్యాచ్లో పైచేయి సాధించేలా చేశాడు. బుమ్రా ఆడని రెండు టెస్టుల్లో భారత్ గెలిచింది. ఎడ్జ్బాస్టన్లో 7 వికెట్లు తీసిన సిరాజ్, ఓవల్లో 9 వికెట్లు పడగొట్టాడు. సిరీస్లో అతను రెండుసార్లు ఇన్నింగ్స్లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. రెండో టెస్టులో వరుస బంతుల్లో రూట్, స్టోక్స్లను అవుట్ చేయడం, క్రాలీని డకౌట్ చేయడం కీలక మలుపులు కాగా... ఓవల్ తొలి ఇన్నింగ్స్లో అతను తీసిన పోప్, రూట్, బ్రూక్ వికెట్లతోనే తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్కు భారీ ఆధిక్యం దక్కలేదు. మూడో రోజు క్రాలీని బౌల్డ్ చేసిన బంతిని ఎవరూ మర్చిపోలేరు. చివరి రోజు బౌలింగ్ గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిలకడగా సత్తా చాటుతూ... మాంచెస్టర్ టెస్టులో 30 ఓవర్లలో 140 పరుగులు ఇచ్చి ఒకటే వికెట్ తీసినప్పుడు సిరాజ్ బౌలింగ్లో పదును తగ్గినట్లు అనిపించింది. అయితే తర్వాతి మ్యాచ్తోనే అతను తనపై వచ్చిన సందేహాలను పటాపంచలు చేశాడు. చాలా సందర్భాల్లో బుమ్రా నీడలో ఉన్నట్లుగా కనిపించిన సిరాజ్ అవకాశం దక్కిన ప్రతీసారి తానేంటో చూపిస్తున్నాడు. బుమ్రాతో కలిసి ఆడిన టెస్టుల్లోకంటే అతను లేని టెస్టుల్లో చెలరేగిపోతున్నాడు. ఏడాదిన్నర క్రితం కేప్టౌన్ టెస్టులో దక్షిణాఫ్రికాపై 15 పరుగులే ఇచ్చి 6 వికెట్లు తీసినప్పుడే టెస్టు బౌలర్గా సిరాజ్ స్థాయి ఎంతో పెరిగింది. ఆ్రస్టేలియాతో సిరీస్లోనూ 20 వికెట్లు పడగొట్టినా... బుమ్రా అసాధారణ 32 వికెట్ల బౌలింగ్తో పాటు భారత్ సిరీస్ ఓడటంతో అతని ప్రదర్శనకు గుర్తింపు రాలేదు. కానీ ఇప్పుడు ఓడిపోతుందనుకున్న సిరీస్ను సమం చేయడంలో సిరాజ్ పోషించిన పాత్ర అతడిని మరో మెట్టు పైకి ఎక్కించింది. చివరగా... నాలుగో రోజు హ్యారీ బ్రూక్ క్యాచ్ వదిలేయడంతో సిరాజ్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతని అద్భుత బౌలింగ్నూ పట్టించుకోకుండా కొందరు వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్ ఓడి ఉంటే అది అతడిని ఎప్పటికీ వెంటాడేది. కానీ ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న ఈ బౌలర్ అలాంటి అవకాశం ఇవ్వకుండా ఒంటిచేత్తో మ్యాచ్ను ముగించాడు. భారత్ను గెలిపించాడు. తానూ గెలిచాడు. ప్రశంసల వెల్లువటెస్టు క్రికెట్కు వన్నెతెచి్చన సిరీస్ ఇది. ఆఖరి మ్యాచ్ అయితే అద్భుతం. నిజంగా రోమాలు నిక్క»ొడుచుకునేలా చేసింది. సిరీస్ ఫలితం 2–2 అయి వుండొచ్చు. కానీ... ప్రదర్శనతో 10కి 10 మార్కులు తెచ్చుకున్నారు. టీమిండియన్స్ అంతా సూపర్గా ఆడారు. –భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్భారత జట్టు అద్భుత విజయం సాధించింది. సిరాజ్, ప్రసిధ్ కృష్ణ బౌలింగ్లో కనబరిచిన నిబద్ధత, అంకితభావానికి హ్యాట్సాఫ్. సిరాజ్కు నా ప్రత్యేక అభినందనలు. జట్టు కోసం ఏదైనా చేసేందుకు ముందువరుసలో సిద్ధంగా ఉంటాడు. –విరాట్ కోహ్లిసంప్రదాయ క్రికెట్కు ఉన్న మ్యాజిక్ను ఆవిష్కరించిన మ్యాచ్ ఇది. ఓవల్ క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయే మ్యాచ్కు ఆతిథ్యమిచ్చింది. అసాధారణ ఆటతీరుతో టెస్టు ఇమేజ్ పెంచిన భారత్, ఇంగ్లండ్ జట్ల సభ్యులకు నా ప్రత్యేక ప్రశంసలు. –ఐసీసీ చైర్మన్ జై షాసాక్షి క్రీడా విభాగం -
‘పోయింది అనుకున్న మ్యాచ్ గెలిచారు.. నన్ను క్షమించండి’
ఇంగ్లండ్పై ఓవల్ వేదికగా అనూహ్య విజయం సాధించిన టీమిండియాపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. ఇదొక చారిత్రాత్మక విజయమని కొనియాడారు. మన చేతుల్లో మ్యాచ్లో లేదు.. పోయింది అనుకున్న సమయంలో టీమిండియా ఆటగాళ్లు అద్భుతం చేశారన్నారు. తాను కూడా మ్యాచ్ మన నుంచి చేజారిపోయిందనే అనుకున్నానని, అయితే అది తప్పు అని నిరూపించి మన ఆటగాళ్లు అద్భుతమే సృష్టించారని పొగడ్తల వర్షం కురిపించారు. అదే సమయంలో మ్యాచ్ ఓడిపోయే అవకాశం ఉందని తాను చెప్పిన దానికి బదులుగా టీమిండియా సభ్యులకు క్షమాపణలు తెలియజేశారు శశిథరూర్.Words fail me….WHAT A WIN! 🇮🇳🏏 Absolutely exhilarated & ecstatic for #TeamIndia on their series-clinching victory against England! The grit, determination, and passion on display were simply incredible. This team is special. I am sorry that I expressed a spasm of doubt about…— Shashi Tharoor (@ShashiTharoor) August 4, 2025 ‘మ్యాచ్ను టీమిండియా కోల్పోతుందనే అనుకున్నా. ఓటమి ఖాయమని చెప్పాను. అయితే అది తప్పైంది. మన మీద మనం నమ్మకం ఉంచితే అద్భుతాలు సృష్టించవచ్చనే దానికి ఇదొక నిదర్శనం. ఎప్పుడూ మీపై నమ్మకాన్ని కోల్పోకండి’ అంటూ శశిథరూర్ తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ ద్వారా ట్వీట్ చేశారు. ఇంగ్లండ్తో చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఐదో టెస్టులో టీమిండియా ఆరు పరుగుల తేడాతో సంచనల విజయం సాధించింది.లార్డ్స్ టెస్టులో బ్యాట్తో జట్టును గెలిపించలేకపోయిన సిరాజ్.. ఓవల్లో మాత్రం బంతితో తన జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. ఈ కీలక పోరులో సిరాజ్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. బుమ్రా లేని లోటును తెలియనివ్వలేదు. తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు పడగొట్టిన సిరాజ్.. రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లతో సత్తాచాటాడు. మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. ఈ టెస్టులో విజయం సిరీస్ను భారత్ 2-2తో సమం చేసింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. -
చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్.. కపిల్ దేవ్ రికార్డు బ్రేక్
ది ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. తన సంచలన బౌలింగ్తో భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో సిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగాడు. మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. ఈ క్రమంలో సిరాజ్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.సిరాజ్ సాధించిన రికార్డులు ఇవే..👉ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక టెస్టు వికెట్లు తీసిన మూడో భారత బౌలర్గా సిరాజ్ నిలిచాడు. సిరాజ్ ఇప్పటివరకు ఇంగ్లండ్లో 46 టెస్టు వికెట్లు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట ఉండేది.కపిల్ దేవ్ తన టెస్టు కెరీర్లో ఇంగ్లండ్ గడ్డపై 43 వికెట్లు సాధించాడు. తాజా ఇన్నింగ్స్లో స్మిత్ను ఔట్ చేసి ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో జస్ప్రీత్ బుమ్రా(51), ఇషాంత్ శర్మ(51) సంయుక్తంగా ఆగ్రస్ధానంలో ఉన్నారు.👉అదేవిధంగా ఇంగ్లండ్లో జరిగిన ఒక టెస్టు సిరీస్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు (23) తీసిన బౌలర్గా బుమ్రా రికార్డును సిరాజ్ సమం చేశాడు. బుమ్రా 2021-22 పర్యటనలో ఇంగ్లండ్పై 23 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో సిరాజ్ మరో వికెట్ తీసి ఉంటే బుమ్రాను ఆధిగమించేవాడు.👉వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ హిస్టరీలో అత్యధిక సార్లు ఫైవ్ వికెట్ హాల్ సాధించిన నాలుగో బౌలర్గా అక్షర్ పటేల్ రికార్డును సిరాజ్ సమం చేశాడు. అక్షర్ ఇప్పటివరకు 5 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించగా.. సిరాజ్ కూడా సరిగ్గా ఐదు సార్లు ఈ ఫీట్ సాధించాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక త్యధిక సార్లు ఫైవ్ వికెట్ హల్ సాధించిన బౌలర్ల జాబితాలో జస్ప్రీత్ బుమ్రా (12) అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత అశ్విన్ (11), రవీంద్ర జడేజా (6) జడేజా కొనసాగుతున్నారు.ఇక ఈ సిరీస్లో సిరాజ్(23 వికెట్లు) లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు.చదవండి: అతడొక సంచలనం.. ప్రాణం పెట్టి ఆడాడు! ఎంత చెప్పిన తక్కువే: గిల్ -
అతడొక సంచలనం.. ప్రాణం పెట్టి ఆడాడు! ఎంత చెప్పిన తక్కువే: గిల్
ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా అద్బుతమైన విజయంతో ముగించింది. ఆండర్సన్- టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టులో 6 పరుగుల తేడాతో భారత్ చారిత్రత్మక విజయం సాధించింది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ప్రత్యర్ధిని ఓడించి సిరీస్ను 2-2తో భారత్ సమం చేసింది.374 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లండ్ సైతం ఆఖరివరకు పోరాడింది. ఓటమి తప్పదనుకున్న చోట భారత బౌలర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ అద్బుతం చేశారు. 339/6 ఓవర్ నైట్ స్కోర్తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. 85.1 ఓవర్లలో 367 పరుగులకు ఆలౌటైంది.సెకెండ్ ఇన్నింగ్స్లో సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్ నాలుగు వికెట్లు సాధించారు. ఓవరాల్గా రెండు ఇన్నింగ్స్లు కలిపి సిరాజ్ తొమ్మిది, ప్రసిద్ద్ 8 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 224 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 247 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్లో 396 పరుగుల భారీ స్కోర్ చేసి 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక ఈ అద్బుత విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పందించాడు. కీలక మ్యాచ్లో గెలిసి సిరీస్ సమం చేసినందుకు సంతోషంగా ఉందని గిల్ అన్నాడు."ఈ సిరీస్ అసాంతం రెండు జట్లు(భారత్, ఇంగ్లండ్) అద్బుతమైన ప్రదర్శన కనబరిచాయి. ఈ మ్యాచ్ ఐదో రోజు విషయానికి వస్తే.. ఇరు జట్లకు సమంగా విజయ అవకాశాలు ఉండేవి. ఎవరు గెలుస్తారో అంచనా వేయలేని పరిస్థితి. ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి. ఆఖరికి ఈ ఉత్కంఠపోరులో మేము పై చేయి సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది.అందుకే కొత్త బంతిని తీసుకోలేదు..సిరాజ్, ప్రసిద్ద్ లాంటి బౌలర్లు ఇంత అద్బుతంగా బౌలింగ్ చేస్తే ఎవరికైనా కెప్టెన్సీ చాలా సులభం అనిపిస్తుంది. వారిద్దరూ మ్యాచ్ విన్నింగ్ స్పెల్ బౌలింగ్ చేశారు. పాత బంతితో మాకు ఎటువంటి సమస్యలేదన్పించింది. బంతి రెండు వైపులా మంచిగా మూవ్ అయింది. అందుకే కొత్త బంతిని తీసుకులేదు. అయితే ఆరంభంలో మాపై కొంత మాపై ఒత్తడి ఉండేది. కానీ గెలుస్తామన్న నమ్మకం అయితే మాకు ఉండేది. వారిని ఒత్తిడి గురిచేయాలనుకున్నాము. ఒత్తిడిలో ఎటువంటి జట్టు అయినా తప్పిదాలు చేస్తోంది. మా ప్రణాళికలకు తగ్గట్టే బౌలర్లు అద్బుతంగా రాణించారు.ఒక్కడు చాలు..సిరాజ్ ఒక సంచలనం. అటువంటి బౌలర్ ఒకరు జట్టులో ఉండాలని ప్రతీ కెప్టెన్ కోరుకుంటాడు. ఈ ఒక్క మ్యాచ్లోనే కాదు ఈ ఐదు మ్యాచ్ల సిరీస్ మొత్తం అతడు ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. ప్రతీ బంతిని ప్రాణం పెట్టి బౌలింగ్ చేస్తాడు.ఈ విజయానికి మేము అన్ని రకాల ఆర్హులం. ఇక ఈ సిరీస్లో టాప్ రన్స్కోరర్గా నిలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సిరీస్ ఆరంభానికి ముందు నేను చాలా కష్టపడ్డాడు. ఈ సిరీస్లో బెస్ట్ బ్యాటర్గా ఉండడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇప్పుడు నా లక్ష్యాన్ని అందుకున్నాను" పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో గిల్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: ప్రతీకారం తీర్చుకున్న సిరాజ్.. ఓవల్లో భారత్ చారిత్రత్మక విజయంसूरमा नहीं विचलित होते,क्षण एक नहीं धीरज खोते,विघ्नों को गले लगाते हैं,काँटों में राह बनाते हैं।#INDvsENGTest #OvalTest pic.twitter.com/j7W0q1y2RY— Office of Shivraj (@OfficeofSSC) August 4, 2025 -
ప్రతీకారం తీర్చుకున్న సిరాజ్.. ఓవల్లో భారత్ చారిత్రాత్మక విజయం
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలోని ఆఖరి మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన టెస్టు క్రికెట్ మజాను అందించింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఐదో టెస్టులో ఇంగ్లండ్పై 6 పరుగుల తేడాతో టీమిండియా సంచలన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ 2-2తో సమమైంది. ఈ విజయంలో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ది కీలక పాత్ర.సిరాజ్ అద్భుతం..లార్డ్స్ టెస్టులో బ్యాట్తో జట్టును గెలిపించలేకపోయిన సిరాజ్.. ఓవల్లో మాత్రం బంతితో తన జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. ఈ కీలక పోరులో సిరాజ్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. బుమ్రా లేని లోటును తెలియనివ్వలేదు. తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు పడగొట్టిన సిరాజ్.. రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లతో సత్తాచాటాడు. మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు.తొలి ఓవర్లోనే.. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు అవసరమవ్వగా.. భారత్ 4 వికెట్లు కావాల్సి వచ్చాయి. క్రీజులో జేమీ ఓవర్టన్, స్మిత్ ఉండగా.. తొలి ఓవర్ వేసే బాధ్యతను ప్రసిద్ద్ కృష్ణకు గిల్ అప్పగించాడు. అయితే ఆ ఓవర్లో ప్రసిద్ద్ వేసిన తొలి బంతినే ఓవర్టన్ బౌండరీకి తరలించాడు. ఆ తర్వాత నాలుగో బంతికి ఫోర్ రావడంతో ఓ ఓవర్లో ఇంగ్లండ్కు 8 పరుగులు లభించాయి. ఇంగ్లండ్ విజయసమీకరణం 27 పరుగులు మారింది. దీంతో డ్రెస్సింగ్ రూమ్తో పాటు అభిమానుల్లో టెన్షన్ నెలకొంది.మియా ఎంట్రీ..ఈ సమయంలో ఎంట్రీ ఇచ్చిన సిరాజ్ మియా.. తన వేసిన తొలి ఓవర్లోనే స్మిత్ను ఔట్ చేసి భారత శిబిరంలో గెలుపు ఆశలు చిగురించేలా చేశాడు. ఆ తర్వాత జేమీ ఓవర్టన్ను సిరాజ్ అద్బుతమైన ఎల్బీగా పెవిలియన్కు పంపాడు. ఈ సమయంలో సిరాజ్కు ప్రసిద్ద్ తోడయ్యాడు.సంచలన బంతితో టెయిలాండర్ టంగ్ను ప్రసిద్ద్ బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో గాయపడిన క్రిస్ వోక్స్ బ్యాటింగ్కు వచ్చాడు. భుజం ఎముక విరిగినప్పటికి తన జట్టు కోసం వోక్స్ మైదానంలో అడుగుపెట్టాడు. నొప్పిని భరిస్తూనే నాన్స్ట్రైక్ ఎండ్లో అట్కిన్సన్కు సపోర్ట్గా వోక్స్ నిలిచాడు. అనంతరం 84వ ఓవర్లో సిరాజ్ బౌలింగ్లో అట్కిన్సన్ సిక్సర్ కొట్టడంతో మళ్లీ టెన్షన్ నెలకొంది. అంతకుతోడు ధ్రువ్ జురెల్ రనౌట్ మిస్ చేయడంతో ఉత్కంఠ మరింత పెరిగింది.కానీ 86వ ఓవర్ వేసిన సిరాజ్ మియా.. అద్బుతమైన బంతితో అట్కిన్సన్ను బౌల్డ్ చేసి అభిమానుల ఉత్కంఠకు తెరదించాడు. దీంతో 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 367 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో సిరాజ్తో పాటు ప్రసిద్ద్ కృష్ణ 8 వికెట్లతో సత్తాచాటాడు.చదవండి: ENG Vs IND: క్రికెట్ చరిత్రలో అత్యంత సాహసోపేతమైన ఎంట్రీ.. ఒంటిచేత్తో బ్యాటింగ్కు దిగిన వోక్స్ -
వాహ్ సిరాజ్ మియా.. చిరకాలం గుర్తుండిపోయేలా చేశావు..!
ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్ట్లో టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ మ్యాచ్లో ఐదు వికెట్ల ప్రదర్శన సహా మొత్తం 9 వికెట్లు తీసిన సిరాజ్.. ఆట చివరి రోజు అద్బుతం చేశాడు. ఇంగ్లండ్ గెలుపుకు 35 పరుగులు అవసరమైన దశలో తనలోని అత్యుత్తమ టాలెంట్ను వెలికి తీసి ఇంగ్లండ్ గెలుపును అడ్డుకున్నాడు. చివరి రోజు ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ చేతిలో 4 వికెట్లు ఉండగా.. సిరాజ్ మ్యాజిక్ స్పెల్తో మూడు వికెట్లు తీశాడు. మరో వికెట్ను ప్రసిద్ద్ కృష్ణ పడగొట్టాడు.దీంతో ఇంగ్లండ్ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్ను 2-2తో డ్రా చేసుకుంది. ఈ సిరీస్ మొత్తంలో సిరాజ్ విశేషంగా రాణించాడు. 5 మ్యాచ్ల్లో 23 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఈ సిరీస్లో అత్యధిక బంతులు వేసిన బౌలర్ కూడా సిరాజే.374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ హ్యారీ బ్రూక్ (111), జో రూట్ (105) సెంచరీలతో చెలరేగడంతో ఓ దశలో సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే భారత పేసర్లు అనూహ్యంగా పుంజుకోవడంతో చివరి 7 వికెట్లు 66 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. సిరాజ్ చిరకాలం గర్తుండిపోయే స్పెల్ వేసి టీమిండియా అపూర్వ విజయాన్నిందించాడు. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఈ సిరీస్లో ఇంగ్లండ్ 1,3 మ్యాచ్లు గెలువగా.. భారత్ 2, 5 మ్యాచ్ల్లో నెగ్గింది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. -
ENG Vs IND: క్రికెట్ చరిత్రలో అత్యంత సాహసోపేతమైన ఎంట్రీ.. ఒంటిచేత్తో బ్యాటింగ్కు దిగిన వోక్స్
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఎంట్రీకి వేదికైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఆటగాడు క్రిస్ వోక్స్ భుజం విరిగినప్పటికీ ఒంటిచేత్తో బ్యాటింగ్కు దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆట చివరి రోజు ఇంగ్లండ్ గెలుపుకు 18 పరుగులు అవసరమైన దశలో వోక్స్ 11వ నంబర్ ఆటగాడిగా ఎంట్రీ ఇచ్చాడు. అతని ఎంట్రీ సినిమా ఎలివేషన్ను తలపించింది.వోక్స్ బ్యాటింగ్ చేయలేకపోయినా స్ట్రయిక్ రొటేట్ చేసి ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నించాడు. అయితే దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ భారత్ చేతిలో 6 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఫలితంగా భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్ను 2-2తో సమం చేసుకుంది.ఇదే సిరీస్ నాలుగో టెస్ట్లో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ కూడా పాదం ఫ్రాక్చర్ అయినప్పటికీ జట్టు ప్రయోజనాల కోసం బరిలోకి దిగి అందరి మన్ననలు అందుకున్నాడు. 1984లో విండీస్ ఆటగాడు మాల్కమ్ మార్షల్ కూడా వోక్స్ తరహాలోనే ఒంటిచేత్తో బ్యాటింగ్కు దిగాడు. ఇంగ్లండ్తో జరిగిన ఆ మ్యాచ్లో మార్షల్ ఒంటిచేత్తో బౌండరీ బాదిన సన్నివేశాన్ని క్రికెట్ ప్రపంచం ఎన్నటికీ మరిచిపోదు.Arm in a sling, Chris Woakes has arrived to the crease 😱 pic.twitter.com/D4QDscnfXE— Sky Sports Cricket (@SkyCricket) August 4, 2025మ్యాచ్ విషయానికొస్తే.. ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్ట్ హోరాహోరీగా సాగింది. 374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ వీరోచితంగా పోరాడినప్పటికీ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. హ్యారీ బ్రూక్ (111), జో రూట్ (105) అద్బుతమైన శతకాలతో గెలుపుకు గట్టి పునాది వేసినా చివరి వరుస బ్యాటర్లు విఫలం కావడంతో ఇంగ్లండ్కు ఓటమి తప్పలేదు. టీమిండియా పేసర్లు అద్బుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేశారు. ముఖ్యంగా సిరాజ్ చివరి రోజు సింహంలా గర్జించి ముగ్గురు ఇంగ్లండ్ బ్యాటర్లను ఔట్ చేశాడు. ఈ ఇన్నింగ్స్లో సిరాజ్ మొత్తంగా ఐదు వికెట్లు తీశాడు. అతనికి ప్రసిద్ద్ కృష్ణ (27-3-126-4), ఆకాశ్దీప్ (20-4-85-1) సహకరించాడు.అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఈ సిరీస్లో ఇంగ్లండ్ 1,3 మ్యాచ్లు గెలువగా.. భారత్ 2, 5 మ్యాచ్ల్లో నెగ్గింది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. -
IND Vs ENG: సిరాజ్ అద్భుతం.. ఐదో టెస్టులో టీమిండియా సంచలన విజయం
లండన్లోని ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్టులో 6 పరుగుల తేడాతో టీమిండియా సంచలన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీని 2-2తో భారత్ సమం చేసింది. 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 367 పరుగులకు ఆలౌటైంది.ఆఖరి రోజు ఆటలో భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అద్భుతం చేశాడు. ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు.. సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. ఓవరాల్గా సిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు ప్రసిద్ద్ కృష్ణ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.రూట్, బ్రూక్ సెంచరీలు వృథా..ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(105), హ్యారీ బ్రూక్(111) అద్బుతమైన సెంచరీలతో రాణించారు. ఓ దశలో వీరిద్దరూ తమ జట్టును సునయాసంగా గెలిపించేలా కన్పించారు. కానీ ప్రత్యర్ధి జట్టు వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో కథ తారుమారైంది.ఇంగ్లండ్ ఓటమిపాలవ్వడంతో రూట్, బ్రూక్ సెంచరీలు వృథా అయిపోయాయి. కాగా తొలి ఇన్నింగ్స్లో భారత్ 224 పరుగులు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్ను 247 పరుగులకు ముగించింది. ఆ తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్లో మాత్రం భారత్ అదరగొట్టింది. యశస్వి జైశ్వాల్(118) సెంచరీ, ఆకాష్ దీప్(66), రవీంద్ర జడేజా(53), వాషింగ్టన్ సుందర్(53) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ 396 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్కు 374 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్ధేశించింది. ఈ భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు చేధించడంలో చతికలపడింది.చదవండి: IND vs ENG: ప్రతీకారం తీర్చుకున్న సిరాజ్.. ఓవల్లో భారత్ చారిత్రత్మక విజయం -
ప్రసిద్ద్ కృష్ణకు సారీ చెప్పిన సిరాజ్.. వీడియో వైరల్!
లండన్లోని ఓవల్ మైదానం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు రసవత్తర ముగింపునకు చేరుకుంది. ఆఖరి రోజు ఆటలో భారత్ విజయానికి 4 వికెట్లు అవసరమవ్వగా.. ఇంగ్లడ్ తమ గెలుపునకు 35 పరుగులు దూరం నిలిచింది.తొలి సెషన్లో మ్యాచ్ ఫలితం తేలిపోనుంది. ప్రస్తుతం క్రీజులో జేమీ స్మిత్(2), జేమి ఓవర్టన్(0) ఉన్నారు. ఇంగ్లండ్ను ఎలాగైనా ఆలౌట్ చేసి సిరీస్ను సమం చేయాలని పట్టుదలతో భారత బౌలర్లు ఉన్నారు.అయితే మ్యాచ్ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ చిన్న తప్పిదంతో విలన్గా మారిపోయాడు. తన బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లను బోల్తా కొట్టించిన సిరాజ్.. ఫీల్డింగ్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు.కొంపముంచిన సిరాజ్..సెకెండ్ ఇన్నింగ్స్లో విధ్వంసకర సెంచరీతో చెలరేగిన ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్కు ఆరంభంలోనే సిరాజ్ లైఫ్ ఇచ్చేశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 35వ ఓవర్ వేసిన ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో తొలి బంతిని హ్యారీ బ్రూక్ ఫైన్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు. అక్కడే ఉన్న సిరాజ్ మియా క్యాచ్ను అందుకున్నాడు.అయితే క్యాచ్ను అందుకున్న సిరాజ్ తన వెనకే ఉన్న బౌండరీ రోప్ను టచ్ చేశాడు. దీంతో బ్యాటర్కు ఆరు పరుగులు లభించాయి. 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న బ్రూక్.. ఏకంగా 111 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.తర్వాత ప్రసిద్ద్ కృష్ణ వద్దకు సిరాజ్ వెళ్లి క్షమాపణలు చెప్పాడు. ప్రసిద్ద్ కృష్ణ నవ్వుతూ సిరాజ్ను హగ్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే యాదృచ్ఛికంగా బ్రూక్ మళ్లీ సిరాజ్కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.Prasidh Krishna was all of us, watching it unfold 😥 #SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/jB138cMO13— Sony Sports Network (@SonySportsNetwk) August 3, 2025 -
IND VS ENG: 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి..!
భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న 5 టెస్ట్ల టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ-2025 రికార్డులకు అడ్డాగా మారింది. ఈ సిరీస్లో ఏళ్ల నాటి రికార్డులు తిరగరాయబడ్డాయి. కొన్ని విభాగాల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పబడ్డాయి. ఐదో టెస్ట్లో రికార్డుల పరంపర తారాస్థాయికి చేరింది.ఈ మ్యాచ్ నాలుగో రోజు సరికొత్త చరిత్ర సృష్టించబడింది. ఈ సిరీస్లో ఏకంగా 9 మంది బ్యాటర్లు 400 ప్లస్ పరుగులు చేశారు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ సిరీస్లోనూ ఇంత మంది 400 ప్లస్ పరుగులు చేయలేదు.ఈ సిరీస్లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ అత్యధికంగా 754 పరుగులు చేశాడు. గిల్ తర్వాత జో రూట్ (537), కేఎల్ రాహుల్ (532), రవీంద్ర జడేజా (516), హ్యారీ బ్రూక్ (481), రిషబ్ పంత్ (479), బెన్ డకెట్ (462), జేమీ స్మిత్ (434), యశస్వి జైస్వాల్ (411) 400 ప్లస్ పరుగులు చేశారు.గతంలో ఇలా..!వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన 1975-76 సిరీస్లో ఇరు జట్లకు చెందిన 8 మంది బ్యాటర్లు 400 ప్లస్ పరుగులు చేశారు. ఆతర్వాత 1993 యాషెస్ సిరీస్లోనూ ఇదే ఫీట్ రిపైటైంది. అయితే 9 మంది 400 ప్లస్ పరుగులు నమోదు చేయడం మాత్రం ఇదే మొదటిసారి.భారత క్రికెట్ చరిత్రలోనూ ఇదే మొదటిసారిఈ సిరీస్లో ఏకంగా ముగ్గురు భారత బ్యాటర్లు (గిల్, రాహుల్, జడేజా) 500 ప్లస్ పరుగులు చేయడం మరో విశేషం. 93 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఫీట్ నమోదు కాలేదు.మ్యాచ్ విషయానికొస్తే.. ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్ చివరి రోజు ఇంగ్లండ్ గెలవాలంటే 35 పరుగులు, భారత్ గెలుపుకు నాలుగు వికెట్లు కావాలి. నాలుగో రోజు వెలుతురులేమి కారణంగా ఆటను గంట ముందుగా నిలిపి వేశారు.374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. జేమీ ఓవర్టన్ (0), జేమీ స్మిత్ (2) క్రీజ్లో ఉన్నారు. ఈ సిరీస్లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. 1, 3 టెస్ట్ల్లో ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో టెస్ట్ గెలిచింది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. స్కోర్ వివరాలు..భారత్ 224 & 396ఇంగ్లండ్ 247 & 339/6 (76.2) -
ENG VS IND 5th Test: అరుదైన ఘనత సాధించిన సిరాజ్
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ సిరీస్లో 1000 బంతులు వేసిన తొలి బౌలర్గా (ఇరు జట్ల తరఫున) అవతరించాడు. అలాగే 2002 జూన్ నుంచి ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ల్లో అత్యధిక బంతులు బౌల్ చేసిన భారత ఫాస్ట్ బౌలర్గానూ నిలిచాడు. ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్లో ఈ ఘనతలు సాధించాడు. ఈ సిరీస్లో సిరాజ్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గానూ కొనసాగుతున్నాడు. 5 మ్యాచ్ల్లో సిరాజ్ 20 వికెట్లు పడగొట్టాడు.ఐదో టెస్ట్ విషయానికొస్తే.. రసవత్తరంగా సాగుతున్న ఈ మ్యాచ్లో చివరి రోజు ఇంగ్లండ్ గెలవాలంటే 35 పరుగులు, భారత్ గెలుపుకు నాలుగు వికెట్లు కావాలి. నాలుగో రోజు వెలుతురులేమి కారణంగా ఆటను గంట ముందుగా నిలిపి వేశారు.374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27), బ్రూక్ (111), జో రూట్ (105), జేకబ్ బేతెల్ (5) ఔట్ కాగా.. జేమీ స్మిత్ (2), జేమీ ఓవర్టన్ (0) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ 3, సిరాజ్ 2, ఆకాశ్దీప్ ఓ వికెట్ తీశారు.అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది. -
ENG VS IND 5th Test: ఇంగ్లండ్ జట్టుకు శుభవార్త
భారత్-ఇంగ్లండ్ మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్ చివరి రోజు ఇంగ్లండ్ గెలవాలంటే 35 పరుగులు, భారత్ గెలుపుకు నాలుగు వికెట్లు కావాలి. నాలుగో రోజు వెలుతురులేమి కారణంగా ఆటను గంట ముందుగా నిలిపి వేశారు.374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. జేమీ ఓవర్టన్ (0), జేమీ స్మిత్ (2) క్రీజ్లో ఉన్నారు.అంత ఈజీ కాదుఐదో రోజు ఇంగ్లండ్ ఛేదించాల్సిన లక్ష్యం 35 పరుగులే అయినప్పటికీ ఇది అంత ఈజీ కాదు. 22 బంతుల తర్వాత భారత బౌలర్ల చేతికి కొత్త బంతి వస్తుంది. కొత్త బంతితో భారత బౌలర్లను ఎదుర్కోవడం ఇంగ్లండ్ టెయిలెండర్లకు కత్తి మీద సామే అవుతుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా వికెట్ సమర్పించుకోక తప్పదు.ఇలాంటి పరిస్థితుల్లో భారత పేసర్లు సర్వశక్తులు ఒడ్డి వికెట్ల కోసం ప్రయత్నిస్తారు. నాలుగో రోజు చివర్లోనే సిరాజ్, ప్రసిద్ద్ లయను అందుకున్నారు. ఐదో రోజు ఆరంభంలోనే వికెట్ పడితే ఇంగ్లండ్పై తీవ్రమైన ఒత్తిడి వస్తుంది. క్రీజ్లో ఉన్న ఆటగాళ్లలో జేమీ స్మిత్ను తప్పిస్తే ఆట భారత్వైపుకు మళ్లే అవకాశం లేకపోలేదు.ఇంగ్లండ్కు శుభవార్తఈ పరిస్థితుల్లో ఇంగ్లండ్ జట్టుకు శుభవార్త వినిపించింది. తొలి రోజు ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన క్రిస్ వోక్స్ అవసరమైతే బ్యాటింగ్కు వస్తాడని జో రూట్ తెలిపాడు. వోక్స్కు ఎడమ భుజం మిస్ లొకేట్ అయినప్పటికీ జట్టు కోసం గాయాన్ని లెక్క చేయకుండా బ్యాటింగ్కు వస్తాడని రూట్ స్పష్టం చేశాడు. అయినా, మ్యాచ్ అంతవరకు (వోక్స్ బ్యాటింగ్ చేసేంత వరకు) వస్తుందని అనుకోవట్లేదని రూట్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా, ఈ సిరీస్ నాలుగో టెస్ట్లో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ కూడా గాయాన్ని (విరిగిన పాదం) లెక్క చేయకుండా బ్యాటింగ్కు దిగిన విషయం తెలిసిందే.బ్రూక్, రూట్ సెంచరీలు భారీ లక్ష్య ఛేదనలో బ్రూక్ (111), జో రూట్ (105) సెంచరీలు చేసి ఇంగ్లండ్ను గెలుపుతీరాల వరకు తీసుకెళ్లారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడంతో ఇంగ్లండ్ డిఫెన్స్లో పడింది. 36 పరుగుల వ్యవధిలో ఇంగ్లండ్ బ్రూక్, రూట్తో పాటు జేకబ్ బేతెల్ వికెట్ కూడా కోల్పోయి తడబాటుకు లోనైంది. జైస్వాల్ సూపర్ శతకంఅంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్లో 396 పరుగులకు ఆలౌటై, ఇంగ్లండ్కు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది. -
India vs England: ఇంకా ఉంది!
ఆఖరి టెస్టుకు, ఐదు మ్యాచ్ల సిరీస్కు నాలుగో రోజే తెరపడాలి. కానీ వెలుతురు మందగించడంతో ఆగిన ఆట... తర్వాత జోరు వాన కురవడంతో ఎంతకీ కొనసాగలేదు. నాటకీయ ముగింపునకు తెరలేచిన ఈ పోరు తుది ఫలితం నేటికి వాయిదా పడింది. ఆతిథ్య ఇంగ్లండ్ 3–1 ఆధిక్యంతో సిరీస్ గెలుచుకునేందుకు మరో 35 పరుగుల దూరంతో దగ్గరైంది. అలాగే భారత్ కూడా 2–2తో సమం చేసేందుకు అంతే దగ్గరగా ఉంది. ప్రధాన బ్యాటర్లంతా అవుట్కాగా 35 పరుగులు చేసేలోపు 4 వికెట్లు తీస్తే టీమిండియా సమం చేసుకొని సగర్వంగా తిరిగొస్తుంది. లండన్: నాటకీయత మొదలవగానే... ఉత్కంఠ అంతకంతకు పెరగకముందే... ప్రతికూల వాతావరణం ఆటకు ‘రెడ్ సిగ్నల్’ ఇవ్వడంతో ‘టెండూల్కర్–అండర్సన్ ట్రోఫీ’ సిరీస్ ఫలితం నాలుగో రోజు తేలలేదు. ఇన్నాళ్లు జరిగిన నాలుగు టెస్టుల అసలు మజా కంటే చివరి ఐదో టెస్టు ‘కొసరే’ ఇరు జట్లను ఊరిస్తోంది. ఇంగ్లండ్ 374 పరుగులు ఛేదన కాస్తా 35 పరుగుల దూరంలో నిలిచింది. వర్షంతో ఆట నిలిచే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 76.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (98 బంతుల్లో 111; 14 ఫోర్లు, 2 సిక్స్లు), జో రూట్ (152 బంతుల్లో 105; 12 ఫోర్లు) శతక్కొట్టారు. జేమీ స్మిత్ (2 బ్యాటింగ్), ఓవర్టన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 3, సిరాజ్ 2 వికెట్లు తీశారు. ఆకాశ్దీప్కు ఒక వికెట్ దక్కింది. ‘టాప్’ లేపడంతో ఉత్సాహం తొలి సెషన్ భారత శిబిరంలో ఉత్సాహం నింపింది. లక్ష్యఛేదన జట్టులోని ఇద్దరు టాపార్డర్ బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ఓవర్నైట్ స్కోరు 50/1తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన డకెట్ (54, 6 ఫోరు), కెప్టెన్ ఒలీ పోప్ (34 బంతుల్లో 27; 5 ఫోర్లు) నిలకడను ప్రదర్శించారు. ఓవర్నైట్ బ్యాటర్ డకెట్ 76 బంతుల్లో తన అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే ప్రసిధ్ కృష్ణ బౌలింగ్లో స్లిప్లో ఉన్న రాహుల్కు క్యాచ్ ఇచ్చి ని్రష్కమించాడు. మళ్లీ ఐదు ఓవర్ల లోపలే సిరాజ్ చక్కని డెలివరీతో కెపె్టన్ పోప్ను ఎల్బీగా అవుట్ చేశాడు. అప్పటికి ఇంగ్లండ్ 106/3 స్కోరే చేసింది. తర్వాత రూట్, బ్రూక్ పరుగుల బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. తొలి సెషన్లోనే బ్రూక్ అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడి భారత బౌలర్లకు మింగుడుపడిని ఇన్నింగ్స్కు శ్రీకారం చుట్టేశాడు. ఇంగ్లండ్ 164/3 వద్ద లంచ్ బ్రేక్కు వెళ్లింది. బ్రూక్, రూట్ శతకాలు నాలుగో ఇన్నింగ్స్లో తొలి సెషన్లోనే రెండు కీలక వికెట్లు పడిపోవడం బౌలింగ్ జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచుతుంది. అయితే క్రీజులో పాతుకుపోయిన రూట్తో అందివచ్చిన అవకాశాన్ని సది్వనియోగం చేసుకున్న బ్రూక్ సాఫీగా పరుగులు సాధిస్తుండటంతో భారత శిబిరంలోని ఆత్మవిశ్వాసం కాస్తా సన్నగిల్లింది. ఇదే అదనుగా ఇద్దరు లక్ష్యాన్ని కరిగించే పనినిలో ముందడుగు వేశారు. ఈ సెషన్ భారత్ ఆశల్ని చిదిమింది. వన్డేను తలపించే ఆటతీరుతో బ్రూక్ 91 బంతుల్లోనే శతకం సాధించాడు. అతను ని్రష్కమించాక... ఆఖరి సెషన్లో రూట్ 137 బంతుల్లో సెంచరీ చేశాడు. లక్ష్యానికి చేరువైన దశలో బెథెల్ (5), రూట్ అవుటవడంతోనే డ్రామా మొదలైంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 224; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 247; భారత్ రెండో ఇన్నింగ్స్: 396; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (బి) సిరాజ్ 14; డకెట్ (సి) రాహుల్ (బి) ప్రసిధ్కృష్ణ 54; పోప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 27; రూట్ (సి) జురేల్ (బి) ప్రసి«ద్ 105; బ్రూక్ (సి) సిరాజ్ (బి) ఆకాశ్దీప్ 111; బెథెల్ (బి) ప్రసి«ద్కృష్ణ 5; స్మిత్ బ్యాటింగ్ 2; ఓవర్టన్ బ్యాటింగ్ 0; ఎక్స్ట్రాలు 21; మొత్తం (76.2 ఓవర్లలో 6 వికెట్లకు) 339. వికెట్ల పతనం: 1–50, 2–82, 3–106, 4–301, 5–332, 6–337. బౌలింగ్: ఆకాశ్దీప్ 20–4–85–1, ప్రసి«ద్కృష్ణ 22.2–3–109–3, సిరాజ్ 26–5–95–2, సుందర్ 4–0–19–0, జడేజా 4–0–22–0. -
ENG VS IND 5th Test Day 4: నిలిచిపోయిన ఆట
భారత్-ఇంగ్లండ్ మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ఇంగ్లండ్ గెలుపునకు 35 పరుగుల దూరంలో ఉన్నప్పుడు వెలుతురులేమి వల్ల మ్యాచ్ నిలిచిపోయింది. ఆతర్వాత భారీ వర్షం మొదలైంది. దీంతో మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పేశారు. ఆటగాళ్లంతా డ్రెస్సింగ్ రూమ్ల్లో సేద తీరుతున్నారు.ఆట నిలిచిపోయే సమయానికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27), బ్రూక్ (111), జో రూట్ (105), జేకబ్ బేతెల్ (5() ఔట్ కాగా.. జేమీ స్మిత్ (2), జేమీ ఓవర్టన్ (0) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలుపుకు 35 పరుగులు, భారత గెలుపుకు 4 వికెట్లు కావాలి.అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్లో 396 పరుగులకు ఆలౌటై, ఇంగ్లండ్కు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది. -
శతక్కొట్టిన బ్రూక్.. సెంచరీకి చేరువలో రూట్.. గెలుపు దిశగా ఇంగ్లండ్
భారత్తో జరుగుతున్న ఐదో టెస్ట్లో ఇంగ్లండ్ గెలుపు దిశగా సాగుతోంది. 374 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ నాలుగో రోజు టీ విరామం సమయానికి 4 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసి, లక్ష్యానికి మరో 57 పరుగుల దూరంలో ఉంది.హ్యారీ బ్రూక్ (98 బంతుల్లో 111; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర శతకం బాది ఇంగ్లండ్ గెలుపుకు గట్టి పునాది వేయగా.. రూట్ (98 నాటౌట్) సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఉన్నాడు. రూట్కు జతగా జేకబ్ బేతెల్ (1) క్రీజ్లో ఉన్నాడు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27), బ్రూక్ (111) ఔటయ్యారు. భారత బౌలర్లలో సిరాజ్ 2, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్దీప్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 5 వికెట్లు (గాయం కారణంగా వోక్స్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు) తీయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యంగా కనిపిస్తుంది. ఏదైన అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్ల భారత్ గెలవలేదు. ఈ మ్యాచ్లో ఓడితే భారత్ సిరీస్ను కూడా కోల్పోతుంది (1-3లో).అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది. -
చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలో తొలి ఆటగాడు
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో 6000 పరుగులు (69 మ్యాచ్ల్లో) పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. భారత్తో జరుగుతున్న ఐదో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో రూట్ ఈ ఘనత సాధించాడు.టీమిండియా నిర్దేశించిన 374 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. 25 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ డబ్ల్యూటీసీలో 6000 పరుగుల మైలురాయిని తాకాడు.డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ స్మిత్ (4278), మార్నస్ లబూషేన్ (4225), బెన్ స్టోక్స్ (3616), ట్రవిస్ హెడ్ (3300) రూట్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రూట్ డబ్ల్యూటీసీలో 20 సెంచరీలు, 22 అర్ద సెంచరీలు చేయడం గమనార్హం.మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ నిర్దేశించిన లక్ష్యానికి ఇంగ్లండ్ మరో 81 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. హ్యారీ బ్రూక్ (103) అద్భుతమైన సెంచరీతో ఇంగ్లండ్ గెలుపుకు బాటలు వేస్తున్నాడు. రూట్ 83 పరుగుల వద్ద బ్యాటింగ్ను కొనసాగిస్తూ అతనికి సహకరిస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ స్కోర్ 293/3గా ఉంది.క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27) ఔట్ కాగా.. జో రూట్ (59), బ్రూక్ (82) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో సిరాజ్ 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో భారత్ గెలుపుకు కేవలం 6 వికెట్లు (గాయం కారణంగా వోక్స్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు) కావాలి.అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది. -
చరిత్ర సృష్టించిన భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్
భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెండూల్కర్-ఆండర్సన్ టెస్ట్ సిరీస్ రికార్డుపుటల్లోకెక్కింది. ఈ సిరీస్లో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు ఏకంగా 50 అర్ద సెంచరీలు బాదారు. టెస్ట్ క్రికెట్ ఆరంభం నుంచి ఓ సిరీస్లో అత్యధిక హాఫ్ సెంచరీల సంఖ్య ఇదే. 1993 యాషెస్ సిరీస్లోనూ ఇన్నే హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి. తాజాగా టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ ఆల్టైమ్ రికార్డును సమం చేసింది. ఐదో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ చేసిన హాఫ్ సెంచరీ ఈ సిరీస్లో 50వది.టెస్ట్ సిరీస్లో అత్యధిక వ్యక్తిగత 50+ స్కోర్లు50* - ఇంగ్లండ్లో టీమిండియా, 202550 - ది యాషెస్, 199349 - ది యాషెస్, 1920/2146 - ఆస్ట్రేలియాలో వెస్టిండీస్, 1960/6146 - ఆస్ట్రేలియాలో వెస్టిండీస్ 1968/69మ్యాచ్ విషయానికొస్తే.. 374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ గెలుపు దిశగా సాగుతోంది. నాలుగో రోజు రెండో సెషన్ డ్రింక్స్ విరామ సమయానికి ఇంగ్లండ్ లక్ష్యానికి ఇంకా 128 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. ఆ జట్టు స్కోర్ సెకెండ్ ఇన్నింగ్స్లో 246/3గా ఉంది.క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27) ఔట్ కాగా.. జో రూట్ (59), బ్రూక్ (82) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో సిరాజ్ 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో భారత్ గెలుపుకు కేవలం 6 వికెట్లు (గాయం కారణంగా వోక్స్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు) కావాలి.అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది. -
ENG VS IND 5th Test: కోహ్లిని దాటేసిన రాహుల్
టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో దుమ్మురేపుతున్నాడు. బ్యాటింగ్లో 10 ఇన్నింగ్స్ల్లో 532 పరుగులు చేసి సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ సిరీస్లో రాహుల్ ఫీల్డర్గానూ సత్తా చాటాడు. 5 మ్యాచ్ల్లో 6 క్యాచ్లు (ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్ ఇంకా కొనసాగుతుంది) పట్టాడు. స్లిప్స్లో రాహుల్ చాలా అలర్ట్గా ఉంటూ ఇంగ్లండ్ బ్యాటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు.KL RAHUL HAS BEEN FANTASTIC IN SLIPS...!!! 💪 pic.twitter.com/juvyI9uH5R— Johns. (@CricCrazyJohns) August 3, 2025ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్లో రాహుల్ బెన్ డకెట్ (ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో) క్యాచ్ పట్టడంతో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిని అధిగమించాడు. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక క్యాచ్లు పట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో రాహుల్ కోహ్లిని వెనక్కు నెట్టాడు. ఇంగ్లండ్లో కోహ్లి టెస్ట్ల్లో 25 క్యాచ్లు పడితే.. తాజాగా రాహుల్ తన క్యాచ్ల సంఖ్యను 26కు పెంచుకున్నాడు. ఈ విభాగంలో సునీల్ గవాస్కర్ (35), రాహుల్ ద్రవిడ్ (30) మాత్రమే రాహుల్ ముందున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. 374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓ మోస్తరుగా ఆడుతుంది. నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి 3 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27) ఔట్ కాగా.. జో రూట్ (23), బ్రూక్ (38) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో సిరాజ్ 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలంటే ఇంకా 210 పరుగులు చేయాలి. అదే భారత్ గెలుపుకు కేవలం 6 వికెట్లు (గాయం కారణంగా వోక్స్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు) కావాలి. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది. -
ENG VS IND 5th Test: సెంచరీ పూర్తి చేసిన సిరాజ్.. విదేశాల్లో మొనగాడు
ఓవల్ టెస్ట్లో భారత్ పట్టు సాధించింది. ఈ మ్యాచ్లో గెలవాలంటే భారత్ మరో 9 వికెట్లు తీయాలి. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ఇదే మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 324 పరుగులు చేయాలి. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోయి 50 పరుగులు చేసింది. బెన్ డకెట్ 34 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. సిరాజ్ అద్బుతమైన బంతిలో జాక్ క్రాలేను (14) క్లీన్ బౌల్డ్ చేశాడు.క్రాలే వికెట్తో సిరాజ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. విదేశీ టెస్ట్ల్లో సిరాజ్ 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఈ మైలురాయిని సిరాజ్ కేవలం 27 టెస్ట్ల్లో తాకాడు. టెస్ట్ కెరీర్లో మొత్తంగా 119 వికెట్లు తీసిన సిరాజ్ విదేశాల్లోనే సింహభాగం వికెట్లు తీసి ఓవర్సీస్ మొనగాడనిపించుకున్నాడు. సిరాజ్ స్వదేశంలో కేవలం 19 వికెట్లు (14 మ్యాచ్ల్లో) సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ రెండో ఇన్నింగ్స్లో 396 పరుగులు చేసి ఇంగ్లండ్కు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది. -
టీమిండియాతో ఐదో టెస్టు.. 123 ఏళ్ల చరిత్రను ఇంగ్లండ్ తిరగరాస్తుందా?
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలోని ఆఖరి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఈ ఐదో టెస్టులో భారత్ తమ విజయానికి తొమ్మిది వికెట్ల దూరంలో నిలవగా.. ఇంగ్లండ్ గెలుపునకు ఇంకా 324 పరుగులు కావాలి. 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 13.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 50 పరుగులు చేసింది.దాదాపు నాలుగో రోజు ఆటలో ఫలితం తేలే అవకాశముంది. ఎలాగైనా ఇంగ్లండ్ను ఆలౌట్ చేసి సిరీస్ను సమంతో ముగించాలని భారత పట్టుదలతో ఉంది. మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ మాత్రం స్కోర్ ఛేజ్ చేసి ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-1 తేడాతో సొంతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో విజయవంతమైన రన్ఛేజ్లపై ఓ లుక్కేద్దాం. కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో 1880లో తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. 145 సంవత్సరాల ఈ మైదానం చరిత్రలో 300 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఒక్కసారి కూడా ఛేదించలేదు.ఇంగ్లండ్ చరిత్రను తిరగరాస్తుందా?ఈ మైదానంలో అత్యధిక రన్ ఛేజ్ చేసిన రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. 1902లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 263 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్లో ఒక్క వికెట్ తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాకు 141 ఆధిక్యం లభిస్తోంది.అయితే రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడంతో పర్యాటక ఆసీస్ జట్టు కేవలం 121 పరుగులకే ఆలౌటైంది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని కలుపునకుని ఇంగ్లండ్ ముందు కంగారులు 263 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. ఈ టార్గెట్ను ఇంగ్లండ్ తొమ్మిది వికెట్లు కోల్పోయి చేధించింది.ఆ తర్వాత ఓవల్లో రెండవ అత్యధిక రన్ చేజ్ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉంది. విండీస్లో 1963లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో విండీస్ 252 పరుగుల లక్ష్యాన్ని చేధించింది.అనంతరం 1972లో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్తో జరిగిన టెస్టులో 242 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. ఇది ఓవల్ మైదానంలో మూడో అత్యంత విజయవంతమైన రన్ చేజ్గా నిలిచింది.ఈ మైదానంలో చివరగా 2024లో శ్రీలంక జట్టు ఇంగ్లండ్పై 219 పరుగుల లక్ష్యాన్ని చేజ్ చేసింది. ఇది ఓవల్లో ఐదో అత్యంత విజయవంతమైన రన్ చేజ్గా నిలిచింది. ఇప్పుడు భారత్ విధించిన లక్ష్యాన్ని ఛేదిస్తే 123 ఏళ్ల చరిత్రను తిరగరాస్తుంది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన జడేజా.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
చరిత్ర సృష్టించిన జడేజా.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా దుమ్ములేపాడు. ది ఓవల్లో జరుగుతున్న ఐదో టెస్టులోనూ జడ్డూ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో జడేజా కీలక హాఫ్ సెంచరీ సాధించాడు.77 బంతుల్లో 5 ఫోర్లతో 53 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో అతడికిది ఆరో హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. మొత్తంగా ఈ సిరీస్లో జడేజా 516 పరుగులతో పాటు 7 వికెట్లు పడగొట్టాడు. తద్వారా జడేజా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.జడేజా సాధించిన రికార్డులు ఇవే..👉ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్టు సిరీస్లో ఆరు లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్కు వచ్చి 6 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా జడ్డూ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ గ్యారీ సోబర్స్ పేరిట ఉండేది. గ్యారీ సోబర్స్ 1966లో ఇంగ్లండ్ పర్యటనలో ఒకే సిరీస్లో ఐదు హాఫ్ సెంచరీలు సాధించారు. తాజా మ్యాచ్తో సోబర్స్ రికార్డును జడ్డూ బ్రేక్ చేశాడు.👉అదేవిధంగా ఓ టెస్టు సిరీస్లో ఆరు లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా సర్ రవీంద్ర జడేజా నిలిచాడు. జడేజా ఈ సిరీస్లో 516 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం వివిఎస్ లక్ష్మణ్ పేరిట ఉండేది. 2002లో వెస్టిండీస్తో సిరీస్లో లక్ష్మణ్ 474 పరుగులు చేశాడు.👉ఇంగ్లండ్ గడ్డపై ఒక సిరీస్లో అత్యధికసార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాడిగా జడేజా( 6 సార్లు) నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత లెజెండ్ సునీల్ గవాస్కర్ పేరిట ఉండేది. గవాస్కర్ 1979లో ఇంగ్లండ్ పర్యటనలో ఒకే సిరీస్లో 5 సార్లు ఏభైకి పైగా స్కోర్లు నమోదు చేశాడు.తొమ్మిది వికెట్ల దూరంలో..కాగా ఓవల్ టెస్టులో భారత్ గెలిచేందుకు 9 వికెట్ల దూరంలో నిలిచింది. 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 13.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 50 పరుగులు చేసింది. అంతకుముందు భారత్ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 396 పరుగులకు ఆలౌటైంది.చదవండి: WCL: డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ.. ఫైనల్లో పాక్ చిత్తు! టైటిల్ సౌతాఫ్రికాదే -
అతడొక లెజెండ్.. కానీ అలా ప్రవర్తిస్తాడని అనుకోలేదు: భారత స్టార్ బౌలర్
ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. బౌలర్లు సత్తా చాటుతున్న మ్యాచ్లో ఇరు జట్లు సమంగా ముందుకు వెళ్తున్నాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(51), ఆకాష్ దీప్(4) ఉన్నారు.ప్రస్తుతం టీమిండియా 52 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే రెండో ఆటలో టీమిండియా పేసర్ ప్రసిద్ద్ కృష్ణ , ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రూట్ను ప్రసిద్ద్ స్లెడ్జింగ్ చేయగా.. అందుకు అతడు సీరియస్గా స్పందించాడు.ప్రసిద్ద్కు భారత ఆటగాళ్లు మద్దతుగా నిలవడంతో మైదానంలో కాసేపు గందరగోళం నెలకొంది. అంపైర్ల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. అయితే రెండో రోజు ఆట అనంతరం ఈ వివాదంపై ప్రసిద్ద్ కృష్ణ స్పందించాడు. తను చేసిన స్లెడ్జింగ్ పై జో రూట్ స్పందన ఆశ్చర్యపరిచిందని కర్ణాటక స్పీడ్ స్టార్ వెల్లడించాడు."జో రూట్ను స్లెడ్జ్ చేయడం మా ప్రణాళికలలో భాగమే. కానీ ఆ చిన్న మాటలకు రూట్ అంత కోపంగా స్పందిస్తాడని నేను ఊహించలేదు. నేను మంచి రిథమ్లో ఉండి బౌలింగ్ చేస్తున్నప్పుడు కొన్ని సార్లు ఇలానే జరుగుతోంది. అంటే బ్యాటర్ ఏకగ్రాతను దెబ్బతీసేందుకు అలా చేస్తాను. నా మాటలకు రియాక్ట్ అయ్యి బ్యాటర్ ఏదైనా తప్పు చేస్తే మాకు వికెట్ వచ్చే అవకాశముంటుంది. ఇదంతా గేమ్లో భాగమే. కానీ జోరూట్ అంటే నాకు చాలా ఇష్టం. మైదానం వెలుపల మేమిద్దరం మంచి స్నేహితులం. అతొడక లెజెండరీ క్రికెటర్. ఇదొక చిన్న విషయం. ఈ విషయం ఇక్కడతో వదిలేయండి" అంటూ రెండో రోజు ఆట అనంతరం కృష్ణ ప్రెస్కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. కాగా తొలి ఇన్నింగ్స్లో ప్రసిద్ద్ కృష్ణ నాలుగు వికెట్లు పడగొట్టాడు.చదవండి: IND vs ENG: చూస్తూ ఊరుకోవాలా? అంపైర్పై కేఎల్ రాహుల్ ఫైర్! వీడియో వైరల్🔥"You want us to just bat, bowl & go home?"🔥KL Rahul BLASTS at umpire Dharmasena in fiery defence of Prasidh Krishna! 😤⚡Tension hits the roof as Rahul says, "What do you want us to do, keep quiet?" 🗣️💥Captain steps up. Drama unfolds. Cricket gets REAL! 🏏🔥#KLRahul… pic.twitter.com/KaID8ddhda— Nihar Ranjan (@Niharra98749805) August 1, 2025 -
చూస్తూ ఊరుకోవాలా? అంపైర్పై కేఎల్ రాహుల్ ఫైర్! వీడియో వైరల్
ది ఓవల్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో ఆటతో పాటు మాటలు కూడా హైలెట్గా నిలుస్తున్నాయి. రెండో రోజు ఆట సందర్బంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ను ఔట్ చేసిన అనంతరం ఆకాష్ దీప్ అతడి భుజంపై చెయ్యి వేసి మరి సెంఢాప్ ఇవ్వడం.. మైదానంలో ప్రశాంతంగా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే జో రూట్, ప్రసిద్ధ్ కృష్ణతో గొడవపడడం వంటి సంఘటనలు జరిగాయి. అంతేకాకుండా భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సైతం ఆన్ఫీల్డ్ అంపైర్ కుమార ధర్మసేనతో మాటల యుద్దానికి దిగాడు.అసలేమి జరిగిందంటే?ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 22వ ఓవర్ వేసిన ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో జో రూట్.. ఐదో బంతిని థర్డ్ మ్యాన్ మీదుగా బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలో రూట్ వైపు చూస్తూ ప్రసిద్ద్ ఏదో అన్నాడు. దీంతో రూట్ కూడా బదులుగా కృష్ణపై సీరియస్ అయ్యాడు.అంతేకాకుండా రూట్ అంపైర్కు కూడా ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ప్రసిద్ద్ మద్దతుగా కేఎల్ రాహుల్ నిలిచాడు. గొడవ దేని గురించి అని తెలుసుకోవడానికి కుమార్ ధర్మసేనతో రాహుల్ మాట్లాడాడు. కానీ ధర్మసేన ఇచ్చిన సమాధానంపై కేఎల్ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో కాసేపు అంపైర్తో రాహుల్ వాదించాడు. ఆ తర్వాత ఎవరి ఫీల్డింగ్ స్దానాలకు వారు వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగింది.అంపైర్-రాహుల్ మధ్య జరిగిన సంభాషణ ఇదే..రాహుల్: మమ్మల్ని ఏం చేయమంటారు? నిశ్శబ్దంగా ఉండమంటారా?ధర్మసేన: ఏ బౌలర్ అయినా నీ దగ్గరికి వచ్చి గొడవ పడితే నీకు నచ్చుతుందా రాహుల్? ప్రసిద్ద్ అలా చేయడం కరక్ట్ కాదు. మనం అలా ప్రవర్తించకూడదు.రాహుల్: అవతలి వ్యక్తి మమ్మల్ని దూషిస్తే.. చూస్తూ ఊరుకోవాలా? బ్యాటింగ్, బౌలింగ్ చేసి ఇంటికి వెళ్లమంటారా?ధర్మసేన: మ్యాచ్ ముగిశాక మనం మాట్లాడదాం. నువ్వు అలా మాట్లాడడం మాత్రం సరికాదుఈ సంభాషణంతా స్టంప్ మైక్లో రికార్డైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(51), ఆకాష్ దీప్(4) ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 52 పరుగుల ఆధిక్యంలో ఉంది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్..🔥"You want us to just bat, bowl & go home?"🔥KL Rahul BLASTS at umpire Dharmasena in fiery defence of Prasidh Krishna! 😤⚡Tension hits the roof as Rahul says, "What do you want us to do, keep quiet?" 🗣️💥Captain steps up. Drama unfolds. Cricket gets REAL! 🏏🔥#KLRahul… pic.twitter.com/KaID8ddhda— Nihar Ranjan (@Niharra98749805) August 1, 2025 -
IND vs ENG: చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్..
ఓవల్ వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. వరుసగా రెండో రోజును బౌలర్లు శాసించారు. తొలి సెషన్లో ఇంగ్లండ్ బ్యాటర్లు అధిపత్యం చెలాయించినప్పటికి.. లంచ్ విరామం తర్వాత భారత బౌలర్లు అద్బుతమైన కమ్బ్యాక్ ఇచ్చారు.ముఖ్యంగా హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ బంతితో మ్యాజిక్ చేశాడు. మొదటి సెషన్లో భారీగా పరుగులు సమర్పించుకున్న సిరాజ్.. రెండో సెషన్లో మాత్రం ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. సంచలన బంతులతో ఇంగ్లీష్ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు.మొత్తంగా 16.2 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్, 86 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది. సిరాజ్తో పాటు ప్రసిద్ద్ కృష్ణ నాలుగు వికెట్లు పడగొట్టాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది.భారత్ ప్రస్తుతం 52 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఆఖరి టెస్టులో నాలుగు వికెట్లతో చెలరేగిన సిరాజ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.బుమ్రా రికార్డు బద్దలు..ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక ఫోర్ వికెట్ల హాల్స్ సాధించిన భారత బౌలర్గా బుమ్రాను సిరాజ్ అధిగమించాడు. సిరాజ్ మియా ఇప్పటివరకు ఇంగ్లండ్లో 11 టెస్టులు ఆడి ఆరు సార్లు 4 వికెట్ల హాల్ సాధించాడు. 2021లో లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన టెస్టు రెండు ఇన్నింగ్స్లలోనూ సిరాజ్ నాలుగు వికెట్ల ఘనత సాధించాడు. ఆ తర్వాత 2022లో ఎడ్జ్బాస్టన్, 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో 4 వికెట్లను సిరాజ్ పడగొట్టాడు. అదేవిధంగా ప్రస్తుత సిరీస్లో బర్మింగ్హామ్లో నాలుగుకు పైగా వికెట్లు తీసిన సిరాజ్.. మళ్లీ ఇప్పుడు ఓవల్ టెస్టులో 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఈ రేర్ ఫీట్ను తన పేరిట లిఖించుకున్నాడు. కాగా బుమ్రా ఇప్పటివరకు ఇంగ్లండ్ గడ్డపై 5 సార్లు 4 వికెట్ల హాల్ సాధించాడు.అంతేకాకుండా ఈ ఫీట్ సాధించిన ఏషియన్ బౌలర్గానూ వకార్ యూనిస్ రికార్డును సిరాజ్ సమం చేశాడు. పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ ఇంగ్లండ్ గడ్డపై 6 సార్లు నాలుగు వికెట్ల ఘనత సాధించాడు.చదవండి: గ్రాహం థోర్ప్కు నివాళిగా... -
ENG VS IND 5th Test: చెలరేగిన సిరాజ్, ప్రసిద్ద్.. ముగిసిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్
ఓవల్ టెస్ట్లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా పేసర్లు మొహమ్మద్ సిరాజ్ (16.2-1-86-4), ప్రసిద్ద్ కృష్ణ (16-1-62-4), ఆకాశ్దీప్ (17-0-80-1) చెలరేగడంతో ఆతిథ్య జట్టు 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. తొలి రోజు ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన క్రిస్ వోక్స్ మ్యాచ్ మొత్తానికి దూరం కావడంతో బ్యాటింగ్కు రాలేదు. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్కు 247 పరుగుల వద్ద పుల్ స్టాప్ పడింది. ఆ జట్టుకు 23 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే 64, బెన్ డకెట్ 43, ఓలీ పోప్ 22, జో రూట్ 29, హ్యారీ బ్రూక్ 53, జేకబ్ బేతెల్ 6, జేమీ స్మిత్ 8, జేమీ ఓవర్టన్ డకౌటయ్యరు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్మన్ గిల్ 21, కరుణ్ నాయర్ 57, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19, వాషింగ్టన్ సుందర్ 26, సిరాజ్, ప్రసిద్ద్ డకౌట్ అయ్యారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడిన విషయం తెలిసిందే. -
ENG VS IND 5th Test: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన రూట్
ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 242 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పతనం అంచుల్లో ఉంది.ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ (29) పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండిన ఓ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ తన కెరీర్లో స్వదేశంలో జరిగిన టెస్ట్ల్లో 7216 పరుగులు చేయగా.. తాజాగా ఇన్నింగ్స్తో రూట్ (7220) సచిన్ రికార్డును అధిగమించాడు.ఈ విభాగంలో ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ (7578) అగ్రస్థానంలో ఉండగా.. రూట్ సచిన్ను వెనక్కునెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు.స్వదేశంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు..7578 - రికీ పాంటింగ్ - ఆస్ట్రేలియా7220* - జో రూట్ - ఇంగ్లండ్*7216 - సచిన్ టెండూల్కర్ - ఇండియా7167 - మహేల జయవర్ధనే - శ్రీలంక7035 - జాక్వెస్ కల్లిస్ - దక్షిణాఫ్రికామ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్ ఇంగ్లండ్ పతనాన్ని వరుణుడు అడ్డుకున్నాడు. 242 పరుగులకు 8 వికెట్లు కోల్పోయిన దశలో ఒక్కసారిగా భారీ వర్షం ప్రారంభమైంది. ప్రస్తుతం ఇంగ్లండ్ భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ దాటి 18 పరుగుల ఆధిక్యంలో ఉంది. హ్యారీ బ్రూక్ (48), జోష్ టంగ్ (0) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో క్రిస్ వోక్స్ ఆడే అవకాశం లేదు. గాయం కారణంగా వోక్స్ తదుపరి మ్యాచ్కు అందుబాటులో లేడు. తొలి రోజు ఆట సందర్భంగా వోక్స్ భుజానికి తీవ్ర గాయమైంది. -
నిప్పులు చెరుగుతున్న భారత పేసర్లు.. ఇంగ్లండ్ పతనాన్ని అడ్డుకున్న వరుణుడు
ఇంగ్లండ్ పతనాన్ని అడ్డుకున్న వరుణుడుతొలి ఇన్నింగ్స్ ఇంగ్లండ్ పతనాన్ని వరుణుడు అడ్డుకున్నాడు. 242 పరుగులకు 8 వికెట్లు కోల్పోయిన దశలో ఒక్కసారిగా భారీ వర్షం ప్రారంభమైంది. ప్రస్తుతం ఇంగ్లండ్ భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ దాటి 18 పరుగుల ఆధిక్యంలో ఉంది. హ్యారీ బ్రూక్ (48), జోష్ టంగ్ (0) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో క్రిస్ వోక్స్ ఆడే అవకాశం లేదు. గాయం కారణంగా వోక్స్ తదుపరి మ్యాచ్కు అందుబాటులో లేడు. తొలి రోజు ఆట సందర్భంగా వోక్స్ భుజానికి తీవ్ర గాయమైంది.ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్లో భారత పేసర్లు చెలరేగిపోతున్నారు. నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. సిరాజ్ (12-1-66-3), ప్రసిద్ద్ కృష్ణ (11.5-0-51-3), ఆకాశ్దీప్ (17-0-80-1) పోటీ పడి సత్తా చాటుతుండటంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో పతనం అంచుల్లో ఉంది. రెండో రోజు టీ విరామం సమయానికి ఆ జట్టు 215 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.టీ విరామానికి ముందు ఓవర్లో ప్రసిద్ద్ విజృంభించాడు. ఐదు బంతుల వ్యవధిలో జేమీ స్మిత్, జేమీ ఓవర్టన్లను పెవిలియన్కు పంపాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 9 పరుగులు వెనుకపడి ఉంది. హ్యారీ బ్రూక్ (33) ఒంటరి పోరాటం చేస్తున్నాడు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే 64, బెన్ డకెట్ 43, ఓలీ పోప్ 22, జో రూట్ 29, జేకబ్ బేతెల్ 6, జేమీ స్మిత్ 8, జేమీ ఓవర్టన్ డకౌటయ్యాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్మన్ గిల్ 21, కరుణ్ నాయర్ 57, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19, వాషింగ్టన్ సుందర్ 26, సిరాజ్, ప్రసిద్ద్ డకౌట్ అయ్యారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడిన విషయం తెలిసిందే. -
ENG VS IND 5th Test: సిరాజ్ డబుల్ సెంచరీ
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్లో టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్లో ఓలీ పోప్ వికెట్ తీయడంతో అంతర్జాతీయ క్రికెట్లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. సిరాజ్ 41 టెస్ట్ మ్యాచ్ల్లో 117 వికెట్లు.. 44 వన్డేల్లో 71 వికెట్లు.. 16 టీ20ల్లో 14 వికెట్లు తీశాడు.ఈ మ్యాచ్లో సిరాజ్ ఓలీ పోప్ వికెట్ తర్వాత మరో రెండు వికెట్లు కూడా తీశాడు. జో రూట్, బేకబ్ బేతెల్లను పెవిలియన్కు పంపాడు. ఈ మ్యాచ్లో సిరాజ్ ఇప్పటివరకు 3 వికెట్లు తీశాడు. సిరాజ్ తీసిన 3 వికెట్లు ఎల్బీడబ్ల్యూలే కావడం విశేషం.సిరాజ్ చెలరేగడంతో టీమిండియా మ్యాచ్పై ఆశలు సజీవంగా ఉంచుకుంది. సిరాజ్తో పాటు ఆకాశ్దీప్, ప్రసిద్ద్ కృష్ణ (తలో వికెట్) కూడా తలో చేయి వేయడంతో ఇంగ్లండ్ 195 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (64), బెన్ డకెట్ (43), ఓలీ పోప్ (22), జో రూట్ (29), జేకబ్ బేతెల్ (6) ఔట్ కాగా.. హ్యారీ బ్రూక్ (22), జేమీ స్మిత్ (5) క్రీజ్లో ఉన్నారు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్మన్ గిల్ 21, కరుణ్ నాయర్ 57, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19, వాషింగ్టన్ సుందర్ 26, సిరాజ్, ప్రసిద్ద్ డకౌట్ అయ్యారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడిన విషయం తెలిసిందే. -
ENG VS IND 5th Test: రికార్డు తిరగరాసిన టీమిండియా
ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్లో టీమిండియా ఓ రికార్డును తిరగరాసింది. ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగుల విభాగంలో భారత్ తమ పూర్వపు రికార్డును బద్దలు కొట్టింది. 1978-79 వెస్టిండీస్ సిరీస్లో భారత్ ఆరు టెస్ట్ మ్యాచ్లు ఆడి 3270 పరుగులు చేసింది. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్కు ముందు ఓ సిరీస్లో భారత జట్టు చేసిన అత్యధిక పరుగులు ఇవే.ప్రస్తుత సిరీస్తో టీమిండియా తమ పాత రికార్డును బద్దలు కొట్టి కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ ఇంగ్లండ్ సిరీస్లో భారత్ ఐదో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు పాత రికార్డును చెరిపేసింది. తొలి రోజు భారత్ తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఈ స్కోర్తో ఈ సిరీస్లో భారత్ పరుగుల సంఖ్య 3393 పరుగులకు చేరింది.ఈ సిరీస్ మొత్తంలో భారత్ చేసిన ఈ పరుగులు 1995 నుంచి ఓ సిరీస్లో ఓ జట్టుచే చేయబడిన అత్యధిక పరుగులు కూడా కావడం మరో విశేషం.మ్యాచ్ విషయానికొస్తే.. 204/6 స్కోర్ వద్ద రెండు రోజు ఆట ప్రారంభించిన భారత్.. సెషన్ ప్రారంభమైన గంటలోపే 224 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాటర్లు కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్ పెద్దగా పరుగులేమీ జోడించకుండానే పెవిలియన్కు చేరారు. ఆతర్వాత వచ్చిన సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ కనీసం ఖాతా కూడా తెరవకుండానే ఔటయ్యారు.ఇవాల్టి ఆటలో అట్కిన్సన్ వీర లెవెల్లో విజృంభించాడు. చివరి నాలుగు వికెట్లలో మూడు వికెట్లు (సుందర్, సిరాజ్, ప్రసిద్ద్) అతనే తీశాడు. చాలాకాలం తర్వాత అర్దసెంచరీతో రాణించిన కరుణ్ను టంగ్ బోల్తా కొట్టించాడు.ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ (21.4-8-33-5) ధాటికి భారత ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. అట్కిన్సన్కు జోష్ టంగ్ (16-4-57-3), క్రిస్ వోక్స్ (14-1-46-1) సహకరించారు.భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్మన్ గిల్ 21, కరుణ్ నాయర్ 57, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19, వాషింగ్టన్ సుందర్ 26, సిరాజ్, ప్రసిద్ద్ డకౌట్ అయ్యారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ రెండో రోజు రెండో సెషన్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. జాక్ క్రాలే (64), బెన్ డకెట్ (43) ఔట్ కాగా.. ఓలీ పోప్ (18), జో రూట్ (4) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్దీప్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ తీశారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడిన విషయం తెలిసిందే. -
ENG VS IND 5th Test: అట్కిన్సన్ విజృంభణ.. కుప్పకూలిన టీమిండియా
ఇంగ్లండ్తో ఐదో టెస్ట్లో టీమిండియా చెత్త ఆటతీరును ప్రదర్శించింది. తొలి ఇన్నింగ్స్లో కేవలం 224 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ (21.4-8-33-5) ధాటికి భారత ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. అట్కిన్సన్కు జోష్ టంగ్ (16-4-57-3), క్రిస్ వోక్స్ (14-1-46-1) సహకరించారు.204/6 వద్ద రెండు రోజు ఆట ప్రారంభించిన భారత్.. సెషన్ ప్రారంభమైన గంటలోపే ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాటర్లు కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్ పెద్దగా పరుగులేమీ జోడించకుండానే పెవిలియన్కు చేరారు. ఆతర్వాత వచ్చిన సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయారు.ఇవాల్టి ఆటలో అట్కిన్సన్ వీర లెవెల్లో విజృంభించాడు. చివరి నాలుగు వికెట్లలో మూడు వికెట్లు (సుందర్, సిరాజ్, ప్రసిద్ద్) అతనే తీశాడు. చాలాకాలం తర్వాత అర్దసెంచరీతో రాణించిన కరుణ్ను టంగ్ బోల్తా కొట్టించాడు.భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్మన్ గిల్ 21, కరుణ్ నాయర్ 57, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19, వాషింగ్టన్ సుందర్ 26, సిరాజ్, ప్రసిద్ద్ డకౌట్ అయ్యారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడిన విషయం తెలిసిందే. -
భారత్తో ఐదో టెస్ట్.. ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ
టీమిండియాతో ఐదో టెస్ట్లో ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్ భుజం గాయం కారణంగా మ్యాచ్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.వోక్స్ తొలి రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే ప్రయత్నంతో అతని భుజానికి తీవ్ర గాయమైంది. జేమీ ఓవర్టన్ వేసిన 57వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఓవర్లో ఐదో బంతిని కరుణ్ నాయర్ మిడాఫ్ దిశగా షాట్ ఆడగా.. వోక్స్ బంతిని ఆపేందుకు పరిగెత్తుకుంటా వెళ్లాడు. ఆ ప్రయత్నంలో వోక్స్ ఎడమ భుజం నేలకు బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిలలాడిపోయాడు. వెంటనే ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. స్కానింగ్ తీయగా బలమైన గాయమని తేలింది.దీంతో అతను ఐదో టెస్ట్ నుంచి అర్దంతరంగా వైదొలిగాడు. ఈ మ్యాచ్లో వోక్స్ లేని లోటు ఇంగ్లండ్ విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది. ఇంగ్లండ్ తమ స్టార్ పేసర్లు బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ లేకుండానే ఈ మ్యాచ్ బరిలోకి దిగింది. తాజాగా వోక్స్ కూడా దూరం కావడంతో ఇంగ్లండ్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనపడినైట్లంది.ఈ సిరీస్లో అన్ని మ్యాచ్లు ఆడిన వోక్స్ 181 ఓవర్లు వేసి 11 వికెట్లు తీశాడు. గాయపడటానికి ముందు కూడా వోక్స్ ఓ వికెట్ తీశాడు. టీమిండియా తరుపుముక్క అయిన కేఎల్ రాహుల్ను క్లీన్ బౌల్డ్ చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్మన్ గిల్ 21, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19 పరుగులు చేసి ఔట్ కాగా.. కరుణ్ నాయర్ (52), వాషింగ్టన్ సుందర్ (19) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్, టంగ్ తలో 2 వికెట్లు తీయగా.. వోక్స్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. గిల్ రనౌటయ్యాడు. -
టెస్టు క్రికెట్లోకి తిరిగిరానున్న శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్-2025 సీజన్ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో అయ్యర్ ఆడనున్నాడు. దులీప్ ట్రోఫీలో ఆడేందుకు తను సిద్దంగా ఉన్నానని ముంబై క్రికెట్ అసోసియేషన్కు శ్రేయస్ అయ్యర్ తెలియజేసినట్లు సమాచారం.ఈ దేశవాళీ రెడ్బాల్ క్రికెట్ టోర్నీ ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో అయ్యర్ వెస్ట్జోన్ తరపున ఆడనున్నాడు. శ్రేయస్ అయ్యర్తో పాటు టీమిండియా క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్పాండే, శివమ్ దూబేలు కూడా దులీప్ ట్రోఫీలో ఆడనున్నట్లు తెలుస్తోంది. వెస్ట్జోన్ జట్టు ఇప్పటికే సెమీఫైనల్కు క్వాలిఫై అయింది. సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభం కానున్న సెమీస్లో క్వార్టర్ ఫైనల్ విజేతతో వెస్ట్జోన్ తలపడనుంది.ఇక ఇది ఇలా ఉండగా.. వైట్బాల్ క్రికెట్లో తనను తను నిరూపించుకున్న శ్రేయస్ అయ్యర్ ఇంకా టెస్టుల్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు. భారత తరపున ఇప్పటివరకు 14 టెస్టులు ఆడిన అయ్యర్.. 36.86 సగటుతో 811 పరుగులు చేశాడు.అయితే డిమాస్టిక్ క్రికెట్లో మాత్రం అయ్యర్ దుమ్ములేపుతున్నాడు. గత రంజీ ట్రోఫీ సీజన్లో కూడా ఈ ముంబైకర్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతడిని ఇంగ్లండ్తో టెస్టులకు ఎంపిక చేస్తారని భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని పరిగణలోకి తీసుకోలేదు. అతడికి ప్రస్తుతం జట్టులోఅయ్యర్ అద్బుతమైన ఫామ్లో ఉన్నప్పటికి.. టెస్టు జట్టులో అతడికి ఛాన్స్ ఇచ్చేందుకు అవకాశం లేదని ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. అయితే ఇంకా మెరుగ్గా రాణించి టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వడమే లక్ష్యంగా అయ్యర్ ముందుకువెళ్తున్నాడు. ఈ క్రమంలోనే దులీప్ ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నాడు. అయ్యర్ భారత తరపున చివరగా గతేడాది ఫిబ్రవరిలో టెస్టు మ్యాచ్ ఆడాడు.చదవండి: నేను ఎప్పుడూ మోసం చేయలేదు.. సూసైడ్ ఆలోచనలూ వచ్చాయి: చాహల్ -
IND Vs ENG: మొన్నటి వరకు జట్టులో దండగ అన్నారు.. ఇప్పుడు అతడే దిక్కయ్యాడు
ఇంగ్లండ్తో ఐదో టెస్టుకు ముందు భారత తుది జట్టులో ఒక ఆటగాడి పేరు చూసి అంతా ఆశ్చర్యపోయారు. మూడు మ్యాచ్లలో విఫలమైనా మళ్లీ అవకాశమెందుకు ఇచ్చారు? స్వ్కాడ్లో అతడి తప్ప ఇంకా ఎవరూ లేరా? అస్సలు గంభీర్కు కొంచమైనా తెలివిందా? అంటూ మెనెజ్మెంట్పై ప్రశ్నల వర్షం కురిసింది.కానీ సదరు ఆటగాడు ఈ ప్రశ్నలన్నింటికి తన ఆటతోనే సమాధానమిచ్చాడు. ఇదంతా ఎవరి కోసమో మీకు ఇప్పటికే మీకు ఓ అంచనా వచ్చి ఉంటుంది. అవును మీరు అనుకుంటుంది నిజమే, ఇదంతా టీమిండియా వెటరన్ కరుణ్ నాయర్ కోసమే.8 ఏళ్ల నిరీక్షణ తర్వాత...కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్లో అద్బుతంగా రాణించి 8 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేశాడు. కానీ తన రీఎంట్రీలో ఈ కర్ణాటక ఆటగాడు అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న సిరీస్లో వరుసగా మూడు మ్యాచ్లు ఆడిన నాయర్.. ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు.తనకు దక్కిన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యాడు. ఈక్రమంలో నాలుగో టెస్టుకు మెనెజ్మెంట్ అతడికి విశ్రాంతి ఇచ్చింది. దీంతో అతడి అంతర్జాతీయ కెరిర్ ముగిసిందన్న చర్చ నడిచింది. మరికొంతమంది అయితే ఓ అడుగు ముందుకేసి నాయర్ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని ప్రచారం చేశారు.మరో ఛాన్స్.. కానీ కరుణ్ నాయర్కు టీమిండియా మెనెజ్మెంట్ చివరగా మరోసారి అవకాశం కల్పించింది. లండన్లోని ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో ప్రారంభమైన ఐదో టెస్టుకు నాయర్ అనూహ్యంగా ఎంపికయ్యాడు. శార్ధూల్ ఠాకూర్ బదులుగా కరుణ్కు ఛాన్స్ ఇచ్చారు. ఈసారిమాత్రం కరుణ్ నాయర్ తనకు వచ్చిన అవకాశాన్నిరెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.కేఎల్ రాహుల్, యశస్వి జైశ్వాల్, గిల్ వంటి కీలక ఆటగాళ్లు విఫలమైనప్పటికి నాయర్ మాత్రం తన అద్బుత బ్యాటింగ్తో సత్తాచాటాడు. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చెరుగుతున్నచోట నాయర్ తన ఆసాధరణ ప్రదర్శనతో అడ్డుగోడలా నిలిచాడు. ధ్రువ్ జురెల్, సుందర్లతో కలిసి కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ఈ క్రమంలో కరుణ్ తన టెస్టు కెరీర్లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. అంతకుముందు 2016లో ఇంగ్లండ్పై ట్రిపుల్ సెంచరీ చేసిన నాయర్ మళ్లీ ఇప్పుడు అదే జట్టుపై 3146 రోజుల తర్వాత ఆర్ధ శతకం సాధించాడు. నాయర్ 52 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. రెండో రోజు ఆటలో నాయర్ బ్యాటింగ్ చాలా కీలకంగా మారనుంది.చదవండి: IND vs ENG 5th Test: ఇంగ్లండ్కు భారీ షాక్.. మ్యాచ్ మధ్యలోనే అస్పత్రికి -
IND Vs ENG: ఇంగ్లండ్కు భారీ షాక్.. మ్యాచ్ మధ్యలోనే అస్పత్రికి
లండన్లోని ఓవల్ వేదికగా భారత్తో జరుగుతున్న ఐదో టెస్టు తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ పై చేయి సాధించింది. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ల ధాటికి టీమిండియా 6 కీలక వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. అయితే తొలి రోజు ఆట చివరిలో ఇంగ్లండ్కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ క్రిస్ వోక్స్కు తీవ్ర గాయమైంది. బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే ప్రయత్నంతో వోక్స్ భుజానికి గాయమైంది.జెమీ ఓవర్టన్ వేసిన 57వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఓవర్లో ఐదో బంతిని కరుణ్ నాయర్ మిడాఫ్ దిశగా షాట్ ఆడాడు. ఈ క్రమంలో మిడాఫ్లో ఉన్న వోక్స్ బంతిని ఆపేందుకు పరిగెత్తుకుంటా వెళ్లాడు. ఆ ప్రయత్నంలో వోక్స్ ఎడమ భుజం నేలకు బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో సాయంతో ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్ మైదానాన్ని వీడాడు.తర్వాత వెంటనే స్కానింగ్ కోసం అస్ప్రతికి తరలించారు. అతడి గాయం తీవ్రత చూస్తుంటే ఎడమ భుజం డిస్ లోకేట్ అయినట్లు అనిపిస్తోంది. వోక్స్ తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెట్టే సూచనలు కన్పించడం లేదు. అతడి గాయం తీవ్రతపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కాగా తొలి రోజు ఆటలో వోక్స్ ఓ వికెట్ సాధించాడు.అద్భుతమైన ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్ను వోక్స్ బోల్తా కొట్టించాడు. ఒకవేళ వోక్స్ దూరమైతే ఇంగ్లండ్కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఇప్పటికే ఓవల్ టెస్టులో ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, ఆర్చర్ సేవలను కోల్పోయింది. ప్రస్తుతం జట్టులో వోక్స్ తప్ప అనుభవమున్న ఫాస్ట్ బౌలర్ మరొకరు లేరు.చదవండి: IND vs ENG 5th Test: ఆధర్మసేన.. ఇంగ్లండ్కు ఫేవర్గా అంపైర్! ఫ్యాన్స్ ఫైర్ -
IND Vs ENG: అధర్మసేన.. ఇంగ్లండ్కు ఫేవర్గా అంపైర్! ఫ్యాన్స్ ఫైర్
లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా తడబడుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును మిడిలార్డర్ బ్యాటర్ కరుణ్ నాయర్ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. నాయర్ 98 బంతుల్లో 52 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు.అతడితో పాటు వాషింగ్టన్ సుందర్(19) క్రీజులో ఉన్నాడు. భారత బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్(2), కేఎల్ రాహుల్(14), జడేజా(9), గిల్(21) నిరాశపరచగా.. సాయిసుదర్శన్(38) పర్వాలేదన్పించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, అట్కిన్సన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. వోక్స్ ఓ వికెట్ సాధించారు.అంపైర్పై ఫ్యాన్స్ ఫైర్..భారత్ ఇన్నింగ్స్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఫీల్డ్ అంపైర్ కుమార ధర్మసేన వ్యవహారశైలి చర్చకు దారి తీసింది. 13వ ఓవర్ వేసిన టంగ్ భారత బ్యాటర్ సాయి సుదర్శన్కు యార్కర్ సంధించాడు. దానిని ఆడలేక సాయి కింద పడిపోయాడు.బంతి ప్యాడ్స్కు తగలడంతో టంగ్ ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేశాడు. దీనిని ధర్మసేన తిరస్కరించడం వరకు ఓకే. కానీ అవుట్ కాదని చెబుతూనే అతను బంతి ముందే బ్యాట్కు తగిలినట్లుగా కూడా తన వేళ్లతో సైగ చేశాడు.నిబంధనల ప్రకారం డీఆర్ఎస్ కోసం ఇచ్చే 15 సెకన్లు ముగిసే వరకు అంపైర్లు ఏ రీతిలో కూడా ఆటగాళ్లకు సహకరించే సంజ్ఞలు చేయరాదు. కానీ ధర్మసేన ఇలా చేయడం ఇంగ్లండ్కు పరోక్షంగా సహకరించినట్లయింది. తమ అప్పీల్పై నమ్మకం ఉంటే ఇంగ్లండ్ డీఆర్ఎస్కు వెళ్లేది. నాటౌట్గా తేలితే జట్టు రివ్యూ కోల్పోయేది. అంపైర్ వ్యవహరించిన తీరుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి.చదవండి: బుమ్రా ఎంత కాలం ఇలా..! -
ENG VS IND 5th Test: పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
మొదటిరోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి టీమిండియా 204 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ 52(98), వాషింగ్టన్ సుందర్ 19(45) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ , గస్ అట్కిన్సన్ చెరో రెండు వికెట్లు సాధించగా క్రిస్ వోక్స్ ఒక వికెట్ పడగొట్టాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్ట్లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. వర్షం అంతరాయాల నడుమ సాగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 123 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్మన్ గిల్ 21, రవీంద్ర జడేజా 9 పరుగులకు ఔట్ కాగా.. కరుణ్ నాయర్ (9), ధ్రువ్ జురెల్ (0) క్రీజ్లో ఉన్నారు.ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 2, క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్ తలో వికెట్ తీయగా.. శుభ్మన్ గిల్ రనౌటయ్యాడు. ప్రస్తుతం ఔటైన వారంతా మంచి ఫామ్లో ఉన్న ఆటగాళ్లే. కొత్తగా జట్టులోకి వచ్చిన ధ్రువ్, ఈ సిరీస్లోనే ఆరు ఇన్నింగ్స్ల్లో దారుణంగా విఫలమైన కరుణ్ నాయర్ టీమిండియాను ఏమేరకు ఆదుకుంటారో చూడాలి. వీరిద్దరి తర్వాత గత మ్యాచ్ సెంచరీ హీరో వాషింగ్టన్ సుందర్పైనే టీమిండియా ఆశలన్నీ ఉన్నాయి. వీరే టీమిండియాను గట్టెక్కించాలి.కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్, ఇంగ్లండ్ జట్లు చెరో నాలుగు మార్పులు చేశాయి. భారత్ తరఫున రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, అన్షుల్ కంబోజ్ స్థానాల్లో ధ్రువ్ జురెల్, కరుణ్ నాయర్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్దీప్ తుది జట్టులోకి రాగా.. ఇంగ్లండ్ తరఫున బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ స్థానాల్లో జేకబ్ బేతెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, జేమీ ఓవర్టన్ ప్లేయింగ్ ఎలెవెన్లోకి వచ్చారు.ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ సిరీస్ను సమం చేసుకోగలుగుతుంది. ఓడినా, డ్రా అయినా ఇంగ్లండే సిరీస్ ఎగరేసుకుపోతుంది. తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్(వికెట్కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్ -
ENG VS IND 5th Test: ఇంగ్లండ్కు ఫ్రీ గిఫ్ట్.. వీడియో
కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో ఇవాళ (జులై 31) మొదలైన ఐదో టెస్ట్లో టీమిండియా కష్టాల్లో ఉంది. వరుణుడి అంతరాయాల నడుమ సాగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్.. లంచ్ విరామం తర్వాత వర్షం ఆటంకం కలిగించే సమయానికి 3 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది.INDIA HAS GIFTED A WICKET TO ENGLAND IN TOUGH CONDITIONS 💔 pic.twitter.com/K3TweTiVGs— Johns. (@CricCrazyJohns) July 31, 2025ఆట నిలిచిపోయే సమయానికి 10 నిమిషాల ముందు భారత్ ఇంగ్లండ్కు ఓ ఫ్రీ గిఫ్ట్ ఇచ్చింది. శుభ్మన్ గిల్ (21) లేని పరుగు కోసం ప్రయత్నించి అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు. అప్పటికే కష్టాల్లో ఉన్న టీమిండియాను గిల్ రనౌట్ మరింత ఇరకాటంలో పడేసింది. ఈ ఇన్నింగ్స్లో గిల్ మంచి టచ్లో ఉన్నట్లు కనిపించాడు. ఆడిన 35 బంతుల్లో 4 సొగసైన బౌండరీలు బాదాడు.సిరీస్లో తొలి మ్యాచ్ నుంచి భీకర ఫామ్లో ఉన్న గిల్ చీప్గా రనౌట్ కావడాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతకుముందు భారత్ 38 పరుగులకే ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14 పరుగులు చేసి పలాయనం చిత్తగించారు. సాయి సుదర్శన్తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేస్తున్న గిల్ అనవసరంగా రనౌటై టీమిండియాను కష్టాల్లోకి నెట్టేశాడు.ప్రస్తుతం సాయి సుదర్శన్తో (28) పాటు కరుణ్ నాయర్ (0) క్రీజ్లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (రాహుల్), అట్కిన్సన్కు (జైస్వాల్) తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. వరుణుడు టాస్కు ముందు, లంచ్ విరామంలో ఓసారి, తాజాగా మరోసారి ఆటకు అడ్డుతగిలాడు. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం ఈ రోజు ఆట అంతా ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. మధ్యమధ్యలో వరుణుడు పలకరిస్తూ పోతుంటాడు.కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ సిరీస్ను సమం చేసుకోగలుగుతుంది. ఓడినా, డ్రా అయినా ఇంగ్లండే సిరీస్ ఎగరేసుకుపోతుంది. -
KL Rahul: గత 11 ఏళ్లలో ఒకే ఒక్కడు..!
కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో ఇవాళ (జులై 31) మొదలైన ఐదో టెస్ట్లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 40 బంతులు ఎదుర్కొని బౌండరీ సాయంతో 14 పరుగులు చేసి ఔటైన రాహుల్.. ఈ సిరీస్లో తానెదుర్కొన్న బంతుల సంఖ్యను వెయ్యి (1000) దాటించాడు. తద్వారా గత 11 ఏళ్ల ఓ టెస్ట్ సిరీస్లో 1000 బంతులు ఎదుర్కొన్న ఏకైక భారత ఓపెనింగ్ బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన మూడో భారత ఓపెనర్గా నిలిచాడు. రాహుల్కు ముందు మురళీ విజయ్, సునీల్ గవాస్కర్ మాత్రమే ఈ ఘనత సాధించారు.ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో ఐదో టెస్ట్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ లంచ్ విరామం సమయానికి 2 వికెట్ల నష్టానికి 72 పరుగులు (23 ఓవర్లలో) చేసింది. సాయి సుదర్శన్ (25), శుభ్మన్ గిల్ (15) క్రీజ్లో ఉన్నారు. వర్షం అంతరాయం కలిగించడంతో లంచ్ బ్రేక్ను కాస్త ముందుగానే తీసుకున్నారు. వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా లంచ్ తర్వాత కూడా ఆట ఆలస్యమవుతుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు కూడా వరుణుడు అడ్డు తగిలాడు. దీంతో టాస్ కూడా ఆలస్యమైంది.ఆదిలోనే ఎదురుదెబ్బలుటాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (2), కేఎల్ రాహుల్ (14) జట్టు స్కోర్ కనీసం 50 పరుగులు కూడా దాటించకుండానే పెవిలియన్కు చేరారు. జట్టు స్కోర్ 10 పరుగుల వద్ద జైస్వాల్ను అట్కిన్సన్, 38 పరుగుల స్కోర్ వద్ద రాహుల్ను క్రిస్ వోక్స్ బోల్తా కొట్టించారు.చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్ఈ సిరీస్లో భీకర ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్ ఈ ఇన్నింగ్స్లో ఓ ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా సునీల్ గవాస్కర్ రికార్డును ఛేదించాడు.1978/79 వెస్టిండీస్ సిరీస్లో గవాస్కర్ భారత కెప్టెన్గా 732 పరుగులు చేయగా.. ప్రస్తుత సిరీస్లో గిల్ 737* పరుగుల వద్ద బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు.చెరో నాలుగు మార్పులుఈ మ్యాచ్ కోసం భారత్, ఇంగ్లండ్ జట్లు చెరో నాలుగు మార్పులు చేశాయి. భారత్ తరఫున రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, అన్షుల్ కంబోజ్ స్థానాల్లో ధ్రువ్ జురెల్, కరుణ్ నాయర్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్దీప్ తుది జట్టులోకి రాగా.. ఇంగ్లండ్ తరఫున బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ స్థానాల్లో జేకబ్ బేతెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, జేమీ ఓవర్టన్ ప్లేయింగ్ ఎలెవెన్లోకి వచ్చారు.ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ సిరీస్ను సమం చేసుకోగలుగుతుంది. ఓడినా, డ్రా అయినా ఇంగ్లండే సిరీస్ ఎగరేసుకుపోతుంది. తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్(వికెట్కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్ -
చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్.. ఆల్టైమ్ రికార్డు బద్దలు
ఇంగ్లండ్ గడ్డపై ఐదు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ వరుస పెట్టి రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఈ సిరీస్ ఆరంభం నుంచి భీకర ఫామ్లో ఉన్న గిల్.. తాజాగా మరో ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేసి చరిత్ర సృష్టించాడు.లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఇవాళ (జులై 31) ఐదో టెస్ట్ ప్రారంభం కాగా.. భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది. కష్టమైన పిచ్పై తడబడుతూనే బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. స్కోర్ 50 పరుగులు కూడా దాటకుండానే ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (2), కేఎల్ రాహుల్ (14) పెవిలియన్కు చేరారు.ఈ దశలో బరిలోకి దిగిన గిల్.. ఎంతో సంయమనంగా బ్యాటింగ్ చేస్తూ లంచ్ విరామంలోపు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ఈ క్రమంలో గిల్ సునీల్ గవాస్కర్ పేరిట ఉండిన ఓ ఆల్టైమ్ రికార్డును చెరిపేసి చరిత్రపుటల్లో తన పేరును లిఖించుకున్నాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గిల్ ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా సునీల్ గవాస్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.1978/79 వెస్టిండీస్ సిరీస్లో గవాస్కర్ 732 పరుగులు చేయగా.. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్లో గిల్ ఈ రికార్డును తన ఖాతాలో వేసేసుకున్నాడు. ఈ సిరీస్లో గిల్ ఇప్పటివరకు 737* పరుగులు చేశాడు. తొలి రోజు లంచ్ విరామం సమయానికి భారత్ స్కోర్ 72/2గా ఉంది. గిల్ (15), సాయి సుదర్శన్ (25) క్రీజ్లో ఉన్నారు.ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్లు737* - శుభ్మన్ గిల్ vs ENG, 2025732 - సునీల్ గవాస్కర్ vs WI, 1978/79655 - విరాట్ కోహ్లీ vs ENG, 2016/17610 - విరాట్ కోహ్లీ vs SL, 2017/18593 - విరాట్ కోహ్లీ vs ENG, 2018కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్, ఇంగ్లండ్ జట్లు చెరో నాలుగు మార్పులు చేశారు. భారత్ తరఫున రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, అన్షుల్ కంబోజ్ స్థానాల్లో ధ్రువ్ జురెల్, కరుణ్ నాయర్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్దీప్ తుది జట్టులోకి రాగా.. ఇంగ్లండ్ తరఫున బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ స్థానాల్లో జేకబ్ బేతెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, జేమీ ఓవర్టన్ ప్లేయింగ్ ఎలెవెన్లోకి వచ్చారు.ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ సిరీస్ను సమం చేసుకోగలుగుతుంది. ఓడినా, డ్రా అయినా ఇంగ్లండే సిరీస్ ఎగరేసుకుపోతుంది. తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్(వికెట్కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్ -
ENG VS IND 5th Test: టీమిండియాకు భారీ షాక్లు
భారత్, ఇంగ్లండ్ మధ్య లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇవాళ (జులై 31) ఐదో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (2), కేఎల్ రాహుల్ (14) జట్టు స్కోర్ కనీసం 50 పరుగులు కూడా దాటించకుండానే పెవిలియన్కు చేరారు. జట్టు స్కోర్ 10 పరుగుల వద్ద జైస్వాల్ను అట్కిన్సన్, 38 పరుగుల స్కోర్ వద్ద రాహుల్ను క్రిస్ వోక్స్ బోల్తా కొట్టించారు.20 ఓవర్లు ముగిసే సమయానికి జట్టు స్కోర్ 56/2గా ఉంది. సాయి సుదర్శన్ (18), శుభ్మన్ గిల్ (6) క్రీజ్లో ఉన్నారు.కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్, ఇంగ్లండ్ జట్లు చెరో నాలుగు మార్పులు చేశాయి. భారత్ తరఫున రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, అన్షుల్ కంబోజ్ స్థానాల్లో ధ్రువ్ జురెల్, కరుణ్ నాయర్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్దీప్ తుది జట్టులోకి రాగా.. ఇంగ్లండ్ తరఫున బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ స్థానాల్లో జేకబ్ బేతెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, జేమీ ఓవర్టన్ ప్లేయింగ్ ఎలెవెన్లోకి వచ్చారు.ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ సిరీస్ను సమం చేసుకోగలుగుతుంది. ఓడినా, డ్రా అయినా ఇంగ్లండే సిరీస్ ఎగరేసుకుపోతుంది. తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్(వికెట్కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్ -
చెత్త రికార్డును మరింత మెరుగుపర్చుకున్న టీమిండియా
టాస్ విషయంలో టీమిండియా ఇప్పటికే తమ ఖాతాలో ఉన్న చెత్త రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. వరుసగా 14 అంతర్జాతీయ మ్యాచ్ల్లో టాస్ ఓడి.. వరుసగా అత్యధిక మ్యాచ్ల్లో టాస్ ఓడిన జట్టుగా చలామణి అవుతున్న భారత్.. తాజాగా ఇంగ్లండ్తో ఐదో టెస్ట్లోనూ టాస్ ఓడి తమ వరుస టాస్ ఓటముల సంఖ్యను 15కు పెంచుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో ఏ జట్టు ఇప్పటివరకు వరుసగా ఇన్ని మ్యాచ్ల్లో టాస్లు ఓడలేదు.ఇంగ్లండ్తో ఐదో టెస్ట్ కలుపుకొని భారత్ వరుసగా ఐదు టెస్ట్లు, అంతకుముందు 8 వన్డేలు, 2 టీ20ల్లో టాస్ కోల్పోయింది. భారత్ చివరిసారిగా ఈ ఏడాది జనవరిలో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో (రాజ్కోట్లో ఇంగ్లండ్తో జరిగిన టీ20 మ్యాచ్) టాస్ గెలిచింది.టాస్ విషయంలో భారత్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ కూడా ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఇంగ్లండ్తో సిరీస్తోనే భారత కెప్టెన్గా అరంగేట్రం చేసిన గిల్.. ఈ సిరీస్లో వరుసగా ఐదు మ్యాచ్ల్లో టాస్ ఓడాడు. తద్వారా కెప్టెన్గా అరంగేట్రం సిరీస్లోనే ఐదు మ్యాచ్ల్లో టాస్ ఓడిన కెప్టెన్గా నిలిచాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ జట్టు ఐదు మ్యాచ్ల సిరీస్లో అన్ని మ్యాచ్ల్లో టాస్లు ఓడటం ఇది 14వ సారి.మ్యాచ్ విషయానికొస్తే.. లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదనంలో ఇవాళ (జులై 31) మొదలైన ఐదో టెస్ట్లో టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఏకంగా నాలుగు మార్పులు చేసింది. రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, అన్షుల్ కంబోజ్ స్థానాల్లో ధ్రువ్ జురెల్, కరుణ్ నాయర్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్దీప్ తుది జట్టులోకి వచ్చారు.ఈ మ్యాచ్లో కరుణ్ నాయర్కు తుది జట్టులో చోటు దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. గత మ్యాచ్లో బ్యాటింగ్లో ఓ మోస్తరుగా రాణించిన శార్దూల్ ఠాకూర్ను పక్కకు పెట్టి మరీ కరుణ్కు అవకాశం ఇచ్చారు. బహుశా కరుణ్కు ఇదే లాస్ట్ ఛాన్స్ కావచ్చు. ఈ మ్యాచ్లో విఫలమైతే కరుణ్ కెరీర్ సమాప్తమైనట్లే.మరోవైపు ఇంగ్లండ్ సైతం ఈ మ్యాచ్ కోసం నాలుగు మార్పులు చేసింది. స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ స్థానాల్లో జేకబ్ బేతెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, జేమీ ఓవర్టన్ తుది జట్టులోకి వచ్చారు. వర్షం కారణంగా టాస్ కాస్త ఆలస్యమైంది. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది.తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్(వికెట్కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్ -
ENG VS IND 5th Test: మళ్లీ టాస్ ఓడిన భారత్.. జట్టులో ఎవరూ ఊహించని ఆటగాడు
ఇంగ్లండ్ గడ్డపై భారత్ వరుసగా ఐదో మ్యాచ్లో టాస్ ఓడింది. లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదనంలో ఇవాళ (జులై 31) ఐదో టెస్ట్ ప్రారంభం కానుండగా, ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడి ఇంగ్లండ్ తాత్కాలిక సారధి ఓలీ పోప్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఏకంగా నాలుగు మార్పులు చేసింది. రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, అన్షుల్ కంబోజ్ స్థానాల్లో ధ్రువ్ జురెల్, కరుణ్ నాయర్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్దీప్ తుది జట్టులోకి వచ్చారు.ఈ మ్యాచ్లో కరుణ్ నాయర్కు తుది జట్టులో చోటు దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. గత మ్యాచ్లో బ్యాటింగ్లో ఓ మోస్తరుగా రాణించిన శార్దూల్ ఠాకూర్ను పక్కకు పెట్టి మరీ కరుణ్కు అవకాశం ఇచ్చారు. బహుశా కరుణ్కు ఇదే లాస్ట్ ఛాన్స్ కావచ్చు. ఈ మ్యాచ్లో విఫలమైతే కరుణ్ కెరీర్ సమాప్తమైనట్లే.మరోవైపు ఇంగ్లండ్ సైతం ఈ మ్యాచ్ కోసం నాలుగు మార్పులు చేసింది. బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ స్థానాల్లో జేకబ్ బేతెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, జేమీ ఓవర్టన్ తుది జట్టులోకి వచ్చారు. వర్షం కారణంగా టాస్ కాస్త ఆలస్యమైంది. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది.తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్(వికెట్కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్ -
ఇంగ్లండ్తో ఐదో టెస్టు.. వాషింగ్టన్ సుందర్కు నో ఛాన్స్?
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు లండన్లోని ఓవల్ మైదానం వేదికగా మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇండియన్ ప్లేయింగ్ ఎలెవన్ను భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఎంపిక చేశాడు. తన ఎంచుకున్న జట్టులో అద్భుతమైన ఫామ్లో ఉన్న స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు చోప్రా చోటు ఇవ్వలేదు. అతడి స్ధానంలో కుల్దీప్ యాదవ్కు అతడు అవకాశమిచ్చాడు.టాప్ ఆర్డర్లో నో ఛేంజ్గత నాలుగు మ్యాచ్లనే భారత ఇన్నింగ్స్ను రాహుల్, యశస్వి జైశ్వాల్ ప్రారంభించాలి. మూడో స్ధానంలో సాయిసుదర్శన్ బ్యాటింగ్ రావాలి. ఒకవేళ అతడు ఆడకపోతే కరుణ్ నాయర్కు అవకాశం దక్కుతుంది. నాలుగో స్ధానంలో కెప్టెన్ గిల్ బ్యాటింగ్కు వస్తాడు.అందులో ఎటువంటి సందేహం లేదు. రిషబ్ పంత్ జట్టులో ఉండి ఉంటే ఐదో స్ధానం కోసం ఎలాంటి టెన్షన్ ఉండేది కాదు. ఇప్పుడు అతడు స్ధానంలో ధ్రువ్ జురెల్ వస్తాడు. జురెల్ను పంత్ ప్లేస్లో బ్యాటింగ్కు పంపి, ఆరేడు స్ధానాల్లో వరుసగా జడేజా, సుందర్ను ఆడిస్తారో లేదా మార్పులు చేస్తారో వేచి చూడాలి.గెలవాల్సిందే..ఈ మ్యాచ్లో భారత్ గెలవకపోతే సిరీస్ను కోల్పోతుంది. ఈ టెస్టులో టీమిండియా గెలవాలంటే కచ్చితంగా 20 వికెట్లు పడగొట్టాల్సిందే. కాబట్టి బ్యాటింగ్ కంటే బౌలింగ్ డెప్త్ను పెంచుకుంటే బాగుంటుంది. అందుకోసం ఆల్రౌండర్లను జట్టులో తగ్గించాలి.వాషింగ్టన్ సుందర్ బదులుగా కుల్దీప్ యాదవ్, శార్ధూల్ ఠాకూర్ స్ధానంలో కరుణ్ నాయర్ను ఆడించండి. జట్టులో నలుగురు సరైన బౌలర్లు ఉంటే చాలు. వారితో పాటు జడేజా ఐదో బౌలింగ్ ఆప్షన్గా ఉంటాడు అని తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.ఐదో టెస్టుకు చోప్రా ఎంచుకున్న జట్టుకేఎల్ రాహుల్, యశస్వి జైశ్వాల్, సాయిసుదర్శన్, శుబ్మన్ గిల్, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో ఐదో టెస్టు.. టీమిండియాకు బ్యాడ్ న్యూస్ -
ఇంగ్లండ్తో ఐదో టెస్టు.. టీమిండియాకు బ్యాడ్ న్యూస్
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో తుది సమరానికి సమయం అసన్నమైంది. ఈ ట్రోఫీలో భాగంగా గురువారం లండన్లోని ఓవల్ నుంచి ప్రారంభం కానున్న ఐదో టెస్టులో భారత్-ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ప్రస్తుతం ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది.దీంతో ఓవల్ టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్ను సమం చేయాలని గిల్ సేన భావిస్తోంది. అయితే భారత ఆశలకు వరుణుడు బ్రేక్ వేసే అవకాశముంది. ఈ మ్యాచ్లో తొలి రోజు ఆటకు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. వాతావరణ శాఖ సూచన ప్రకారం.. గురువారం(జూలై 31) రోజంతా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంది.తొలి రోజు ఆటలో దాదాపు 4 గంటల పాటు వర్షం పడేందుకు ఆస్కారం ఉన్నట్లు ఆక్యూవెదర్ రిపోర్ట్ వెల్లడించింది. మొదటి రోజు మాత్రమే కాకుండా మిగితా నాలుగు రోజులు కూడా తేలికపాటి జల్లులు కురిసే ఛాన్స్ ఉంది.ఆక్యూ వెదర్ రిపోర్ట్ ప్రకారం..ఉదయం 11- 80 % వర్షం పడే అవకాశం మధ్యాహ్నం 12- 70% వర్షం పడే అవకాశంమధ్యాహ్నం 1 -70% వర్షం పడే అవకాశంమధ్యాహ్నం 2- 60% వర్షం పడే అవకాశంమధ్యాహ్నం 3- 60% వర్షం పడే అవకాశంసాయంత్రం 4- 60% వర్షం పడే అవకాశంసాయంత్రం 5- 40% వర్షం పడే అవకాశంసాయంత్రం 6- 30% వర్షం పడే అవకాశంఇంగ్లండ్ వర్సెస్ భారత్ ఐదవ టెస్ట్వేదిక: కెన్నింగ్టన్ ఓవల్, లండన్తేదీ: జూలై 31-ఆగస్టు 4సమయం: భారత కాలమానం ప్రకారం(మధ్యాహ్నం 3:30)టాస్: మధ్యాహ్నం 3:00 గంటలకు లైవ్ స్ట్రీమింగ్: జియో హాట్స్టార్లైవ్ బ్రాడ్కాస్ట్: సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్తుది జట్ల వివరాలు: భారత్ (అంచనా): శుబ్మన్ గిల్ (కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్, శార్దుల్ ఠాకూర్/ప్రసిధ్ కృష్ణ, అర్ష్ దీప్ సింగ్, ఆకాశ్దీప్, సిరాజ్.ఇంగ్లండ్: ఓలీ పోప్ (కెప్టెన్ ), జాక్ క్రాలీ, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెతెల్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, అట్కిన్సన్, ఒవర్టన్, టంగ్. -
'మాకు రూల్స్ తెలుసు.. చాలా క్రికెట్ ఆడాము'.. పిచ్ క్యూరేటర్పై గిల్ ఫైర్
ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందే అందరి దృష్టిని ఆకర్షించింది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఓవల్ పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం పిచ్ ను పరిశీలిస్తున్న భారత బృందం దగ్గరికి వచ్చిన ఫోర్టిస్.. పిచ్ ను రెండున్నర మీటర్ల దూరం నుంచి పరిశీలించాలని సూచించాడు.అతడి మాటలకు గంభీర్కు చిర్రెత్తుకు వచ్చింది. ఈ క్రమంలో ప్రధాన కోచ్ పిచ్ క్యూరేటర్తో వాగ్వాదానికి దిగాడు. అక్కడే ఉన్న భారత బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్ సైతం లీ ప్రవర్తన పట్ల అసహనం వ్యక్తం చేశాడు. తాజాగా ఈ వివాదంపై టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పందించాడు. లీ ఫోర్టిస్పై గిల్ అగ్రహం వ్యక్తం చేశాడు."నా కెరీర్లో చాలా మ్యాచ్లు ఆడాను. మ్యాచ్కు ముందు ప్రధాన పిచ్ను రెండున్నర మీటర్ల దూరం నుంచి పరిశీలించాలని ఇప్పటివరకు ఏ క్యూరేటర్ కూడా నాతో చెప్పలేదు. రబ్బర్ స్పైక్స్ లేదా బేర్ ఫూట్(చెప్పులు లేకుండా) తో పిచ్ను దగ్గరగా వెళ్లి పరిశీలించవచ్చు. మాకు రూల్స్ తెలుసు.ఒకవేళ స్పైక్స్ ఉన్న షూలను వేసుకున్నట్లయితే క్యూరేటర్ మమ్మల్ని అడ్డుకోవచ్చు. కానీ మేము అటువంటి షూలను ధరించలేదు. అయినా క్యూరేటర్ మమ్మల్ని ఎందుకు ఆపాడో ఆర్ధం కావడం లేదు. మేము ఇప్పటివరకు ఈ సిరీస్లో నాలుగు మ్యాచ్లు ఆడాము. ఏ క్యూరేటర్ కూడా మాకు ఇలాంటి సూచనలు ఇవ్వలేదు" అని ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో గిల్ పేర్కొన్నాడు.కాగా ఐదో టెస్టు గురువారం నుంచి ఓవల్ మైదానం వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేసుకోవాలని భారత్ భావిస్తుంటే.. ఇంగ్లండ్ మాత్రం ఎలాగైనా పర్యటక జట్టును ఓడించి 3-1 తేడాతో సిరీస్ దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో ఐదో టెస్టు.. అర్ష్దీప్ అరంగేట్రం! అతడికి మరోసారి నో ఛాన్స్? -
ఇంగ్లండ్తో ఐదో టెస్టు.. అర్ష్దీప్ అరంగేట్రం! అతడికి మరోసారి నో ఛాన్స్?
లండన్లోని ఓవల్ మైదానం వేదిగా ఇంగ్లండ్తో ఆఖరి టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను 2-2తో సమం చేయాలని భారత జట్టు భావిస్తోంది. ఈ కీలక మ్యాచ్లో ఆడేందుకు భారత్ తమ తుది జట్టులో మూడు మార్పులు చేసే అవకాశముంది. అరంగేట్ర మ్యాచ్లో విఫలమైన అన్షుల్ కాంబోజ్ వేటు వేసేందుకు గంభీర్ అండ్కో సిద్దమైనట్లు తెలుస్తోంది.అదేవిధంగా వర్క్లోడ్ లోడ్ మెనెజ్మెంట్లో భాగంగా జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గాయంతో ఐదో టెస్టుకు దూరమైన పంత్ స్దానంలో ధ్రువ్ జురెల్ జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. ఇక ఈ మ్యాచ్తో టీమిండియా స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నట్లు భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ హింట్ ఇచ్చాడు. "ఆఖరి టెస్టు కోసం అర్ష్దీప్ను సిద్దంగా ఉండమని చెప్పాం. కానీ ఈ సాయంత్రం పిచ్ను పరిశీలించిన తర్వాత ప్లేయింగ్ ఎలెవన్పై నిర్ణయం తీసుకుంటాము" అని గిల్ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. గిల్ వ్యాఖ్యలు బట్టి అర్ష్దీప్ భారత వైట్బాల్ జెర్సీలో కన్పించే ఛాన్స్ ఉంది. పిచ్పై పచ్చిక ఎక్కువగా ఉన్నందున ఫాస్ట్బౌలర్లకు అనుకూలించింది. ఈ క్రమంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కంటే అర్ష్దీప్ వైపే మెనెజ్మెంట్ ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ జట్టు ఒక్క ఫ్రంట్లైన్ స్పిన్నర్ లేకుండా ఆడుతోంది. మాకు మాత్రం జడేజా,వాషింగ్టన్లో రూపంలో ఇద్దు స్పిన్నర్లు ఉన్నారని గిల్ చెప్పుకొచ్చాడు. గిల్ వ్యాఖ్యలు బట్టి కుల్దీప్ బెంచ్కు పరిమితం కావడం దాదాపు ఖాయం.కాగా అన్షుల్ కాంబోజ్ స్దానంలో అర్ష్దీప్, బుమ్రా స్ధానంలో ఆకాష్ దీప్ ఆడనున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అయితే మాంచెస్టర్లో బంతితో విఫలమైన శార్ధూల్ ఠాకూర్ను తుది జట్టులో కొనసాగిస్తారా లేదా వేరే ఆటగాడికి ఛాన్స్ ఇస్తారా అన్నది వేచి చూడాలి.స్టోక్స్ దూరం..మరోవైపు ఆఖరి టెస్టు కోసం ఇంగ్లండ్ తమ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించింది. ఆతిథ్య జట్టు ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగనుంది. ఈ కీలక మ్యాచ్ నుంచి కెప్టెన్ బెన్ స్టోక్స్ భుజం గాయంతో తప్పుకొన్నాడు. స్టోక్స్ స్దానంలో జాకబ్ బెతల్కు అవకాశమిచ్చారు.అదేవిధంగా ఆర్చర్, కార్స్లకు విశ్రాంతినివ్వగా...గత టెస్టులో పూర్తిగా విఫలమైన స్పిన్నర్ డాసన్ను ముందే పక్కన పెట్టారు. వీరి ముగ్గురి స్ధానాల్లో అట్కిన్సన్, ఒవర్టన్, టంగ్ జట్టులోకి వచ్చారు.తుది జట్ల వివరాలు: భారత్ (అంచనా): శుబ్మన్ గిల్ (కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్, శార్దుల్ ఠాకూర్/ప్రసిధ్ కృష్ణ, అర్ష్ దీప్ సింగ్, ఆకాశ్దీప్, సిరాజ్.ఇంగ్లండ్: ఓలీ పోప్ (కెప్టెన్ ), జాక్ క్రాలీ, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెతెల్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, అట్కిన్సన్, ఒవర్టన్, టంగ్.చదవండి: Asia Cup 2025: ఆసియాకప్-2025కు జస్ప్రీత్ బుమ్రా దూరం! అతడు కూడా? -
భారత్తో ఐదో టెస్ట్కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్.. తుది జట్టులో 4 మార్పులు
లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం వేదికగా రేపటి నుంచి (జులై 31) టీమిండియాతో ప్రారంభం కాబోయే ఐదో టెస్ట్కు ముందు ఇంగ్లండ్ జట్టుకు అతి భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, ఇన్ ఫామ్ ప్లేయర్ బెన్ స్టోక్స్ భుజం గాయం కారణంగా కీలకమైన మ్యాచ్కు దూరమయ్యాడు. స్టోక్స్ మాంచెస్టర్లో జరిగిన నాలుగో టెస్ట్లో ఏకంగా 35 ఓవర్లు వేసి గాయాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటర్లు వీరోచితంగా పోరాడుతున్న సమయంలోనే స్టోక్స్ చాలా అసౌకర్యంగా కనిపించాడు. అప్పుడే అతని పని అయిపోయిందని అంతా అనుకున్నారు. నాలుగో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు ఐదుకు పైగా సెషన్లలో ఏకంగా 143 ఓవర్లు బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్ బౌలర్ల రసాన్ని పీల్చారు. స్టోక్స్ దాని బాదితుడే. ఆ మ్యాచ్లో స్టోక్స్ బంతితో పాటు బ్యాట్తోనూ చెలరేగి (5 వికెట్ల ప్రదర్శన సహా 6 వికెట్లు, సెంచరీ) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.అంతకుముందు వారు గెలిచిన మూడో టెస్ట్లోనూ స్టోక్సే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఆ మ్యాచ్లో అతను 77 పరుగులు చేసి, 5 వికెట్లు తీశాడు. ఈ సిరీస్లో లీడింగ్ వికెట్ టేకర్గా (17 వికెట్లు) నిలవడంతో పాటు బ్యాట్తోనూ మంచి టచ్లో ఉన్న స్టోక్స్ కీలకమైన ఐదో టెస్ట్కు దూరం కావడం ఇంగ్లండ్ విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది.కెప్టెన్గా పోప్స్టోక్స్ గైర్హాజరీలో ఐదో టెస్ట్లో ఇంగ్లండ్ కెప్టెన్గా ఓలీ పోప్ వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తుది జట్టును కూడా ప్రకటించింది. ఇందులో ఏకంగా నాలుగు మార్పులు చేసింది. గాయపడిన స్టోక్స్ స్థానంలో జేమీ ఓవర్టన్ తుది జట్టులోకి రాగా.. జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ స్థానాల్లో జేకబ్ బేతెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్లకు తుది జట్టులో స్థానం కల్పించింది. జేకబ్ బేతెల్ ఆరో స్థానంలో బ్యాటింగ్కు వస్తాడని స్పష్టం చేసింది.కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ ప్రస్తుతం 1-2తో వెనుకపడి ఉంది. ఇందులో 1,3 మ్యాచ్లు ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో మ్యాచ్లో విజయం సాధించింది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఐదో టెస్ట్లో భారత్ విజయం సాధిస్తే సిరీస్ సమం అవుతుంది. ఓడినా, డ్రా అయినా ఇంగ్లండ్ వశమవుతుంది. ఇలాంటి కీలక మ్యాచ్లో ఇన్ ఫామ్ ఆల్రౌండర్ స్టోక్స్ లేకపోవడం భారత్కు తప్పక కలిసొచ్చే విషయమే. -
గౌతమ్ గంభీర్కు వార్నింగ్ ఇచ్చిన పిచ్ క్యూరేటర్.. తనదైన శైలిలో ఫైరైన టీమిండియా హెడ్ కోచ్
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్ట్కు వేదికైన కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఇవాళ (జులై 29) ఘర్షనాత్మక వాతావరణం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్పై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినట్లు సమాచారం. HEATED ARGUMENT BETWEEN INDIA'S HEAD COACH GAUTAM GAMBHIR & OVAL STADIUM'S PITCH CURATOR. 🥶🤯 (PTI).pic.twitter.com/WX9R9fWvQ8— Tanuj (@ImTanujSingh) July 29, 2025ఫోర్టిస్పై గంభీర్ ఫైరవడానికి గల అసలు కారణాలు తెలియనప్పటికీ.. పిచ్ ప్రిపరేషన్ విషయంలో వాగ్వాదం తలెత్తినట్లు సోషల్మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియోల ద్వారా తెలుస్తుంది.పిచ్పై అతిగా పచ్చిక అమర్చడాన్ని గంభీర్ వ్యతిరేకించినట్లు సమాచారం. ఈ విషయమై గంభీర్ ఫోర్టిస్ను సంప్రదించగా తలబిరుసుగా సమాధానం చెప్పాడట. Gautam Gambhir has a heated argument with The Oval stadium's pitch curator. 🤯 (Raysportz).pic.twitter.com/RbTyMGcDSV— Tanuj (@ImTanujSingh) July 29, 2025దీంతో చిర్రెత్తిపోయిన గంభీర్ ఫోర్టిస్పై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడని సమాచారం. ఓ దశలో ఫోర్టిస్ గంభీర్పై ఫిర్యాదుకు ధమ్కీ ఇచ్చాడని.. ఇందుకు ప్రతిగా గంభీర్ ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పో అని అన్నాడని సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది.గంభీర్ ఫోర్టిస్పై ఫైరవుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్మీడియాలో ట్రెండ్ అవుతుంది. వీడెవడో పోయి పోయి గంభీర్తో పెట్టుకున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గంభీర్ ముక్కోపి అన్న విషయం తెలిసిందే. అతనికి కోపం వస్తే తనా మనా అని చూడడు. ఇది గతంలో చాలా సందర్భాల్లో చూశాం. 2024 ఐపీఎల్ సందర్భంగా గంభీర్ విరాట్ కోహ్లి లాంటి దిగ్గజ ఆటగాడిని కూడా వదిలిపెట్టలేదు.కాగా, భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్ట్ కోసం ఓవల్ మైదానంలో దట్టమైన పచ్చికతో పిచ్ను తయారు చేసినట్లు తెలుస్తుంది. దీని వల్ల ఇంగ్లండ్ పేసర్లకు అదనపు ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. ఇందుకే గంభీర్ క్యూరేటర్తో గొడవ పడి ఉండవచ్చు.ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో మొదటి, మూడు టెస్ట్లు ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో టెస్ట్లో విజయం సాధించింది. తాజాగా జరిగిన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు వీరోచితంగా పోరాడి ఇంగ్లండ్ గెలుపును అడ్డుకున్నారు. జులై 31 నుంచి ఐదో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. ఇంగ్లండ్ గెలిచినా లేదా డ్రా అయినా సిరీస్ వారి వశమే అవుతుంది. -
ఆర్చర్ను పక్కన పెట్టండి.. అతడిని జట్టులోకి తీసుకోండి: బ్రాడ్
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు గెలిచి సిరీస్ను 3-1 సొంతం చేసుకోవాలని భావించిన ఇంగ్లండ్ జట్టుకు టీమిండియా ఝులక్ ఇచ్చింది. ఆ మ్యాచ్ను భారత జట్టు తమ విరోచిత పోరాటంతో డ్రా ముగించింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య ఆఖరి టెస్టు జూలై 31 నుంచి లండన్లోని ఓవెల్ మైదానం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని ఇంగ్లండ్ భావిస్తుంటే.. భారత్ మాత్రం ప్రత్యర్ధిని ఓడించి సిరీస్ సమం చేయాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ టీమ్మెనెజ్మెంట్కు ఆ దేశ మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ కీలక సూచన చేశాడు. ఓవెల్ టెస్టులో జోఫ్రా ఆర్చర్కు బదులుగా గాస్ అట్కినసన్ను ఆడించాలని బ్రాడ్ అభిప్రాయపడ్డాడు."ఐదో టెస్టుకు జోఫ్రా ఆర్చర్కు విశ్రాంతి ఇవ్వాలి. అతడి స్ధానంలో గస్ అట్కిన్సన్ ఆడించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అతడిపై పస్తుతం ఎటువంటి వర్క్లోడ్ లేదు. ఆఖరి టెస్టులో అతడిని ఖచ్చితంగా ఆడించాలి. అట్కిన్సన్ టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు సరైన ప్రత్యర్ధిని ఎదుర్కొలేదు. అదేవిధంగా బ్రైడన్ కార్స్ కూడా బాగా ఆలిసిపోయాడు. నాలుగో టెస్టులో అతడు అంత కంఫర్ట్గా కన్పించలేదు. కానీ ఈ సిరీస్లో అతడు అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. కార్స్కు విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో టీమ్మెనెజ్మెంట్ ఉండొచ్చు. ఒకవేళ అదే జరిగితే అట్కినసన్ జట్టులోకి రావడం ఖాయం. జోష్ టంగ్ రూపంలో కూడా మరో ఆప్షన్ ఉంది. అతడు తొలి టెస్టులో మాత్రమే ఆడాడు. టంగ్ భారత లోయర్ ఆర్డర్ ఆటగాళ్లను ఔట్ చేసి వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ అతడికి అద్బుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. కాబట్టి ఆర్చర్కు ప్రత్యామ్నాయంగా టంగ్ను కూడా జట్టులోకి తీసుకొవచ్చు" అని స్కై స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రాడ్ పేర్కొన్నాడు. -
నా కొడుకు ఏమి తప్పు చేశాడు: సెలక్టర్లపై సుందర్ తండ్రి ఫైర్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టును టీమిండియా డ్రా ముగించడంలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ది కీలక పాత్ర. ఈ మ్యాచ్లో సుందర్ తన విరోచిత పోరాటంతో జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. మరో ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి ఐదో వికెట్కు 203 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు.ఈ తమిళనాడు ఆటగాడు మొత్తంగా 206 బంతులు ఎదుర్కొని 101 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో సుందర్పై అందరూ ప్రంశసల వర్షం కురిపిస్తుంటే.. అతడి తండ్రి మణి సుందర్ మాత్రం కీలక వ్యాఖ్యలు చేశాడు. తన కుమారుడు నిలకడగా రాణిస్తున్నప్పటికి, జాతీయ జట్టులో ఎక్కువగా అవకాశాలు ఇవ్వడం లేదని భారత సెలక్టర్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు"వాషింగ్టన్ తను ఆడిన ప్రతీ మ్యాచ్లోనూ మెరుగైన ప్రదర్శన కనబరిస్తున్నాడు. గత కొంతకాలంగా అతడు నిలకడగా రాణిస్తున్నాడు. కానీ వాషీకి పెద్దగా గుర్తింపు లభించలేదు. భారత జట్టు అభిమానులు సైతం సుందర్ ప్రదర్శనలను గుర్తించడం లేదు. మిగితా ఆటగాళ్లు బాగా ఆడకపోయినా, వారికి క్రమం తప్పకుండా అవకాశాలు లభిస్తున్నాయి. నా కొడుకు మాత్రం బాగా ఆడిన కూడా రెగ్యూలర్గా ఛాన్స్లు లభించలేదు. నాలుగో టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్లో ఐదో స్దానంలో బ్యాటింగ్కు వచ్చినట్లగానే మిగితా మ్యాచ్లలో కూడా అదే పొజిషన్లో అతడిని పంపాలి. వరుసగా 10 మ్యాచ్లలో నా కుమారుడిని ఆడించాలి. ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో వాషీకి చోటు దక్కకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. సెలక్టర్లు అతడి ప్రదర్శలనపై ఓ కన్నేసి ఉంచాలి" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంమ్ సుందర్ పేర్కొన్నాడు.2021లో భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన సుందర్.. ఇప్పటివరకు కేవలం 12 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. 12 మ్యాచ్లలో 44.87 సగటుతో 673 పరుగులు చేసిన వాషీ.. 32 వికెట్లు కూగా పడగొట్టాడు.చదవండి: ‘వేరొకరి భర్తను లాక్కోవడం కూడా మోసమే కదా’ -
ఆఖరి టెస్టులో బుమ్రా ఆడుతాడా? కీలక అప్డేట్ ఇచ్చిన గంభీర్
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ తుది అంకానికి చేరుకుంది. ఈ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదో టెస్టు జూలై 31 నుంచి లండన్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచి లేదా డ్రాగా ముగించైనా సిరీస్ను సొంతం చేసుకోవాలని ఇంగ్లండ్ భావిస్తుంటే, టీమిండియా మాత్రం ప్రత్యర్ధిని ఓడించి సిరీస్ను సమం చేయాలని పట్టుదలతో ఉంది.అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియాను పేస్ బౌలింగ్ కష్టాలు వెంటాడుతున్నాయి. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతుండగా.. ఆకాష్ దీప్ గజ్జ గాయంతో బాధపడుతున్నాడు. అదేవిధంగా చేతి వేలి గాయం కారణంగా లెఫ్ట్మ్ ఆర్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ ఇప్పటికే ఈ సిరీస్ నుంచి తప్పుకొన్నాడు.అతడి స్ధానంలో జట్టులోకి వచ్చిన యువ పేసర్ అన్షుల్ కాంబోజ్.. తన తొలి మ్యాచ్లో తీవ్ర నిరాశపరిచాడు. అంతకుతోడు ఆఖరి రెండు టెస్టులకు దూరంగా ఉన్న పేసర్ ప్రసిద్ద్ కృష్ణ కూడా చెప్పుకోదగ్గ ఫామ్లో లేడు. దీంతో కీలకమైన ఐదో టెస్టులో భారత ఫాస్ట్ బౌలింగ్ కాంబనేషన్ ఎలా ఉంటుందో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బౌలర్ల ఫిట్నెస్పై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక అప్డేట్ ఇచ్చాడు.ఇంగ్లండ్తో చివరి టెస్టు కోసం జస్ప్రీత్ బుమ్రా సహా భారత బౌలింగ్ బృందమంతా సిద్ధంగా ఉందని, ఎలాంటి గాయాల సమస్య లేదని గంభీర్ స్పష్టం చేశాడు. అయితే బుమ్రా విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, తుది జట్టుకు సంబంధించి ఇంకా చర్చ జరగలేదని అతడు పేర్కొన్నాడు. కాగా మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టును టీమిండియా పోరాడి డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1తో ఇంగ్లండ్ ముందంజలో ఉంది.ఇంగ్లండ్తో ఐదో టెస్టుకు భారత తుది జట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్ -
ఇంగ్లండ్తో ఐదో టెస్టు.. భారత జట్టులో కీలక మార్పులు! వారిద్దరిపై వేటు?
ఇంగ్లండ్తో నాలుగో టెస్టును డ్రా ముగించిన భారత జట్టు.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. లండన్లోని ఓవల్ వేదికగా జూలై 31 నుంచి ప్రారంభం కానున్న ఆఖరి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్తో తాడోపేడో తేల్చుకునేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను 2-2తో సమం చేయాలని గిల్ సేన భావిస్తోంది.అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే ఆఖరి టెస్టుకు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ దూరం కాగా.. ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్పై అనుమానాలు నెలకొన్నాయి. మాంచెస్టర్ టెస్టులో బుమ్రా ఫుల్ ఫిట్నెస్గా కన్పించలేదు. ఈ మ్యాచ్లో ఎక్కువ వేగంతో కూడా జస్ప్రీత్ బౌలింగ్ చేయలేకపోయాడు.ఈ స్టార్ పేసర్ 100కు పైగా పరుగులు సమర్పించుకుని కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. మరోవైపు గాయం కారణంగా నాలుగో టెస్టుకు దూరమైన పేసర్ ఆకాష్ దీప్ ఫిట్నెస్పై ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. అయితే కీలకమైన ఐదో టెస్టులో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగే అవకాశముంది.శార్ధూల్ పై వేటు..!వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్ధానంలో ధ్రువ్ జురెల్ తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. పంత్కు ప్రత్నమయ్నాంగా తమిళనాడు వికెట్ కీపర్ జగదీశన్ నారాయణ్ను సెలక్టర్లు ఎంపిక చేసినప్పటికి.. అనుభవం దృష్ట్యా జురెల్ వైపే మెనెజ్మెంట్ ఆసక్తి చూపే అవకాశముంది.అంతేకాకుండా నాలుగో టెస్టులో బంతితో విఫలమైన ఆల్రౌండర్ శార్ధూల్ ఠాకూర్పై కూడా వేటు పడే ఛాన్స్ ఉంది. అతడి స్ధానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ ఎలెవన్లోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అరంగేట్రంలో తీవ్ర నిరాశపరిచిన పేసర్ అన్షుల్ కాంబోజ్ను కూడా ఓవల్ టెస్టుకు పక్కన పెట్టనున్నట్లు సమాచారం.అతడి స్ధానంలో ఆకాష్ దీప్(ఫిట్నెస్కు లోబడి) లేదా ప్రసిద్ద్ కృష్ణకు అవకాశమివ్వాలని గంభీర్ అండ్ కో భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి బుమ్రాకు ఆఖరి టెస్టులో ఆడిస్తారా లేదా విశ్రాంతి ఇస్తారా అన్నది ఇప్పుడు ప్రశార్ధకంగా మారింది. మరోవైపు ఇంగ్లండ్ ఐదో టెస్టుకు తమ జట్టును ప్రకటించింది. బౌలింగ్ ఆల్రౌండర్ జేమి ఓవర్టన్కు తిరిగి మళ్లీ ఇంగ్లీష్ జట్టు సెలక్టర్లు పిలుపునిచ్చారు.ఇంగ్లండ్తో ఐదో టెస్టుకు భారత తుది జట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్చదవండి: వారిద్దరూ అద్బుతం.. మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది: శుబ్మన్ గిల్ -
వారిద్దరూ అద్భుతం.. మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది: శుబ్మన్ గిల్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో ఓటమి అంచుల నుంచి తప్పించుకొని మ్యాచ్ను భారత్ ‘డ్రా’గా ముగించడంపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వచ్చాయి. రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయి టీమిండియా... తర్వాతి ఐదు సెషన్లలో మరో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ప్రత్యర్ధిని నిలువరించగలిగింది. ఇది మన జట్టు పట్టుదలను చూపించింది.మాది ఒక గొప్ప జట్టు..ఈ విషయాన్ని భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాడు. మంచి జట్టుకు, గొప్ప జట్టుకు మధ్య ఉన్న తేడాను తాము చూపించగలిగామని అతను చెప్పాడు. ‘మైదానంలో 143 ఓవర్ల పాటు ఒకే లక్ష్యంతో ఒకే తరహా ఆలోచనతో మానసికంగా దృఢంగా ఉండటం చాలా కష్టం. కానీ మేం దానిని చేసి చూపించాం. ఒక మంచి జట్టుకు, గొప్ప జట్టుకు మధ్య ఇదే ప్రధాన తేడా. ఈ టెస్టులో ఆటతో మాది గొప్ప జట్టని నిరూపించాం’ అని గిల్ వ్యాఖ్యానించాడు.సున్నాకే 2 వికెట్లు కోల్పోయిన దశలో సీనియర్ కేఎల్ రాహుల్తో కలిసి గిల్ నెలకొల్పిన భాగస్వామ్యమే జట్టు రాతను మార్చింది. 70.3 ఓవర్ల వీరి భాగస్వామ్యంలో 188 పరుగులు వచ్చాయి. ఈ పార్ట్నర్షిప్తోనే తాము మ్యాచ్ను కాపాడుకోగలమనే నమ్మకం కలిగిందని గిల్ చెప్పాడు. ‘మా జట్టు పట్టుదలగా ముందుకు వెళ్లాలంటే కావాల్సిన అగ్గిని రగిల్చేందుకు ఒక నిప్పు కణిక అవసరమైంది. నేను, రాహుల్ కలిసి నెలకొల్పిన భాగస్వామ్యం అలాంటిదే. మేం పెట్టుకున్న లక్ష్యాన్ని అందుకోగలమని అప్పుడే అనిపించింది. తుది ఫలితం చాలా సంతోషాన్నిచ్చింది. శనివారం మేం ఉన్న స్థితితో పోలిస్తే మ్యాచ్ను డ్రా చేసుకోవడం ఎంతో సంతృప్తికరం. నా ఇన్నింగ్స్ పట్ల కూడా ఎంతో ఆనందంగా ఉన్నా’ అని గిల్ పేర్కొన్నాడు.భారత్ ఓటమి నుంచి తప్పించుకోవడంలో కీలక పాత్ర పోషించిన జడేజా, సుందర్లపై కూడా కెప్టెన్ ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరు 55.2 ఓవర్లు ఆడి అభేద్యంగా 203 పరుగులు జత చేశారు. ‘జడేజా, సుందర్ క్రీజ్లో ఉన్నప్పుడు కూడా బ్యాటింగ్కు అంత అనుకూల పరిస్థితి ఏమీ లేదు.బంతి అనూహ్యంగా స్పందిస్తోంది. కానీ అలాంటి స్థితి నుంచి ప్రశాంతంగా ఆడుతూ ఇద్దరూ సెంచరీలు సాధించడం చాలా గొప్ప విషయం. ఏకాగ్రత చెదరకుండా ప్రతీ బంతిపై వారు దృష్టి పెట్టి డ్రా వరకు తీసుకెళ్లడం ఎంతో ప్రత్యేకం. ఇది మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అని గిల్ అన్నాడు.చదవండి: IND vs PAK: ‘పాక్తో మ్యాచ్ ఆడాలి’!.. గంగూలీపై అభిమానుల ఆగ్రహం -
అవిశ్రాంత యోధుడు సిరాజ్.. కోహ్లిని కూడా దాటేశాడు..!
హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఇటీవలి కాలంలో టీమిండియా ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా మారిపోయాడు. ముఖ్యంగా టెస్ట్ల్లో అవిశ్రాంత యోధుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా మాంచెస్టర్ టెస్ట్లో పాల్గొన్న సిరాజ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ దశాబ్దంలో (2020ల్లో) భారత్ తరఫున అత్యధిక టెస్ట్లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిని సైతం అధిగమించాడు. విరాట్ 2020 నుంచి టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించకముందు వరకు 39 టెస్ట్లు ఆడగా.. సిరాజ్ మాంచెస్టర్ టెస్ట్తో 40వ టెస్ట్ పూర్తి చేసుకున్నాడు. 2020 డిసెంబర్లో టీమిండియా తరఫున టెస్ట్ అరంగేట్రం చేసిన సిరాజ్.. ఆ ఏడాదంతా (2020) టెస్ట్లు ఆడకపోయినా ఈ దశాబ్దంలో భారత్ తరఫున అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా నిలవడం విశేషం.వర్క్ లోడ్ కారణంగా మేనేజ్మెంట్ రొటేషన్ పాలసీని ప్రవేశపెట్టినప్పటికీ సిరాజ్ టీమిండియా ఆడిన ప్రతి టెస్ట్ మ్యాచ్లోనూ ఆడాల్సి వస్తుంది. పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు క్రమం తప్పకుండా విశ్రాంతినిస్తున్న మేనేజ్మెంట్ సిరాజ్ను మాత్రం దాదాపుగా ప్రతి మ్యాచ్లో ఆడిస్తుంది. లెక్కలు చూసుకోవడానికి ఇది బాగానే ఉన్నా పరిస్థితి ఇలాగే కొనసాగితే సిరాజ్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.పని భారం ఎక్కువై సిరాజ్ గాయాల బారిన పడితే కెరీర్ అర్దంతరంగా ముగిసే ప్రమాదం ఉంది. ఇప్పటికే సిరాజ్ వయసు 31 సంవత్సరాలు. ఇలా నిర్విరామంగా ఆడితే అతని కెరీర్ మరో రెండు, మూడేళ్లకు మించి కొనసాగే అవకాశం ఉండదు. టీమిండియా మేనేజ్మెంట్ ఇకనైనా మేల్కొని సిరాజ్కు కూడా వరుస విరామాల్లో విశ్రాంతి కల్పించకపోతే చేజేతులా ఓ టాలెంటెడ్ క్రికెటర్ కెరీర్ను ప్రమాదంలోకి తోసేసినట్లవుతుంది. సిరాజ్ తాజాగా ముగిసిన మాంచెస్టర్ టెస్ట్లో సింహభాగం బౌలింగ్ చేశాడు. 24 ఏళ్ల యువ పేసర్ అన్షుల్ కంబోజ్ కేవలం 18 ఓవర్లు వేస్తే సిరాజ్ బుమ్రా తర్వాత అత్యధికంగా 30 ఓవర్లు బౌలింగ్ చేశాడు. కెప్టెన్లకు సిరాజ్పై ఉన్న నమ్మకంతో అతనికే తరుచూ బౌలింగ్ రొటేట్ చేస్తున్నారు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇది సమంజసమే అయినప్పటికీ.. ఓ టాలెండెట్ బౌలర్ అర్దంతరంగా ముగిసిపోయే ప్రమాదం ఉంది.సిరాజ్ త్వరలో తన కెరీర్లో 41వ టెస్ట్ ఆడటం కూడా దాదాపుగా ఖరారైంది. ఇంగ్లండ్తో ఐదో టెస్ట్లో ఒకవేళ బుమ్రాకు విశ్రాంతినిచ్చినా సిరాజ్ను మాత్రం తప్పక ఆడిస్తారు. ఈ విషయంలో టీమిండియాకు మరో ఆప్షన్ కూడా లేదు. సత్తా చాటుతాడనుకున్న యువ పేసర్ అన్షుల్ కంబోజ్ నాలుగో టెస్ట్లో ప్రభావం చూపలేకపోయాడు. మరో ఆప్షన్ అయిన ప్రసిద్ద్ కృష్ణను మేనేజ్మెంట్ నమ్మే పరిస్థితుల్లో లేదు. మరో రెండు ఆప్షన్లైన ఆకాశ్దీప్, అర్షదీప్ సింగ్ గాయాలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో జులై 31 నుంచి ప్రారంభమయ్యే ఐదో టెస్ట్లో సిరాజ్ ఆడటం దాదాపుగా ఖాయమనే చెప్పాలి. -
మాంచెస్టర్ టెస్ట్ హీరోలు.. కేఎల్ రాహుల్కు క్రెడిట్ ఇవ్వని ఎల్ఎస్జీ
మాంచెస్టర్ టెస్ట్లో వీరోచితంగా పోరాడి ఇంగ్లండ్ గెలుపును అడ్డుకున్న టీమిండియా హీరోలు కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. అభిమానులు, విశ్లేషకులు, వారు, వీరు అన్న తేడా లేకుండా అందరూ పై నలుగురిని కొనియాడుతున్నారు. ఈ మ్యాచ్లో 311 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన భారత్ (నాలుగో రోజు).. ఖాతా తెరవకుండానే యశస్వి జైస్వాల్ (0), సాయి సుదర్శన్ (0) వికెట్లు కోల్పోయింది.ఈ దశలో కేఎల్ రాహుల్ (90), శుభ్మన్ గిల్ (103) న భూతో న భవిష్యతి అన్న రీతిలో బ్యాటింగ్ చేసి మూడో వికెట్కు రికార్డు స్థాయిలో 188 పరుగులు జోడించారు. ఆతర్వాత వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా (107 నాటౌట్) వీరోచిత శతకాలు బాది మ్యాచ్ను డ్రా చేశారు.పై నలుగురిలో గిల్, జడ్డూ, సుందర్ సెంచరీలు చేయగా.. రాహుల్ తృటిలో ఆ మార్కును చేజార్చుకున్నాడు. స్టోక్స్ అద్బుతమైన బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో రాహుల్ మూడంకెల స్కోర్ను చేరుకోలేకపోయాడు. రాహుల్ సెంచరీ చేయకపోయినా, చారిత్రక ఇన్నింగ్స్ ఆడి, ఇంగ్లండ్ గెలుపును అడ్డుకునేందుకు తొలి మెట్టు పేర్చాడు.అంకెల విషయాన్ని పక్కన పెడితే సున్నాకే 2 వికెట్లు కోల్పోయిన దశలో గిల్తో పాటు రాహుల్ ప్రదర్శించిన పోరాటపటిమ చరిత్రలో నిలిచిపోతుంది. మూడంకెల స్కోర్ అందుకోలేకపోయాడన్న విషయం తప్పించి, సెంచరీలు చేసిన గిల్, జడ్డూ, సుందర్తో పాటు రాహల్ను కూడా వేనోళ్ల పొగడాల్సిందే.The men who made it happen 🫡 pic.twitter.com/6zST20o0Dp— Lucknow Super Giants (@LucknowIPL) July 28, 2025ఇదిలా ఉంటే, ఐపీఎల్లో రాహుల్ మాజీ ఫ్రాంచైజీ అయిన లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం అతని ఇన్నింగ్స్ను విస్మరించి, మిగతా ముగ్గురికి క్రెడిట్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇవాళ (జులై 28) ఉదయం ఎల్ఎస్జీ తమ అధికారిక సోషల్మీడియా ఖాతాలను నుంచి పోస్ట్ చేస్తూ.. The men who made it happen అంటూ గిల్, జడ్డూ, సుందర్కు మాత్రమే క్రెడిట్ ఇచ్చింది. ఇందులో రాహుల్ ప్రస్తావన లేకపోవడాన్ని క్రికెట్ అభిమానులు తప్పుబడుతున్నారు. రాహుల్ అంటే ఎందుకంత చిన్న చూపు అంటూ ఎల్ఎస్జీకి అక్షింతలు వేస్తున్నారు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మ్యాచ్ భారత్ నుంచి చేజారకుండా ఉండటంలో రాహుల్ది కూడా ప్రధానపాత్ర అని అతని అభిమానులు అంటున్నారు. కాగా, ఎల్ఎస్జీ యాజమాన్యానికి రాహుల్ విషయంలో ఇలా ప్రవర్తించడం కొత్తేమీ కాదు. రాహుల్ తమ ఫ్రాంచైజీని వదిలి ఢిల్లీకి వెళ్లాడన్న అక్కసుతో వీలు చిక్కినప్పుడల్లా ఇలాగే ప్రవర్తిస్తుంటుంది. -
బెన్ స్టోక్స్ సరికొత్త చరిత్ర
భారత్, ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటర్లు కేఎల్ రాహుల్ (90), శుభ్మన్ గిల్ (103), వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా (107 నాటౌట్) వీరోచితంగా పోరాడి ఇంగ్లండ్ గెలుపును అడ్డుకున్నారు. 311 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన భారత్.. ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ అనూహ్య రీతిలో పుంజుకుంది. రాహుల్, గిల్, సుందర్, జడ్డూ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్లు ఆడటంతో భారత్ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసింది. జో రూట్ (150), బెన్ స్టోక్స్ (141) భారీ శతకాలతో కదంతొక్కడంతో 669 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4, బుమ్రా, సుందర్ తలో 2, అన్షుల్ కంబోజ్, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, రిషబ్ పంత్ 54, శార్దూల్ ఠాకూర్ 41 రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లు తీశాడు.స్టోక్స్ సరికొత్త చరిత్రఈ మ్యాచ్లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆల్రౌండ్ ప్రదర్శనతో (141 పరుగులు, 6 వికెట్లు) ఇరగదీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ ప్రదర్శన అనంతరం స్టోక్స్ చరిత్రలో ఏ ఇంగ్లండ్ కెప్టెన్కు సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనతను సాధించాడు. ఈ సిరీస్లో స్టోక్స్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 300 పైచిలుకు (304) పరుగులు చేసి, 15కు పైగా (17) వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ ఇతర కెప్టెన్ ఓ సిరీస్లో 300 ప్లస్ పరుగులు చేసి 15 ప్లస్ వికెట్లు తీయలేదు. మరో ఇంగ్లండ్ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ఈ ఘనత సాధించినప్పటికీ సాధారణ ఆటగాడిగానే సాధించాడు. ఈ సిరీస్లో స్టోక్స్ మరో టెస్ట్ ఆడేది ఉండగా.. మరిన్ని పరుగులు, వికెట్లు తీసే అవకాశం ఉంది.నాలుగో టెస్ట్ డ్రా అయినా ఈ సిరీస్లో ఇంగ్లండ్ ఆధిక్యం 2-1తో కొనసాగుతూ ఉంది. చివరిదైన ఐదో టెస్ట్ జులై 31 నుంచి లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో ఒకటి, మూడు మ్యాచ్లు ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో మ్యాచ్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. -
భారత్తో ఐదో టెస్ట్.. మరో ఫాస్ట్ బౌలింగ్ అస్త్రాన్ని ప్రయోగించనున్న ఇంగ్లండ్
జులై 31 నుంచి లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా టీమిండియాతో జరుగబోయే ఐదో టెస్ట్ కోసం అప్డేటెడ్ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) ఇవాళ (జులై 28) ప్రకటించింది. ఈ మ్యాచ్ కోసం నాలుగో టెస్ట్ ఆడిన జట్టును యధాతథంగా కొనసాగించిన ఈసీబీ అదనంగా మరో ఫాస్ట్ బౌలర్ను జట్టులో చేర్చుకుంది. 31 ఏళ్ల జేమీ ఓవర్టన్ ఐదో టెస్ట్ కోసం జట్టులో భాగం కానున్నాడు.నాలుగో టెస్ట్ సందర్భంగా కెప్టెన్ బెన్ స్టోక్స్ అసౌకర్యంగా కనిపించడంతో అతనికి బ్యాకప్గా జేమీని ఎంపిక చేశారు. జేమీ చేరికతో జట్టులో పేసర్ల సంఖ్య ఏడుకు చేరింది. ఇప్పటికే బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, జోష్ టంగ్, గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ లాంటి పేసర్లు జట్టులో ఉన్నారు.జేమీ చివరిగా 2022లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అతనికి కెరీర్లో అదే ఏకైక టెస్ట్ మ్యాచ్. నాడు న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో జేమీ 97 పరుగులు (ఒకే ఇన్నింగ్స్లో) చేసి, 2 వికెట్లు తీశాడు. జేమీ ఇటీవల ముగిసిన ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు.భారత్తో ఐదో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, జాక్ క్రాలే, లియామ్ డాసన్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, ఓల్లీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్కాగా, మాంచెస్టర్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య నిన్న ముగిసిన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు వీరోచితంగా పోరాడారు. 311 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన భారత్ (నాలుగో రోజు).. ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ ఊహకందని రీతిలో పుంజుకుంది.కేఎల్ రాహుల్ (90), శుభ్మన్ గిల్ (103), వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా (107 నాటౌట్) న భూతో న భవిష్యతి అన్న రీతితో బ్యాటింగ్ చేసి మ్యాచ్ను డ్రా చేశారు. ముఖ్యంగా సుందర్-జడేజా జోడీ ప్రదర్శించిన పోరాటపటిమ చరిత్రలో నిలిచిపోనుంది. ఈ మ్యాచ్ డ్రా కావడంతో సిరీస్లో ఇంగ్లండ్ ఆధిపత్యం 2-1తో కొనసాగుతుంది. ఈ సిరీస్లో ఒకటి, మూడు మ్యాచ్లు ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో మ్యాచ్లో విజయం సాధించింది. -
IND vs ENG: సుందర్-జడేజా జోడీ సరికొత్త చరిత్ర..
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టు.. భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోనుంది. ఓటమి తప్పదనుకున్న చోట భారత బ్యాటర్లు అద్బుతం చేశారు. తమ విరోచిత పోరాటంతో మ్యాచ్ను డ్రా ముగించి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకున్నారు.ఈ మ్యాచ్ను భారత్ డ్రా ముగించడంలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లది కీలక పాత్ర. ఆఖరి రోజు ఆటలో కేఎల్ రాహుల్, శుబ్మన్ గిల్ ఔటైన తర్వాత ఈ ఇద్దరు ఆల్రౌండర్లు జట్టు బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు.ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ తమ సెంచరీల మార్క్ను అందుకున్నారు. ఇద్దరూ కలసి ఐదో వికెట్కు 203 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించారు. ఈ క్రమంలో ఈ ఎడమ చేతి వాటం జోడీ ఓ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకున్నారు.ఓల్డ్ట్రాఫర్డ్ మైదానంలో టెస్టుల్లో ఐదో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన భారత జోడీగా సుందర్- జడేజా నిలిచారు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, మహ్మద్ అజారుద్దీన్ పేరిట ఉండేది. ఈ ఇద్దరు లెజెండరీ క్రికెటర్లు 1990లో మాంచెస్టర్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్లో ఐదో వికెట్కు 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తాజా మ్యాచ్తో ఈ ఆల్టైమ్ రికార్డు బ్రేక్ అయ్యింది. ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు జూలై 31 నుంచి లండన్లోని ఓవెల్ వేదికగా జరగనుంది.చదవండి: మీ వాళ్లైతే ఇలాగే చేస్తావా?.. స్టోక్స్పై మండిపడ్డ గంభీర్ -
రిషబ్ పంత్ స్ధానంలో 'వైల్డ్ కార్డ్' ఎంట్రీ.. ఎవరీ జగదీశన్?
లండన్లోని ఓవల్ వేదికగా ఇంగ్లండ్ జరగనున్న ఐదో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. నాలుగో టెస్టులో గాయపడిన స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఓవల్ టెస్టుకు దూరమయ్యాడు. మాంచెస్టర్లో టెస్టులో బంతి బలంగా తాకడంతో కుడి కాలి బొటనవేలి ఫ్రాక్చర్ అయింది. ఈ క్రమంలోనే తిరిగి స్వదేశానికి పయనమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది."మాంచెస్టర్లో ఇంగ్లండ్తో జరిగిన నాల్గవ టెస్ట్ సందర్భంగా పంత్ కుడి పాదానికి ఫ్రాక్చర్ అయింది. దీంతో ఈ సిరీస్లోని ఆఖరి టెస్టుకు అతడు దూరమయ్యాడు. అతడు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉండనున్నాడు. త్వరగా కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని" ఆశిస్తున్నామని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.కాగా ఇది నిజంగా భారత్కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. రిషబ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ సిరీస్లో 4 మ్యాచ్లు ఆడి 479 పరుగులు చేశాడు. ఇక అతడి స్ధానాన్ని వికెట్ కీపర్ బ్యాటర్ నారాయణ్ జగదీశన్తో సెలక్టర్లతో భర్తీ చేశారు.జట్టులో పంత్కు ప్రత్యామ్నాయంగా ధ్రువ్ జురెల్ ఉన్నప్పటికి, బ్యాకప్ వికెట్ కీపర్గా జగదీశన్ను తీసుకున్నారు. జగదీశన్ ఇప్పటికే లండన్కు చేరుకున్నాడు. ఈ క్రమంలో ఎవరీ జగదీశన్ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.ఎవరీ జగదీశన్..?తమిళనాడుకు చెందిన టాలెంటడ్ వికెట్ కీపర్ బ్యాటర్ జగదీశన్.. దేశవాళీ క్రికెట్లో తనకంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో జగదీశన్కు అద్బుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 52 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన నారాయణ్.. 47.50 సగటుతో 3,373 పరుగులు. అందులో 10 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత రంజీ ట్రోఫీ సీజన్లో జగదీశన్ తమిళనాడు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఎనిమిది మ్యాచ్లలో 56.16 సగటుతో 674 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. లిస్ట్-ఎ క్రికెట్, టీ20ల్లో కూడా అతడు అదరగొడుతున్నాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (277).. వరుసగా ఐదు ఇన్నింగ్స్లతో సెంచరీలు చేసిన వరల్డ్ రికార్డు అతడి పేరిట ఉన్నాయి.చదవండి: మీ వాళ్లైతే ఇలాగే చేస్తావా?.. స్టోక్స్పై మండిపడ్డ గంభీర్ -
స్టుపిడ్ పనులు చేయొద్దని బ్రూక్కు ముందే చెప్పా: బెన్ స్టోక్స్
మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వ్యవహరించిన తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. భారత బ్యాటర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లు తమ సెంచరీలకు దగ్గరగా ఉన్నప్పుడు స్టోక్స్.. కరచాలనం చేసి మ్యాచ్ను డ్రాగా ముగించాలని కోరుకున్నాడు.ఇంకా అప్పటికి 15 ఓవర్ల ఆట మిగిలి ఉంది. స్టోక్స్ ప్రతిపాదనను జడేజా, సుందర్లు తిరష్కరించారు. దీంతో స్టోక్స్ ఫ్రస్ట్రేషన్ తారస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో స్టోక్స్తో పాటు తన సహచర ఆటగాళ్లు తమ నోటికి పనిచెప్పారు. క్రీడాస్పూర్తిని మరిచి గల్లీ క్రికెటర్లా ప్రవర్తించారు. టీమిండియాకు డ్రాకు ఒప్పుకోలేదనో అక్కసుతో బ్రూక్తో స్టోక్స్ బౌలింగ్ చేశాడు. సాధరణంగా బ్రూక్ చాలా సందర్భాల్లో పార్ట్ టైమ్ స్పిన్నర్గా తన సేవలను అందించాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం బ్రూక్ స్లోగా ఫుల్ టాస్లు వేస్తూ, ఈజీగా పరుగులు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో బౌలింగ్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ కెప్టెన్ భారత అభిమానుల అగ్రహానికి గురయ్యాడు.కాగాఈ హ్యాండ్షేక్ వివాదంపై మ్యాచ్ అనంతరం స్టోక్స్ స్పందించాడు. డ్రా తప్పదనే ఉద్దేశ్యంతో ముందుగానే హ్యాండ్ షేక్ ఇవ్వాలనుకున్నాను స్టోక్స్ తెలిపాడు."రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లు అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. మ్యాచ్ను వారికి అనుకూలంగా మార్చుకోవడంలో వీరిద్దరి భాగస్వామ్యం కీలకం మారింది. వారు బాగా ఆడారని అప్పటికే మేము ఒప్పుకొన్నాము . 80,90 పరుగులతో నాటౌట్గా ఉండి జట్టును క్లిష్ట పరిస్థితి నుంచి కాపాడడం కంటే, సెంచరీ చేసి ఆజేయంగా డ్రెసింగ్స్ రూమ్కు వెళ్లడం ఎక్కువ సంతృప్తి ఇస్తుందని నేను అనుకోవడం లేదు. సెంచరీకి 10 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ ఏదైనా సరే ఫలితం మాత్రం మారదు. ఆ విషయం వారికి కూడా తెలుసు. చాలా క్లిష్ట పరిస్థితి నుంచి జట్టును కాపాడడంలో విజయం సాధించారు. చివరి మ్యాచ్ కంటే ముందు సిరీస్ ఓటమి నుంచి మీ జట్టును కాపాడారు. అంతకుమించి ఇంకేమి కావాలి.అందుకే బ్రూక్కు ఇచ్చా..ఈ మ్యాచ్లో ఫలితం వచ్చే వచ్చే అవకాశం లేనందున, మిగిలిన ఓవర్లను ఫ్రంట్లైన్ బౌలర్లతో బౌలింగ్ చేయించి రిస్క్ తీసుకోడదని భావించాను. మా ప్రధాన బౌలర్లు వర్క్లోడ్ కారణంగా చాలా ఇబ్బందిపడ్డారు.అందుకే బ్రూక్తో బౌలింగ్ చేయించాను. ఎటువంటి స్టుపిడ్ పనులు చేయోద్దని బ్రూక్కు బంతి ఇచ్చే ముందు చెప్పా. మేము అప్పటికే ఎక్కువ సమయం ఫీల్డింగ్ చేసి అలిసిపోయాము. కానీ పరుగులిచ్చి మ్యాచ్ను తొందరగా ముగించాలని మేము అనుకోలేదు. సహజంగా మనం బౌలింగ్ చేయకపోయినా కూడా ఫీల్డ్లో ఉంటే అలసట వస్తుంది. అందుకే డ్రాకు వెళ్లాలని భావించాను. గంట ఆట మాత్రమే ఉన్నప్పుడు డ్రా కోసం షేక్హ్యాండ్స్ ఇచ్చుకోవచ్చు. కానీ అందుకు భారత్ తిరష్కరించింది" అని పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో స్టోక్స్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
బెన్ స్టోక్స్ నోటి దురుసు.. అస్సలు నీవు కెప్టెన్వేనా? వీడియో వైరల్
మాంచెస్టర్ టెస్టును టీమిండియా ఆద్వితీయ పోరాటంతో డ్రా ముగించింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో తమ ఆశలను భారత్ సజీవంగా నిలుపునకుంది. ఓవర్ నైట్స్కోర్ 171/2తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. కేఎల్ రాహుల్(90) వికెట్ను త్వరగానే కోల్పోయింది.లంచ్ విరామానికి ముందు ఇన్ఫామ్ బ్యాటర్ శుబ్మన్ గిల్(103) కూడా పెవిలియన్కు చేరాడు. దీంతో భారత్ ఓటమి తప్పదని అంతా భావించారు. ఈ క్రమంలో సర్ రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్బుతం చేశారు. వీరిద్దరూ తమ ఆసాధరణ బ్యాటింగ్తో ఇంగ్లండ్ ప్లేయర్లు విసుగుతెప్పించారు.ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికి ఈ జోడీని ఇంగ్లండ్ విడగొట్టలేకపోయింది. ఇద్దరూ కలసి ఐదో వికెట్కు 203 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించారు. అయితే వీరిని ఔట్ చేయలేక అలిసిపోయిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. 15 ఓవర్ల ఆట మిగిలూండగానే చేతులెత్తేశాడు.స్టోక్స్ డ్రా ఆఫర్ చేస్తూ రవీంద్ర జడేజా వద్దకు షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అందుకు జడేజా తిరస్కరించాడు. నాకేమి సంబంధం లేదు, కెప్టెన్ చెప్పినట్లు చేస్తా అని జడ్డూ సమాధనమిచ్చాడు. అయితే అప్పటికే రవీంద్ర జడేజా 89 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 80 పరుగులు చేసి సెంచరీలకు చేరువలో ఉన్నారు. అందుకే వారిద్దరూ డ్రాకు అంగీకరించలేదు. దీంతో సహనం కోల్పోయిన స్టోక్స్ తన నోటికి పనిచెప్పాడు. బ్రూక్, బెన్ డకెట్ బౌలింగ్లో సెంచరీలు చేయాలనుకుంటున్నారా అంటూ జడేజాతో వెటకారంగా అన్నాడు. ఇంగ్లండ్ ప్లేయర్లు కూడా స్టోక్స్కు జతయ్యారు. జాక్ క్రాలీ డ్రాకు ఒప్పుకొవచ్చుగా అని జడేజాతో అన్నాడు.కానీ జడేజా, సుందర్ మాత్రం ఒకే మాటపై ముందుకు వెళ్లారు. స్టోక్స్ అన్నవిధంగానే పార్ట్ టైమ్ స్పిన్నర్ హ్యారీ బ్రూక్కు బంతి అందించాడు. బ్రూక్ గల్లీ క్రికెట్లో బౌలింగ్ చేసినట్లు చేశాడు. అతడి బౌలింగ్లోనే సిక్స్ బాది జడేజా(107) సెంచరీ పూర్తి చేసుకోగా.. ఆ తర్వాత రెండు ఓవర్లకే సుందర్(101) తన తొలి టెస్టు సెంచరీ మార్క్ను అందుకున్నాడు.కాగా ఈ మ్యాచ్లో స్టోక్స్ ప్రవర్తనపై నెటిజన్లు ఫైరవతున్నారు. అస్సలు నీకు క్రీడాస్పూర్తి ఉందా? ఆ స్దానంలో మీ ప్లేయర్లు ఉంటే ప్రత్యర్ధి కెప్టెన్ ఇలా చేస్తే ఊరుకుంటావా? అని సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగాScored a hundred, saved the Test, farmed ♾ aura! 💁♂#RavindraJadeja didn't hesitate, till the end 👀#ENGvIND 👉 5th TEST | Starts THU, 31st July, 2:30 PM | Streaming on JioHotstar! pic.twitter.com/cc3INlS07P— Star Sports (@StarSportsIndia) July 27, 2025 -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత జట్టు తమ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్ జరిగిన నాలుగో టెస్టును టీమిండియా డ్రా ముగించింది. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్లో భారత బ్యాటర్లు అద్బుతం చేశారు.రవీంద్ర జడేజా (107 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), కెప్టెన్ శుబ్మన్ గిల్ (103), కేఎల్ రాహుల్(90) తమ విరోచిత పోరాటాలతో భారత్ను ఓటమి నుంచి గటెక్కించారు. 174/2 ఓవర్నైట్ స్కోరుతో చివరి రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. తొలుత రాహుల్, గిల్ అడ్డుగోడగా నిలవగా.. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, జడేజా ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు.వీరిద్దరిని ఔట్ చేయడం ఇంగ్లీష్ బౌలర్ల తరం కాలేదు. ఆఖరికి ఇంగ్లండ్ ప్లేయర్లు దిగొచ్చి డ్రాకు అంగీకరించాలని భారత ప్లేయర్లను కోరారు. కానీ జడేజా, సుందర్లు తమ సెంచరీలు పూర్తియ్యాక డ్రా అంగీకరించారు. ఇక ఈ మ్యాచ్ను డ్రా ముగించిన భారత జట్టు ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.👉ఒక టెస్టు సిరీస్లో అత్యధిక సార్లు 350కు పైగా పరుగులు చేసిన జట్టుగా టీమిండియా వరల్డ్ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న సిరీస్లో భారత్ 7 సార్లు 350+ స్కోర్లు సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది.ఆస్ట్రేలియా మూడు టెస్టు సిరీస్లలో 6 సార్లు 350కు పైగా పరుగులు చేసింది. ఆసీస్ చివరగా 1980లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో 6 సార్లు 350+ స్కోర్లు చేసింది. తాజా మ్యాచ్తో ఆసీస్ ఆల్టైమ్ రికార్డును భారత్ బ్రేక్ చేసింది.👉ఒక టెస్ట్ సిరీస్లో నలుగురు భారత బ్యాటర్లు 400 కంటే ఎక్కువ పరుగులు చేయడం ఇదే తొలిసారి. ఈ సిరీస్లో శుబ్మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా 400కు పైగా పరుగులు చేశారు.చదవండి: చాలా సంతోషంగా ఉంది.. అందుకే వారు షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు: గిల్ -
చాలా సంతోషంగా ఉంది.. అందుకే వారు షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు: గిల్
మాంచెస్టర్లో టీమిండియా అద్బుతం చేసింది. ఓటమి తప్పదనుకున్న చోట భారత ఆటగాళ్లు తమ విరోచిత పోరాటంతో ఇంగ్లండ్తో నాలుగో టెస్టును డ్రాగా ముగించారు. దాదాపు రెండు రోజుల పాటు ఇంగ్లండ్ బౌలర్లకు ఎదురీది మరి మ్యాచ్ను తమ చేజారకుండా కాపాడుకున్నారు.సున్నా పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును కెప్టెన్ శుబ్మన్ గిల్(103), కేల్ రాహుల్(90) తమ అద్బుత బ్యాటింగ్లతో ఆదుకోగా.. ఆ తర్వాత రవీంద్ర జడేజా(185 బంతుల్లో 107 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(206 బంతుల్లో 101 నాటౌట్) ఆజేయ శతకాలతో భారత్ను ఓటమి నుంచి గట్టెక్కించారు.వీరిద్దరి అసమాన పోరాటానికి ఇంగ్లీష్ జట్టు ప్లేయర్లు తమ సహనాన్ని కోల్పోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ రెండు, ఆర్చర్, బెన్ స్టోక్స్ తలా వికెట్ సాధించారు. ఈ మ్యాచ్ డ్రా గా ముగియడంతో సిరీస్ను సమం చేసే అవకాశం టీమిండియాకు లభించింది. ఇక మాంచెస్టర్ టెస్టు డ్రా ముగియడంపై భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పందించాడు.తమ ఆటగాళ్ల అసాధారణ పోరాటంపై గిల్ ప్రశంసల వర్షం కురిపించాడు. "కీలకమైన మ్యాచ్లో మా బ్యాటింగ్ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంది. గత రెండు రోజులుగా మాపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఎందుకంటే వికెట్లు పడితే మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది.నాలుగో రోజును కేఎల్ భాయ్, నేను జాగ్రత్తగా ఆడి ముగించాము. ఐదో రోజు పిచ్ ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో? అనే ఆందోళన నెలకొంది. అందుకే ప్రతీ బంతిని కూడా జాగ్రత్తగా ఆడాలని నిర్ణయించుకున్నాము. అందుకే షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు..మేం ప్రతీ బంతిని ఆచితూచి ఆడుతూ మ్యాచ్ను వీలైనంత ఆఖరివరకు తీసుకెళ్లాలనుకున్నాం. జడేజా, సుందర్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచారు. వారిద్దరూ తమ సెంచరీలకు చేరువలో ఉన్నారు. వారు సెంచరీలు చేసేందుకు ఆర్హులు, అందుకే డ్రాను అంగీకరించేందుకు కరచాలనం చేయలేదు.ఈ సిరీస్లో ప్రతీ మ్యాచ్ ఆఖరి రోజు, చివరి సెషన్ వరకు సాగింది. ఈ సిరీస్ నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాము. ప్రతీ టెస్టు మ్యాచ్ కూడా ఒక కొత్త పాఠాన్ని నేర్పుతోంది. మా ఆఖరి మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను సమం చేసేందుకు ప్రయత్నిస్తాము.ప్రతీసారి కాస్త ఒత్తిడి..నిజాయితీగా చెప్పాలంటే గతంలో ఎన్ని పరుగులు చేశారనేది ముఖ్యం కాదు. వైట్ జెర్సీ ధరించి దేశం కోసం ఆడిన ప్రతీసారి కొంత ఒత్తిడి అనేది ఉంటుంది. అప్పుడే మనం ధైర్యంగా నిలబడాలి. అప్పుడే ఆటను మనం ఎంతగా ప్రేమిస్తున్నామో తెలియజేస్తుంది.నేను బ్యాటింగ్ చేసే ప్రతీ సారి మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటా. నా బ్యాటింగ్ను ఆస్వాదించాలని కోరుకుంటునాను. తొలి ఇన్నింగ్స్లో మేము మంచి స్కోర్ సాధించాము. కానీ మా బ్యాటర్లలో చాలా మంది తమకు లభించిన ఆరంభాలను పెద్ద స్కోర్లగా మలచడంలో విఫలమయ్యారు. ఇలాంటి వికెట్పై ఒకరిద్దరు బ్యాటర్లు భారీ ఇన్నింగ్స్లు ఆడడం చాలా ముఖ్యం. కానీ దురదృష్టవశాత్తూ మేము అలా చేయలేకపోయాము. ఇక బుమ్రా ఫిట్నెస్ గురించి ఇప్పుడే ఏమి చెప్పలేను. అదేవిధంగా మేం మ్యాచ్ గెలుస్తున్నంత కాలం టాస్ గురించి కూడా పట్టించుకోమని" పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్లో గిల్ పేర్కొన్నాడు.సంక్షిప్త స్కోర్లు:భారత్ తొలి ఇన్నింగ్స్ 358 ఆలౌట్( సాయి సుదర్శన్ 61, బెన్ స్టోక్స్ 5/72)ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 669 ఆలౌట్(జోరూట్ 150, బెన్ స్టోక్స్ 141, జడేజా 4/143)భారత్ రెండో ఇన్నింగ్స్: 425/4 (శుభ్మన్ గిల్ 103, జడేజా 107 నాటౌట్, సుందర్ 101 నాటౌట్, క్రిస్ వోక్స్ 2/67)చదవండి: పోరాటం కూడా గర్వించేలా... -
జడేజా, సుందర్ వీరోచిత శతకాలు.. డ్రాగా ముగిసిన నాలుగో టెస్ట్
ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 311 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన భారత్ (నాలుగో రోజు).. ఖాతా తెరవకుండానే యశస్వి జైస్వాల్ (0), సాయి సుదర్శన్ (0) వికెట్లు కోల్పోయినప్పటికీ వీరోచితంగా పోరాడింది.తొలుత కేఎల్ రాహుల్ (90), శుభ్మన్ గిల్ (103) అద్భుతంగా బ్యాటింగ్ చేసి మూడో వికెట్కు రికార్డు స్థాయిలో 188 పరుగులు జోడించగా.. ఆతర్వాత వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా (107 నాటౌట్) వీరోచిత శతకాలు బాది మ్యాచ్ను డ్రా చేశారు. సుందర్-జడేజా జోడీ ఐదో వికెట్కు అజేయమైన 203 పరుగులు జోడించింది. ఫలితంగా భారత్ సెకెండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. అంతకుముందు ఇంగ్లండ్తో తొలి ఇన్నింగ్స్లో 669 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (150), బెన్ స్టోక్స్ (141) భారీ శతకాలతో కదంతొక్కగా.. జాక్ క్రాలే (84), బెన్ డకెట్ (94) సెంచరీలకు చేరువలో ఔటయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4, బుమ్రా, సుందర్ తలో 2, అన్షుల్ కంబోజ్, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, రిషబ్ పంత్ 54, శార్దూల్ ఠాకూర్ 41 రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లు తీశాడు.నాలుగో టెస్ట్ డ్రా కావడంతో సిరీస్లో ఇంగ్లండ్ ఆధిపత్యం 2-1తో కొనసాగుతుంది. చివరిదైన ఐదో టెస్ట్ జులై 31 నుంచి లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్లో ప్రారంభమవుతుంది. ఈ సిరీస్లో ఒకటి, మూడు మ్యాచ్లు ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో మ్యాచ్లో విజయం సాధించింది. -
వీరోచితంగా పోరాడుతున్న సుందర్, జడేజా.. దిగ్గజాల సరసన చేరిన వెటరన్ ఆల్రౌండర్
మాంచెస్టర్ టెస్ట్లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వీరోచితంగా పోరాడుతున్నాడు. జట్టు తీవ్ర కష్టాల్లో ఉన్నప్పుడు అజేయమైన హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్ గడ్డపై 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఏడో భారత బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. తద్వారా బ్యాటింగ్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి సరసన చేరాడు.ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లుసచిన్ టెండూల్కర్ - 30 ఇన్నింగ్స్లలో 1575 పరుగులురాహుల్ ద్రవిడ్ - 23 ఇన్నింగ్స్లలో 1376 పరుగులుసునీల్ గవాస్కర్ - 28 ఇన్నింగ్స్లలో 1152 పరుగులుకేఎల్ రాహుల్ - 26 ఇన్నింగ్స్లలో 1125 పరుగులువిరాట్ కోహ్లీ - 33 ఇన్నింగ్స్లలో 1096 పరుగులురిషబ్ పంత్ - 24 ఇన్నింగ్స్లలో 1035 పరుగులురవీంద్ర జడేజా - 31 ఇన్నింగ్స్లలో 1016* పరుగులుమ్యాచ్ విషయానికొస్తే.. ఆట చివరి రోజు టీమిండియా ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా వీరోచితంగా పోరాడుతున్నారు. వీరిద్దరు ఐదో వికెట్కు అజేయమైన 100 పరుగులు జోడించి ఇన్నింగ్స్లు కొనసాగిస్తున్నారు. సుందర్ 58, జడ్డూ 53 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.టీ విరామం సమయానికి భారత్ సెకెండ్ ఇన్నింగ్స్ స్కోర్ 322/4గా ఉంది. ప్రస్తుతం భారత్ 11 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ను డ్రాగా ముగించాలంటే భారత్ మరో రెండున్నర గంటల్లోపు ఆలౌట్ కాకుండా చూసుకోవాలి.311 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన భారత్.. ఖాతా తెరవకుండానే యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ వికెట్లు కోల్పోయింది. ఈ దశలో గిల్, కేఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి మూడో వికెట్కు రికార్డు స్థాయిలో 188 పరుగులు జోడించారు. అనంతరం రాహుల్ 90 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. బెన్ స్టోక్స్ అద్భుతమైన బంతితో రాహుల్ను ఎల్బీడబ్ల్యూ చేశాడు.రాహుల్ ఔటయ్యాక చాలా జాగ్రత్తగా ఆడిన గిల్ ఈ సిరీస్లో నాలుగో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ వెంటనే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో వికెట్కీపర్ జేమీ స్మిత్కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్గా (222 పరుగుల వద్ద) వెనుదిరిగాడు. ఇవాళ భారత్ తొలి సెషన్లోనే ఓవర్నైట్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (90), శుభ్మన్ గిల్ (103) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ దశలో సుందర్, జడేజా భారత ఇన్నింగ్స్ను నిలబెట్టారు. వీరిద్దరు ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. స్కోర్ వివరాలు..భారత్ తొలి ఇన్నింగ్స్- 358 ఆలౌట్ (సాయి సుదర్శన్ 61, జైస్వాల్ 58, పంత్ 54, స్టోక్స్ 5/72)ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్- 669 ఆలౌట్ (రూట్ 150, స్టోక్స్ 141, రవీంద్ర జడేజా 4/143) -
చిక్కుల్లో టీమిండియా ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి
టీమిండియా యువ ఆల్రౌండర్, ఆంధ్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి చిక్కుల్లో చిక్కుకున్నాడు. గాయం కారణంగా ఇంగ్లండ్ పర్యటన నుంచి అర్దంతరంగా (మూడో టెస్ట్ తర్వాత) వైదొలిగిన నితీశ్.. ప్రస్తుతం చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. నితీశ్పై అతని మాజీ ఏజెన్సీ 'స్క్వేర్ ది వన్' రూ. 5 కోట్ల బకాయిలు చెల్లించాలని పిటిషన్ దాఖలు చేసింది.స్క్వేర్ ది వన్ సంస్థ 2021 నుంచి నితీశ్కు సంబంధించిన వాణిజ్య (ప్రకటనలు, ఎండార్స్మెంట్లు) కార్యకలాపాలు చూస్తుంది. అయితే నితీశ్ 2024-25 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా స్క్వేర్ ది వన్ సంస్థతో నాలుగేళ్ల బంధాన్ని తెంచుకొని కొత్త ఏజెంట్ను పెట్టుకున్నాడు.తమతో అకస్మాత్తుగా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడన్న కోపంతో స్క్వేర్ ది వన్ సంస్థ నితీశ్పై ప్రతీకారం తీర్చుకునేందుకు పూనుకుంది. ఇందులో భాగంగా నితీశ్ తమకు చెల్లించవలిసిన బకాయిలు ఎగ్గొట్టాడని ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ చట్టంలోని సెక్షన్ 11(6) కింద పిటిషన్ దాఖలు చేసింది.బకాయిల విషయమై తాము నితీశ్ను సంప్రదించగా.. ఎండార్స్మెంట్ డీల్స్ అన్నీ తానే స్వయంగా కుదుర్చుకున్నట్లు తెలిపాడని, బకాయిలు చెల్లించేందుకు నిరాకరించాడని స్క్వేర్ ది వన్ సంస్థ ఆరోపిస్తుంది. ఈ కేసు ఈ నెల 28న ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది.ఎస్ఆర్హెచ్తో తెగదెంపులు.. క్లారిటీ ఇచ్చిన నితీశ్కుమార్ రెడ్డిలీగల్ పరమైన సమస్యలు ఎదుర్కొంటుండగానే నితీశ్ తనపై జరుగుతున్న మరో ప్రచారంపై క్లారిటీ ఇచ్చాడు. తాను ఎస్ఆర్హెచ్ను వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నితీశ్ కొట్టి పారేశాడు. ఎస్ఆర్హెచ్తో తన బంధం గౌరవం, ప్యాషన్తో ఏర్పడిందని.. తానెప్పుడూ ఎస్ఆర్హెచ్తోనే ఉండాలని కోరుకుంటానని ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు.కాగా, గత ఐపీఎల్ సీజన్లో తనను నాలుగో నంబర్లో బ్యాటింగ్కు పంపలేదని నితీశ్ ఎస్ఆర్హెచ్పై ఆగ్రహంగా ఉన్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై నితీశ్ తాజాగా వివరణ ఇచ్చాడు. నితీశ్ గాయం నుంచి పూర్తిగా కోలుకుంటే ఆగస్ట్ 8 నుంచి ప్రారంభమయ్యే ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ లీగ్లో నితీశ్ భీమవరం బుల్స్కు నాయకత్వం వహించాల్సి ఉంది. -
పీకల్లోతు కష్టాల్లో టీమిండియా.. నిలబడిందా అద్భుతమే..!
మాంచెస్టర్ టెస్ట్లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. చివరి రోజు భారత్ తొలి సెషన్లోనే ఓవర్నైట్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (90), శుభ్మన్ గిల్ (103) వికెట్లు కోల్పోయింది.ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. బెన్ స్టోక్స్ అద్భుతమైన బంతితో రాహుల్ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. రికార్డు సెంచరీ పూర్తి చేసిన వెంటనే శుభ్మన్ గిల్ కూడా పెవిలియన్కు చేరాడు.జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో వికెట్కీపర్ జేమీ స్మిత్కు క్యాచ్ ఇచ్చి గిల్ నాలుగో వికెట్గా (222 పరుగుల వద్ద) వెనుదిరిగాడు. లంచ్ విరామం సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 88 పరుగులు వెనుకపడి ఉంది. సుందర్ (21), రవీంద్ర జడేజా క్రీజ్లో ఉన్నారు.ఈ మ్యాచ్లో భారత్ గట్టెక్కడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. ఇంకా రెండు సెషన్ల ఆట మిగిలి ఉండగా.. భారత్ 6 వికెట్లను నిలుపుకోవాలి. సుందర్, జడేజా తర్వాత పంత్ బ్యాటింగ్కు వస్తాడని తెలుస్తుంది. ఈ ముగ్గురు ఔటైతే భారత్ ఖేల్ ఖతం అయినట్లే.ఈ మ్యాచ్లో ఓడితే భారత్ సిరీస్ను కూడా కోల్పోతుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్ను భారత్ డ్రా చేసుకునే అవకాశం లేదు.స్కోర్ వివరాలు..భారత్ తొలి ఇన్నింగ్స్- 358 ఆలౌట్ (సాయి సుదర్శన్ 61, జైస్వాల్ 58, పంత్ 54, స్టోక్స్ 5/72)ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్- 669 ఆలౌట్ (రూట్ 150, స్టోక్స్ 141, రవీంద్ర జడేజా 4/143)భారత్ రెండో ఇన్నింగ్స్- 223/4 (ఐదో రోజు లంచ్ విరామం సమయానికి) -
శుభ్మన్ గిల్ వీరోచిత శతకం.. దిగ్గజాల సరసన చోటు
మాంచెస్టర్ టెస్ట్లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ వీరోచితంగా పోరాడుతున్నాడు. 311 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన భారత్.. ఖాతా తెరవకుండానే యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ వికెట్లు కోల్పోగా.. గిల్.. కేఎల్ రాహుల్తో కలిసి ఇన్నింగ్స్ను నిర్మించాడు. వీరిద్దరు మూడో వికెట్కు రికార్డు స్థాయిలో 188 పరుగులు జోడించాక, రాహుల్ 90 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు.రాహుల్ ఔటైనా ఏమాత్రం ఒత్తిడికి లోను కాని గిల్.. వాషింగ్టన్ సుందర్ (7) సాయంతో భారత్ను గట్టెక్కించే ప్రయత్నం చేస్తూ సెంచరీ పూర్తి చేశాడు. ఈ సిరీస్లో గిల్కు ఇది నాలుగో సెంచరీ. ఈ సెంచరీతో అతను దిగ్గజాల సరసన చేరాడు. ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక సెంచరీ చేసిన భారత ఆటగాడిగా, ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్గా డాన్ బ్రాడ్మన్, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లితో కలిసి రికార్డును షేర్ చేసుకున్నాడు.ఓ టెస్ట్ సిరీస్లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు4 - సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్, 1971 (విదేశాల్లో)4 - సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్, 1978/79 (స్వదేశంలో)4 - విరాట్ కోహ్లీ vs ఆస్ట్రేలియా, 2014/15 (విదేశాల్లో)4 - శుభ్మన్ గిల్ vs ఇంగ్లండ్, 2025 (విదేశాల్లో)**కెప్టెన్గా ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక సెంచరీలు4 - సర్ డాన్ బ్రాడ్మన్ vs ఇండియా, 1947/48 (విదేశాల్లో)4 - సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్, 1978/79 (స్వదేశంలో)4 - శుభ్మన్ గిల్ vs ఇంగ్లాండ్, 2025 (విదేశాల్లో)**అలాగే ఓ టెస్ట్ సిరీస్లో భారత్ తరఫున మూడో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా.. ఇంగ్లండ్లో, ఇంగ్లండ్పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా, ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్గా పలు రికార్డులు సాధించాడు. ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా బ్యాటర్లు🏏శుభ్మన్ గిల్ (ఇండియా)- 720*- 2025లో- అత్యుత్తమ స్కోరు 269🏏మొహమ్మద్ యూసఫ్ (పాకిస్తాన్)- 631- 2006లో- అత్యుత్తమ స్కోరు 202🏏రాహుల్ ద్రవిడ్ (ఇండియా)- 602- 2002లో- అత్యుత్తమ స్కోరు 217🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 593- 2018లో- అత్యుత్తమ స్కోరు 149🏏సునిల్ గావస్కర్ (ఇండియా)- 542- 1979లో- అత్యుత్తమ స్కోరు 221.ఓ టెస్ట్ సిరీస్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు774 - సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్, 1971 (బయట)732 - సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్, 1978/79 (హోం)720* - శుభ్మన్ గిల్ vs ఇంగ్లండ్, 2025 (బయట)712 - యశస్వి జైస్వాల్ vs ఇంగ్లండ్, 2024 (హోం)ఈ సెంచరీతో గిల్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్తో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. వీరిద్దరు డబ్ల్యూటీసీ చరిత్రలో తలో 9 సెంచరీలు చేశారు.25 ఏళ్ల వయసులో గిల్కు ఇది 18వ సెంచరీ. టెస్ట్ల్లో 9, వన్డేల్లో 8, టీ20ల్లో ఓ సెంచరీ చేశాడు. ఈ వయసులో సచిన్ 40, విరాట్ 26 సెంచరీలు చేశారు.మాంచెస్టర్లో 35 ఏళ్ల తర్వాత సెంచరీ చేసిన భారత ఆటగాడిగా గిల్ రికార్డు నెలకొల్పాడు.మ్యాచ్ విషయానికొస్తే.. గిల్ సెంచరీ పూర్తి చేసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 105 పరుగులు వెనుకపడి ఉంది. గిల్కు జతగా వాషింగ్టన్ సుందర్ (7) క్రీజ్లోకి వచ్చాడు.స్కోర్ వివరాలు..భారత్ తొలి ఇన్నింగ్స్- 358 ఆలౌట్ (సాయి సుదర్శన్ 61, జైస్వాల్ 58, పంత్ 54, స్టోక్స్ 5/72)ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్- 669 ఆలౌట్ (రూట్ 150, స్టోక్స్ 141, రవీంద్ర జడేజా 4/143) -
చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్
టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్ట్ సిరీస్లో 700 పరుగుల మార్కును తాకిన తొలి ఆసియా ప్లేయర్గా రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా జరుగుతున్న నాలుగో మ్యాచ్లో గిల్ ఈ ఫీట్ను సాధించాడు. రెండో ఇన్నింగ్స్లో 85 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గిల్ ఈ సిరీస్లో 700 పరుగులు పూర్తి చేసుకున్నాడు.గతంలో ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్ట్ సిరీస్లో 700 పరుగుల మైలురాయిని ఏ ఆసియా బ్యాటర్ తాకలేదు. గిల్కు ముందు పాకిస్తాన్ బ్యాటర్ మొహమ్మద్ యూసఫ్ అత్యధికంగా 631 పరుగులు (2006 పర్యటనలో) సాధించాడు.ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా బ్యాటర్లు🏏శుభ్మన్ గిల్ (ఇండియా)- 700*- 2025లో- అత్యుత్తమ స్కోరు 269🏏మొహమ్మద్ యూసఫ్ (పాకిస్తాన్)- 631- 2006లో- అత్యుత్తమ స్కోరు 202🏏రాహుల్ ద్రవిడ్ (ఇండియా)- 602- 2002లో- అత్యుత్తమ స్కోరు 217🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 593- 2018లో- అత్యుత్తమ స్కోరు 149🏏సునిల్ గావస్కర్ (ఇండియా)- 542- 1979లో- అత్యుత్తమ స్కోరు 221.ఓవరాల్గా ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్ పేరిట ఉంది. బ్రాడ్మన్ 1930 ఇంగ్లండ్ పర్యటనలో 5 మ్యాచ్ల్లో ఏకంగా 974 పరుగులు చేశాడు. బ్రాడ్మన్ తర్వాత ఇంగ్లండ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన రికార్డు (విదేశీ ఆటగాళ్లు) మార్క్ టేలర్ (839), వివ్ రిచర్డ్స్ (829), స్టీవ్ స్మిత్ (774), బ్రియాన్ లారా (765) పేరిట ఉంది.నాలుగో బ్యాటర్ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో 700 పరుగుల మార్కును తాకిన గిల్ భారత్ తరఫున ఓ టెస్ట్ సిరీస్లో ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు.భారత్ తరఫున ఓ టెస్ట్ సిరీస్లో 700 కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్లు774 - సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్, 1971 (బయట)732 - సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్, 1978/79 (హోం)712 - యశస్వి జైస్వాల్ vs ఇంగ్లండ్, 2024 (హోం)701* - శుభ్మన్ గిల్ vs ఇంగ్లండ్, 2025 (బయట)మ్యాచ్ విషయానికొస్తే.. 311 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన టీమిండియా పోరాడుతోంది. తొలి ఓవర్లో ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయి భారత్ను శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్కు 188 పరుగులు జోడించారు.ఆదిలోనే షాక్ అయితే చివరి రోజు భారత్కు ఆదిలోనే షాక్ తగిలింది. 90 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కేఎల్ రాహుల్ బెన్ స్టోక్స్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ప్రస్తుతం శుభ్మన్ గిల్ 90, వాషింగ్టన్ సుందర్ 4 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. భారత్ స్కోర్ 193/3గా ఉంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 118 పరుగులు వెనుకపడి ఉంది.స్కోర్ వివరాలు..భారత్ తొలి ఇన్నింగ్స్- 358 ఆలౌట్ (సాయి సుదర్శన్ 61, జైస్వాల్ 58, పంత్ 54, స్టోక్స్ 5/72)ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్- 669 ఆలౌట్ (రూట్ 150, స్టోక్స్ 141, రవీంద్ర జడేజా 4/143) -
చరిత్ర సృష్టించిన రాహుల్-గిల్ జోడీ.. ప్రపంచంలోనే
మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్లో ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టును డ్రాగా ముగించేందుకు టీమిండియా పోరాడుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో రెండు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది.311 పరుగుల లోటుతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్కు ఆదిలోనే క్రిస్ వోక్స్ బిగ్ షాకిచ్చాడు. ఒకే ఓవర్లో వరుస బంతుల్లో యశస్వి జైశ్వాల్(0), సాయిసుదర్శన్(0) పెవిలియన్కు పంపాడు. భారత్ సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో నాలుగో రోజే భారత కథ ముగుస్తుందని అంతా భావించారు.కానీ కేఎల్ రాహుల్(87 బ్యాటింగ్), శుబ్మన్ గిల్(78 నాటౌట్) తమ అద్బుత బ్యాటింగ్తో అడ్డుగోడగా నిలిచారు. వీరిద్దరూ 62 ఓవర్లు పాటు తమ వికెట్ను కోల్పోకుండా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో గిల్-రాహుల్ జోడీ పలు అరుదైన ఘనతలను తమ పేరిట లిఖించుకున్నారు.తొలి జోడీగాఒక టెస్టు మ్యాచ్లో 'సున్నా' పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన తర్వాత థర్డ్ వికెట్కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా గిల్-రాహుల్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఈ రికార్డు దిగ్గజాలు మొహిందర్ అమర్నాథ్, గుండప్ప విశ్వనాథ్ పేరిట ఉండేది.1977లో ఆస్ట్రేలియాపై ఇటువంటి పరిస్థితుల్లో వీరిద్దరూ మూడో వికెట్కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే తాజా మ్యాచ్లో మూడో వికెట్కు 174 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రాహుల్-గిల్ జంట 49 ఏళ్ల తర్వాత ఈ రేర్ ఫీట్ను బ్రేక్ చేసింది.కాగా ఇంగ్లండ్తో జరుగుతున్న ప్రస్తుత టెస్టు సిరీస్లో శుబ్మన్ గిల్, రాహుల్ ఇద్దరూ 500 పరుగుల మార్క్ను దాటేశారు. ఈ సిరీస్లో గిల్ ఇప్పటివరకు 697 పరుగులు చేయగా.. రాహుల్ 508 రన్స్ చేశాడు. విదేశీ గడ్డపై ఒక టెస్ట్ సిరీస్లో ఇద్దరు భారత బ్యాటర్లు 500కు పైగా పరుగులు చేయడం గత 54 ఏళ్లలో ఇదే మొదటిసారి. వీరికంటే ముదు 1970-71 విండీస్ పర్యటనలో భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, దిలీప్ సర్దేశాయ్ ఈ ఫీట్ సాధించారు. ఆ సిరీస్లో సునీల్ గవాస్కర్ (774), దిలీప్ సర్దేశాయ్ (642) పరుగులు చేశారు.చదవండి: IND vs ENG: షాకింగ్.. 'జస్ప్రీత్ బుమ్రా త్వరలోనే రిటైర్మెంట్' -
షాకింగ్.. 'జస్ప్రీత్ బుమ్రా త్వరలోనే రిటైర్మెంట్'
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పూర్తిగా తేలిపోయాడు. తన శైలికి విరుద్దంగా బౌలింగ్ చేసి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అస్సలు మనం చూస్తుందని బుమ్రా బౌలింగేనా అన్నట్లు అన్పించింది.డౌన్ది లెగ్ ఎక్కువగా వేయడం, బౌలింగ్లో వేగం లేకపోవడం, సరైన లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేయకపోవడం వంటి తప్పిదాలను బుమ్రా చేశాడు. సాధారణంగా 138-142 కి.మీ వేగంతో బంతులు వేసే బుమ్రా.. ఈ మ్యాచ్లో అందుకు భిన్నంగా ఒకే ఒక్కసారి 140 కి.మీ పైగా వేగంతో బౌలింగ్ చేశాడు. మాంచెస్టర్లో బుమ్రా 33 ఓవర్లు బౌలింగ్ చేసి 112 పరుగులు ఇచ్చి కేవలం రెండు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా తన ఏడేళ్ల టెస్ట్ కెరీర్లో ఓ ఇన్నింగ్స్లో 100కు పైగా పరుగులు సమర్పించుకోవడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో బుమ్రాపై భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలో మాదిరిగా ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసే సామర్థ్యాన్ని బుమ్రా ప్రస్తుతం కోల్పోయడని కైఫ్ అన్నాడు. అంతేకాకుండా రోహిత్, విరాట్ కోహ్లిల టెస్టులకు బుమ్రా వీడ్కోలు పలికినా ఆశ్చర్యపోన్కర్లేదని అతడు జోస్యం చెప్పాడు."ఇకపై టెస్టుల్లో బుమ్రాను మనం చూడలేకపోవచ్చు. అతడు త్వరలోనే రెడ్బాల్ క్రికెట్(టెస్టులు)కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని నేను అనుకుంటున్నాను. అతడు ఇప్పటికి వేగంతో బౌలింగ్ చేయగలడు. కానీ అందుకు అతడి శరీరం సహకరించడం లేదు.ఒక ఆటగాడు జట్టు కోసం 100 శాతం ఎఫక్ట్ పెట్టలేనని, వికెట్లు తీయలేనని భావించిన రోజున అతడే స్వయంగా తప్పుకొంటాడు. దేశం కోసం ఆడాలన్న తపన, అంకితభావం బుమ్రాలో ఇప్పటికి ఉంది. కానీ అతడు తన ఫిట్నెస్ను కోల్పోయాడు. అతడు బలవంతంగా ఆడితే భవిష్యత్తులో కచ్చితంగా అతడు ఇబ్బందులు ఎదుర్కొంటాడు.ఇదివరకే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, అశ్విన్ వంటి లెజెండరీ ప్లేయర్లు టెస్టులకు వీడ్కోలు పలికారు. ఆ జాబితాలో ఇప్పుడు బుమ్రా చేరనున్నాడు. కాబట్టి బుమ్రా లేని భారత జట్టును చూడడం అభిమానులు అలవాటు చేసుకోవాలని" తన యూట్యూబ్ ఛానల్లో కైఫ్ పేర్కొన్నాడు. -
టీమిండియాకు గుడ్ న్యూస్.. పోరాట యోధుడు బ్యాటింగ్కు రానున్నాడు?
మాంచెస్టర్ వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తుది అంకానికి చేరుకుంది. ఈ మ్యాచ్లో ఓటమి నుంచి తప్పించుకుని, సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవడానికి టీమిండియా పోరాడుతోంది.311 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ను మొదలు పెట్టిన భారత జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వోక్స్ వేసిన తొలి ఓవర్లో స్కోరు బోర్డుపై ‘సున్నా’ పరుగులు ఉండగానే యశస్వి జైస్వాల్(0), సాయి సుదర్శన్(0) వికెట్లను భారత్ కోల్పోయింది.ఈ సమయంలో కేఎల్ రాహుల్(210 బంతుల్లో 8 ఫోర్లతో 87 నాటౌట్), శుభ్మన్ గిల్(167 బంతుల్లో 10 ఫోర్లతో 78 నాటౌట్) ఇంగ్లండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఇంగ్లండ్ స్కోర్కు భారత్ ఇంకా 137 పరుగుల వెనుకంజలో ఉంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం సాధించాలంటే 8 వికెట్లు కావాలి. మాంచెస్టర్ టెస్టును భారత్ డ్రా ము గించాలంటే ఆఖరి రోజు ఆటలో కనీసం రెండు సెషన్ల పాటు వికెట్లు కోల్పోకుండా ఆడాలి. ఈ క్రమంలో భారత జట్టుకు ఓ గుడ్న్యూస్ అందింది. కాలి పాదం ఎముక విరిగిన గాయంతో బాధపడుతున్న స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.. ఐదో రోజు ఆటలో బ్యాటింగ్కు రానున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ధ్రువీకరించాడు. ఆఖరి రోజు ఆటలో బ్యాటింగ్ చేసేందుకు పంత్ సిద్దంగా ఉన్నాడని కోటక్ నాలుగో రోజు అనంతరం కోటక్ పేర్కొన్నాడు.ఆరు వారాల విశ్రాంతి?కాగా మొదటి రోజు ఆట సందర్భంగా పంత్కు గాయమైంది. క్రిస్ వోక్స్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి.. బ్యాట్కు తగులుతూ అతడి కుడి కాలి పాదానికి తాకింది. దీంతో అతడు మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు.ఆ తర్వాత అతడికి స్కానింగ్ తరలించగా మెటాటార్సల్ ఫ్రాక్చర్(పాదంలోని ఎముక విరగడం) ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అతడికి ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొన్నాయి.కానీ రిషబ్ మాత్రం గాయంతో బాధపడుతూనే రెండో రోజు బ్యాటింగ్కు వచ్చి హాఫ్ సెంచరీ బాదాడు. ఇప్పుడు కూడా ఆఖరి రోజు ఆట భారత్కు కీలకం కావడంతో ఈ పోరాట యోధుడు మరోసారి నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేయనున్నాడు.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్కు టీమిండియా సవాల్ విసురుతుందా? ఆఖరి రోజు ఎవరిది? -
ఇంగ్లండ్కు టీమిండియా సవాల్ విసురుతుందా? ఆఖరి రోజు ఎవరిది?
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. 311 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన టీమిండియా పోరాడుతోంది. సెకెండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది.ఈ సమయంలో జట్టును కెప్టెన్ శుబ్మన్ గిల్(167 బంతుల్లో 78 బ్యాటింగ్), కేఎల్ రాహుల్ (210 బంతుల్లో 87; 8 ఫోర్లు), విరోచిత పోరాటంతో ఆదుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లు సమర్ధవంతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు నడపించారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్లు నష్టానికి 174 పరుగులు చేసింది. ప్రస్తుతం గిల్ సేన 137 పరుగులు వెనుకంజలో ఉంది.టీమిండియా సవాల్ విసురుతుందా?కాగా మాంచెస్టర్ టెస్టు రసవత్తర ముగింపునకు చేరుకుంది. కేవలం ఒక్క రోజు ఆట మాత్రమే మిగిలూండడంతో ఈ మ్యాచ్లో ఫలితం తేలుతుందా? లేదా డ్రా ముగిస్తుందా? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆఖరి రోజు ఆటలో తొలి సెషన్ టీమిండియాకు చాలా కీలకం కానుంది.ఇంగ్లండ్కు టార్గెట్ నిర్దేశించాలని భారత జట్టు భావిస్తే కచ్చితంగా మొదటి సెషన్లో వికెట్లు ఏమీ కోల్పోకుండా కాస్త దూకుడుగా ఆడాలి. ఇంగ్లండ్కు 200 పైగా టార్గెట్ ఇవ్వాలన్న టీమిండియా ఖచ్చితంగా టీ బ్రేక్ వరకు అయినా బ్యాటింగ్ చేయాలి. అంటే వన్డే తరహాలో తమ బ్యాటింగ్ను కొనసాగించాలి.ఒకవేళ తొలి సెషన్లో టీమిండియా వికెట్లు కోల్పోతే డ్రా కోసం వెళ్తే బెటర్ అని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే గాయపడిన రిషబ్ పంత్ బ్యాటింగ్ వచ్చినా, క్రీజులో నిలదొక్కకుంటాడో లేదా అన్నది ప్రశ్నార్ధంగా మారింది.అతడు కాలి పాదం గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. పంత్ క్రీజులో ఉన్నంతసేపు భారీ షాట్లకు వెళ్లే అవకాశముంది. ఆ ప్రయత్నంతో పంత్ వికెట్ కోల్పోయిన ఆశ్చర్యపోన్కర్లలేదు. ఆ తర్వాత రవీంద్ర జడేజా ప్రతిఘటించే అవకాశమున్నప్పటికి, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్ ఎప్పుడూ ఎలా ఆడుతారో చెప్పలేం. కాబట్టి టీమిండియా మొత్తం ఆశలన్నీ క్రీజులో ఉన్న శుబ్మన్ గిల్, రాహుల్పైనే ఉన్నాయి. మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ వీలైనంత త్వరగా భారత్ను ఆలౌట్ చేయాలని పట్టుదలతో ఉంది.చదవండి: కివీస్దే ముక్కోణపు టోర్నీ -
0/2 నుంచి 174/2 వరకు...
తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్కు ఏకంగా 311 పరుగుల ఆధిక్యం అప్పగించేశాం. లక్ష్యం నిర్దేశించడం సంగతి తర్వాత... ముందు ఈ లోటును ఎలా పూడ్చాలా అనే ఆందోళన... రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి స్కోరు 0/2... మిగిలిన అరవైకి పైగా ఓవర్లను ఆడగలరా అనే సందేహం. నాలుగో రోజే కుప్పకూలి మ్యాచ్ను అప్పగించేస్తారేమో అనిపించింది. కానీ రాహుల్, గిల్ అసాధారణ రీతిలో గట్టిగా నిలబడ్డారు. ఆరంభంలో కాస్త తడబడ్డా ఏకాగ్రత చెదరకుండా రెండు సెషన్లు పట్టుదలగా ఆడారు. ఏకంగా 62.1 ఓవర్ల పాటు వికెట్ ఇవ్వకుండా రోజును ముగించారు. అయితే ప్రమాదం ఇంకా పూర్తిగా దాటిపోలేదు. మరో 137 పరుగులు వెనుకంజలో ఉన్న జట్టు ప్రస్తుతానికి మ్యాచ్ను రక్షించుకునేందుకు బాటలు వేసుకుంది. ఆపై ఎన్ని పరుగులు చేసి ఇంగ్లండ్కు సవాల్ విసరగలదా అనేది చూడాలి.మాంచెస్టర్: ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఓటమి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్న భారత్ సురక్షిత స్థితికి చేరుతోంది. మ్యాచ్ నాలుగో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (210 బంతుల్లో 87; 8 ఫోర్లు), శుబ్మన్ గిల్ (167 బంతుల్లో 78 బ్యాటింగ్; 10 ఫోర్లు) క్రీజ్లో ఉన్నారు. అంతకు ముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 669 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (198 బంతుల్లో 141; 11 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రవీంద్ర జడేజాకు 4 వికెట్లు దక్కాయి. 22.1 ఓవర్లలో 125 పరుగులు... నాలుగో రోజు ఇంగ్లండ్ మెరుపు బ్యాటింగ్తో భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. స్టోక్స్ చాలా కాలం తర్వాత చెలరేగిపోగా, బ్రైడన్ కార్స్ (54 బంతుల్లో 47; 3 ఫోర్లు 2 సిక్స్లు), డాసన్ (26) అండగా నిలిచారు. ఆట ఆరంభంలోనే డాసన్ను బుమ్రా బౌల్డ్ చేసినా... స్టోక్స్, కార్స్ భాగస్వామ్యంతో ఇంగ్లండ్ దూసుకుపోయింది. సిరాజ్ బౌలింగ్లో లెగ్సైడ్ దిశగా కొట్టిన బౌండరీతో 164 బంతుల్లో స్టోక్స్ సెంచరీ పూర్తయింది. రెండేళ్ల తర్వాత, 35 ఇన్నింగ్స్లలో స్టోక్స్కు ఇది తొలి శతకం కావడం విశేషం. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడిన స్టోక్స్ తర్వాతి 34 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 41 పరుగులు రాబట్టడం విశేషం. మరో ఎండ్లో కార్స్ కూడా భారత బౌలర్లపై ధాటిని చూపించాడు.తొమ్మిదో వికెట్కు స్టోక్స్, కార్స్ కేవలం 95 బంతుల్లోనే 97 పరుగులు జోడించడం విశేషం. ఎట్టకేలకు జడేజా బౌలింగ్లో మరో భారీ షాట్కు ప్రయతి్నంచి స్టోక్స్ వెనుదిరగ్గా... తన తర్వాతి ఓవర్లో కార్స్ను అవుట్ చేసి జడేజా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగించాడు. 2015 తర్వాత ఒకే ఇన్నింగ్స్లో నలుగురు భారత బౌలర్లు తలా 100కు పైగా పరుగులు ఇవ్వడం ఇదే తొలిసారి. భారీ భాగస్వామ్యం... భారత జట్టు ఇన్నింగ్స్ పేలవంగా మొదలైంది. వోక్స్ వేసిన తొలి ఓవర్లో స్కోరు బోర్డుపై ‘సున్నా’ పరుగులు ఉండగానే వరుస బంతుల్లో జైస్వాల్ (0), సాయి సుదర్శన్ (0) వెనుదిరిగారు. అయితే ఆ తర్వాత రాహుల్, గిల్ చక్కటి భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. రెండో సెషన్లో ఆరంభంలో కొన్ని ఉత్కంఠ క్షణాలను ఎదుర్కొన్నా... ఆ తర్వాత వీరిద్దరు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చూడచక్కటి షాట్లతో అలరించారు. 46 పరుగుల వద్ద గల్లీలో డాసన్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన గిల్ 77 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.26 ఓవర్ల రెండో సెషన్లో భారత్ ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. టీ విరామం తర్వాత కూడా గిల్, రాహుల్ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఆడారు. పరుగుల రాక కాస్త తగ్గినా ప్రమాదం కూడా ఏమీ కనిపించలేదు. ఒక దశలో వరుసగా 21.4 ఓవర్ల పాటు బౌండరీనే రాలేదు! 137 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే ఆ తర్వాత వీరిద్దరు స్వేచ్ఛగా ఆడారు. ఈ జోడీని విడదీసేందుకు ఇంగ్లండ్ బౌలర్లను మార్చి మార్చి ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. అప్పుడప్పుడు కొన్ని చక్కటి బంతులు ఇబ్బంది పెట్టినట్లుగా అనిపించినా భారత్కు నష్టం జరగలేదు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 358; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) రాహుల్ (బి) జడేజా 84; డకెట్ (సి) (సబ్) జురేల్ (బి) కంబోజ్ 94; పోప్ (సి) రాహుల్ (బి) సుందర్ 71; రూట్ (స్టంప్డ్) (సబ్) జురేల్ (బి) జడేజా 150; బ్రూక్ (స్టంప్డ్) (సబ్) జురేల్ (బి) సుందర్ 3; స్టోక్స్ (సి) సుదర్శన్ (బి) జడేజా 141; స్మిత్ (సి) (సబ్) జురేల్ (బి) బుమ్రా 9; డాసన్ (బి) బుమ్రా 26; వోక్స్ (బి) సిరాజ్ 4; కార్స్ (సి) సిరాజ్ (బి) జడేజా 47; ఆర్చర్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 38; మొత్తం (157.1 ఓవర్లలో ఆలౌట్) 669.వికెట్ల పతనం: 1–166, 2–197, 3–341, 4–349, 5–499, 6–515, 7–528, 8–563, 9–658, 10–669.బౌలింగ్: బుమ్రా 33–5–112–2, కంబోజ్ 18–1–89–1, సిరాజ్ 30–4–140–1, శార్దుల్ 11–0–55–0, జడేజా 37.1–0–143–4, సుందర్ 28–4–107–2. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) రూట్ (బి) వోక్స్ 0; రాహుల్ (బ్యాటింగ్) 87; సుదర్శన్ (సి) బ్రూక్ (బి) వోక్స్ 0; గిల్ (బ్యాటింగ్) 78; ఎక్స్ట్రాలు 9; మొత్తం (63 ఓవర్లలో 2 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–0, 2–0. బౌలింగ్: వోక్స్ 15–3–48–2, ఆర్చర్ 11–2–40–0, కార్స్ 10–2–29–0, డాసన్ 22–8–36–0, రూట్ 5–1–17–0.⇒ 3 టెస్టుల్లో 7 వేలకు పైగా పరుగులు చేసి 200కు పైగా వికెట్లు పడగొట్టిన మూడో ఆటగాడిగా స్టోక్స్ నిలిచాడు. గతంలో గ్యారీ సోబర్స్, జాక్ కలిస్ మాత్రమే ఈ ఘనత సాధించారు.⇒ 5 ఒకే టెస్టులో సెంచరీ సాధించడంతో పాటు ఐదు వికెట్లు కూడా తీసిన ఐదో కెప్టెన్ స్టోక్స్. గతంలో అట్కిన్సన్, సోబర్స్, ముస్తాక్ మొహమ్మద్, ఇమ్రాన్ ఖాన్లకు మాత్రమే ఇది సాధ్యమైంది.⇒1 టెస్టుల్లో బుమ్రా ఒక ఇన్నింగ్స్లో 100కు పైగా పరుగులివ్వడం ఇదే మొదటి సారి. అతను తన కెరీర్లో 48వ టెస్టు ఆడుతున్నాడు. -
ప్లేయర్స్ను గంభీర్ నమ్మడం లేదు.. ఇలా అయితే చాలా కష్టం: మనోజ్ తివారీ
టీమిండియా హెడ్ కోచ్గా వైట్బాల్ క్రికెట్లో విజయవంతమైన గౌతమ్ గంభీర్.. టెస్టుల్లో మాత్రం ఇప్పటివరకు తన మార్క్ను చూపించలేకపోయాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో టెస్టు సిరీస్ ఓటమి.. ఇప్పుడు అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో 1-2 తేడాతో భారత్ వెనుకబడి ఉండటంతో గంభీర్పై విమర్శల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ చేరాడు. గంభీర్ ఎక్కువగా ఆల్రౌండర్లపై ఆధారపడుతున్నాడని, స్పెషలిస్టులను నమ్మడం లేదని తివారీ అన్నాడు. స్పెషలిస్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఈ సిరీస్లో ఇప్పటివరకు ఆడించకపోవడంతో మనోజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్లోమనోజ్ తివారీ, గంభీర్ కలిసి కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిథ్యం వహించాడు."ఒక టెస్టు మ్యాచ్ ఆడేటప్పుడు జట్టులో కచ్చితంగా స్పెషలిస్ట్లు ఉండాలి. ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు నేను చెప్పాను. కానీ టీమ్ మెనెజ్మెంట్ మాత్రం స్పెషలిస్టు స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లను పక్కన పెట్టి ఆల్రౌండర్లపై ఎక్కువగా నమ్ముతున్నారు. గంభీర్ హెడ్ కోచ్గా వచ్చినప్పటి నుంచి ఓ కొత్త అనవాయితీని తీసుకొచ్చాడు.ఏ ప్లేయర్ అయినా ఒకట్రెండు మ్యాచ్లు విఫలమైతే అతడి స్దానంలో వేరే ఆటగాడిని భర్తీ చేస్తున్నాడు. న్యూజిలాండ్ సిరీస్లో అశ్విన్పై వేటు వేసి వాషింగ్టన్ సుందర్కు గంభీర్ అవకాశమిచ్చాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో దేవదత్ పడిక్కల్, హర్షిత్ రాణాలు భారత జట్టు తరపున ఆడారు. కానీ ఇప్పుడు వారిద్దరూ జట్టులో లేరు. ఇప్పుడు కొత్తగా అన్షుల్ కాంబోజ్ జట్టులోకి వచ్చాడు.అంటే గంభీర్ రాడార్లో ఇక హర్షిత్ రాణా లేనట్లే. గంభీర్కు స్థిరత్వం లేదు. అతడు తన ఆటగాళ్లను ఎక్కువ కాలం నమ్మలేకపోతున్నాడు. పార్ట్ టైమ్ ఆల్ రౌండర్లను ఆడించి టెస్టు మ్యాచ్ను గెలవాలనుకుంటున్నాడు. అది ఎప్పటికి సాధ్యం కాదు అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తివారీ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: ఏయ్.. అక్కడేమి చేస్తున్నావ్? యువ ఆటగాడిపై జడేజా ఫైర్! వీడియో వైరల్ -
ఏయ్.. అక్కడేమి చేస్తున్నావ్? యువ ఆటగాడిపై జడేజా ఫైర్! వీడియో వైరల్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా తడబడుతోంది. వరుసగా రెండు రోజుల పాటు భారత్పై ఆతిథ్య ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ప్రస్తుతం 186 పరుగుల లీడ్లో కొనసాగుతోంది. ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్(150) అద్బుతమైన సెంచరీతో కదం తొక్కాడు. తన సూపర్ బ్యాటింగ్తో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఆఖరికి రవీంద్ర జడేజా బౌలింగ్లో రూట్ స్టంపౌట్గా వెనుదిరిగాడు. అయితే సెంచరీతో మెరిసిన జో రూట్కు మూడో రోజు ఆట ఆరంభంలోనే భారత ఫీల్డర్లు ఓ లైఫ్లైన్ ఇచ్చేశారు. రూట్ 23 పరుగుల వ్యక్తిగత స్కోర్ భారత ఫీల్డర్ల తప్పిదం వల్ల ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా తన సహచర ఆటగాడు అన్షుల్ కాంబోజ్పై కోపంతో ఊగిపోయాడు.ఏమి జరిగిందంటే?ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 54 ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో ఆఖరి బంతిని రూట్ గల్లీ దిశగా ఆడాడు. గల్లీ పొజిషేన్లో ఉన్న జైశ్వాల్ ఆ బంతిని ఆపేందుకు ప్రయత్నించాడు. జైశ్వాల్ చేతికి తాకి కాస్త దూరంగా వెళ్లిన బంతిని జడేజా అందుకున్నాడు. అయితే బంతిని చూస్తూ ఉండిపోయిన రూట్ నాన్స్ట్రైక్ ఎండ్కు వెళ్లేందుకు ఆలస్యం చేశాడు.ఈ క్రమంలో బంతిని అందుకున్న జడేజా నాన్స్ట్రైక్ ఎండ్వైపు త్రో చేశాడు. కానీ బంతి మాత్రం స్టంప్స్కు తాకలేదు. అయితే జడేజా విసిరిన బంతిని అందుకోవడనికి కూడా కనీసం స్టంప్స్ దగ్గర ఎవరూ లేరు. జడేజా విసిరిన బంతిని మిడ్-ఆన్లో ఫీల్డింగ్ చేస్తున్న కాంబోజ్ అందుకున్నాడు.కానీ కాంబోజ్ ముందే బంతిని తీసుకోవడానికి స్టంప్స్ దగ్గరకు రాకపోవడంతో జడేజా సీరియస్ అయ్యాడు. అక్కడ ఏమిచేస్తున్నావు? ఇక్కడకు రావాలి కాదా అంటూ కోపంతో ఊగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఒకవేళ రూట్ రనౌట్ అయ్యింటే ఇంగ్లండ్ పరిస్థితి మరో విధంగా ఉండేది. ఈ తప్పిదానికి భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.చదవండి: IND vs ENG: టీమిండియాకు డేంజర్ బెల్స్.. పేస్ గుర్రానికి ఏమైంది?pic.twitter.com/Fh7dXQIX4S— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) July 25, 2025 -
టీమిండియాకు డేంజర్ బెల్స్.. పేస్ గుర్రానికి ఏమైంది?
మాంచెస్టర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ పట్టుబిగిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది. స్టోక్స్ సేన ప్రస్తుతం 186 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.ఇంగ్లండ్ బ్యాటర్లను ఔట్ చేసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, కాంబోజ్ చెరో వికెట్ సాధించారు.బుమ్రాకు ఏమైంది?ఈ మ్యాచ్లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పూర్తిగా తేలిపోయాడు. అతడు తన తొలి వికెట్ అందుకోవడానికి 23 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జేమి స్మిత్ను ఔట్ చేసి మొదటి వికెట్ను సాధించాడు. అస్సలు ఈ మ్యాచ్లో మనం చూస్తుంది బుమ్రానేనా అన్నట్లు అతడి బౌలింగ్ సాగింది. ఇంగ్లండ్ బ్యాటర్లు సునాయసంగా అతడి బౌలింగ్ను ఎదుర్కొన్నారు. ఈ సిరీస్లో ఇప్పటివరకు ఇటువంటి బౌలింగ్ను బుమ్రా నుంచి చూడలేదు.ఒకవేళ ఏదైనా తప్పిదం జరిగితే తనను తాను సరిదిద్దుకోవడానికి ఒకటి లేదా రెండు ఓవర్లు కంటే ఎక్కువ సమయం పట్టదు. ఏమైందో కానీ మాంచెస్టర్లో మాత్రం తన మార్క్ను ఈ స్పీడ్ చూపించలేకపోతున్నాడు. ఎక్కువగా డౌన్ ది లెగ్ బంతులు వేసి పరుగులు ఇవ్వడం, సరైన లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేయకపోవడం వంటి తప్పులు చేశాడు.ఒకే ఒక్కసారి..ముఖ్యంగా మాంచెస్టర్లో బుమ్రా పేస్ జనరేట్ చేయడానికి ఎక్కువగా ఇబ్బంది పడ్డాడు. ఈ గుజరాత్ స్పీడ్ స్టార్ సాధరణంగా టెస్టుల్లో గంటకు 138- 140 కి.మీ పైగా వేగంతో బౌలింగ్ చేస్తాడు. కానీ మ్యాచ్లో మాత్రం కేవలం ఒక్కసారి మాత్రమే 140 ప్లస్ వేగంతో బౌలింగ్ చేశాడు.ఇప్పటివరకు నో బాల్స్తో కలిపి 173 బంతులు బౌలింగ్ చేసిన బుమ్రా.. ఒకే ఒక్కసారి 140 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగల్గాడు. అంతకుముందు లీడ్స్ టెస్టులో 266 బంతులు వేసిన బుమ్రా.. 39.84 శాతంతో 106 బాల్స్ను 140 కి.మీ పైగా వేగంతో సంధించాడు.ఆ తర్వాత లార్డ్స్లో కూడా 257 బంతుల్లో 69 బంతులను 140 కి.మీ పైగా వేగంతో వేశాడు. కానీ నాలుగో టెస్టులో మాత్రం సరైన పేస్తో బౌలింగ్ చేయలేకపోతున్నాడు. దీంతో అతడి గాయం ఏమైనా తిరిగబెట్టిందా అని భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికే టీమిండియా మెనెజ్మెంట్ ఈ సిరీస్లో కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడించాలని నిర్ణయించింది. ఈ సిరీస్లో అతడికి ఇది మూడో మ్యాచ్. తొలి టెస్టులో ఆడిన బుమ్రా, రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్నాడు. తిరిగి వచ్చిన బుమ్రా మూడో టెస్టులో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలో నాలుగో టెస్టుకు ఈ స్పీడ్ స్టార్ విశ్రాంతి ఇస్తారని అంతా భావించారు. కానీ కీలకమైన మ్యాచ్ కావడంతో మాంచెస్టర్లో అతడిని ఆడించారు. ఈ నిర్ణయం టీమిండియాకు ఏ మాత్రం కలిసిరాలేదనే చెప్పుకోవాలి. కాగా మాంచెస్టర్ టెస్టులో ఇప్పటివరకు 28 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా.. 95 పరుగులిచ్చి కేవలం ఒక్క వికెట్ మాత్రమే సాధించాడు. రెండో ఇన్నింగ్స్లోనైనా బుమ్రా రాణిస్తాడో లేదో వేచి చూడాలి.చదవండి: టెస్టు చేజారిపోతోంది! -
రూట్ రికార్డు శతకం.. భారీ ఆధిక్యంలో ఇంగ్లండ్
Update: టీమిండియా-ఇంగ్లండ్ మధ్య నాలుగవ టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. మాంచెస్టర్ వేదికగా శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 544 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ 77, లియాం డాసన్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా కంటే ఇంగ్లండ్ ప్రస్తుతం 186 పరుగుల ఆధిక్యంలో ఉంది.రూట్ రికార్డు శతకం: మాంచెస్టర్ టెస్ట్లో ఇంగ్లండ్ భారీ ఆధిక్యం సాధించింది. 127 ఓవర్ల తర్వాత ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 523 పరుగులు చేసి, 165 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. రూట్ రికార్డు శతకం (150) సాధించి ఇంగ్లండ్ను పటిష్ట స్థితికి చేర్చాడు. అతనికి స్టోక్స్ (66 రిటైర్డ్ హర్ట్) అండగా నిలిచాడు. క్రిస్ వోక్స్ (2), లియామ్ డాసన్ (7) క్రీజ్లో ఉన్నారు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్లు జాక్ క్రాలే (84), బెన్ డకెట్ (94), ఓలీ పోప్ (71) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. హ్యారీ బ్రూక్ (3) ఒక్కడే నిరాశపరిచాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీయగా.. 2, అన్షుల్ కంబోజ్ ఓ వికెట్ పడగొట్టాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
Fact Check: కరుణ్ నాయర్ నిజంగానే ఏడ్చాడా..?
మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మూడో రోజు ఆట సాగుతున్న వేల ఓ ఆసక్తికర ఫోటో సోషల్మీడియాలో వైరలవుతుంది. ఈ ఫోటోలో టీమిండియా బ్యాటర్ కరుణ్ నాయర్ బాధపడుతూ (ఏడుస్తూ) ఉన్నట్లు కనిపించగా.. సహచరుడు కేఎల్ రాహుల్ అతన్ని ఓదారుస్తున్నట్లు కనిపించాడు. ఈ ఫోటో సోషల్మీడియాలో కొద్ది క్షణాల్లోనే వైరలైంది. ఇది చూసి క్రికెట్ అభిమానులు కరుణ్ను నాలుగో టెస్ట్ నుంచి తప్పించినందుకు ఏడుస్తున్నాడంటూ, బాధలో ఉన్న అతన్ని అతని ఆప్తమిత్రుడు కేఎల్ రాహుల్ ఓదారుస్తున్నాడంటూ ఊహించుకోవడం మొదలు పెట్టారు. దీనిపై ఫ్యాక్ట్ చేయగా అది నిజం కాదని తెలిసింది. వాస్తవానికి ఆ ఫోటో లార్డ్స్లో జరిగిన మూడో టెస్ట్ సందర్భంగా తీసిందని తేలింది. కరుణ్, రాహుల్ లార్డ్స్ బాల్కనీలో కూర్చున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. దీంతో నాలుగో టెస్ట్ నుంచి తప్పించినందుకు కరుణ్ ఏడుస్తున్నాడన్న ప్రచారం ఫేక్ అని తేలిపోయింది.కాగా, కరుణ్ నాయర్ దేశవాలీ క్రికెట్లో అద్భుతాలు చేసి ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో క్రికెట్ ఒక్క ఛాన్స్ అంటూ కరుణ్ చేసిన ఓ ట్వీట్ సోషల్మీడియాలో వైరలైంది. ఎట్టకేలకు భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చి ఇంగ్లండ్ పర్యటనలో తొలి మూడు టెస్ట్లు ఆడే అవకాశం దక్కించుకున్న కరుణ్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేక జట్టులో (నాలుగో టెస్ట్) స్థానం కోల్పోయాడు. కరుణ్ స్థానంలో మేనేజ్మెంట్ నాలుగో టెస్ట్లో సాయి సుదర్శన్కు అవకాశం ఇవ్వగా అతను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో కీలక సమయంలో బరిలోకి దిగి బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శనతో సాయి సుదర్శన్ భారత జట్టులో నంబర్-3 స్థానాన్ని ఖాయం చేసుకున్నాడని ప్రచారం మొదలైంది. ఇది పరోక్షంగా కరుణ్ కెరీర్ ముగిసినట్లేనన్న సంకేతాలిస్తుంది. కెరీర్ ముగిసిపోయిందన్న బాధలో కరుణ్ ఏడుస్తున్నాడని అభిమానులు అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. వాస్తవానికి కరుణ్ తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం చాలా పెద్ద తప్పిదం. ప్రస్తుత పరిస్థితుల్లో అతని మరో అవకాశం రావడం దాదాపుగా అసాధ్యం. ఒకవేళ సాయి సుదర్శన్ కూడా తదుపరి మ్యాచ్ల్లో విఫలమైనా కరుణ్కు మరో అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే తిలక్ వర్మ, సర్ఫరాజ్ ఖాన్ లాంటి యువకులతో పాటు శ్రేయస్ అయ్యర్ టెస్ట్ జట్టులో స్థానంలో కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కరుణ్ కెరీర్ ముగిసిందనే చెప్పుకోవాలి.ఇదిలా ఉంటే, నాలుగో టెస్ట్లో ఇంగ్లండ్ పైచేయి సాధించింది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసేసింది. రూట్ రికార్డు సెంచరీతో ఆ జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 499 పరుగులు చేసి 141 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. రూట్ 150, జేమీ స్మిత్ 2 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, శార్దూల్ ఠాకూర్ 41 భారత ఇన్నింగ్స్లో ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
పాంటింగ్నూ దాటేసిన రూట్.. మిగిలింది సచిన్ ఒక్కడే
మాంచెస్టర్ టెస్ట్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ వరుస పెట్టి రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇప్పటికే చాలా రికార్డులు తన ఖాతాలో వేసుకున్న రూట్.. 120 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మరో దిగ్గజ ఆటగాడి రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ స్కోర్ వద్ద రూట్ సచిన్ తర్వాత టెస్ట్ల్లో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ను అధిగమించాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్ ఈ ఒక్క ఇన్నింగ్స్తోనే రాహుల్ ద్రవిడ్, జాక్ కల్లిస్, రికీ పాంటింగ్ను దాటేయడం విశేషం. ఇక రూట్ ముందున్న ఏకైక లక్ష్యం సచిన్ ఆల్టైమ్ రికార్డు ఒక్కటే. ఈ రికార్డును చేరుకోవాలంటే రూట్ మరో 2500 పైచిలుకు పరుగులు చేయాలి. ఇది ఈజీ కాదు. అలాగని అసాధ్యం కూడా కాదు.టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు..సచిన్ టెండూల్కర్- 15921జో రూట్- 13380*రికీ పాంటింగ్- 13378జాక్ కల్లిస్- 13289రాహుల్ ద్రవిడ్- 13288మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు టీ విరామం సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 433/4గా ఉంది. రూట్ 121, స్టోక్స్ 36 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 75 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్లు జాక్ క్రాలే (84), బెన్ డకెట్ (94), ఓలీ పోప్ (71) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. హ్యారీ బ్రూక్ (3) ఒక్కడే నిరాశపరిచాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2, అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
38వ సెంచరీ పూర్తి చేసిన రూట్.. రికార్డుల జాతర
మాంచెస్టర్ టెస్ట్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇప్పటికే రెండు భారీ రికార్డులు సాధించిన రూట్.. తాజాగా సెంచరీ పూర్తి చేసి మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. 178 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసిన రూట్.. టెస్ట్ల్లో 38వ శతకాన్ని, ఓవరాల్గా (మూడు ఫార్మాట్లలో కలిపి) 56 శతకాన్ని నమోదు చేశాడు. ఈ సెంచరీతో రూట్ టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర్తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. సంగక్కర్ కూడా టెస్ట్ల్లో 38 సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (51), జాక్ కల్లిస్ (45), రికీ పాంటింగ్ (41) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.ఈ ఇన్నింగ్స్లో రూట్ తొలుత టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్ (13288), జాక్ కల్లిస్ను (13289) అధిగమించి మూడో స్థానానికి ఎగబాకాడు. ఆతర్వాత హాఫ్ సెంచరీ పూర్తి చేసి టెస్ట్ల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్, జాక్ కల్లిస్ను దాటేసి రెండో స్థానానికి చేరాడు. తాజాగా సెంచరీ పూర్తి చేసి టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంగక్కరతో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో, అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సింగిల్గా ఆరో స్థానంలో నిలిచాడు. ఈ సెంచరీకి ముందు రూట్, హాషిమ్ అమ్లా తలో 55 సెంచరీలతో సంయుక్తంగా ఆరో స్థానంలో ఉండేవారు. 56వ సెంచరీతో రూట్ సింగిల్గా ఆరో స్థానానికి చేరాడు.టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు..సచిన్ టెండూల్కర్- 15921రికీ పాంటింగ్- 13378జో రూట్- 13358*జాక్ కల్లిస్- 13289రాహుల్ ద్రవిడ్- 13288టెస్ట్ల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన టాప్-5 ఆటగాళ్లు..సచిన్ టెండూల్కర్- 119జో రూట్- 104రికీ పాంటింగ్- 103జాక్ కల్లిస్- 103రాహుల్ ద్రవిడ్- 99టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్-5 ఆటగాళ్లు..సచిన్ టెండూల్కర్- 51జాక్ కల్లిస్- 45రికీ పాంటింగ్- 41జో రూట్- 38కుమార సంగక్కర- 38అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్-6 బ్యాటర్లు..సచిన్ టెండూల్కర్- 100విరాట్ కోహ్లి- 82రికీ పాంటింగ్- 71కుమార సంగక్కర- 63జాక్ కల్లిస్- 62జో రూట్- 56ఈ సెంచరీతో రూట్ సాధించిన మరిన్ని ఘనతలు..టెస్ట్ల్లో ఫాబ్-4 ఆటగాళ్లు చేసిన సెంచరీలురూట్-38 స్టీవ్ స్మిత్- 36కేన్ విలియమ్సన్- 33విరాట్ కోహ్లి- 30అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుతం యాక్టివ్ ఉండి అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్లువిరాట్ కోహ్లి- 82జో రూట్- 56రోహిత్ శర్మ- 49కేన్ విలియమ్సన్- 48స్టీవ్ స్మిత్- 48టెస్ట్ల్లో భారత్పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లురూట్- 12స్టీవ్ స్మిత్- 11గత ఐదేళ్లలో 21 సెంచరీలు చేసిన రూట్2021లో 62022లో 52023లో 22024లో 62025లో 2మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు ఆటలో రూట్ సెంచరీ పూర్తి చేసే సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 407/4గా ఉంది. రూట్ 104, స్టోక్స్ 27 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 49 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్లు జాక్ క్రాలే (84), బెన్ డకెట్ (94), ఓలీ పోప్ (71) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. హ్యారీ బ్రూక్ (3) ఒక్కడే నిరాశపరిచాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2, అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
భారత్తో నాలుగో టెస్ట్.. రికార్డులు బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకున్న జో రూట్
మాంచెస్టర్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ రికార్డులు బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. తొలుత టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్ (13288), జాక్ కల్లిస్ను (13289) అధిగమించి మూడో స్థానానికి ఎగబాకిన రూట్.. హాఫ్ సెంచరీ పూర్తి చేశాక టెస్ట్ల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్, జాక్ కల్లిస్ను దాటేసి రెండో స్థానానికి చేరాడు.టెస్ట్ల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన టాప్-5 ఆటగాళ్లు..సచిన్ టెండూల్కర్- 119జో రూట్- 104రికీ పాంటింగ్- 103జాక్ కల్లిస్- 103రాహుల్ ద్రవిడ్- 99టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు..సచిన్ టెండూల్కర్- 15921రికీ పాంటింగ్- 13378జో రూట్- 13319*జాక్ కల్లిస్- 13289రాహుల్ ద్రవిడ్- 13288మ్యాచ్ విషయానికొస్తే.. 225/2 స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి సెషన్లో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా మరో 107 పరుగులు జోడించింది. లంచ్ విరామం సమయానికి ఆ జట్టు స్కోర్ 332/2గా ఉంది. పోప్ 70, రూట్ 63 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంగ్లండ్ ఇంకా 26 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. పోప్, రూట్కు ముందు ఓపెనర్లు జాక్ క్రాలే (84), బెన్ డకెట్ (94) కూడా అర్ద సెంచరీలు సాధించారు. క్రాలే వికెట్ జడేజాకు.. డకెట్ వికెట్ అన్షుల్ కంబోజ్కు దక్కింది.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
ద్రవిడ్, కల్లిస్ను దాటేసిన రూట్.. మిగిలింది పాంటింగ్, సచిన్ మాత్రమే..!
ఇంగ్లండ్ ఆల్టైమ్ గ్రేట్ బ్యాటర్ జో రూట్ టెస్ట్ క్రికెట్లో మరో ఘనత సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్, జాక్ కల్లిస్ను అధిగమించాడు. మాంచెస్టర్ వేదికగా భారత్తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లోఈ ఫీట్ను నమోదు చేశాడు. మ్యాచ్ మూడో రోజు తొలి సెషన్లో 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ద్రవిడ్ను.. 31 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కల్లిస్ను అధిగమించాడు.టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం రూట్ ముందుంది రికీ పాంటింగ్, సచిన్ టెండూల్కర్ మాత్రమే. భారత్తో జరుగుతున్న ఇదే సిరీస్లో రూట్ రికీ పాంటింగ్ను కూడా అధిగమించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్తో పాటు ఐదో టెస్ట్లో మరో 89 పరుగులు చేస్తే పాంటింగ్ను అధిగమిస్తాడు. అప్పుడు రూట్ ముందు సచిన్ మాత్రమే ఉంటాడు. సచిన్ రికార్డు బద్దలు కొట్టడం రూట్కు అంత ఈజీ కాదు. రూట్ తన కెరీర్లో మరో 2500 పైచిలుకు పరుగులు చేయాల్సి ఉంటుంది. ఈ ఫీట్ అసాధ్యమైతే కాదు. రూట్ ప్రస్తుత ఫామ్ను బట్టి చూస్తే మరో 25 టెస్ట్ల్లో సచిన్ ఆల్టైమ్ రికార్డు బద్దలవడం ఖాయం.టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు..సచిన్ టెండూల్కర్- 15921రికీ పాంటింగ్- 13378జో రూట్- 13290*జాక్ కల్లిస్- 13289రాహుల్ ద్రవిడ్- 13288మ్యాచ్ విషయానికొస్తే.. 225/2 స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి సెషన్లో ఆచితూచి ఆడుతుంది. భారత బౌలర్లు సరైన లెంగ్త్లో బౌలింగ్ చేస్తుండటంతో ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడుతున్నారు. పోప్ 32, రూట్ 31 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోర్ 261/2గా ఉంది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంగ్లండ్ ఇంకా 97 పరుగులు వెనుకపడి ఉంది.ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్కు ఓపెనర్లు జాక్ క్రాలే (84), బెన్ డకెట్ (94) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ ధాటిగా ఆడి స్కోర్ బోర్డును పరిగెత్తించారు. క్రాలే వికెట్ జడేజాకు.. డకెట్ వికెట్ అన్షుల్ కంబోజ్కు దక్కింది.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
జడేజాది క్లియర్గా నాటౌట్.. కావాలనే ఔట్ ఇచ్చారు! ఫ్యాన్స్ ఫైర్
మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగు టెస్టులో టీమిండియాపై ఇంగ్లండ్ ఆదిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య ఇంగ్లండ్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 225 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇంకా భారత్ కంటే 133 పరుగులు వెనకంజలో ఉంది.అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 264/4తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. ఆదనంగా 94 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్ను ముగించింది. భారత బ్యాటర్లలో సాయిసుదర్శన్(61) టాప్ స్కోరర్గా నిలవగా.. రిషబ్ పంత్(54) విరోచిత పోరాటం కనబరిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లతో చెలరేగాడు.ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్లో భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఔటైన తీరు వివాదస్పదమైంది. జడేజా ఇచ్చిన క్యాచ్ను ఇంగ్లండ్ ఫీల్డర్ హ్యారీ బ్రూక్ క్లీన్గా అందుకోలేదన్న చర్చ క్రికెట్ వర్గాల్లో నడుస్తోంది. భారత ఇన్నింగ్స్ 85వ ఓవర్ వేసిన ఆర్చర్.. ఐదో బంతిని జడేజాకు ఎవే స్వింగర్గా సంధించాడు.ఆ బంతిని జడేజా డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్ దిశగా వెళ్లింది. సెకెండ్ స్లిప్లో ఉన్న బ్రూక్ డైవ్ చేస్తూ క్యాచ్ను అందుకున్నాడు. అయితే బ్రూక్ క్యాచ్ను అందుకునేటప్పుడు బంతి నేలకు తాకినట్లు కన్పించింది. కానీ ఫీల్డ్ అంపైర్ మాత్రం అది క్లీన్ క్యాచ్ కాదా కనీసం చెక్ చేయకుండా ఔట్ అని వేలు పైకెత్తాడు. దీంతో జడేజా(20 పరుగులు) కూడా ఔట్ అని భావించి రివ్యూ తీసుకోకుండా మైదానం వీడాడు. ఈ నేపథ్యంలో ఫీల్డ్ అంపైర్లు పై భారత అభిమానులు మండిపడుతున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా ఎలా ఔట్ ఇస్తారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బంతి క్లియర్గా నేలకు తాకిందంటూ స్క్రీన్ షాట్లను ఎక్స్లో షేర్ చేస్తున్నారు.The @imjadeja catch by Harry Brook had clearly touched the groundJadeja stood his ground as he too saw it. Why would he give way? #INDvsENG#ECB pic.twitter.com/23Fqnj4SEB— Vivek J (@Vivekrvcse) July 24, 2025చదవండి: ఏడ్చేసిన కరుణ్ నాయర్.. ఓదార్చిన కేఎల్ రాహుల్.. ఇక గుడ్బై!? -
IND Vs ENG: డీఎస్పీ ఆన్ ఫైర్.. గొడవలు అవసరమా సిరాజ్ భయ్యా?
మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ(Mohammed Siraj) తన సహనాన్ని కోల్పోయాడు. రెండో రోజు ఆట సందర్భంగా ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్తో సిరాజ్ వాగ్వాదానికి దిగాడు.తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్కు ఓపెనర్లు బెన్ డకెట్(94), జాక్ క్రాలీ(84) అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్కు 166 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యాన్ని భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు.కానీ ఇంగ్లండ్ ఓపెనర్లు మాత్రం వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా మహ్మద్ సిరాజ్ను బెన్ డకెట్ ఓ ఆట ఆడేసికున్నాడు. అతడి బౌలింగ్లో బౌండరీలు బాదుతూ డకెట్ పరుగులు రాబట్టుకున్నాడు.ఈ క్రమంలో తన ప్రశాంతతను కోల్పోయిన సిరాజ్.. డకెట్తో గొడవపడ్డాడు. ఏదో విషయంలో డకెట్ అంపైర్కు ఫిర్యాదు చేస్తుండగా బౌలింగ్ ఎండ్లో సిరాజ్ తన నోటికి పనిచెప్పాడు. వేలు చూపిస్తూ అతడిపై సీరియస్ అయ్యాడు. అందుకు బదులుగా డకెట్ సైతం మాటల యుద్దానికి దిగాడు. అంపైర్ జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సిరాజ్ భయ్యా ఇది అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.కాగా డకెట్తో సిరాజ్ గొడవపడడం ఇది తొలిసారి కాదు. లార్డ్స్ టెస్టులో డకెట్ను అవుట్ చేసిన తర్వాత అతిగా సెలబ్రేట్ చేసుకున్నందుకు మహమ్మద్ సిరాజ్కు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా ఐసీసీ విధించింది. ఇప్పుడు కూడా అదేవిధంగా సిరాజ్ ప్రవర్తిస్తుండడంతో ఐసీసీ తీవ్ర చర్యలు తీసుకునే అవకాశముంది. కాగా మాంచెస్టర్ టెస్టులో ఇప్పటివరకు 10 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్.. వికెట్ ఏమీ తీయకుండా 58 పరుగులు సమర్పించుకున్నాడు.Tempers flared between Ben Duckett and M. Siraj. 🔥#ENGvIND 👉 4th TEST, DAY 2 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/Y3btplYguV pic.twitter.com/MmTP86rXNU— Star Sports (@StarSportsIndia) July 24, 2025 -
అది నా చేతుల్లో లేదు.. అంతా కెప్టెన్ ఇష్టమే: శార్ధూల్ ఠాకూర్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఆల్రౌండర్ శార్ధూల్ ఠాకూర్ బ్యాట్తో రాణించాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన శార్ధూల్.. 88 బంతులు ఎదుర్కొని 41 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే బౌలింగ్లో మాత్రం మరోసారి లార్డ్ ఠాకూర్ తేలిపోయాడు.ఇప్పటివరకు 5 ఓవర్లు బౌలింగ్ చేసిన ఠాకూర్ వికెట్ ఏమీ తీయకుండా 35 పరుగులు సమర్పించుకున్నాడు. లీడ్స్లో జరిగిన తొలి టెస్టులో విఫలమం కావడంతో శార్ధూల్పై టీమ్మెనెజ్మెంట్పై వేటు పడింది. ఆ తర్వాత రెండు మ్యాచ్లకు బెంచ్కే పరిమితమైన ఈ ముంబై ఆల్రౌండర్.. తిరిగి మళ్లీ మాంచెస్టర్ టెస్టులో ఆడేందుకు అతడికి ఛాన్స్ లభించింది.అయితే బౌలర్గా శార్ధూల్ సేవలను టీమిండియా సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. దేశవాళీ క్రికెట్లో బౌలర్గా అద్బుతంగా రాణిస్తున్న ఠాకూర్కు మొదటి టెస్టులో కేవలం 16 ఓవర్లు మాత్రమే వేసే అవకాశం దక్కింది. ఇప్పుడు మాంచెస్టర్ టెస్టులో కూడా కేవలం 5 ఓవర్లు మాత్రమే శార్ధూల్తో గిల్ బౌలింగ్ చేయించాడు. తాజాగా ఇదే విషయంపై శార్ధూల్ ఠాకూర్ స్పందించాడు. పరిస్థితులకు అనుగుణంగా ఎవరిని బౌలింగ్ చేయాలనేది కెప్టెన్ ఇష్టమే అని ఠాకూర్ తెలిపాడు."ఒక బౌలర్కు బౌలింగ్ ఇవ్వడం, ఇవ్వకపోవడం అది కెప్టెన్ నిర్ణయం. అది నా చేతుల్లో లేదు. బౌలింగ్లో ఎప్పుడు ఎవరిని ఎటాక్లోకి తీసుకురావాలో కెప్టెన్ నిర్ణయిస్తాడు. ఈ మ్యాచ్లో ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉంది. మరిన్ని ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నాను" అని రెండో రోజు ఆట అనంతరం విలేకరుల సమావేశంలో ఠాకూర్ పేర్కొన్నాడు.ఇక మాంచెస్టర్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. -
IND vs ENG: అప్పుడు కుంబ్లే.. ఇప్పుడు పంత్!
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత బౌలర్లు తడబడతున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ 225 పరుగులు స్కోర్ సాధించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ(84), బెన్ డకెట్(94) దంచికొట్టారు.ప్రస్తుతం క్రీజులో జో రూట్(11), ఓలీ పోప్(20) ఉన్నారు. భారత బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, రవీంద్ర జడేజా తలా వికెట్ సాధించారు. ప్రధాన బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఇప్పటివరకు ఒక్క వికెట్ సాధించలేకపోయారు. అంతకుముందు టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది.రిషబ్ విరోచిత పోరాటం..కాగా ఈ మ్యాచ్ తొలి రోజే స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయపడటంతో భారత్కు ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. వోక్స్ సంధించిన బంతి పంత్ కుడికాలి బొటనవేలికి బలంగా తగలడంతో అతను విలవిలలాడుతూ రిటైర్ట్హర్ట్గా వెనుదిరిగాడు.తదనంతరం స్కానింగ్లో బొటనవేలికి ఫ్రాక్చర్ అయినట్లు తేలడంతో ఇక ఆడే పరిస్థితి లేనట్లేనని భావించారంతా! కానీ 2022, డిసెంబర్లో పెను ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన పంత్ నడవలేని స్థితి నుంచి... పట్టుదలతో నడవడమే కాదు ఏకంగా పిచ్పై చకచకా పరుగులు తీస్తున్న ఈ పోరాటయోధుడు రెండో రోజు బ్యాటింగ్కు దిగి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. గాయాన్ని పంటిబిగువన భరించి అసౌకర్యంగా నడుకుకుంటూ వచ్చిన రిషభ్ పంత్ క్రీజ్లో మొండిగా పోరాడి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. దెబ్బ తగలగానే అడుగుతీసి అడుగు వేయడంలో ఇబ్బంది పడిన పంత్ రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ బౌలర్లకు ఎదురీది అర్ధసెంచరీ సాధించడం విశేషం. ఈ స్పెషలిస్ట్ బ్యాటర్ ఆడటం వల్లే భారత్ తొలి ఇన్నింగ్స్లో 350 పైచిలుకు స్కోరు చేయగలిగింది. లేదంటే భారత్ పరిస్థితి భిన్నంగా ఉండేది. మొత్తమ్మీద అతని పోరాటం దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను గుర్తుకుతెచ్చింది. 2002లో కరీబియన్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో అప్పటి బౌలింగ్ దళానికి తురుపుముక్కలాంటి కుంబ్లే తలకు గాయమైంది. అయినాసరే తలకు బ్యాండేజ్ కట్టుకొని వచ్చి మరీ 14 ఓవర్లు వేసిన కుంబ్లే... వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాను అవుట్ చేశాడు.చదవండి: వచ్చే ఏడాదీ ఇంగ్లండ్కు టీమిండియా -
ENG VS IND 4th Test: దుమ్మురేపిన ఓపెనర్లు.. భారీ స్కోర్ దిశగా ఇంగ్లండ్
బెన్ డకెట్ 94 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. కాగా 40 ఓవర్ల తర్వాత ప్రస్తుతం స్కోరు 205/2గా ఉంది.మాంచెస్టర్ టెస్ట్లో ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలే చెలరేగిపోయారు. తొలి వికెట్కు మెరుపు వేగంతో 166 పరుగులు జోడించారు. అనంతరం 84 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జాక్ క్రాలే (113 బంతుల్లో 84; 13 ఫోర్లు, సిక్స్) ఔటయ్యాడు. రవీంద్ర జడేజా బౌలింగ్లో కేఎల్ రాహుల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో క్రాలే పెవిలియన్కు చేరాడు.క్రాలే ఔటైనా బెన్ డకెట్ ధాటిగా ఆడుతున్నాడు. 91 పరుగుల వద్ద (98 బంతుల్లో 13 ఫోర్లు) ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. 37 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 192/1గా ఉంది. డకెట్కు జతగా ఓలీ పోప్ (8) క్రీజ్లో ఉన్నాడు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. 264/4 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. ఓవర్నైట్ స్కోర్కు మరో 94 పరుగులు జోడించి మిగతా 6 వికెట్లు కోల్పోయింది.భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఇవాల్టి ఆటలో ఇంగ్లండ్ బౌలర్ బెన్ స్టోక్స్ చెలరేగిపోయాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తంగా అతను 5 వికెట్లు తీశాడు. ఆర్చర్కు సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
ENG VS IND 4th Test: దూకుడుగా ఆడుతున్న ఇంగ్లండ్ ఓపెనర్లు
మాంచెస్టర్ టెస్ట్లో ఇంగ్లండ్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. రెండో రోజు టీ విరామం సమయానికి ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 77 పరుగులు (14 ఓవర్లలో) చేసింది. బెన్ డకెట్ 43, జాక్ క్రాలే 33 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఈ సెషన్లో భారత బౌలర్లు ఎంత శ్రమించినా వికెట్ దక్కలేదు. బుమ్రా, అన్షుల్ కంబోజ్ తలో 5, సిరాజ్ 4 ఓవర్లు వేయగా.. ఇంగ్లండ్ బ్యాటర్లు వన్డేలను తలపించి ఆడారు. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంగ్లండ్ ఇంకా 281 పరుగులు వెనుకపడి ఉంది.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. 264/4 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. ఓవర్నైట్ స్కోర్కు మరో 94 పరుగులు జోడించి మిగతా 6 వికెట్లు కోల్పోయింది.భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఇవాల్టి ఆటలో ఇంగ్లండ్ బౌలర్ బెన్ స్టోక్స్ చెలరేగిపోయాడు. ఈ ఇన్నింగ్స్లో అతను 5 వికెట్లు తీశాడు. ఆర్చర్ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
పంత్ వీరోచిత పోరాటం.. ముగిసిన భారత తొలి ఇన్నింగ్స్
మాంచెస్టర్ టెస్ట్లో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 358 పరుగులకు ఆలౌటైంది. 264/4 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. ఓవర్నైట్ స్కోర్కు మరో 94 పరుగులు జోడించి మిగతా 6 వికెట్లు కోల్పోయింది.తొలి రోజు ఆటలో గాయపడిన వికెట్కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇవాళ వీరోచితంగా పోరాడి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇవాళ శార్దూల్ ఠాకూర్ ఔటయ్యాక రీఎంట్రీ ఇచ్చిన పంత్.. వాషింగ్టన్ సుందర్, అన్షుల్ కంబోజ్ సాయంతో భారత ఇన్నింగ్స్ను తీర్చిదిద్దాడు. పంత్ తొమ్మిదో వికెట్గా వెనుదిరిగాక భారత ఇన్నింగ్స్ క్షణాల్లో ముగిసింది.భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఇవాల్టి ఆటలో ఇంగ్లండ్ బౌలర్ బెన్ స్టోక్స్ చెలరేగిపోయాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తంగా అతను 5 వికెట్లు తీశాడు. ఆర్చర్కు సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
గాయాన్ని సైతం లెక్క చేయకుండా ఆడి చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్
మాంచెస్టర్ టెస్ట్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో గాయాన్ని సైతం లెక్క చేయకుండా బరిలోకి దిగిన పంత్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక పరుగులు (67 ఇన్నింగ్స్ల్లో 2719 పరుగులు) చేసిన భారత ఆటగాడిగా అవతరించాడు. ఈ రికార్డు ఇంతకుముందు రోహిత్ శర్మ (69 ఇన్నింగ్స్ల్లో 2716 పరుగులు) పేరిట ఉండేది. పంత్ తాజాగా హిట్మ్యాన్ రికార్డును బద్దలు కొట్టాడు.ఈ మ్యాచ్లో పంత్ 54 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. తొలి రోజు ఆటలో 37 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయిన పంత్.. మరో 17 పరుగులు జోడించి పెవిలియన్కు చేరాడు. బొటన వేలు గాయంతో బాధపడుతూనే పంత్ ఆడిన ఈ ఇన్నింగ్స్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. పంత్ వీరోచిత పోరాటానికి అందరూ సలాం కొడుతున్నారు. పంత్ హాఫ్ సెంచరీకి చేరువలో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో బాదిన ఓ సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. ఈ సిక్సర్తో పంత్ భారత్ తరఫున టెస్ట్ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం పంత్, సెహ్వాగ్ టెస్ట్ల్లో తలో 90 సిక్సర్లతో ఉన్నారు.హాఫ్ సెంచరీ పూర్తి కాగానే పంత్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పంత్ ఔటయ్యాక భారత్ ఇన్నింగ్స్ కొద్ది క్షణాల్లోనే ముగిసింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది.భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 5, ఆర్చర్ 3, వోక్స్ డాసన్ తలో వికెట్ తీశారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
విజృంభించిన బెన్ స్టోక్స్.. ఎనిమిదేళ్ల తర్వాత అరుదైన ఘనత
మాంచెస్టర్ టెస్ట్లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్లో చెలరేగిపోయాడు. ఎనిమిదేళ్ల తర్వాత టెస్ట్ల్లో అరుదైన ఐదు వికెట్ల ఘనత సాధించాడు. భారత తొలి ఇన్నింగ్స్లో అన్షుల్ కంబోజ్ వికెట్ స్టోక్స్కు ఈ మ్యాచ్లో ఐదో వికెట్. కంబోజ్ను ఔట్ చేయకముందు స్టోక్స్ అదే ఓవర్లో వాషింగ్టన్ సుందర్ను కూడా పెవిలియన్కు పంపాడు. అప్పటిదాకా సాఫీగా సాగిన భారత ఇన్నింగ్స్ స్టోక్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో ఒక్కసారిగా కుదుపుకులోనైంది. కంబోజ్ వికెట్తో స్టోక్స్ ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు (16) తీసిన బౌలర్గానూ అవతరించాడు. ఈ ఇన్నింగ్స్లో స్టోక్స్ కంబోజ్, సుందర్ వికెట్లతో పాటు కీలకమైన సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, శార్దూల్ ఠాకూర్ వికెట్లు తీశాడు.లంచ్ విరామం తర్వాత భారత్ స్కోర్ 8 వికెట్ల నష్టానికి 349 పరుగులుగా ఉంది. రిషబ్ పంత్ 54, జస్ప్రీత్ బుమ్రా 0 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన విషయం తెలిసిందే. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 5, వోక్స్, ఆర్చర్, డాసన్ తలో వికెట్ తీశారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
మళ్లీ బ్యాటింగ్కు దిగిన పంత్.. లంచ్ సమయానికి టీమిండియా స్కోర్ ఎంతంటే..?
మాంచెస్టర్ టెస్ట్లో భారత్ ఓ మోస్తరు స్కోర్ దిశగా పయనిస్తుంది. రెండో రోజు లంచ్ విరామం సమయానికి టీమిండియా 6 వికెట్ల కోల్పోయి 321 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (20), రిషబ్ పంత్ (39) క్రీజ్లో ఉన్నారు.ఓవర్నైట్ స్కోర్ 264/4 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రవీంద్ర జడేజా తన వ్యక్తిగత స్కోర్కు మరో పరుగు మాత్రమే జోడించి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.జడేజా ఆదిలోనే ఔటైనప్పటికీ శార్దూల్ ఠాకూర్ (41).. వాషింగ్టన్ సుందర్ సాయంతో ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. లంచ్ విరామానికి కొద్ది సమయం ముందు శార్దూల్ స్టోక్స్ బౌలింగ్లో బెన్ డకెట్కు క్యాచ్ ఇచ్చి ఆరో వికెట్గా వెనుదిరిగాడు.అనంతరం పంత్ గాయంతో బాధపడుతూనే బరిలోకి దిగాడు. తొలి రోజులో ఆటలో పంత్ 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గాయం బారిన పడి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. పంత్ గాయం తీవ్రమైందే అయినప్పటికీ జట్టు అవసరాల దృష్ట్యా బ్యాటింగ్కు దిగాడు. పంత్ సేవలు ఈ మ్యాచ్లో కేవలం బ్యాటింగ్కు మాత్రమే పరిమితమవుతాయని, అతను వికెట్కీపింగ్ చేయడని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది.ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన విషయం తెలిసిందే. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 3, వోక్స్, ఆర్చర్, డాసన్ తలో వికెట్ తీశారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
ఇషాన్ కిషన్ కాదు.. పంత్కు రీప్లేస్మెంట్ అతడే..!
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో (తొలి రోజు) టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయపడిన విషయం తెలిసిందే. పంత్ గాయం తీవ్రత అధికంగా ఉన్నా జట్టు అవసరాల దృష్ట్యా రెండో రోజు బ్యాటింగ్కు దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే పంత్ సేవలు కేవలం బ్యాటింగ్కు మాత్రమే పరిమితమవుతాయని, అతను వికెట్కీపింగ్ చేయడని బీసీసీఐ స్పష్టం చేసింది.జట్టు అవసరాల దృష్ట్యా పంత్ను ఈ మ్యాచ్లో బ్యాటింగ్కు వాడుకున్నా, ఐదో టెస్ట్లో మాత్రం అతను బరిలోకి దిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో పంత్కు ప్రత్యామ్నాయంగా ఎవరో ఒకరిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ధృవ్ జురెల్ అందుబాటులో ఉన్నా, కవర్ ప్లేయర్ ఎంపిక తప్పనిసరి అవుతుంది.నిన్నటి వరకు పంత్కు ప్రత్యామ్నాయంగా ఇషాన్ కిషన్ను ఎంపిక చేస్తారని ప్రచారం జరిగినా, తాజాగా ఓ కొత్త పేరు తెరపైకి వచ్చింది. చివరి టెస్ట్ కోసం పంత్కు రీప్లేస్మెంట్గా తమిళనాడుకు చెందిన రైట్ హ్యాండ్ వికెట్కీపర్ బ్యాటర్ నారాయణన్ జగదీశన్ పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. 29 ఏళ్ల జగదీశన్ ఐపీఎల్లో సీఎస్కే, కేకేఆర్ తరఫున ఆడాడు. చివరిగా అతను 2023 సీజన్లో కేకేఆర్లో ఉన్నాడు. జగదీశన్ ఐపీఎల్లో పెద్దగా రాణించకపోయిన దేశవాలీ క్రికెట్లో అద్భుతాలు చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (277).. లిస్ట్-ఏ క్రికెట్లో వరుసగా ఐదు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసిన వరల్డ్ రికార్డు ఇతని ఖాతాలో ఉన్నాయి. వికెట్కీపర్గానూ జగదీశన్కు మంచి రికార్డే ఉంది. -
ENG VS IND 4th Test: పంత్ బ్యాటింగ్ చేస్తాడు.. బీసీసీఐ కీలక ప్రకటన
ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్ తొలి రోజు ఆటలో గాయపడి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన రిషబ్ పంత్కు సంబంధించి బీసీసీఐ కీలక అప్డేట్ ఇచ్చింది. పంత్ ఈ మ్యాచ్లో వికెట్కీపింగ్కు దూరంగా ఉన్నా, బ్యాటింగ్ చేస్తాడని కన్ఫర్మ్ చేసింది. పంత్ స్థానంలో ధృవ్ జురెల్ వికెట్ కీపింగ్ చేస్తాడని స్పష్టం చేసింది. గాయం తీవ్రత అధికంగా ఉన్నా ఆట రెండో రోజు పంత్ జట్టుతో చేరాడని, జట్టు అవసరాల దృష్ట్యా అతను బ్యాటింగ్ చేస్తాడని బీసీసీఐ తమ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ప్రకటన చేసింది.𝗨𝗽𝗱𝗮𝘁𝗲: Rishabh Pant, who sustained an injury to his right foot on Day 1 of the Manchester Test, will not be performing wicket-keeping duties for the remainder of the match. Dhruv Jurel will assume the role of wicket-keeper.Despite his injury, Rishabh Pant has joined the…— BCCI (@BCCI) July 24, 2025కాగా, ఈ మ్యాచ్ తొలి రొజు ఆటలో పంత్ క్రిస్ వోక్స్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపడ్డాడు. బంతి బ్యాట్ ఎడ్జ్కు తగిలి పంత్ కుడి కాలు పాదానికి బలంగా తాకింది. దీంతో పంత్ తీవ్రమైన నొప్పితో విలవిలలాడాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి ఫలితం లేకపోవడంతో పంత్ రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. నడవలేని స్థితిలో ఉన్న పంత్ను వాహనంలో తీసుకెళ్లారు. పంత్ రిటైర్డ్ అయ్యే సమయానికి 37 పరుగులు చేశాడు.ఇదిలా ఉంటే, ఓవర్నైట్ స్కోర్ 264/4 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓవర్నైట్ బ్యాటర్ రవీంద్ర జడేజా తన స్కోర్కు మరో పరుగు మాత్రమే జోడించి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.జడేజా ఆదిలోనే ఔటైనప్పటికీ శార్దూల్ ఠాకూర్ (39) ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. వాషింగ్టన్ సుందర్ (13) శార్దూల్కు సహకరిస్తున్నాడు. కడపటి వార్తలు అందేసరికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన విషయం తెలిసిందే. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రిషబ్ పంత్ 37 (రిటైర్డ్ హర్ట్), రవీంద్ర జడేజా 20 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 2, వోక్స్, ఆర్చర్, డాసన్ తలో వికెట్ తీశారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
మరోసారి ఇంగ్లండ్లో పర్యటించనున్న టీమిండియా.. షెడ్యూల్ విడుదల
భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టు వచ్చే ఏడాది మరోసారి ఇంగ్లండ్లో పర్యటించనుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలోనే ఉన్న టీమిండియా.. 2026 జులైలో ఇంగ్లండ్తో 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఈ మేరకు ఇవాళ (జులై 24) షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది జులై 1 (డర్హమ్), 4 (మాంచెస్టర్), 7 (నాటింగ్హమ్), 9 (బ్రిస్టల్), 11 (సౌతాంప్టన్) తేదీల్లో ఐదు టీ20లు.. ఆతర్వాత 14 (బర్మంగ్హమ్), 16 (కార్డిఫ్), 19 (లార్డ్స్) తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. భారత్తో జరగాల్సిన మ్యాచ్లతో పాటు వచ్చే ఏడాది హెం సమ్మర్ షెడ్యూల్ మొత్తాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. పురుషులతో పాటు మహిళల క్రికెట్కు సంబంధించిన షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. వచ్చే ఏడాది హోం సమ్మర్లో భారత మహిళల జట్టు కూడా ఇంగ్లండ్తో మ్యాచ్లు ఆడనుంది. ఈ పర్యటనలో భారత్ 3 టీ20లు, ఓ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. వచ్చే ఏడాది ఇంగ్లండ్ పురుషుల హోం సమ్మర్ షెడ్యూల్..మొదటి టెస్ట్ న్యూజిలాండ్తో జూన్ 4-8 లార్డ్స్, లండన్రెండవ టెస్ట్ న్యూజిలాండ్తో జూన్ 17-21 ది కియా ఓవల్, లండన్మూడవ టెస్ట్ న్యూజిలాండ్తో జూన్ 25-29 ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్హామ్మొదటి T20I ఇండియాతో జూలై 1 బ్యాంక్స్ హోమ్స్ రివర్సైడ్, డర్హమ్రెండవ T20I ఇండియాతో జూలై 4 ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్3వ T20I ఇండియాతో జూలై 7 ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్హామ్4వ T20I ఇండియాతో జూలై 9 సీట్ యూనిక్ స్టేడియం, బ్రిస్టల్5వ T20I ఇండియాతో జూలై 11 యుటిలిటా బౌల్, సౌతాంప్టన్మొదటి వన్డే ఇండియాతో జూలై 14 ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్రెండవ వన్డే ఇండియా తోజూలై 16 సోఫియా గార్డెన్స్, కార్డిఫ్మూడవ వన్డే ఇండియాతో జూలై 19 లార్డ్స్, లండన్మొదటి టెస్ట్ పాకిస్తాన్తో ఆగస్టు 19-23 హెడింగ్లీ, లీడ్స్రెండవ టెస్ట్ పాకిస్తాన్తో ఆగస్టు 27-31 లార్డ్స్, లండన్మూడవ టెస్ట్ పాకిస్తాన్తో సెప్టెంబర్ 9-13 ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్మొదటి T20I శ్రీలంకతో సెప్టెంబర్ 15 యుటిలిటా బౌల్, సౌతాంప్టన్రెండవ T20I శ్రీలంకతో సెప్టెంబర్ 17 సోఫియా గార్డెన్స్, కార్డిఫ్3వ T20I శ్రీలంకతో సెప్టెంబర్ 19 ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్మొదటి ODI శ్రీలంకతో సెప్టెంబర్ 22 బ్యాంక్స్ హోమ్స్ రివర్సైడ్, డర్హామ్రెండవ ODI శ్రీలంకతో సెప్టెంబర్ 24 హెడింగ్లీ, లీడ్స్మడవ ODI శ్రీలంకతో సెప్టెంబర్ 27 ది కియా ఓవల్, లండన్వచ్చే ఏడాది ఇంగ్లండ్ మహిళల హోం సమ్మర్ షెడ్యూల్..మొదటి వన్డే న్యూజిలాండ్తో మే 10 బ్యాంక్స్ హోమ్స్ రివర్సైడ్, డర్హామ్రెండవ వన్డే న్యూజిలాండ్తో మే 13 ది కౌంటీ గ్రౌండ్, నార్తాంప్టన్మూడవ వన్డే న్యూజిలాండ్తో మే 16 సోఫియా గార్డెన్స్, కార్డిఫ్1వ T20I న్యూజిలాండ్తో మే 20 ది సెంట్రల్ కో-ఆప్ కౌంటీ గ్రౌండ్, డెర్బీ2వ T20I న్యూజిలాండ్తో మే 23 ది స్పిట్ఫైర్ గ్రౌండ్, కాంటర్బరీ3వ T20I న్యూజిలాండ్తో మే 25 ది 1వ సెంట్రల్ కౌంటీ గ్రౌండ్, హోవ్1వ T20I ఇండియాతో మే 28 అంబాసిడర్ క్రూయిజ్ లైన్ గ్రౌండ్, చెల్మ్స్ఫోర్డ్2వ T20I ఇండియాతో మే 30 సీట్ యూనిక్ స్టేడియం, బ్రిస్టల్3వ T20I ఇండియాతో జూన్ 2 ది కూపర్ అసోసియేట్స్ కౌంటీ గ్రౌండ్, టౌంటన్టెస్ట్ ఇండియాతో జూలై 10-14 లార్డ్స్, లండన్1వ వన్డే ఐర్లాండ్తో సెప్టెంబర్ 1 ది అప్టన్స్టీల్ కౌంటీ గ్రౌండ్, లీసెస్టర్2వ వన్డే ఐర్లాండ్తో సెప్టెంబర్ 3 ది సెంట్రల్ కో-ఆప్ కౌంటీ గ్రౌండ్, డెర్బీ3వ వన్డే ఐర్లాండ్తో సెప్టెంబర్ 6 వోర్సెస్టర్షైర్ న్యూ రోడ్, వోర్సెస్టర్ -
నాకు ఇలానే జరిగింది.. అదే అయితే పంత్ ఆడడం కష్టమే: పాంటింగ్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయం కారణంగా రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో పంత్ గాయపడ్డాడు.బంతి బ్యాట్ ఎడ్జ్ తగిలి పంత్ కుడి కాలి పాదానికి బలంగా తాకింది. వెంటనే పత్యేక వాహనంలో పంత్ మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత స్కానింగ్ కోసం అతడిని ఆస్పత్రికి తరలించారు. స్కాన్ రిపోర్ట్లు కోసం బీసీసీఐ వైద్య బృందం ఎదురు చూస్తోంది.ఒకవేళ అతడి గాయం తీవ్రమైనదిగా తేలితే అది భారత్కు గట్టి ఎదురు దెబ్బ కానుంది. రిషబ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ సిరీస్లో సెకెండ్ లీడింగ్ రన్స్కోరర్గా కొనసాగుతున్న పంత్.. ఈ మ్యాచ్తో పాటు ఆఖరి టెస్టు అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో పంత్ గాయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు."రిషబ్ పంత్ కుడి కాలి పాదానికి బలంగా బంతి తాకింది. దెబ్బ తాకిన పంత్ తన కాలును నేలపై పెట్టలేకపోయాడు. గోల్ఫ్ కార్ట్ వాహనం మైదానంలో లోపలికి వచ్చేముందు అతడు కొద్ది నిమిషాల పాటు అటు ఇటు తిరిగాడు. అయితే వెంటనే వాపు రావడం నాకు ఆందోళన కలిగించింది.గతంలో నాకు ఓ సారి ఇటువంటి గాయమే అయింది. పాదంలో చిన్న చిన్న పెళుసుగా ఉండే ఎముకలు ఉంటాయి. బంతి తాకడంతో అందులో ఒకట్రెండు విరిగిపోయాయి. అలా జరిగితే కాలు కింద పెట్టలేము. ఒకవేళ పంత్ విషయంలో అదే జరిగితే అతడు ఈ మ్యాచ్ నుంచి వైదొలగక తప్పదు. అలా అతడు తిరిగి బ్యాటింగ్కు వచ్చే అవకాశముంది. ఒకవేళ తిరిగొచ్చిన ఇటువంటి రివర్స్ స్వీప్ షాట్లు ఆడడని నేను ఆశిస్తున్నా అని స్కై స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాంటింగ్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: రిషబ్ పంత్ గాయంపై బీసీసీఐ కీలక అప్డేట్ -
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను దురదృష్టం వెంటాడింది. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో పంత్కు తీవ్రగాయమైంది. క్రిస్ వోక్స్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ షాట్ ఆడే క్రమంలో పంత్ కుడికాలికి గాయమైంది.దీంతో 37 పరుగులు చేసిన రిషబ్ రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. పంత్ గాయపడక ముందు ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. విదేశీ గడ్డపై 1000 పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి పర్యాటక జట్టు వికెట్ కీపర్ బ్యాటర్గా పంత్ చరిత్ర సృష్టించాడు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని రికార్డును పంత్ తన పేరిట లిఖించుకున్నాడు. పంత్ ఇప్పటివరకు ఇంగ్లండ్లో టెస్టుల్లో 1004 పరుగులు చేశాడు. ప్రస్తుతం పంత్ దారిదాపుల్లో ఎవరూ లేరు.ఇంగ్లండ్లో అత్యధిక పరుగులు చేసిన విజిటింగ్ వికెట్ కీపర్లు వీరే..1004 పరుగులు-రిషబ్ పంత్ (భారత్)*778 పరుగులు- ఎంఎస్ ధోని (భారత్)773 పరుగులు - రాడ్ మార్ష్ (ఆస్ట్రేలియా)684 పరుగులు - జాన్ వైట్ (దక్షిణాఫ్రికా)624 పరుగులు - ఇయాన్ హీలీ (ఆస్ట్రేలియా)విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన విజిటింగ్ వికెట్ కీపర్లు వీరే..1000 – రిషబ్ పంత్ (ఇంగ్లాండ్)879 – రిషబ్ పంత్ (ఆస్ట్రేలియా)778 – ఎంఎస్ ధోని (ఇంగ్లాండ్)773 – రాడ్ మార్ష్ (ఇంగ్లాండ్)717 – ఆండీ ఫ్లవర్ (భారతదేశం)👉ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక టెస్టు పరుగులు చేసిన పర్యాటక వికెట్ కీపర్గా పంత్(879) కొనసాగుతున్నాడు.కాగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 77 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(19), శార్ధూల్ ఠాకూర్(19) ఉన్నారు. భారత బ్యాటర్లలో ఓపెనర్లు యశస్వి జైశ్వాల్(58), సాయిసుదర్శన్(61), కేఎల్ రాహుల్(46) రాణించారు.చదవండి: IND vs ENG: గిల్ నీకు కొంచమైన తెలివి ఉందా.. ఇంత చెత్తగా ఔట్ అవుతావా? వీడియో -
గిల్ నీకు కొంచమైన తెలివి ఉందా.. ఇంత చెత్తగా ఔట్ అవుతావా? వీడియో
ఇంగ్లండ్తో మూడో టెస్టులో ఘోరంగా విఫలమైన టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్.. ఇప్పుడు మాంచెస్టర్లో కూడా అదే తీరును కనబరిచాడు. మాంచెస్టర్ వేదికగా బుధవారం ఇంగ్లీష్ జట్టుతో ప్రారంభమైన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో గిల్ తీవ్ర నిరాశపరిచాడు.రెండో సెషన్ యశస్వి జైశ్వాల్ ఔటయ్యాక గిల్ బ్యాటింగ్కు దిగాడు. ఈ క్రమంలో గిల్ మైదానంలో అడుగుపెట్టగానే ఇంగ్లండ్ అభిమానులు గట్టిగా అరుస్తూ గేలి చేశారు.లార్డ్స్ టెస్టులో గిల్ వ్యవహరించిన తీరు కారణంగా ఇంగ్లీష్ జట్టు అభిమానులు ఇలా చేశారు. అయితే ఈ మ్యాచ్లో గిల్ ఔటైన తీరుపై నెటిజన్లు ఫైరవతున్నారు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ట్రాప్లో గిల్ చిక్కుకున్నాడు. భారత ఇన్నింగ్స్ 50వ ఓవర్ వేసిన స్టోక్స్.. తొలి బంతిని గిల్కు అద్బుతమైన ఇన్స్వింగర్గా సంధించాడు. అయితే బంతిని అంచనా వేయడంలో గిల్ విఫలమయ్యాడు.ఆ ఇన్స్వింగర్ బంతిని గిల్ ఆడకుండా వదిలేశాడు. కానీ బంతి అద్భుతంగా టర్న్అయ్యి గిల్ ప్యాడ్కు తాకింది. వెంటనే బౌలర్తో పాటు ఫీల్డర్లు ఎల్బీకి అప్పీల్ చేశారు. వెంటనే అంపైర్ రాడ్ టక్కర్ ఔట్ అంటూ వేలు పైకెత్తాడు.దీంతో గిల్ నాన్స్ట్రైక్లో ఉన్న సాయిసుదర్శన్తో మాట్లాడి రివ్యూ తీసుకున్నాడు. రిప్లేలో బంతి ఆఫ్స్టంప్కు తాకినట్లు తేలింది. దీంతో 12 పరుగులు చేసిన గిల్ మైదానాన్ని వీడక తప్పలేదు. ఈ క్రమంలో ఇంగ్లండ్ బర్మి ఆర్మీ గిల్ను ట్రోలు చేసింది. "గిల్ సమయాన్ని తన వృధా చేయకుండా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపోయాడని" ఎక్స్లో పోస్ట్ చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 77 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(19), శార్ధూల్ ఠాకూర్(19) ఉన్నారు Captain 🆚 captainAnd Ben Stokes comes out on top! 🔥🇮🇳 1️⃣4️⃣0️⃣-3️⃣ pic.twitter.com/kjpBIGpp5K— England Cricket (@englandcricket) July 23, 2025 -
రిషబ్ పంత్ గాయంపై బీసీసీఐ కీలక అప్డేట్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్కు తీవ్రగాయమైంది. తొలి రొజు ఆటలో భాగంగా పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్లో మూడో బంతికి పంత్ రివర్స్ స్వీప్ ఆడటానికి ప్రయత్నించాడు.అయితే బంతి బ్యాట్ ఎడ్జ్కు తగిలి పంత్ కుడి కాలు పాదానికి బలంగా తాకింది. దీంతో రిషబ్ తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి ఫలితం లేకపోవడంతో ఈ ఢిల్లీ ఆటగాడు రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. పంత్ రిటైర్డ్ హార్ట్ అయ్యే సమయానికి 37 పరుగులు చేశాడు. అద్భుతమైన ఫామ్లో ఉన్న రిషబ్ గాయపడడం భారత్కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. అస్సలు రెండో రోజు ఆటలో పంత్ బ్యాటింగ్ వస్తాడా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. ఇంతకుముందు లార్డ్స్ టెస్టులో కూడా పంత్ గాయపడిన సంగతి తెలిసిందే. ఇక తాజా గాయంపై బీసీసీఐ అప్డేట్ ఇచ్చింది."మాంచెస్టర్ టెస్ట్ మొదటి రోజు ఆటలో బ్యాటింగ్ చేస్తుండగా రిషబ్ పంత్ కుడి పాదానికి గాయమైంది. అతడిని స్కాన్ల కోసం అస్పత్రికి తరలించారు. పంత్ ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని" భారత క్రికెట్ బోర్డు ఎక్స్లో రాసుకొచ్చింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 77 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది.క్రీజులో రవీంద్ర జడేజా(19), శార్ధూల్ ఠాకూర్(19) ఉన్నారు. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ (58), రాహుల్ (46) రాణించగా.. కెప్టెన్ శుభమన్ గిల్ 12 పరుగులు మాత్రమే చేసి నిరాశ పర్చాడు. ఇక యువ ఆటగాడు సాయిసుదర్శన్(61) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండు వికెట్ల పడగొట్టగా.. వోక్స్, డాసన్ చెరో వికెట్ తీశారు.చదవండి: IND vs ENG: భారత మాజీ వికెట్ కీపర్కు అరుదైన గౌరవం..𝗨𝗽𝗱𝗮𝘁𝗲:Rishabh Pant was hit on his right foot while batting on Day 1 of the Manchester Test. He was taken for scans from the stadium. The BCCI Medical Team is monitoring his progress.— BCCI (@BCCI) July 23, 2025 -
ENG VS IND 4th Test: టీమిండియాకు బిగ్ షాక్.. మైదానాన్ని వీడిన పంత్
83 ఓవర్ల తర్వాత టీమిండియా బ్యాటర్ శార్ధుల్ ఠాకూర్ 19, జడేజా 19 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. 4 వికెట్ల నష్టానికి స్కోర్ 264 పరుగులుగా ఉంది.మాంచెస్టర్ టెస్ట్లో టీమిండియాకు తొలి రోజు చివరి సెషన్లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మూడో టెస్ట్లో వేలి గాయానికి గురైన పంత్ తాజాగా కాలి బొటన వేలికి దెబ్బ తగిలించుకున్నాడు. నొప్పితో విలవిలలాడిపోయిన పంత్ను వాహనంలో డ్రెస్సింగ్ రూమ్కు తీసుకెళ్లారు. పంత్ (37) మైదానాన్ని వీడే సమయానికి ఓ చారిత్రక రికార్డు సాధించాడు. ఇంగ్లండ్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి పర్యాటక వికెట్కీపర్ బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డును పంత్ సిక్సర్తో అందుకోవడం విశేషం.పంత్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాక రవీంద్ర జడేజా క్రీజ్లోకి వచ్చాడు. పంత్ మైదానాన్ని వీడిన కొద్ది సేపటికే సాయి సుదర్శన్ అర్ద సెంచరీ పూర్తి చేశాడు. 78 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 249 పరుగులుగా ఉంది. సాయి సుదర్శన్ (61), రవీంద్ర జడేజా (12) క్రీజ్లో ఉన్నారు.ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (46), యశస్వి జైస్వాల్ (58) రాణించగా.. శుభ్మన్ గిల్ (12) నిరాశపరిచాడు. భారత్ కోల్పోయిన వికెట్లలో రాహుల్ వికెట్ క్రిస్ వోక్స్కు.. జైస్వాల్ వికెట్ లియామ్ డాసన్కు.. శుభ్మన్ గిల్ వికెట్ బెన్ స్టోక్స్కు దక్కింది.కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. మొదటి, మూడు టెస్ట్ల్లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. భారత్ రెండో మ్యాచ్లో గెలుపొందింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ సిరీస్లో నిలబడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ భారత్కు డు ఆర్ డైగా మారింది.తుది జట్లు..ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.భారత్: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (WK),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. -
ENG VS IND 4th Test: ఇన్నింగ్స్ను చక్కదిద్దుతున్న సాయి సుదర్శన్, పంత్
మాంచెస్టర్ టెస్ట్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 200 పరుగుల మార్కును దాటింది. 46 పరుగుల వ్యవధిలో కేఎల్ రాహుల్ (46), యశస్వి జైస్వాల్ (58), శుభ్మన్ గిల్ (12) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ను సాయి సుదర్శన్ (46), రిషబ్ పంత్ (28) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్కు అజేయమైన 61 పరుగులు జోడించి భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దుతున్నారు.సాయి సుదర్శన్ ఎంతో ఓపికగా ఆడుతూ ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తుండగా.. పంత్ తనదైన శైలిలో ధాటిగా ఆడుతున్నాడు. 65 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 201/3గా ఉంది. భారత్ కోల్పోయిన వికెట్లలో రాహుల్ వికెట్ క్రిస్ వోక్స్కు.. జైస్వాల్ వికెట్ లియామ్ డాసన్కు.. శుభ్మన్ గిల్ వికెట్ బెన్ స్టోక్స్కు దక్కింది.కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. మొదటి, మూడు టెస్ట్ల్లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. భారత్ రెండో మ్యాచ్లో గెలుపొందింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ సిరీస్లో నిలబడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ భారత్కు డు ఆర్ డైగా మారింది.తుది జట్లు..ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.భారత్: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (WK),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. -
ఘోరంగా విఫలమైన వైభవ్ సూర్యవంశీ
ఇంగ్లండ్ అండర్ 19 జట్టుతో జరుగుతున్న రెండో యూత్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో భారత యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఘోరంగా విఫలమయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే అలెక్స్ గ్రీన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డై గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కూడా వైభవ్ నిరాశపరిచాడు. కేవలం 20 పరుగులకే ఔటయ్యాడు.ఈ సిరీస్లోని తొలి టెస్ట్లో కూడా వైభవ్ ఓ మోస్తరు ప్రదర్శనలకే పరిమితమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో 14 పరుగులే చేసి నిరాశపరిచిన వైభవ్.. రెండో ఇన్నింగ్స్లో అర్ద సెంచరీ చేసి పర్వాలేదనిపించాడు. టెస్ట్ సిరీస్లో వైభవ్పై భారీ అంచనాలు ఉండటానికి కారణం అంతకుముందు ఇంగ్లండ్తోనే జరిగిన ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్. ఆ సిరీస్లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి మ్యాచ్లో 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిన వైభవ్.. రెండో వన్డేలో 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు.. మూడో వన్డేలో 31 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 86 పరుగులు.. నాలుగో వన్డేలో 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో ఏకంగా 143 పరుగులు చేశాడు. చివరి వన్డేలో శాంతించిన వైభవ్.. ఓ మోస్తరు ఇన్నింగ్స్తో (42 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 33 పరుగులు) సరిపెట్టాడు.వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్ల ధాటికి భారత్ ఇంగ్లండ్ను వారి సొంతగడ్డపై 3-2 తేడాతో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. వైభవ్ వన్డేల్లో ప్రదర్శించిన జోరును కొనసాగిస్తాడని అనుకుంటే మమ అనిపించి నిరాశపరిచాడు.టెస్ట్ సిరీస్ విషయానికొస్తే.. తొలి టెస్ట్ డ్రా కాగా.. రెండో టెస్ట్లో ఇవాళ (జులై 23) చివరి రోజు ఆట కొనసాగుతుంది. టీ విరామం సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. వైభవ్ గోల్డెన్ డకౌటై నిరాశపరిచినా కెప్టెన్ ఆయుశ్ మాత్రే అజేయ అర్ద సెంచరీతో ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా అభిగ్యాన్ కుందు (19) క్రీజ్లో ఉన్నాడు.ఈ మ్యాచ్లో భారత్ 355 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 223 పరుగులు చేయాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి.స్కోర్ వివరాలు..ఇంగ్లండ్ అండర్-19: 309 (ఎకాన్ష్ సింగ్ 117) & 324/5 (డాకిన్స్ 136)భారత్ అండర్-19: 279 (విహాన్ మల్హోత్రా 120) & 131/2 (ఆయుశ్ మాత్రే 80 నాటౌట్) -
ENG VS IND 4th Test Day 1: కష్టాల్లో భారత్
మాంచెస్టర్ టెస్ట్లో టీమిండియా కష్టాల్లో పడింది. 140 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్ (46), యశస్వి జైస్వాల్ (58) శుభారంభాన్ని అందించి ఔట్ కాగా.. శుభ్మన్ గిల్ కేవలం 12 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. 46 పరుగుల వ్యవధిలో భారత్ 3 కీలకమైన వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. సాయి సుదర్శన్ (26), రిషబ్ పంత్ (3) భారత్ను పటిష్ట స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.భారత్ కోల్పోయిన వికెట్లలో రాహుల్ వికెట్ క్రిస్ వోక్స్కు.. జైస్వాల్ వికెట్ లియామ్ డాసన్కు.. శుభ్మన్ గిల్ వికెట్ బెన్ స్టోక్స్కు దక్కింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. మొదటి, మూడు టెస్ట్ల్లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. భారత్ రెండో మ్యాచ్లో గెలుపొందింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ సిరీస్లో నిలబడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ భారత్కు డు ఆర్ డైగా మారింది.తుది జట్లు..ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.భారత్: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (WK),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. -
ENG VS IND 4th Test: సచిన్ రికార్డును సమం చేసిన జైస్వాల్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఓ అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 58 పరుగులు చేసి ఔటైన జైస్వాల్.. టెస్ట్ల్లో ఇంగ్లండ్పై 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన 20వ బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. అలాగే ఈ ఘనత సాధించిన రెండో వేగవంతమైన భారత బ్యాటర్గా సచిన్ టెండూల్కర్, మొహమ్మద్ అజహారుద్దీన్ రికార్డును సమం చేశాడు. సచిన్, అజహార్, జైస్వాల్ ఇంగ్లండ్పై తలో 16 ఇన్నింగ్స్ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నారు. ఇంగ్లండ్పై అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన రికార్డు రాహుల్ ద్రవిడ్ పేరిట ఉంది. ద్రవిడ్ కేవలం 15 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 47 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (46), యశస్వి జైస్వాల్ (58) ఔట్ కాగా.. సాయి సుదర్శన్ (20), కెప్టెన్ శుభ్మన్ గిల్ (11) క్రీజ్లో ఉన్నారు. భారత్ కోల్పోయిన వికెట్లలో రాహుల్ వికెట్ క్రిస్ వోక్స్కు.. జైస్వాల్ వికెట్ లియామ్ డాసన్కు దక్కింది. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. మొదటి, మూడు టెస్ట్ల్లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. భారత్ రెండో మ్యాచ్లో గెలుపొందింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ సిరీస్లో నిలబడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ భారత్కు డు ఆర్ డైగా మారింది.తుది జట్లు..ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.భారత్: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (WK),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. -
ENG VS IND 4th Test: దిగ్గజాల సరసన కేఎల్ రాహుల్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో ఇవాళ (జులై 23) మొదలైన తొలి టెస్ట్లో టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 28 పరుగుల వద్ద రాహుల్ ఇంగ్లండ్ గడ్డపై 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఐదో భారత బ్యాటర్గా.. రెండో భారత ఓపెనర్గా రికార్డుల్లోకెక్కాడు. రాహుల్కు ముందు దిగ్గజ బ్యాటర్లు సచిన్ టెండూల్కర్ (1575), రాహుల్ ద్రవిడ్ (1376), సునీల్ గవాస్కర్ (1152), విరాట్ కోహ్లి (1096) మాత్రమే ఈ ఘనత సాధించారు. వీరిలో గవాస్కర్ ఒక్కరే ఓపెనర్.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో రాహుల్ 46 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్లో జాక్ క్రాలేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది. రాహుల్ ఔటయ్యే సమయానికి (30 ఓవర్లు) భారత్ స్కోర్ 94/1గా ఉంది. యశస్వి జైస్వాల్ 45 పరుగులతో కొనసాగుతుండగా.. అతనికి జతగా సాయి సుదర్శన్ క్రీజ్లోకి వచ్చాడు.భీకరమైన ఫామ్లో రాహుల్ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో రాహుల్ భీకరమైన ఫామ్లో ఉన్నాడు. 7 ఇన్నింగ్స్ల్లో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 421 పరుగులు చేసి లీడింగ్ రన్స్కోరర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. మొదటి, మూడు టెస్ట్ల్లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. భారత్ రెండో మ్యాచ్లో గెలుపొందింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ సిరీస్లో నిలబడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ భారత్కు డు ఆర్ డైగా మారింది.తుది జట్లు..ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.భారత్: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (WK),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. -
ENG VS IND 4th Test Day 1: నిలకడగా ఆడుతున్న భారత ఓపెనర్లు
భారత్, ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా ఇవాళ (జులై 23) నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగి నిలకడగా ఆడుతుంది. లంచ్ విరామం సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 78 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 40, యశస్వి జైస్వాల్ 36 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.తొలి సెషన్ అంతా కష్టపడినా ఇంగ్లండ్ బౌలర్లకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. లంచ్ సమయానికి బెన్ స్టోక్స్ వారి స్పిన్ అస్త్రం లియామ్ డాసన్ను బరిలోకి దించలేదు. పేసర్లు క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్ తలో 8 ఓవర్లు బౌలింగ్ చేశారు. స్టోక్స్, బ్రైడన్ కార్స్ తలో 5 ఓవర్లు వేశారు. బౌలర్లను ఎంత మార్చినా స్టోక్స్కు ఎలాంటి ఫలితం రాలేదు. రాహుల్, జైస్వాల్ ఎంతో పట్టుదలతో బ్యాటింగ్ చేస్తున్నారు. నిదానంగా ఆడుతున్నా, చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ ఇన్నింగ్స్ను నిర్మిస్తున్నారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. మొదటి, మూడు టెస్ట్ల్లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. భారత్ రెండో మ్యాచ్లో గెలుపొందింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ సిరీస్లో నిలబడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ భారత్కు డు ఆర్ డైగా మారింది.తుది జట్లు..ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.భారత్: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (WK),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. -
ENG VS IND 4th Test Day 1: ముక్కలైన జైస్వాల్ బ్యాట్..!
భారత్, ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా ఇవాళ (జులై 23) నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగి నిలకడగా ఆడుతుంది. 25 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 39, యశస్వి జైస్వాల్ 35 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.ఈ సెషన్లో ఇంగ్లండ్ బౌలర్లు ఎంత కష్టపడినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. రాహుల్, జైస్వాల్ నిదానంగా ఆడుతున్నా, చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ ఇన్నింగ్స్ను నిర్మిస్తున్నారు. ఇన్నింగ్స్లో 9వ ఓవర్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. క్రిస్ వోక్స్ బౌలింగ్ను ఎదుర్కోబోయి జైస్వాల్ బ్యాట్ రెండు ముక్కలైంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే వోక్స్ సంధించిన బంతి ఏమంత వేగవంతమైంది కాదు. జైస్వాల్ డిఫెన్స్ ఆడినా బ్యాట్ హ్యాండిల్ దగ్గర చీలిపోయింది. దీంతో అతను బ్యాట్ను మార్చకతప్పలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఒత్తిడిలో జైస్వాల్యశస్వి జైస్వాల్ ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో పర్వాలేదనిపించినప్పటికీ చెత్త షాట్ సెలెక్షన్ కారణంగా ఒత్తిడిలో ఉన్నాడు. మూడో టెస్ట్లో అతను ఓ చెత్త ఆడి వికెట్ పారేసుకోవడాన్ని యాజమాన్యం తీవ్రంగా పరిగణిస్తుంది. ఆ మ్యాచ్లో భారత్ 193 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగగా.. జైస్వాల్ అవసరం లేని షాట్ ఆడి వికెట్ పారేసుకోవడంతో పాటు జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు. జైస్వాల్ నిర్లక్ష్యమైన షాట్ ఆ మ్యాచ్లో టీమిండియా కొంపముంచింది. జైస్వాల్ తన సహజ ఆటతీరుతో ఆడి ఉంటే ఫలితం భారత్కు అనుకూలంగా వచ్చే అవకాశం ఉండేది. ఈ చెత్త షాట్ కారణంగా జైస్వాల్ మేనేజ్మెంట్తో పాటు అభిమానుల నుంచి కూడా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ సిరీస్లో అతను తొలి మూడు మ్యాచ్ల్లో సెంచరీ సహా 241 పరుగులు చేశాడు.కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉంది. తొలి, మూడో టెస్ట్ల్లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. భారత్ రెండో మ్యాచ్లో గెలుపొందింది. -
ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్.. శార్దూల్ ఎంపికపై తీవ్రమైన వ్యతిరేకత
భారత్, ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా ఇవాల్టి నుంచి (జులై 23) నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును రెండు రోజుల ముందే ప్రకటించగా.. భారత్ గతంలో మాదిరే ఆఖరి నిమిషంలో ప్లేయింగ్ ఎలెవెన్ను అనౌన్స్ చేసింది.ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తప్పనిసరి పరిస్థితిలో ఓ మార్పు చేయగా.. భారత్ ఏకంగా మూడు మార్పులతో బరిలోకి దిగింది. మూడో టెస్ట్ సందర్భంగా గాయపడిన షోయబ్ బషీర్ స్థానంలో ఇంగ్లండ్ లియామ్ డాసన్ను బరిలోకి దించగా.. భారత్ కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్దీప్ స్థానాల్లో సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్ తుది జట్టులోకి తీసుకుంది.భారత్ చేసిన ఈ మూడు మార్పుల్లో రెండు సహేతుకమైనవే కాగా.. ఓ మార్పును మాత్రం టీమిండియా అభిమానులు స్వాగతించలేకపోతున్నారు. ఫామ్లో లేని కరుణ్ నాయర్కు బదులుగా సాయి సుదర్శన్.. గాయపడిన ఆకాశ్దీప్కు బదులుగా అన్షుల్ కంబోజ్ ఎంపికను సమర్దిస్తున్న ఫ్యాన్స్.. నితీశ్ కుమార్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా శార్దూల్ ఠాకూర్ ఎంపికను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఈ మ్యాచ్లో అసలు శార్దూల్ అవసరమేముందని ప్రశ్నిస్తున్నారు. అవసరమనుకుంటే బౌలర్ను.. లేదనుకుంటే బ్యాటర్ను తీసుకోవాలి కాని.. అటు బౌలింగ్కు, ఇటు బ్యాటింగ్కు పూర్తిగా న్యాయం చేయలేని శార్దూల్ ఎంపిక దండగ అని మండిపడుతున్నారు. ఏ ఆప్షన్ లేక శార్దూల్ ఠాకూర్ను ఎంపిక చేయడం పరిపాటిగా మారిందని దుయ్యబడుతున్నారు. ఆల్రౌండర్ అన్న ట్యాగ్ ఉంది కాబట్టి ప్రతిసారి శార్దూల్ ఠాకూర్ను ఎంపిక చేయడం సరికాదని అంటున్నారు.వాస్తవానికి శార్దూల్ విషయంలో అభిమానుల ఆగ్రహానికి కారణాలు లేకపోలేదు. ఈ సిరీస్లోనే కాకుండా గతంలో చాలా సార్లు అతన్ని ఆల్రౌండర్ కోటాలో జట్టులోకి తీసుకొని ఏ విభాగంలోనూ పూర్తిగా వినియోగించుకోలేదు. శార్దూల్ను తుది జట్టులోకి ఎంపిక చేసి ప్రతిసారి ఓ స్థానాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తారు. ఇదే అభిమానులకు చిరాకు తెప్పిస్తుంది. ఎవరిని ఎంపిక చేయాలో తెలియక ఎవరో ఒకరు అన్న ధోరణిలో శార్దూల్ను ఎంపిక చేయడాన్ని ఫ్యాన్స్ తీవ్రమైన తప్పిదంగా పరిగణిస్తున్నారు. మరి ఈ మ్యాచ్లో శార్దూల్ ఏం చేస్తాడో చూడాలి మరి.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 18 ఓవర్ల తర్వాత వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 32, యశస్వి జైస్వాల్ 18 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.తుది జట్లు..ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.భారత్: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (WK),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. -
ENG Vs IND: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. టీమిండియాలో మూడు మార్పులు
మాంచెస్టర్ వేదికగా భారత్తో ఇవాళ (జులై 23) మొదలైన నాలుగో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఏకంగా మూడు మార్పులు చేసింది. కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్దీప్ స్థానాల్లో సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్ తుది జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మ్యాచ్తో 24 హర్యానా యువ పేసర్ అన్షుల్ కంబోజ్ టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేస్తున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ ఈ మ్యాచ్ కోసం రెండు రోజుల కిందటే తుది జట్టును ప్రకటించింది. మూడో టెస్ట్ ఆడిన జట్టు నుంచి గాయపడిన షోయబ్ బషీర్ తప్పుకున్నాడు. అతడి స్థానంలో లియామ్ డాసన్ తుది జట్టులోకి వచ్చాడు. ఐదు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తొలి, మూడో టెస్ట్ల్లో ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో టెస్ట్లో విజయం సాధించింది. తుది జట్లు..ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.భారత్: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. -
టీమిండియాకు బిగ్ షాక్.. కన్ఫర్మ్ చేసిన శుభ్మన్ గిల్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో రేపటి నుంచి ప్రారంభంకాబోయే నాలుగో టెస్ట్కు ముందు భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. సిరీస్లో నిలబడాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్కు ముందు ముగ్గురు కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. ఈ విషయాన్ని కెప్టెన్ శుభ్మన్ గిల్ అధికారికంగా ధృవీకరించినట్లు తెలుస్తుంది. నితీశ్ కుమార్ రెడ్డి సిరీస్లోని మిగతా రెండు మ్యాచ్లకు దూరం కాగా.. పేసర్లు అర్షదీప్ సింగ్, ఆకాశ్దీప్ నాలుగో టెస్ట్కు దూరమయ్యారని గిల్ పేర్కొన్నట్లు సమాచారం. పైన పేర్కొన్న విషయాల్లో నితీశ్, అర్షదీప్ అందుబాటులో ఉండరన్న విషయంపై క్లారిటీ ఉన్నప్పటికీ.. ఆకాశ్దీప్ విషయంలో మాత్రం గిల్ పూర్తి సమచారాన్ని అందించినట్లు తెలుస్తుంది. ఆకాశ్దీప్కు ప్రత్యామ్నాయంపై కూడా గిల్ మాట్లాడినట్లు సమాచారం. అన్షుల్ కంబోజ్, ప్రసిద్ద్ కృష్ణల్లో ఎవరిని ఆడిస్తారనే విషయంపై మ్యాచ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు నిర్ణయం తీసుకుంటామని గిల్ చెప్పినట్లు తెలుస్తుంది.అలాగే కరుణ్ నాయర్ భవితవ్యంపై కూడా గిల్ మాట్లాడినట్లు సమాచారం. కరుణ్కు మరో అవకాశం ఉంటుందని గిల్ పరోక్షంగా చెప్పినట్లు తెలుస్తుంది. కరుణ్ ఈ సిరీస్లో తన స్థాయి ప్రదర్శన చేయలేదన్న విషయాన్ని అంగీకరించిన గిల్.. అతనికి మరో అవకాశం ఉంటుందని చెప్పినట్లు సమాచారం. ఈ సిరీస్లో కరుణ్ ఫామ్ను అందిపుచ్చుకుంటాడని గిల్ ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.పంత్ విషయంలోనూ గిల్ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. నాలుగో టెస్ట్లో పంత్ వికెట్కీపింగ్ చేస్తాడని గిల్ ధృవీకరించినట్లు తెలుస్తుంది. ఈ విషయాలతో పాటు గిల్ మూడో టెస్ట్ సందర్భంగా జరిగిన ఓ విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు సమాచారం. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 90 సెకెన్లు ఆలస్యంగా బరిలోకి దిగిందని, ఇలా చేయడం క్రీడాస్పూర్తికి విరుద్దమని గిల్ అసహనం వ్యక్తిం చేసినట్లు సమాచారం.నాలుగో టెస్ట్లో ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవెన్..జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.టీమిండియా (అంచనా)..యశస్వి జైస్వాల్, KL రాహుల్, కరుణ్ నాయర్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (WK), ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. -
భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్.. అభిమానులకు చేదు వార్త
భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మాంచెస్టర్ వేదికగా రేపటి నుంచి ప్రారంభం కానుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్కు వరుణుడి ఆటంకం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మ్యాచ్ జరిగే ఐదు రోజులూ వర్షం పడే అవకాశాలున్నాయని అంచనా.వెదర్ రిపోర్ట్ను నిజం చేస్తూ మాంచెస్టర్లో ఇవాల్టి నుంచే వర్షం మొదలైంది. స్టేడియం చుట్టూ దట్టమైన మబ్బులు కమ్ముకొని భారీ వర్షం కురుస్తుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మైదానం చిత్తడిగా మారి, రేపు ఆట ప్రారంభ సమయానికి ఇబ్బంది పెట్టవచ్చు. వాతావరణం ఇలాగే కొనసాగితే పిచ్ ప్రభావంలో కూడా మార్పు రావచ్చు. BAD NEWS FOR CRICKET FANS 📢- It's raining in Manchester ahead of the 4th Test. [Bharat Sharma from PTI] pic.twitter.com/OF0PgPhzxv— Johns. (@CricCrazyJohns) July 22, 2025ప్రస్తుతానికి పిచ్ బ్యాటర్లు, బౌలర్లకు సమాంతరంగా సహరించవచ్చు. తొలి మూడు రోజుల్లో ఉదయం పూట (తొలి సెషన్లో) బంతి బౌన్స్ అవుతుంది. దీన్ని బ్యాటర్లు అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. ఆట గడిచే కొద్దీ స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుందని అంచనా. ఈ పిచ్పై తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు లబ్ది చేకూరే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.టీమిండియా విషయానికొస్తే.. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉంది. ఈ మ్యాచ్ భారత్కు డు ఆర్ డై అన్నట్లుగా మారింది. మాంచెస్టర్లో భారత్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోవడం ఆందోళన కలిగించే అంశం. ఈ పిచ్పై టీమిండియా ఇప్పటివరకు 9 టెస్ట్ మ్యాచ్లు ఆడగా.. నాలుగు సార్లు ఓటమిపాలై, ఐదు మ్యాచ్లను డ్రా చేసుకుంది. చివరిగా భారత్ ఈ పిచ్పై 2014లో మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్లో ఓటమిపాలైంది. 2014లో ఆడిన భారత్ జట్టు సభ్యుల్లో ప్రస్తుతం రవీంద్ర జడేజా ఒక్కడే ఉన్నాడు. ఇది ఓ రకంగా భారత్కు కలిసొచ్చే విషయం. ఈ మ్యాచ్లో భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. భారత్ ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేసుకుంటుందో, లేక ఓడి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను చేజార్చుకుంటుందో చూడాలి.నాలుగో టెస్ట్లో ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవెన్..జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.టీమిండియా (అంచనా)..యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్/కరుణ్ నాయర్, శుభమన్ గిల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ (WK), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అన్షుల్ కాంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. -
చరిత్ర సృష్టించేందుకు 25 పరుగుల దూరంలో శుబ్మన్ గిల్..
ఇంగ్లండ్తో నాలుగో టెస్టు కోసం శుబ్మన్ గిల్ సారథ్యంలోనే భారత జట్టు మాంచెస్టర్లో అడుగుపెట్టింది. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో టీమిండియా తీవ్రంగా శ్రమించనుంది. సిరీస్ సమమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగనుంది.అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఇంగ్లండ్ గడ్డపై ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్గా చరిత్ర సృష్టించేందుకు గిల్ సిద్దంగా ఉన్నాడు.ప్రస్తుతం ఈ రికార్డు పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం మహ్మద్ యూసుఫ్ పేరిట ఉంది. అతడు 2006 ఇంగ్లండ్ టూర్లో భాగంగా నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 90.14 సగటుతో 631 పరుగులు చేశాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 202గా ఉంటుంది.ఇప్పుడు మాంచెస్టర్లో శుబ్మన్ మరో 25 పరుగులు సాధిస్తే.. యూసుఫ్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు. ప్రస్తుత సిరీస్లో గిల్ ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడి 101.16 సగటుతో 607 పరుగులు చేశాడు. తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన గిల్.. అనంతరం బర్మింగ్హామ్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో ఏకంగా ద్విశతకంతో మెరిశాడు. అతడి అత్యధిక స్కోర్ 269గా ఉంది.ఇంగ్లండ్లో టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్లుమహ్మద్ యూసుఫ్ (పాకిస్తాన్) - 2006లో 4 మ్యాచ్ల్లో 631 పరుగులుశుభ్మన్ గిల్ (భారత్) - 2025లో 3 మ్యాచ్ల నుండి 607 పరుగులురాహుల్ ద్రవిడ్ (భారత్) - 2002లో 4 మ్యాచ్ల నుండి 602 పరుగులువిరాట్ కోహ్లీ (భారత్) - 2018లో 5 మ్యాచ్ల నుండి 593 పరుగులుసునీల్ గవాస్కర్ (భారత్) - 1979లో 4 మ్యాచ్ల నుండి 542 పరుగులుసలీమ్ మాలిక్ (పాకిస్తాన్) - 1992లో 5 మ్యాచ్ల నుండి 488 పరుగులుగిల్కు కఠిన పరీక్ష..కాగా మాంచెస్టర్ టెస్టు రూపంలో గిల్కు కఠిన పరీక్ష ఎదురుకానుంది. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ప్రస్తుతం భారత్ 1-2తో వెనుకబడి ఉంది. తొలి టెస్టులో ఓడిన అనంతరం టీమిండియా రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత లార్డ్స్ టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైంది.దీంతో ఇప్పుడు నాలుగో టెస్టు భారత జట్టుకు చాలా కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో భారత్ గెలవకపోతే సిరీస్ కోల్పోనుంది. కాబట్టి ఈ మ్యాచ్లో గిల్ తన కెప్టెన్సీతో జట్టును ఎలా నడిపిస్తాడో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.చదవండి: #Karun Nair: అనుకున్నదే జరిగింది.. కరుణ్ నాయర్ గుడ్బై -
నితీశ్ను పక్కన పెట్టండి.. ఇప్పటికైనా అతడిని ఆడించండి: హర్భజన్
భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు జూలై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచి లార్డ్స్ టెస్టులో ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా కసితో ఉంది. ఈ కీలక మ్యాచ్ కోసం గిల్ సేన నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో మాంచెస్టర్ టెస్టు కోసం భారత్ తమ ప్లేయింగ్ ఎలెవన్లో చేయవలసిన మార్పులను మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సూచించాడు. ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి స్ధానంలో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఆడించాలని భజ్జీ టీమ్ మెనెజ్మెంట్ను కోరాడు. ఈ సిరీస్లో తొలి మూడు మ్యాచ్లకు కుల్దీప్ యాదవ్ బెంచ్కే పరిమితమయ్యాడు, రెండో టెస్టులో కుల్దీప్ ఆడుతాడని అంతా భావించారు. కానీ హెడ్కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ గిల్.. వాషింగ్టన్ సుందర్ను తుది జట్టులోకి తీసుకున్నారు.సుందర్ మెరుగైన ప్రదర్శన చేయడంతో మూడో టెస్టులో కూడా అతడిని కొనసాగించారు. ఇప్పుడు మాంచెస్టర్ వికెట్ కాస్త ఫ్లాట్ ఉండే అవకాశమున్నందన కుల్దీప్ను ఆడించాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈజాబితాలో భజ్జీ కూడా చేరాడు. ఇప్పటికైనా అతడిని ఆడించండి.."బర్మింగ్హామ్లో జరిగిన రెండో టెస్టులో కుల్దీప్ యాదవ్ను ఆడించాలని నేను సూచించాను. కానీ అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. ఆ తర్వాత లార్డ్స్ టెస్టులోనైనా ఛాన్స్ ఇవ్వండి చెప్పాను. అప్పుడు కూడా అతడిని బెంచ్కే పరిమితం చేశారు. మాంచెస్టర్ టెస్టులో కుల్దీప్ యాదవ్ను కచ్చితంగా ఆడించాలి. ఎందుకంటే ఇంగ్లీష్ బ్యాటర్లు అతడి బౌలింగ్ను ఆర్ధం చేసుకోవడానికి ఇబ్బంది పడతారు. దూకుడుగా ఆడే ఇంగ్లండ్ బ్యాటర్లకు కుల్దీప్ను ఎటాక్ అంత సులువు కాదు. అతడికి బంతిని రెండు వైపులా టర్న్ చేసే సత్తా ఉంది. కుల్దీప్ కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టే మిస్టరీ బౌలర్. టెస్టు క్రికెట్లో కొత్త బంతితో వికెట్ల పడగొట్టే బౌలర్ కాదు, పాత బంతితో కూడా అద్బుతాలు చేసే బౌలర్ జట్టుకు కావాలి. ఆ సత్తా కుల్దీప్ వద్ద ఉంది. కాబట్టి కుల్దీప్ కోసం భారత జట్టు మెనెజ్మెంట్ ఓ బ్యాటర్ను పక్కన పెట్టాల్సి వస్తోంది. నేను టీమ్ మెనెజ్మెంట్లో భాగంగా ఉంటే నేరుగా నితీశ్ స్ధానంలో కుల్దీప్ను జట్టులోకి తీసుకువస్తాను అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ పేర్కొన్నాడు. -
అతడొక రన్మిషన్.. మాంచెస్టర్లో కూడా చెలరేగుతాడు: భారత మాజీ క్రికెటర్
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో శతక్కొట్టిన గిల్.. ఆ తర్వాత ఎడ్జ్బాస్టన్లో భీబత్సం సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ(262)తో చెలరేగిన శుబ్మన్, రెండో ఇన్నింగ్స్లో సూపర్ సెంచరీతో మెరిశాడు.కానీ లార్డ్స్ లో జరిగిన మూడో టెస్టులో రెండు ఇన్నింగ్స్ల(16,6)లోనూ విఫలమయ్యాడు. ఈ క్రమంలో శుబ్మన్ గిల్పై భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్లో ఇంగ్లండ్తో జరిగే నాలుగో టెస్టులో గిల్ తిరిగి అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తాడని మంజ్రేకర్ జోస్యం చెప్పాడు. కాగా సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే నాలుగో టెస్టులో భారత్ కచ్చితంగా గెలవాల్సిందే. ఈ కీలక మ్యాచ్లో గిల్ ఎలా రాణిస్తాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.శుబ్మన్ గిల్ గిల్ తన ఫామ్ను కొనసాగిస్తాడని నేను భావిస్తున్నాను. అతడికి ఆ సత్తా ఉంది. లార్డ్స్ టెస్టుకు మాంచెస్టర్లో జరిగే నాలుగో టెస్టుకు దాదాపు ఎనిమిది రోజుల విశ్రాంతి లభించింది. దీంతో అతడు కాస్త రిలాక్స్గా ఉంటాడు. తన తండ్రి, స్నేహితులతో చాలా విషయాలు అతడు చర్చించి ఉంటాడు. గిల్ తన కెప్టెన్సీ, వ్యూహాలు, ఫీల్డింగ్, బ్యాటింగ్పై పెట్టాలి. అప్పుడే మాంచెస్టర్లో గిల్ రన్మిషన్ తిరిగి మళ్లీ పనిచేస్తోంది. ప్రస్తుత భారత జట్టులో గిల్ పాత్ర చాలా ముఖ్యమైనది. లార్డ్స్లో జరిగిన మూడో టెస్టులో గిల్ బ్యాట్తో విఫలమయ్యాడు. దీంతో భారత్ ఓడిపోయింది. అయినప్పటికి మెన్ ఇన్ బ్లూ ఆఖరి వరకు పోరాడింది. దీని బట్టి భారత జట్టు కేవలం గిల్ ఒక్కడిపైనే ఆధారపడటం లేదని ఆర్ధమైంది అని జియో హాట్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు. -
ఇంగ్లండ్తో నాలుగో టెస్టు.. బీసీసీఐ కీలక నిర్ణయం! ధోని శిష్యుడికి పిలుపు
మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి ఇంగ్లండ్తో ప్రారంభంకానున్న నాలుగో టెస్టుకు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారత టెస్టు జట్టులోకి యువ పేసర్ అన్షుల్ కాంబోజ్ను బీసీసీఐ చేర్చింది. ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరిగే ఈ మ్యాచ్కు పేసర్లు అర్ష్దీప్ సింగ్, ఆకాష్ దీప్ అందుబాటులో ఉంటారా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.లార్డ్స్లో జరిగిన మూడో టెస్టులో ఆకాష్ దీప్ గాయపడగా.. నాలుగో టెస్టు కోసం ప్రాక్టీస్ సందర్భంగా అర్ష్దీప్ చేతి వేలికి గాయమైంది. అర్ష్దీప్ కోలుకోవడానికి దాదాపు 10 రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అన్షుల్ కాంబోజ్కు తొలిసారి సెలక్టర్లు పిలుపునిచ్చారు.దీంతో అతడు ఉన్నపళంగా భారత్ నుంచి లండన్కు బయలుదేరినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ సిరీస్కు ముందు ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన అనాధికారిక టెస్టుల్లో భారత-ఎ తరపున కాంబోజ్ ఆడాడు. ఈ సిరీస్లో కాంబోజ్ మంచి ప్రదర్శన కనబరిచాడు. ఈ పేసర్ 3 మ్యాచ్ల్లో 5 వికెట్లు పడగొట్టాడు.అన్షుల్ కాంబోజ్ ఐపీఎల్-2025 సీజన్లో ఎంఎస్ ధోని సారథ్యంలో సీఎస్కే తరపున ఆడాడు. ఐపీఎల్లో కూడా తన బౌలింగ్ ప్రదర్శనతో కాంబోజ్ ఆకట్టుకున్నాడు. అతడికి అద్భుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. గంటకు 138-139 కి.మీ వేగంతో బౌలింగ్ చేసి బ్యాటర్లను బోల్తా కొట్టించగలడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 24 మ్యాచ్లు ఆడి 79 వికెట్లు పడగొట్టాడు. అతడి పేరిట ఓ పది వికెట్ల హాల్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అతడి సీనియర్ జట్టులోకి తీసుకున్నారు. ఇక అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భారత జట్టు 2-1 తేడాతో వెనకబడి ఉంది. దీంతో నాలుగో టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్ను 2-1తో సమం చేయాలని గిల్ బృందం భావిస్తోంది.చదవండి: WCL: భారత్-పాక్ మ్యాచ్ రద్దు.. అఫ్రిదిపై వేటు! -
'ఆకాష్ దీప్ను పక్కన పెట్టండి.. అతడిని జట్టులోకి తీసుకోండి'
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు జూలై 23 నుంచి ప్రారంభం కానుంది. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో అమీతుమీ తెల్చుకోవడానికి ఇరు జట్లు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేయాలని భారత్ భావిస్తుంటే.. ఇంగ్లండ్ మాత్రం లార్డ్స్ ఫలితాన్ని పునరావృతం చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియా మెనెజ్మెంట్కు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కీలక సూచన చేశాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ ఫ్లాట్గా ఉంటుందని, భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడితే సరిపోతుందని అథర్టన్ అన్నారు. కాగా లార్డ్స్ టెస్టులో భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడింది. నితీశ్ కుమార్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఉన్నాడు. ఒకవేళ మాంచెస్టర్లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలని భావిస్తే.. పేసర్ ఆకాష్దీప్పై వేటు పడే ఛాన్స్ ఉంది."మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ పిచ్ ఫ్లాట్గా ఉండే ఛాన్స్ ఉంది. దీంతో ఇటువంటి పరిస్థితుల్లో మణికట్టు స్పిన్నర్లు చక్రం తిప్పుతారు అని అందరికి తెలుసు. కాబట్టి భారత్ బుమ్రా, సిరాజ్లతో పాటు ముగ్గురు స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, జడేజా,కుల్దీప్ యాదవ్లతో ఆడితే బాగుంటుంది.ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. అయితే మాంచెస్టర్లో వాతావరణ పరిస్థితులపై మనకు అంచనా లేదు. ఒకవేళ వాతావరణం చల్లగా ఉండి, వర్షం పడితే ఫాస్ట్ బౌలర్లకు పిచ్ అనుకూలిస్తోంది. కానీ ముగ్గురు స్పిన్నర్లతో ఆడడం కోసం భారత మెనెజ్మెంట్ కచ్చితంగా ఆలోచించాలి" అని స్కై స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మైఖేల్ అథర్టన్ పేర్కొన్నాడు.చదవండి: ENG vs IND: క్రికెట్ ప్లేయర్లు లంచ్ బ్రేక్లో ఏమి తింటారో తెలుసా? -
క్రికెట్ ప్లేయర్లు లంచ్ బ్రేక్లో ఏమి తింటారో తెలుసా?
టెస్టు మ్యాచ్లో ప్రతీ రోజు ఆటలో లంచ్ విరామంతో పాటు టీ బ్రేక్ ఉంటాయి. అయితే లంచ్ బ్రేక్లో ఆటగాళ్లు ఏమి తింటారా అని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిచూపుతుంటారు. తాజాగా ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ ఓలీ పోప్ లంచ్ బ్రేక్లో తాను ఏమి తీసుకుంటాడో వెల్లడించాడు."సాధారణంగా లంచ్ మెనూలో చికెన్, చేపలు, పాస్తాతో పలు రకాల వంటకాలు ఉంటాయి. ఆటగాళ్లు తమకు ఎక్కువగా ఎనర్జీ ఇచ్చే ఆహారాన్ని తీసకుంటారు. నా విషయానికొస్తే.. నేను బ్యాటింగ్లో ఉంటే ఎక్కువగా ఫుడ్ తీసుకోను. ఆ సమయంలో ఎందుకో నాకు ఎక్కువగా తినాలనిపించదు.కాబట్టి నేను ప్రోటీన్ షేక్, అరటిపళ్లు ఎక్కవగా తింటాను. అదే రోజు మొత్తం బ్యాటింగ్ చేస్తే కనీసం ఆరటిపళ్లు కూడా తినను. ఎందుకంటే ఎక్కువ తిని బ్యాటింగ్ కొనసాగించడం చాలా కష్టం. ఆ రోజు ఆట ముగిశాక ఫుడ్ తీసుకుంటాను. అదేవిధంగా సెకెండ్ బ్రేక్ సమయంలో కొంతమంది ఆటగాళ్లు టీ తీసుకోవడానికి ఇష్టపడతారు.నేను అయితే నేను సాధారణంగా కాఫీ తాగుతాను. కొన్నిసార్లు, వర్షం ఆలస్యం అయినప్పుడు ఒక కప్పు టీ తాగుతాను అని" స్కై స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోప్ పేర్కొన్నాడు. కాగా కాగా లార్డ్స్లో లంచ్ మెనూకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టింది. అందులో బటర్నట్ స్క్వాష్ సూప్,సీబాస్ ఫిల్లెట్, బాస్మతి రైస్, రొయ్యల కర్రీ వంటి వంటకాలు ఉన్నాయి. ఇక భారత్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఈ ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ పర్వాలేదన్పిస్తున్నాడు. తొలి టెస్టులో పోప్ అద్బుతమైన సెంచరీతో చెలరేగి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా లార్డ్స్ టెస్టులో కూడా 44 పరుగులతో రాణించాడు.చదవండి: T20 Blast: చరిత్ర సృష్టించిన 17 ఏళ్ల కుర్రాడు.. హ్యాట్రిక్ వికెట్లతో రికార్డు! వీడియో -
టీమిండియాతో నాలుగో టెస్టు.. చరిత్రకు అడుగు దూరంలో జో రూట్
సొంత గడ్డపై టీమిండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ దుమ్ములేపుతున్నాడు. లార్డ్స్ టెస్టులో అద్బుతమైన సెంచరీతో చెలరేగిన రూట్.. ఇప్పుడు మాంచెస్టర్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టులో కూడా సత్తాచాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు జూలై 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో జోరూట్ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు.డేంజర్లో పాంటింగ్ రికార్డు.. మాంచెస్టర్లో రూట్ మరో 119 పరుగులు సాధిస్తే..టెస్టు క్రికెట్లో అత్యధిక రన్స్ చేసిన రెండో ఆటగాడిగా రూట్ నిలుస్తాడు. రూట్ ఇప్పటివరకు 156 టెస్టులు 50.8 సగటుతో 13259 పరుగులు చేశాడు.టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రూట్ ప్రస్తుతం నాలుగో స్ధానంలో ఉన్నాడు.రూట్ కంటే ముందు రాహుల్ ద్రవిడ్(13288), జాక్వస్ కల్లిస్(13289), రికీ పాంటింగ్(13378), సచిన్ టెండూల్కర్(15921) ఉన్నారు. ఈ మ్యాచ్లో గాని ఆఖరి టెస్టులో గాని ద్రవిడ్, కల్లిస్, పాంటింగ్ను రూట్ అధగమించే అవకాశముంది. ఇక అగ్రస్దానంలో కొనసాగుతున్న సచిన్ను ఆధిగమించేందుకు రూట్ ఇంకా 2,662 పరుగుల దూరంలో ఉన్నాడు.అయితే 34 ఏళ్ల రూట్ మరి కొన్నాళ్ల పాటు టెస్టుల్లో కొనసాగితే సచిన్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. కాగా ఐదు టెస్టుల ఆండర్సన్- టెండూల్కర్ ట్రోఫీలో ఇంగ్లండ్ ప్రస్తుతం 1-2 ఆధిక్యంలో కొనసాగుతోంది.చదవండి: WCL 2025: అన్నా.. నీవు ఇప్పటికి మారలేదా? పాక్ ఆటగాడిపై సెటైర్లు -
రుతురాజ్ గైక్వాడ్ కీలక నిర్ణయం
టీమిండియా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) కీలక నిర్ణయం తీసుకున్నాడు. యార్క్షైర్తో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి అతడు వైదొలిగాడు. ఈ విషయాన్ని యార్క్షైర్ (Yorkshire) కౌంటీ ధ్రువీకరించింది. వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.నిరాశకు గురిచేసిందిఈ సందర్భంగా యార్క్షైర్ జట్టు హెడ్కోచ్ ఆంటోని మెగ్రాత్ మాట్లాడుతూ.. ‘‘వ్యక్తిగత కారణాల దృష్ట్యా గైక్వాడ్ ఇంగ్లండ్కు రాలేకపోతున్నాడు. అతడు ఈ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండడు. ఈ విషయం మమ్మల్ని నిరాశకు గురిచేసింది.అయితే, గైక్వాడ్ నిర్ణయానికి గల కచ్చితమైన కారణాన్ని నేను చెప్పలేను. అతడి స్థానంలో సరైన ఆటగాడిని ఎంపిక చేసుకుంటాం. కానీ అందుకు సమయం తక్కువగా ఉంది. ఏదేమైనా ఈ విషయం గురించి నేను ఇంతకంటే ఎక్కువగా ఏమీ మాట్లాడలేను’’ అని పేర్కొన్నాడు.కాగా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడాలని నిర్ణయించుకున్న రుతురాజ్ గైక్వాడ్ యార్క్షైర్తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 28 ఏళ్ల ఈ ఓపెనింగ్ బ్యాటర్ తాజా కౌంటీ సీజన్లో సర్రేతో జరిగే మ్యాచ్తో అరంగేట్రం చేయాల్సి ఉంది. అదే విధంగా వన్డే కప్లోనూ పాల్గొనాల్సి ఉంది. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఇంగ్లండ్కు వెళ్లే పరిస్థితి లేదని.. అందుకే తప్పుకొన్నాడని సమాచారం.సీఎస్కే సారథిగా..ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా.. ఈ సీజన్ మధ్యలోనే వైదొలిగిన విషయం తెలిసిందే. మోచేతి గాయం వల్ల ఐదు మ్యాచ్ల తర్వాత జట్టుకు దూరమయ్యాడు.అయితే, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత- ‘ఎ’ జట్టుకు ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్.. అనధికారిక టెస్టు సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే, ఇంట్రా- స్క్వాడ్ మ్యాచ్లో మాత్రం పాల్గొన్నాడు.చివరగా జింబాబ్వేతో సిరీస్లోకాగా ఫస్ట్క్లాస్ కెరీర్లో రుతురాజ్ గైక్వాడ్ మెరుగ్గా రాణిస్తున్నాడు. ఇప్పటికి 38 మ్యాచ్లు ఆడిన ఈ మహారాష్ట్ర కెప్టెన్ 41.77 సగటుతో 2632 పరుగులు సాధించాడు. ఇక 2021లో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రుతురాజ్.. మరుసటి ఏడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు.ఇప్పటికి భారత్ తరఫున 23 టీ20 మ్యాచ్లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 441 పరుగులు చేశాడు. ఆరు వన్డేల్లో 157 రన్స్ రాబట్టాడు. చివరగా 2024లో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా రుతు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. చదవండి: WCL 2025: హఫీజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన పాకిస్తాన్ -
బెన్ స్టోక్స్ను చూసి గిల్ నేర్చుకోవాలి: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
టీమిండియా టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ తన తొలి పర్యటనలోనే ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో రెండు మ్యాచ్ల్లో భారత్ ఓటమి పాలైనప్పటికి.. గిల్ మాత్రం బ్యాటింగ్, కెప్టెన్సీ పరంగా వందకు వంద మార్క్లు కొట్టేశాడు.ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన గిల్.. 607 పరుగులతో లీడింగ్ రన్స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో గిల్పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లాంటి సీనియర్లు లేనప్పటికి గిల్ జట్టును అద్బుతంగా నడిపిస్తున్నాడని గోవర్ కొనియాడాడు."రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల వంటి దిగ్గజాల లేకుండా భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వచ్చింది. దీంతో అందరి దృష్టి యువ కెప్టెన్ శుబ్మన్ గిల్పైనే ఉండేది. కానీ శుబ్మన్ మాత్రం అందరి అంచనాలను తారుమారు చేస్తూ తొలి రెండు ఇన్నింగ్స్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.ఒక జట్టుకు నాయకత్వం వహించడానికి 34 ఏళ్ల వయస్సు ఉండనవసరం లేదు. టాలెంట్తో పాటు సరైన టెక్నిక్ ఉంటే చాలు 24 ఏళ్లకే కెప్టెన్ అవ్వచ్చు. అని గోవర్ స్పోర్ట్స్ స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అదేవిధంగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్పై కూడా గోవర్ ప్రశంసల వర్షం కురిపించాడు."ఒక బలమైన జట్టును తాయారు చేయడం చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. నాయకుడు ముందుండి జట్టును నడిపిస్తే విజయం సాధించడం పెద్ద కష్టమైన పనికాదు. అందుకు ఊదహరణగా బెన్ స్టోక్స్ను తీసుకొవచ్చు. లార్డ్స్లో టెస్టులో స్టోక్స్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. గత కొన్నాళ్లగా స్టోక్స్ నుంచి ఇటువంటి ప్రదర్శనను మిస్ అయ్యాము. గంటకు 120 కి.మీ వేగంతో బౌలింగ్ చేయడం, పేస్ బౌలింగ్ ఎటాక్ను లీడ్ చేయడం వంటి నిజంగా అద్బుతం. స్టోక్సీ నుంచి గిల్ కచ్చితంగా కొన్ని విషయాలను నేర్చుకోవాలి" గోవర్ అన్నారు.చదవండి: అరంగేట్రానికి సిద్దమవుతున్న కోహ్లి అన్న కొడుకు.. -
అతడికి రెస్ట్ ఏమి అవసరం లేదు.. రెండు టెస్టుల్లోనూ ఆడించండి: కుంబ్లే
అండర్సన్-సచిన్ డెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు జూలై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సిరీస్లో ఇంగ్లండ్ జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది. లార్డ్స్ టెస్టులో గెలవాల్సిన మ్యాచ్లో మెన్ ఇన్ బ్లూ ఓడిపోవడంతో సిరీస్లో వెనకబడింది.ఈ క్రమంలో మాంచెస్టర్లో ఎలాగైనా గెలిచి మూడో టెస్టు ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్లో మిగిలిన రెండు మ్యాచ్లలోనూ భారత పేసర్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఆడించాలని టీమ్మెనెజ్మెంట్ను కుంబ్లే సూచించాడు.కాగా వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా బుమ్రా ఇంగ్లండ్ పర్యటనలో కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడతాడని జట్టు సెలక్షన్ సమయంలోనే బీసీసీఐ సెలక్షన్ కమిటీ స్పష్టం చేశాడు. ఇందులో భాగంగానే తొలి టెస్టులో ఆడిన బుమ్రా.. రెండు మ్యాచ్కు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ స్పీడ్ స్టార్ తిరిగి లార్డ్స్లో జరిగిన మూడో టెస్టులో ఆడాడు. ఇప్పుడు కీలకమైన నాలుగో టెస్టులో కూడా బుమ్రా ఆడాలని పలువురు మాజీలు డిమాండ్ చేస్తున్నారు."ఇండియన్ టీమ్ మెనెజ్మెంట్లో నేను భాగమై ఉంటే బుమ్రాను కచ్చితంగా మాంచెస్టర్ టెస్టులో ఆడిస్తాను. ఎందుకంటే భారత జట్టుకు ఆ మ్యాచ్ చాలా కీలకం. ఒకవేళ ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోతే సిరీస్ కథ ముగిసినట్లే. బుమ్రా నాలుగో టెస్టులోనూ కాదు ఆఖరి మ్యాచ్లో కూడా ఆడాలి.ముందే మూడు మ్యాచ్లు ఆడుతానని బుమ్రా చెప్పొండచ్చు. కానీ ఈ సిరీస్ తర్వాత అతడికి చాలా విశ్రాంతి లభిస్తోంది. కాబట్టి మిగిలిన రెండు మ్యాచ్లలో కూడా బుమ్రా కచ్చితంగా ఆడాలి. అతడికి మరింత విశ్రాంతి ఇవ్వాలనుకుంటే, స్వదేశంలో జరిగే సిరీస్లకు పక్కనపెట్టండి" అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుంబ్లే పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: వామ్మో మాంచెస్టర్.. భారత్ను భయపెడుతున్న గత రికార్డులు -
వామ్మో మాంచెస్టర్.. భారత్ను భయపెడుతున్న గత రికార్డులు
లార్డ్స్ టెస్టులో అనుహ్య ఓటమి తర్వాత ఆతిథ్య ఇంగ్లండ్తో మరో కీలక పోరుకు టీమిండియా సిద్దమైంది. జూలై 23 నుంచి మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డు మైదానం వేదికగా ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో భారత్-ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని ఇంగ్లండ్ భావిస్తుంటే.. భారత్ మాత్రం ప్రత్యర్ధిని ఎలాగైనా ఓడించి సిరీస్ను సమం చేయాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ కోసం శుబ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ఈ కీలకపోరుకు ముందు మాంచెస్టర్లో గత రికార్డులు టీమిండియాను భయపెడుతున్నాయి.ఇంగ్లండ్దే పైచేయి..ఈ పర్యటనలో ఎడ్జ్బాస్టన్ టెస్టులో విజయం సాధించి ఇంగ్లండ్ కంచుకోటను బద్దలు కొట్టిన భారత జట్టు.. ఇప్పుడు మాంచెస్టర్పై కన్నేసింది. ఇప్పటివరకు మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డు మైదానంలో టీమిండియా ఒక్క టెస్టు మ్యాచ్లో కూడా గెలవలేదు. ఈ మైదానం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య మొత్తం తొమ్మిది టెస్టులు జరిగాయి.అందులో ఇంగ్లండ్ నాలుగింట విజయం సాధించగా.. మరో ఐదు టెస్టులు డ్రాగా ముగిశాయి. ఈ మైదానంలో టీమిండియా తొలి టెస్టు మ్యాచ్ 1936లో ఆడింది. అప్పటి నుంచి భారత జట్టుకు విజయం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. భారత జట్టు చివరసారిగా ఈ వేదికలో 2014లో టెస్టు మ్యాచ్ ఆడింది. మళ్లీ ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక మైదానంలో భారత్ ఆడనుంది.భారత ఓటమికి కారణమిదే..?ఇప్పటివరకు ఈ మైదానంలో భారత జట్టు విజయం సాధించికపోవడం వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఈ మైదానంలో పిచ్ ఎక్కువగా ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తోంది. ఈ గ్రీన్ టాప్ వికెట్పై పేసర్లు పండగ చేసుకుంటారు. ఇటువంటి పిచ్పై ఆసియా జట్లకు ఆడడం చాలా కష్టంగా ఉంటుంది.బ్యాటర్లు స్వింగింగ్ కండీషన్స్కు అలవాటు పడకపోవడంతో ఈ మైదానంలో ఏషియన్ జట్లు ఎక్కువగా ఓటమి చవిచూడాల్సి వస్తోంది. ఈ మైదానంలో ఇంగ్లండ్ జట్టుకు అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. 84 టెస్టుల్లో ఆతిథ్య జట్టు 33 మ్యాచ్ల్లో, 15 మ్యాచ్లలో ఓటమి చవిచూసింది.మిగిలిన 36 మ్యాచ్లను డ్రాగా ముగిసింది. ఈ మైదానంలో భారత అత్యధిక స్కోర్ 390 పరుగులగా ఉంది. ప్రస్తుతం భారత జట్టులో రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ మినహా మిగితా ఎవరూ కూడా మైదానంలో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. టీమిండియా తరపున ఈ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సునీల్ గవాస్కర్ ఉన్నారు. ఆయన ఈ మైదానంలో మూడు టెస్టులు ఆడి 242 పరుగులు చేశాడు.మాంచెస్టర్లో భారత రికార్డులుఅత్యధిక స్కోరు: 119.2 ఓవర్లలో 432/10 (ఆగస్టు 1990).అత్యల్ప స్కోరు: 21.4 ఓవర్లలో 58/10 (జూలై 1952).అతిపెద్ద ఓటమి (ఇన్నింగ్స్ వారీగా): 1952లో భారత్ను ఇంగ్లండ్ ఇన్నింగ్స్ అండ్ 207 పరుగుల తేడాతో ఓడించింది.అతిపెద్ద ఓటమి (పరుగులు వారీగా): జూలై 1959లో భారత్ను 171 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు ఓడించింది.అత్యధిక పరుగులు: సునీల్ గవాస్కర్ మూడు టెస్టుల్లో 242 పరుగులు.అత్యధిక స్కోరు: ఆగస్టు 1990లో మహ్మద్ అజారుద్దీన్ 243 బంతుల్లో 179 పరుగులు.అత్యధిక సగటు: సచిన్ టెండూల్కర్ 187.00 (ఒక టెస్ట్లో 187 పరుగులు).సెంచరీలు చేసిన ప్లేయర్లు వీరే: సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ మర్చంట్, అబ్బాస్ అలీ బేగ్, పాలీ ఉమ్రిగర్, సునీల్ గవాస్కర్, సందీప్ పాటిల్, మహ్మద్ అజారుద్దీన్ సచిన్ టెండూల్కర్. -
ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్.. చరిత్ర సృష్టించేందుకు సిద్దంగా ఉన్న పంత్
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించేందుకు అతి సమీపంలో ఉన్నాడు. జులై 23 నుంచి ఇంగ్లండ్తో ప్రారంభం కాబోయే నాలుగో టెస్ట్లో పంత్ మరో 182 పరుగులు చేస్తే.. ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్కీపర్ బ్యాటర్గా సరికొత్త రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు సౌతాఫ్రికా దిగ్గజం డెనిస్ లిండ్సే పేరిట ఉంది. లిండ్సే 1966/67 ఆస్ట్రేలియా సిరీస్లో 5 మ్యాచ్ల్లో (7 ఇన్నింగ్స్ల్లో) 86.57 సగటున 3 సెంచరీలు, 2 అర్ద సెంచరీల సాయంతో 606 పరుగులు చేశాడు.ఈ రికార్డు బద్దలు కొట్టేందుకు పంత్ 182 పరుగుల దూరంలో ఉన్నాడు. ఆరు దశాబ్దాల తర్వాత పంత్కు ఈ రికార్డు బద్దలు కొట్టే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో పంత్ ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడి 6 ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీల సాయంతో 425 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో శుభ్మన్ గిల్ (607) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. ఒక వేళ పంత్ నాలుగో టెస్ట్లో ఈ అవకాశం మిస్ అయినా ఐదో టెస్ట్లో సాధించే అవకాశం ఉంటుంది.మరో 101 పరుగులు చేస్తే..!ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్లో పంత్ 101 పరుగులు చేస్తే ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్గా రికార్డు సాధిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు బుద్ది కుందరన్ పేరిట ఉంది. కుందరన్ 1963/64లో ఇంగ్లండ్తో జరిగిన 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 10 ఇన్నింగ్స్లు ఆడి 525 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉంది.ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్లు..డెనిస్ లిండ్సే-606ఆండీ ఫ్లవర్- 540కుందరన్- 525బ్రాడ్ హడిన్- 493గెర్రి అలెగ్జాండర్- 484ఆడమ్ గిల్క్రిస్ట్- 473అలెక్ స్టివార్ట్- 465వాల్కాట్- 452రిషబ్ పంత్- 425రికార్డుల మాట అటుంచితే, అసలు పంత్ ఆడతాడా..?రికార్డుల మాట అటుంచితే ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్లో పంత్ ఆడతాడా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. మూడో టెస్ట్లో గాయపడిన పంత్.. నాలుగో మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొనడం లేదు.పంత్ గాయంపై భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డెష్కటే అప్డేట్ ఇచ్చాడు. పంత్ ఇంకా నొప్పితో బాధపడుతున్నాడని, నాలుగో టెస్ట్ సమయానికి ఫిట్నెస్ సాధిస్తాడని థీమా వ్యక్తం చేశాడు. ముందుస్తు జాగ్రత్తగా పంత్ను ప్రాక్టీస్కు దూరంగా ఉంచామని తెలిపాడు.కాగా, మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్కు ముందే పంత్ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్ సబ్స్ట్యూట్ వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తించాడు. వికెట్కీపింగ్కు దూరంగా ఉన్నా పంత్ రెండు ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ మాత్రం చేశాడు. -
వరుస వైఫల్యాలు.. కరుణ్ నాయర్పై వేటు..?
లండన్: ఇంగ్లండ్తో నాలుగో టెస్టు ఈ నెల 23 నుంచి జరగనుండగా అప్పుడే తుది జట్టుపై చర్చ మొదలైంది. సిరీస్లో జట్టు ఆడిన మూడు టెస్టులను చూస్తే బ్యాటర్ కరుణ్ నాయర్ మినహా ఇతర ఆటగాళ్లంతా రాణించారు. నాయర్ మాత్రం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. క్రీజ్లోకి వచ్చాక మెరుగ్గానే ఇన్నింగ్స్లను ఆరంభించినా...వాటిని అతను భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు.అతను వరుసగా 0, 20, 31, 26, 40, 14 (మొత్తం 131 పరుగులు) స్కోర్లు నమోదు చేశాడు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత తనకు లభించిన ‘మరో చాన్స్’ను నాయర్ సది్వనియోగం చేసుకోలేదు. ముఖ్యంగా లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో అతను అవుటైన తీరు విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టులో నాయర్ స్థానం నిలబెట్టుకోవడం కష్టంగానే ఉంది.కీలకమైన మూడో స్థానంలో నాయర్కు బదులుగా యువ ఆటగాడు సాయి సుదర్శన్కు మరో అవకాశం ఇవ్వాలని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. లీడ్స్ టెస్టు మొదటి ఇన్నింగ్స్లో డకౌట్ అయినా... రెండో ఇన్నింగ్స్లో చక్కటి షాట్లతో చెప్పుకోదగ్గ ప్రదర్శన (30 పరుగులు) కనబర్చాడు. తుది జట్టుకు సంబంధించి ఈ ఒక్క మార్పు మాత్రం కచ్చితంగా ఉండవచ్చని తెలుస్తోంది. కాగా, 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్ల్లో ఇంగ్లండ్ 2, భారత్ ఓ టెస్ట్ మ్యాచ్లో గెలిచాయి. సిరీస్లో నిలబడాలంటే భారత్ నాలుగో టెస్ట్లో గెలవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో తుది జట్టులో పలు మార్పులకు ఆస్కారం ఉంది. విశ్లేషకుల అభిప్రాయం మేరకు కరుణ్ నాయర్ను తప్పించి సాయి సుదర్శన్కు అవకాశం ఇవ్వవచ్చు. -
గెలిపించగలనని నమ్మాను.. గతంలోనూ ఇలాంటి స్థితిలో ఆడాను: టీమిండియా స్టార్ క్రికెటర్
సౌతాంప్టన్: ఇంగ్లండ్తో బుధవారం జరిగిన తొలి వన్డేను భారత మహిళల జట్టు గెలుచుకోవడంలో దీప్తి శర్మ ప్రధాన పాత్ర పోషించింది. ఆఫ్స్పిన్నర్గా జట్టు బౌలింగ్ బృందంలో రెగ్యులర్ సభ్యురాలైన దీప్తి... బ్యాటర్గా లోయర్ ఆర్డర్లో అనేక మార్లు కీలక ఇన్నింగ్స్లు ఆడింది. ఇప్పుడు ఇంగ్లండ్తో మ్యాచ్లో ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన దీప్తి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ జట్టును విజయం వరకు తీసుకెళ్లింది.28వ ఓవర్లో 127/4 వద్ద క్రీజ్లోకి వచ్చిన ఆమె 62 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 64 పరుగులు సాధించి చివరి వరకు అజేయంగా నిలిచింది. లారెన్ బెల్ బౌలింగ్లో దీప్తి ఒంటి చేత్తో కొట్టిన సిక్సర్ హైలైట్గా నిలిచింది.‘ఇన్నేళ్ల నా కెరీర్లో చాలా సందర్భాల్లో ఇలాంటి స్థితిలోనే బరిలోకి దిగాను. నేను ఎంత ప్రశాంతంగా ఉండగలనో నాకు బాగా తెలుసు. కాబట్టి ఏమాత్రం ఒత్తిడికి గురి కాలేదు. ఈసారి కూడా అదే కీలకంగా మారింది. జెమీమాతో భాగస్వామ్యం నెలకొల్పడంపై ముందుగా దృష్టి పెట్టాను. మా పార్ట్నర్షిప్ జట్టు గెలుపు వరకు తీసుకెళుతుందని నేను నమ్మాను.నేను చివరి వరకు నిలిస్తే విజయం ఖాయమవుతుందని తెలుసు. జెమీమా తర్వాత రిచా, అమన్ కూడా బాగా సహకరించారు. ఒంటి చేత్తో సిక్సర్ కొట్టడం రిషభ్ పంత్ను చూసి నేర్చుకున్నాను’ అని మ్యాచ్ అనంతరం దీప్తి శర్మ వ్యాఖ్యానించింది.ఇంగ్లండ్ పేసర్ ఫైలర్ షార్ట్ పిచ్ బంతులతో పన్నిన వ్యూహానికి తాము సిద్ధంగా ఉండటం వల్లే ఎలాంటి సమస్యా రాలేదని దీప్తి పేర్కొంది. ఆమె కెరీర్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవడం 20వసారి కాగా... మొదటిసారి బౌలింగ్లో ఒక్క వికెట్ కూడా తీయకుండా కేవలం బ్యాటింగ్ ప్రదర్శనతోనే ఆమె ఈ అవార్డును గెలుచుకోవడం విశేషం.త్వరలో జరిగే వన్డే వరల్డ్ కప్లోనూ ఆల్రౌండర్గా ఆమె కీలకం కానుంది. ‘మా జట్టు ఇటీవల వరుసగా చెప్పుకోదగ్గ విజయాలు సాధిస్తోంది. శ్రీలంకతో ముక్కోణపు టోర్నీ గెలిచాక ఇక్కడ కూడా బాగా రాణిస్తున్నాం. వరల్డ్ కప్కు ఇంకా చాలా సమయం ఉంది. దాని గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు. ప్రస్తుతం ఒక్కో మ్యాచ్పైనే దృష్టి పెట్టాం’ అని దీప్తి పేర్కొంది. తొలి వన్డేలో 4 వికెట్లతో ఇంగ్లండ్ను ఓడించిన భారత్ సిరీస్లో 1–0తో ముందంజ వేయగా... రేపు లార్డ్స్ మైదానంలో రెండో వన్డే జరుగుతుంది. -
నాలుగో టెస్టులో రిషబ్ పంత్ ఆడుతాడా? కీలక్ అప్డేట్ ఇచ్చిన కోచ్
ఇంగ్లండ్తో మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు బెకెన్హామ్లో తమ ప్రాక్టీస్ను మొదలు పెట్టింది. గురువారం తొలి ప్రాక్టీస్ సెషన్లో గిల్ సేన తీవ్రంగా శ్రమించింది. అయితే ఈ ప్రాక్టీస్ సెషన్కు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ దూరమయ్యాడు.లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో పంత్ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్ సబ్స్ట్యూట్ వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఫీల్డింగ్కు దూరంగా ఉన్న పంత్.. రెండు ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు మాత్రం వచ్చాడు. తీవ్రమైన నొప్పితో బాధపడుతూనే బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో నాలుగో టెస్టుకు పంత్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. తాజాగా పంత్ గాయంపై భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్డెష్కాట్ అప్డేట్ ఇచ్చాడు. పంత్ ఇంకా నొప్పితో బాధపడుతున్నాడని, మాంచెస్టర్ టెస్ట్ సమయానికి ఫిట్నెస్ సాధిస్తాడని టెన్డెష్కాట్ థీమా వ్యక్తం చేశాడు."మాంచెస్టర్లో జరిగే నాలుగో టెస్టుకు ముందు పంత్ తన బ్యాటింగ్ ప్రాక్టీస్ను మొదలు పెడతాడు. ఆ సమయానికి అతడు కచ్చితంగా ఫిట్నెస్ సాధిస్తాడన్న నమ్మకం ఉంది. అతడు మూడో టెస్టులో చాలా నొప్పితో బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత అతడి చేతి వేలి నొప్పి కాస్త తగ్గింది.కానీ ముందుస్తు జాగ్రత్తగా ప్రస్తుతం అతడు ప్రాక్టీస్కు దూరంగా ఉన్నాడు. వికెట్ కీపింగ్ చేయగలడా లేదా అన్నది ఆఖరిలో మేము నిర్ధారించుకుంటాము. మరోసారి ఇన్నింగ్స్ మధ్యలో కీపర్ను మార్చాల్సిన పరిస్థితి రాకూడదు. పూర్తి ఫిట్నెస్ సాధిస్తే పంత్నే బ్యాటింగ్, వికెట్ కీపింగ్ రెండూ చేస్తాడు. రాబోయే రోజుల్లో అతడి ఫిట్నెస్పై కచ్చితంగా అప్డేట్ ఇస్తామని" విలేకరుల సమావేశంలో డెష్కాట్ పేర్కొన్నాడు.చదవండి: ENG vs IND: ఇంగ్లండ్తో నాలుగో టెస్టు.. టీమిండియాకు భారీ షాక్ -
ఇంగ్లండ్తో నాలుగో టెస్టు.. టీమిండియాకు భారీ షాక్
లార్డ్స్ టెస్టులో హార్ట్ బ్రేకింగ్ ఓటమి తర్వాత ఆతిథ్య ఇంగ్లండ్తో మరో రసవత్తర పోరుకు టీమిండియా సిద్దమైంది. మాంచెస్టర్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు జూలై 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా తమ సన్నాహాకాలను ప్రారంభించింది. గురువారం ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం నెట్స్లో భారత ఆటగాళ్లు చెమటోడ్చారు.అర్ష్దీప్కు గాయం..!అయితే ఈ మ్యాచ్కు ముందు భారత జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. నెట్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ చేతి వేలికి గాయమైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ రిపోర్ట్లో పేర్కొంది. బంతి చేతి వేలికి తాకడంతో రక్తం కూడా వచ్చినట్లు తెలుస్తోంది.దీంతో అతడి చేతి వేలికి ఫిజియో టేప్ వేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్డెష్కాట్ కూడా ధ్రువీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేసిన అర్ష్దీప్.. టెస్టుల్లో మాత్రం ఇంకా భారత్ తరపున ఆడలేదు.ఇంగ్లండ్ టూర్కు ఎంపికైనప్పటికి తొలి మూడు టెస్టులకు బెంచ్కే పరిమితమయ్యాడు. ఒకవేళ నాలుగో టెస్టుకు జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇస్తే.. అర్ష్దీప్కు తుది జట్టులోకి చోటు దక్కే అవకాశముంది. కానీ ఇంతలోనే అర్ష్దీప్ గాయపడడం టీమ్మెనెజ్మెంట్ను కలవరపెడుతోంది. మరోవైపు లార్డ్స్ టెస్టులో గాయపడిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఫిట్నెస్పై ఇంకా క్లారిటీ లేదు.చదవండి: సిరాజ్ 3 సిక్సర్లతో గెలిపిస్తాడని అనుకున్నా!.. జోకులు ఆపండి: అశ్విన్ -
సిరాజ్ 3 సిక్సర్లతో గెలిపిస్తాడని అనుకున్నా!.. జోకులు ఆపండి: అశ్విన్
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ ఓ సస్పెన్ష్ థ్రిల్లర్ సినిమా ను తలపించింది. ఇరు జట్ల ఆటగాళ్ల తమ విరోచిత పోరాటాలతో అభిమానులకు అసలు సిసలైన టెస్టు క్రికెట్ మజాను అందించారు. ఆఖరివరకు నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ పోరులో విజయం ఇంగ్లండ్ జట్టునే వరించింది.ఈ మ్యాచ్లో భారత్ ఓటమిపాలైనప్పటికి రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్లు తమ పోరాటాలతో కోట్ల మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి నేను వున్నా అంటూ జడేజా బ్యాటింగ్ చేసిన తీరు.. అతడికి టెయిలాండర్లు(జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్) సహకరించిన విధానం గురుంచి ఎంతచెప్పుకొన్నతక్కువే.విజయానికి 22 పరుగులు కావాల్సిన సమయంలో సిరాజ్ క్లీన్ బౌల్డ్ కావడంతో కోట్లమంది భారత అభిమానుల గుండెలు బద్దలయ్యాయి. ఆఖరి వికెట్గా వెనుదిరిగిన సిరాజ్ సైతం మైదానంలోనే భావోద్వేగానికి లోనయ్యాడు. అయితే లార్డ్స్ టెస్టులో ఓటమిపై టీమిండియా స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ ఆశ్విన్ తాజాగా స్పందించాడు. మ్యాచ్ ఆఖరి రోజు ఆట సందర్భంగా తన తండ్రితో జరిగిన సంభాషణ గురించి ఆశ్విన్ వివరించాడు. సిరాజ్ మూడు సిక్సర్లు కొట్టి మ్యాచ్ను గెలిపిస్తాడని నమ్మకంతో తన తండ్రి ఉన్నట్లు ఆశ్విన్ వెల్లడించాడు."లార్డ్స్ టెస్టులో భారత్ పోరాడి ఓడింది. అయితే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రం అద్బుతమైన స్పెల్ను బౌల్ చేశాడు. ఓవైపు అలసిన శరీరంతో మైదానంలో పోరడాతూనే స్టోక్స్ తన బౌలింగ్ను కొనసాగించాడు. ఆఖరి రోజు ఆటను మా నాన్న నేను కలిసి టీవీలో వీక్షించాము.సిరాజ్ మూడు సిక్సర్లు బాది మ్యాచ్ను ఫినిష్ చేస్తాడని మా నాన్న నాతో అన్నారు. వెంటనే నేను జోకులు ఆపండి అని ఆయనతో అన్నాను. అదేవిధంగా స్టోక్స్ను కూడా ఆయన ప్రశంసించారు. రెండు ఎండ్స్ నుంచి అద్బుతంగా బౌలింగ్ చేశాడని ఆయన కొనియాడారు.తొలి ఇన్నింగ్స్లో కంటిన్యూగా 9.2 ఓవర్ల స్పెల్ను బౌలింగ్ చేసిన స్టోక్సీ.. రెండో ఇన్నింగ్స్లో 10 ఓవర్ల మ్యాచ్ విన్నింగ్ స్పెల్ను వేశాడు. అతడు 13-140 కిం కి.మీ. వేగంతో బౌలింగ్ చేశాడు. ఓవైపు భారత తరపున జడేజా అడ్డుగోడలా నిలిచి తన పోరాటాన్ని కొనసాగిస్తుంటే.. మరోవైపు స్టోక్స్ కూడా ఇంగ్లండ్ తరపున అదే పనిచేశాడు" అని తన యూట్యూబ్ ఛానల్లో జడ్డూ పేర్కొన్నాడు.చదవండి: అత్యధికసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’లు అందుకుంది వీరే -
లార్డ్స్లో టర్నింగ్ పాయింట్ అదే.. లేదంటే విజయం భారత్దే: రహానే
మాంచెస్టర్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు జూలై 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని ఆతిథ్య ఇంగ్లండ్ భావిస్తుంటే.. టీమిండియా మాత్రం ప్రత్యర్దిని మట్టికర్పించి సిరీస్ను సమం చేయాలని కసితో ఉండి.లార్డ్స్ టెస్టులో అనుహ్యంగా 22 పరుగుల తేడాతో ఓటమి పాలైన గిల్ సేన, నాలుగో టెస్టులో తమ తప్పిదాలను సరిదిద్దుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మెనెజ్మెంట్కు మాజీ కెప్టెన్ అజింక్య రహానే కీలక సూచన చేశాడు.మాంచెస్టర్ టెస్టులో భారత జట్టు అదనపు ఫాస్ట్ బౌలర్తో బరిలోకి దిగాలని రహానే అభిప్రాయపడ్డాడు. లార్డ్స్ టెస్టులో టీమిండియా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడింది. నితీశ్ కుమార్ పేస్ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఉన్నాడు."లార్డ్స్ టెస్టులో టీమిండియా ఓడిపోవడం నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే తొలి ఇన్నింగ్స్లో మాత్రం భారీ స్కోర్ను సాధించే అవకాశాన్ని భారత్ కోల్పోయింది. రాబోయే మ్యాచ్లో భారత్ అదనంగా ఓ ఫాస్ట్ బౌలర్ను ఆడిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఓ టెస్టు మ్యాచ్ను గెలవాలంటే ప్రత్యర్ధి జట్టులోని 20 వికెట్లను పడగొట్టాలి. ప్రస్తుతం భారత బ్యాటింగ్ యూనిట్ మెరుగ్గానే రాణిస్తున్నారు. కాబట్టి ఎక్స్ట్రా ఓ బౌలర్ జట్టులో ఉండాలన్నది నా అభిప్రాయం. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో కూడా 40 పరుగులకు ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి పటిష్ట స్థితిలో కన్పించింది. కానీ ఆ సమయంలో కరుణ్ నాయర్ ఎల్బీ రూప్లో ఔట్ కావడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఆ వికెట్తో మ్యాచ్పై ఇంగ్లండ్ పట్టుబిగించింది. ప్రత్యర్ధి బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేసి భారత బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారు. ఎలాగైనా గెలవాలన్న కసి వారిలో కన్పించింది. ఫీల్డింగ్లో కూడా వందకు వంద శాతం ఎఫక్ట్ పెట్టారు" అని రహానే తన యూట్యూబ్ ఛానలో పేర్కొన్నారు.చదవండి: ఫిట్గా లేకుంటే.. ఒక్క మ్యాచ్ కూడా ఆడకు: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
ఇంగ్లండ్తో నాలుగో టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టులో అనూహ్య ఓటమిచవిచూసిన భారత జట్టు.. మరో కీలక పోరుకు సిద్దమవుతోంది. జూలై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్తో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది.ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను 2-2తో సమం చేయాలని గిల్ సేన పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియాకు భారీ ఊరట లభించింది. మాంచెస్టర్లో జరిగే నాలుగో టెస్టులో భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఆడనున్నాడు.వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా బుమ్రా ఇంగ్లండ్ పర్యటనలో కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడతాడని బీసీసీ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జట్టును ఎంపిక చేసిన సమయంలోనే స్పష్టం చేశారు. దీంతో తొలి టెస్టులో ఆడిన బుమ్రా.. ఎడ్జ్బాస్టన్లో జరిగిన రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్నాడు.ఆ తర్వాత లార్డ్స్ టెస్టులో ఆడి అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలో బుమ్రా నాలుగో టెస్టులో ఆడుతాడా లేదా విశ్రాంతి తీసుకుంటాడా అన్నదానిపై సర్వాత్ర ఆసక్తి నెలకొంది.నాలుగో టెస్టుకు బుమ్రా సై..లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టుకు మాంచెస్టర్ టెస్టుకు దాదాపు ఎనిమిది రోజుల విరామం లభించింది. రేవ్స్పోర్ట్స్ రిపోర్ట్ ప్రకారం.. బుమ్రాకు తగినంత విశ్రాంతి దొరకవడంతో నాలుగో టెస్టులో ఆడించాలని టీమ్ మెనెజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.అంతేకాకుండా సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే నాలుగో టెస్టులో టీమిండియా కచ్చితంగా గెలవాల్సిందే. అంతేకాకుండా ఈ మ్యాచ్ ఫలితం డబ్ల్యూటీసీ సైకిల్ 2025-27 పాయింట్ల పట్టికపై ప్రభావం చూపనుంది. ఇప్పటికే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ నాలుగో స్ధానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బుమ్రా కూడా నాలుగో టెస్టులో ఆడేందుకు సిద్దంగా ఉన్నాడు. బుమ్రా తన కెరీర్లో ఇప్పటివరకు మాంచెస్టర్లో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు.ఇంగ్లండ్లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ గణాంకాలు (టెస్టులు)మ్యాచ్లు: 11ఇన్నింగ్స్: 21మెయిడెన్స్: 102వికెట్లు: 49ఉత్తమ బౌలింగ్ ఇన్నింగ్స్: 5/64ఉత్తమ బౌలింగ్ మ్యాచ్: 9/110సగటు: 24.97స్ట్రైక్ రేట్: 54.35-వికెట్ల హాల్స్: 4చదవండి: బంగ్లా ప్లేయర్ సరికొత్త చరిత్ర.. భజ్జీ ఆల్టైమ్ రికార్డు బద్దలు