breaking news
india vs england
-
IND vs ZIM: సిరీస్లో టీమిండియా ఫేవరెట్ కాదు: జింబాబ్వే కెప్టెన్
విదేశీ పర్యటనలో ఉన్న టీమిండియా వరుస పరాజయాలు చవిచూసింది. యూకే టూర్లో భాగంగా తొలుత ఐర్లాండ్తో టీ20 సిరీస్లో తలపడ్డ భారత జట్టు.. అనూహ్య రీతిలో పసికూన చేతిలో 2-0తో క్లీన్స్వీప్ అయింది. ఆ తర్వాత ఇంగ్లండ్ గడ్డ మీద అడుగుపెట్టి ఆతిథ్య జట్టు చేతిలో 4-0తో వైట్వాష్ అయింది.దీంతో యూకే పర్యటనతో భారత టీ20 జట్టు కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్కు అత్యంత చేదు అనుభవమే మిగిలింది. విజయమన్నదే లేకుండా అతడు ఈ రెండు సిరీస్లను అవమానకర రీతిలో ముగించాల్సి వచ్చింది.ఇపుడు జింబాబ్వేతో సిరీస్అనంతరం.. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో శుబ్మన్ గిల్ సారథ్యంలోనూ టీమిండియా ఓటమిపాలైంది. ప్రత్యర్థికి 1-2తో సిరీస్ను సమర్పించుకుంది. ఇక ఇప్పుడు భారత జట్టు జింబాబ్వేలో అడుగుపెట్టింది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది.ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ బృందం ఎలాగైనా ఈసారి గెలుపు ఖాతా తెరిచి.. సిరీస్లో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. అయితే, అదేమీ అంత తేలిక కాదు. ఐరిష్ జట్టు వంటి పసికూన చేతిలో ఓడిన టీమిండియాకు.. జింబాబ్వే కూడా కఠిన సవాలు విసురుతోంది.అసాధారణ విజయాలుఇటీవలి కాలంలో ఆ జట్టు సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనం. టీ20 ప్రపంచకప్-2026లో అనూహ్య రీతిలో మాజీ చాంపియన్, పటిష్ట ఆస్ట్రేలియా జట్టునే జింబాబ్వే మట్టికరిపించింది. ఏకంగా 23 పరుగుల తేడాతో ఓడించి గ్రూప్ దశలోనే ఆసీస్ను ఎలిమినేట్ చేసింది. ఆ తర్వాత శ్రీలంక, బంగ్లాదేశ్లపై కూడా విజయాలు సాధించింది.ఇక ఇటీవల బంగ్లాదేశ్ జట్టు తమ దేశంలో పర్యటించగా ఏకైక టెస్టులో బంగ్లాను ఏకంగా ఇన్నింగ్స్ 85 పరుగుల తేడాతో జింబాబ్వే మట్టికరిపించింది. ఆ తర్వాత వన్డే సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. అయితే, టీ20 సిరీస్ను మాత్రం 1-2తో బంగ్లాకు కోల్పోయింది. ఏదేమైనా ఇటీవల అన్ని ఫార్మాట్లలో చెప్పుకోదగ్గ విజయాలతో జింబాబ్వే పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.టీమిండియా ఫేవరెట్ కాదుఈ నేపథ్యంలో తాజా టీ20 సిరీస్లో టీమిండియా హాట్ ఫేవరెట్ కదా అన్న ప్రశ్నకు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా ఇచ్చిన సమాధానం వైరల్గా మారింది. ‘‘అదేం లేదు. ఈ సిరీస్లో గెలిచేందుకు ఇరుజట్లకు సమాన అవకాశాలు ఉన్నాయి.ఏదేమైనా నేనొక విషయం కచ్చితంగా చెప్పగలను. జింబాబ్వే ఇటీవలి కాలంలో అత్యంత నిలకడగా ఆడుతూ క్రికెట్లోని అసలైన మజాను అందిస్తోంది. ఈ సిరీస్ ద్వారా కూడా జింబాబ్వే కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది.వార్వన్ సైడ్ కానే కాదుప్రస్తుతం టీమిండియా సంధి దశలో ఉంది. జింబాబ్వే పరిస్థితి కూడా అంతే. కాబట్టి ఈ సిరీస్ ఎంతమాత్రం ఏకపక్షంగా ఉండబోదని చెప్పగలను’’ అని రజా పేర్కొన్నాడు. కాగా టీమిండియా- జింబాబ్వే మధ్య జూలై 23, 25, 26 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక. చదవండి: iND vs ENG: ప్రపంచంలోనే బెస్ట్.. అతడిని ఎందుకు ఆడించలేదు?Another exciting challenge awaits Team India! 🇮🇳Zimbabwe skipper Sikandar Raza is excited for the upcoming series against India and believes fans are in for an entertaining contest! 👊🔥#ZIMvIND pic.twitter.com/6iyXDzZbLn— Star Sports (@StarSportsIndia) July 21, 2026 -
వారి వల్లే ఓడిపోయాం.. కానీ అతడు మాత్రం అద్భుతం: గిల్
భారత పురుషల క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనను ఓటమితో ముగించింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలోనూ ఇంగ్లండ్ చేతిలో 27 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో ఆతిథ్య జట్టుకు భారత్ సమర్పించుకుంది.నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ బ్యాటింగ్ పరంగా రాణించినప్పటికి బౌలింగ్లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఏకంగా 387 పరుగులు సాధించింది. ఓపెనర్లు బెన్ డకెట్ (141), జేకబ్ బెతెల్ (91) దుమ్ములేపగా.. జో రూట్ (48 బంతుల్లో 74), జోస్ బట్లర్ (13 బంతుల్లో 41) మెరుపు ఇన్నింగ్స్తో అజేయంగా నిలిచారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 360 రన్స్ చేసింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ(138) భారీ సెంచరీతో కదం తొక్కగా.. గిల్(77), విరాట్ కోహ్లి(74) హాఫ్ సెంచరీలతో రాణించారు. అయితే మిడిలార్డర్ బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోవడంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పందించాడు.బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ చివరి ఓవర్లలో రాణించలేకపోయామని గిల్ తెలిపాడు."ఈ మ్యాచ్లో ఓడిపోవడం మమ్మల్ని మేము తీవ్ర నిరాశపరిచింది. తొలుత బౌలింగ్లో విఫలమయ్యాం. పవర్ప్లేలో మా బౌలర్లు లూజ్ డెలివరీలు వేసి భారీగా పరుగులు ఇచ్చారు. పవర్ప్లే తర్వాత వారు మ్యాచ్ను పూర్తిగా వారి గుప్పిట్లోకి తీసుకున్నారు. చివరి మూడు ఓవర్లలో మేమ ఏకంగా 60 పరుగుల వరకు సమర్పించుకున్నాం. అంతర్జాతీయ క్రికెట్లో అంత భారీగా పరుగులు ఇస్తే మ్యాచ్ను కాపాడుకోవడం కష్టం. అయినప్పటికి లక్ష్యాన్ని చేధిస్తామన్న నమ్మకం మాకు ఉండేది. 40 ఓవర్ల తర్వాత మా చేతిలో వికెట్లు ఉంటే మ్యాచ్ను గెలుచుకోవచ్చని అనుకున్నాం. వికెట్లు పడకుండా ఉండే చివరి 10 ఓవర్లలో 100 నుండి 110 పరుగులు చేయడం పెద్దం కష్టమేమి కాదు. పవర్ప్లే తర్వాత కూడా రోహిత్ భాయ్ నేనూ రన్రేట్ తగ్గకుండా స్కోర్ బోర్డును ముందుకు నడిపించాం. కానీ కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం కొంపముంచింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మరోసారి ఈ సీనియర్ ఆటగాళ్లు తమ క్లాస్ చూపించారు. ముఖ్యంగా రోహిత్ భాయ్ ఆడిన తీరు అద్భుతం. మ్యాచ్ చివర్లో వికెట్ చాలా నెమ్మదించింది, షాట్లు ఆడటం అంత సులువు కాలేదు. కానీ అలాంటి పిచ్పై కూడా రోహిత్ అదరగొట్టాడు" అని గిల్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో పేర్కొన్నాడు. -
రోహిత్ సెంచరీ వృథా.. లార్డ్స్ వన్డేలో టీమిండియా ఓటమి
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో భారత్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ బెన్ డక్కెట్ (141 పరుగులు, 135 బంతుల్లో, 18 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు జాకబ్ బెథెల్ (91), జో రూట్ (74 నాటౌట్, 48 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. భారత బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు.రో-కో హిట్.. మిడిలార్డర్ ఫట్అనంతరం 388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్కు వీరిద్దరూ 147 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత 77 పరుగులు చేసిన గిల్.. రషీద్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు.అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి, రోహిత్తో జతకట్టాడు. వీరిద్దరూ దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలో రోహిత్ 34 బంతుల్లో తన 34వ వన్డే సెంచరీ మార్క్ను పూర్తి చేసుకున్నాడు. వరుస బౌండరీలు బాది మంచి జోరు మీద ఉన్న రోహిత్(110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్లతో 138) జాకబ్ బెథల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. రోహిత్ ఔటైన తర్వాత భారత వికెట్ల పతనం మొదలైంది. మిడిలార్డర్ బ్యాటర్లు ఒక్కరు కూడా రాణించలేకపోయారు. ఇషాన్ కిషన్(14), శ్రేయస్ అయ్యర్(0) వరుస ఓవర్లలో ఔటయ్యారు. దీంతో కావాల్సిన రన్రేట్ భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలో కోహ్లి(74) కూడా ఓ భారీ షాట్కు ప్రయత్నించి పెవిలియన్కు చేరాడు.దీంతో మ్యాచ్ భారత్ చేతులనుంచి చేజారిపోయింది. కేఎల్ రాహుల్(12), అక్షర్ పటేల్(2) నిరాపరిచారు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 360 పరుగుల వద్ద ఆగిపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కుర్రాన్ 4 వికెట్లతో భారత్ను దెబ్బ తీశాడు. కాగా ఇంగ్లండ్ టూర్లో భారత్ టీ20 సిరీస్తో పాటు వన్డే సిరీస్ను కూడా కోల్పోయి ఘోర పరాభవాన్ని మూట కట్టుకుంది. -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తన ఫామ్ను తిరిగి అందుకున్నాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో మూడో వన్డేలో రోహిత్ సూపర్ సెంచరీతో మెరిశాడు. 388 పరుగుల భారీ లక్ష్య చేధనలో అతడు చెలరేగి ఆడాడు. ఈ క్రమంలో హిట్మ్యాన్ కేవలం కేవలం 84 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో తన 34వ వన్డే శతకాన్ని అందుకున్నాడు.మొత్తంగా ఈ మ్యాచ్లో 110 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. 17 ఫోర్లు, 5 సిక్స్లతో 138 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ అద్భుత సెంచరీతో రోహిత్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.రోహిత్ సాధించిన రికార్డులు ఇవే👉ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో వన్డేల్లో సెంచరీ సాధించిన తొలి భారత బ్యాటర్గా రోహిత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతకుముందు ఈ గ్రౌండ్లో అత్యధిక వన్డే స్కోరు చేసిన భారత్ ఆటగాడిగా రికార్డు సౌరవ్ గంగూలీ పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో గంగూలీని హిట్మ్యాన్(138) అధిగమించాడు. ఈ రికార్డు సచిన్, కోహ్లి వంటి దిగ్గజాలకు కూడా సాధ్యం కాలేదు.👉విదేశీ గడ్డపై ఒకే దేశంలో అత్యధిక అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ వరల్డ్ సృష్టించాడు ఇంగ్లండ్లో రోహిత్కు ఇది ఎనిమిదవ వన్డే సెంచరీ. ఇంతకుముందు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్, సయీద్ అన్వర్, డివిలియర్స్, క్వింటన్ డికాక్ సంయుక్తంగా ఉండేది. వీరంతా ఒకే దేశంలో 7 వన్డే సెంచరీలు నమోదు చేశారు. అయితే ఈ మ్యాచ్లో అద్భుత సెంచరీ సాధించడంతో రోహిత్ ఈ దిగ్గజ క్రికెటర్లను దాటేశాడు.👉వన్డే చరిత్రలోనే ఎక్కువ వయసులో (39 సంవత్సరాల 80 రోజులు) సెంచరీ సాధించిన భారత ఆటగాడిగానూ రోహిత్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (38 ఏళ్ల 327 రోజులు) పేరిట ఉండేది.👉అంతర్జాతీయ క్రికెట్లో సేనా (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలపై అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. సేనా దేశాల జట్లపై రోహిత్ ఇప్పటివరకు 343 సిక్సర్లు కొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్(342) పేరిట ఉండేది. రోహిత్, గేల్ తర్వాత స్ధానాల్లో విరాట్ కోహ్లి(179), ఎంఎస్ ధోని(177), షాహిద్ అఫ్రిది -
లార్డ్స్లో విధ్వంసం.. శతక్కొట్టిన రోహిత్ శర్మ
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 388 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఇంగ్లండ్ బౌలర్లకు రోహిత్ చుక్కలు చూపించాడు.ఈ క్రమంలో హిట్మ్యాన్ కేవలం 84 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో తన 34వ వన్డే శతకాన్ని అందుకున్నాడు.తన ఫామ్పై విమర్శలు చేస్తున్న వారికి రోహిత్ బ్యాట్తోనే సమాధనమిచ్చాడు. లార్డ్స్లో వన్డేల్లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. ఓవరాల్గా 110 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. 17 ఫోర్లు, 5 సిక్స్లతో 138 పరుగులు చేసి ఔటయ్యాడు.కాగా లార్డ్స్ వన్డే అనంతరం రోహిత్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కానీ ఈ ముంబై ఆటగాడు తన సూపర్ సెంచరీ ఈ రూమర్స్కు చెక్పెట్టాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 387 పరుగుల భారీ స్కోర్ సాధించింది. -
టీమిండియాకు ఎదురుదెబ్బ.. గాయంతో ఆల్రౌండర్ దూరం!
ఇంగ్లండ్తో రెండో వన్డేలో పరాజయం చవిచూసిన టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తొలి వన్డేలో మెరుపు అర్ధసెంచరీతో టీమిండియాను గెలిపించిన ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయంతో సిరీస్లో మిగిలిన వన్డేకు దూరమైనట్లు బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లండ్తో రెండో వన్డే సందర్భంగా బ్యాటింగ్కు ముందే వాషింగ్టన్ సుందర్ కండరాల నొప్పితో బాధపడ్డాడు. ఫిజియో వద్ద చికిత్స తీసుకొని మైదానంలోకి అడుగుపెట్టిన సుందర్ 5 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో సుందర్ రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్కు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో సుందర్కు గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇంగ్లండ్ సిరీస్లో చివరి వన్డేకు దూరమైనట్లు తెలుస్తోంది. అతడు కోలుకోవడానికి రెండు నుంచి నాలుగు వారాల సమయం పట్టే అవకాశముందని సమాచారం. సుందర్ గాయం తీవ్రతపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ లెక్కన శ్రీలంకతో టెస్టు సిరీస్కు సుందర్ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 26 ఏళ్ల సుందర్ ప్రస్తుతం టీమిండియాలో అన్ని ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 18 టెస్టుల్లో 41 వికెట్లు తీయడంతో పాటు 937 పరుగులు సాధించాడు.వదలని గాయాల బెడదవరుస సిరీస్లతో బిజీగా గడుపుతున్న టీమిండియాను గాయాల బెడద వదలడం లేదు. ఇప్పటికే హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి గాయాలతో ఇంగ్లండ్ సిరీస్కు దూరమయ్యారు. తాజాగా వాషింగ్టన్ సుందర్ దూరం కావడం టీమిండియాకు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఇక సుందర్కు గాయాలు కొత్తేమి కాదు. ఈ ఏడాది ఆరంభంలో పక్కటెముకల్లో ఫ్రాక్చర్ కావడంతో న్యూజిలాండ్తో సిరీస్కు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న సుందర్ 2026 టీ20 ప్రపంచకప్ మధ్యలో జట్టులో జాయిన్ అయ్యాడు. -
రోహిత్ శర్మ రిటైర్మెంట్..? ఎల్లుండే ఆఖరి మ్యాచ్?
టీమిండియా స్టార్ ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా? అంటే అవునానే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. ఆదివారం(జూలై 19) ఇంగ్లండ్తో జరగనున్న మూడో వన్డే అతడి చివరి ఇంటర్ననేషనల్ మ్యాచ్ కానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇది రోహిత్ తనంతంట తాను తీసుకున్న నిర్ణయం కాదని, సెలక్టర్ల ఒత్తిడి మేరకే అతడు తప్పుకొంటున్నాడని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ హిట్మ్యాన్తో మాట్లాడి భవిష్యత్తు ప్రణాళికలపై పూర్తి స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మకు చోటు లేదని అగార్కర్ చెప్పినట్లు సమాచారం.అతడి స్థానంలో యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్కు అవకాశమివ్వనున్నట్లు ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ తమ కథనంలో రాసుకొచ్చింది. జైశ్వాల్ తాను ఆడిన ప్రతీ మ్యాచ్లో నూ అద్భుతంగా రాణిస్తున్నప్పటికి, జట్టులో ఓపెనింగ్ స్లాట్స్ ఖాళీ లేకపోవడంతో అతడికి చోటు దక్కడం లేదు.ఈ క్రమంలోనే 2027 వన్డే ప్రపంచకప్ నాటికి యశస్విని పూర్తి స్ధాయి ఓపెనర్గా సిద్దం చేయాలని మేనెజ్మెంట్ భావిస్తోంది. ముఖ్యంగా రోహిత్ శర్మ వయస్సును కూడా సెలక్టర్లు పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే వరల్డ్ కప్ నాటికి 40 ఏళ్ల 6 నెలలకు పైగా వయసు ఉండే రోహిత్ ఫిట్నెస్పై కూడా బీసీసీఐకి సందేహాలు ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అసంతృప్తిలో రోహిత్!అయితే ఈ నిర్ణయంపై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే అతడు బీసీసీఐ పెద్దలతో మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. రోహిత్ ఇప్పటికే టీ20ఐలు, టెస్టుల నుంచి తప్పుకోగా.. వన్డే క్రికెట్ మాత్రమే ఆడుతున్నారు. అతడు టెస్టుల నుంచి తప్పుకున్నప్పటి నుంచి, రోహిత్ భవిష్యత్తుపై సెలెక్షన్ కమిటీ టీమ్ మేనేజ్మెంట్తో నిరంతరం చర్చిస్తూనే ఉంది. కాగా రోహిత్ ఇటీవల ఆశించిన విధంగా రోహిత్ ఆడలేకపోతున్నాడు. సిడ్నీలో 121 నాటౌట్ ఇన్నింగ్స్ తర్వాత 11 మ్యాచ్లు ఆడిన 35.18 సగటుతో 387 పరుగులు చేశాడు. వీటిలో 3 అర్ధ సెంచరీలు ఉన్నా... అతని స్థాయిలో బ్యాటింగ్లో దూకుడు కనిపించలేదు. ముఖ్యంగా ఇంగ్లండ్తో రెండు వన్డేల్లో కలిపి 68 బంతుల్లో 37 పరుగులే చేయగలిగాడు. ఇక వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్గా గుర్తింపు ఉన్న రోహిత్ 19 ఏళ్ల కెరీర్లో 287 వన్డేల్లో 48.58 సగటుతో 11,757 పరుగులు చేశాడు. వీటిలో 33 సెంచరీలు, 62 అర్ధసెంచరీలు ఉన్నాయి.చదవండి: అదే మా కొంపముంచింది.. చాలా బాధగా ఉంది: శుబ్మన్ గిల్ -
అదే మా కొంపముంచింది.. చాలా బాధగా ఉంది: శుబ్మన్ గిల్
యూకే పర్యటనలో భారత్కు మరో ఓటమి ఎదురైంది. కార్డిఫ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో భారత బౌలింగ్ పరంగా రాణించినప్పటికి బ్యాటింగ్లో మాత్రం విఫలమైంది. ముఖ్యంగా మిడిలార్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 44 ఓవర్లలో కేవలం 233 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 234 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 6 వికెట్లు కోల్పోయి 44.1 ఓవర్లలో చేధించింది. లక్ష్య చేధనలో ఇంగ్లండ్ కూడా కాస్త తడబడినప్పటికి, సీనియర్ బ్యాటర్ జోరూట్(99) అజేయంగా నిలిచి మ్యాచ్ను ముగించాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ 1-1 సమమైంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పందించాడు. బ్యాటింగ్లో మిడిలార్డర్ వైఫల్యమే తమ కొంపముంచిందని గిల్ అంగీకరించాడు.ఈ ఓటమి మమ్మల్ని తీవ్ర నిరాశపరిచింది. 25 ఓవర్లు ముగిసేసరికి మేము మంచి పొజిషన్లో ఉన్నాం. కనీసం 300 నుంచి 310 పరుగులు చేస్తామని ఆశించాం. కానీ ఒక్కసారిగా పరిస్థితి తారుమారు అయిపోయింది. మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయాం. మా టెయిలెండర్లు గొప్ప బ్యాటర్లు కారని మాకు తెలుసు. కానీ లోయర్ మిడిలార్డర్ నుంచి మేము మరింత మెరుగైన ప్రదర్శనను ఆశించాం. ఈ మ్యాచ్లో మాకు లభించిన ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం. వచ్చే మ్యాచ్లో ఇలాంటి పరిస్థితి ఎదురైతే చిన్న చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పి, ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తున్నాను అని గిల్ పేర్కొన్నాడు.తన వికెట్ కోల్పోవడంపై గిల్ స్పందిస్తూ.. మంచి షాట్ ఆడినప్పుడు బంతి నేరుగా కవర్ ఫీల్డర్ చేతికి వెళ్తే ఎవరికైనా బాధగా అనిపిస్తుంది. నాకు కూడా అలానే అనిపించింది. వాషింగ్టన్ సుందర్ గాయం జట్టు వ్యూహాలను దెబ్బతీసింది. వాషీ మా జట్టులో కీలక ఆటగాడు. అతడు బ్యాటింగ్ చేస్తూ మిడ్-ఆఫ్ వైపు సింగిల్ తీసే క్రమంలో గాయపడ్డాడు.దీంతో మేము ఇన్నింగ్స్ మొత్తం మా ప్రధాన బౌలర్లతోనే బౌలింగ్ చేయించాల్సి వచ్చింది. జో రూట్ అద్బుతంగా ఆడాడు. ఒకవేళ స్కోరు 300 ఉండి ఉంటే, అప్పుడు రూట్పై ఒత్తిడి ఉండేది. కానీ ఇలాంటి చిన్న స్కోర్లు చేధించడంలో అతడు దిట్ట అని చెప్పుకొచ్చాడు. -
సిరీస్ సమం
కార్డిఫ్: ఇంగ్లండ్తో తొలి వన్డేలో చక్కటి విజయం సాధించిన భారత జట్టు... రెండో మ్యాచ్లో పరాజయం పాలైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన రెండో పోరులో ఆతిథ్య ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. ఫలితంగా సిరీస్ 1–1తో సమమైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ 44 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (66 బంతుల్లో 65; 8 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (71 బంతుల్లో 66; 5 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. గిల్ (31; 6 ఫోర్లు), రోహిత్ శర్మ (26; 1 ఫోర్, 1 సిక్స్) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. గత మ్యాచ్ అర్ధశతక వీరులు వాషింగ్టన్ సుందర్ (2), అక్షర్ పటేల్ (1)తో పాటు ఇషాన్ కిషన్ (1), శివమ్ దూబే (0) సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఆఖర్లో బుమ్రా (13 బంతుల్లో 20 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక పరుగులు జోడించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్, ఆట్కిన్సన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 44.1 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ జో రూట్ (133 బంతుల్లో 99 నాటౌట్; 9 ఫోర్లు) సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అజేయంగా నిలిచాడు. డకెట్ (0), బెథెల్ (4), కెప్టెన్ బ్రూక్ (16), సామ్కరన్ (26), బట్లర్ (17) విఫలమ య్యారు. ఒక దశలో 125 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ జట్టును రూట్ ఆదుకున్నాడు. విల్ జాక్స్ (30; 2 ఫోర్లు)తో కలిసి 86 బంతుల్లో 72 పరుగులు జోడించాడు. దీంతో విజయ సమీకరణం ఇంగ్లండ్కు అనుకూలంగా మారింది.ఆరంభంలో ప్రభావవంతంగా కనిపించిన భారత బౌలర్లు ఆ తర్వాత అదే జోరు కనబర్చడంలో విఫలమయ్యారు. గుర్నూర్ బ్రార్ రెండు వికెట్లు పడగొట్టగా... బుమ్రా, ప్రసిధ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఆదివారం లార్డ్స్లో నిర్ణయాత్మక మూడో వన్డే జరగనుంది. -
ఇంగ్లండ్తో రెండో వన్డే.. భారత జట్టులోకి పేస్ సంచలనం?
కార్డిఫ్ వేదికగా ఇంగ్లండ్తో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి 2-0 తేడాతో సిరీస్ను సొంతం చేసుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. అయితే ఈ కార్డిఫ్ వన్డేలో టీమిండియా ఓ మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.తొలి వన్డేలో గాయపడిన కెప్టెన్ శుబ్మన్ గిల్ పూర్తి ఫిట్నెస్ సాధించినప్పటికి.. పేసర్ గుర్నూర్ బ్రార్ మాత్రం ఇంకా కోలుకోలేదు. ఎడ్జ్బాస్టన్ వన్డేలో గుర్నూర్ కాలి పిక్క గాయం బారిన పడ్డాడు. దీంతో మ్యాచ్ మధ్యలోనే అతడు మైదానాన్ని వీడాడు. ఈ క్రమంలో రెండో వన్డేకు అతడికి విశ్రాంతి ఇచ్చి ప్రిన్స్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇంగ్లండ్తో టీ20ల్లో ప్రిన్స్ ఆకట్టుకున్నాడు. అంతకుముందు అఫ్గాన్తో సిరీస్లో కూడా అతడు రాణించాడు. వాస్తవానికి ఇంగ్లండ్తో వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో ప్రిన్స్కు చోటు దక్కలేదు. కానీ హర్షిత్ రాణా గాయపడడంతో సెలక్టర్లు ఈ ఢిల్లీ పేసర్కు తిరిగి పిలుపు నిచ్చారు.మరోవైపు ఇంగ్లండ్ కూడా ఓ మార్పు చేసే అవకాశముంది. పేసర్ జోష్ టంగ్ స్ధానంలో బ్రైడన్ కార్స్కు అవకాశమివ్వనున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా తొలి వన్డేలో ఇంగ్లండ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమై ఓటమి చవిచూసింది.తుది జట్లు(అంచనా)భారత్శుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, శివమ్ దూబే, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాఇంగ్లండ్జాకబ్ బెథెల్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కర్రన్, విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్ -
ఎట్టకేలకు ఒక విజయం
బర్మింగ్హామ్: ఫార్మాట్ మారింది... ఫలితం మారింది... ఐర్లాండ్–ఇంగ్లండ్ పర్యటనలో ఒక్క గెలుపు కోసం ఎదురు చూస్తున్న భారత అభిమానులకు ఎట్టకేలకు ఊరట దక్కింది. టి20ల్లో ఆరు పరాజయాల తర్వాత వన్డేల్లో సరైన ఆరంభం లభించింది. ఇంగ్లండ్తో మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకే ఆలౌటైంది. జో రూట్ (76 బంతుల్లో 76 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), లియామ్ డాసన్ (83 బంతుల్లో 68; 6 ఫోర్లు 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. ఇంగ్లండ్ 107/6తో ఇబ్బందుల్లో ఉన్న దశలో రూట్, డాసన్ కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్కు 22.2 ఓవర్లలో 121 పరుగులు జోడించారు. అనంతరం భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్లకు 262 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (75 బంతుల్లో 80 రిటైర్ట్హర్ట్; 11 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్ (52 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), వాషింగ్టన్ సుందర్ (63 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. అక్షర్, సుందర్ ఐదో వికెట్కు 105 బంతుల్లో అభేద్యంగా 102 పరుగులు జత చేశారు. సిరీస్లో భారత్ 1–0తో పైచేయి సాధించగా... కార్డిఫ్లో రేపు రెండో వన్డే జరుగుతుంది. కీలక భాగస్వామ్యం... భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంలో ఆరంభంలో స్కోరు చేయడానికి ఇంగ్లండ్ బాగా ఇబ్బంది పడింది. 13వ బంతికి గానీ బెతెల్ (14) తొలి పరుగు తీయలేకపోగా, 7 ఓవర్లలో జట్టు 20 పరుగులే చేసింది. బుమ్రా తన తొలి స్పెల్ను 4–0–8–0తో ముగించాడు. ఈ దశలో గుర్నూర్ తొలి ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్ బాది దూకుడు ప్రదర్శించిన బెన్ డకెట్ (45 బంతుల్లో 43; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అతని రెండో ఓవర్లో మరో 2 ఫోర్లు కొట్టాడు. అయితే గుర్నూర్ తన తర్వాతి ఓవర్లో ప్రతీకారం తీర్చుకున్నాడు. ఒకే ఓవర్లో అతను బెతెల్, డకెట్లను వెనక్కి పంపించాడు. బుమ్రా చక్కటి బంతితో బ్రూక్ (1) పని పట్టగా... ఒకే ఓవర్లో బట్లర్ (5), స్యామ్ కరన్ (0)లను ప్రసిధ్ అవుట్ చేశాడు. 27 బంతుల వ్యవధిలో 19 పరుగులు మాత్రమే చేసి ఇంగ్లండ్ 5 వికెట్లు చేజార్చుకుంది. ఆపై విల్ జాక్స్ (20) కొద్దిసేపు వికెట్ల పతనాన్ని నిలువరించాడు. అతనూ పెవిలియన్ చేరిన తర్వాత రూట్, డాసన్ భాగస్వామ్యంతో జట్టు కోలుకుంది.7 పరుగుల వద్ద రూట్ ఇచ్చిన సులువైన రిటర్న్ క్యాచ్ను దూబే వదిలేయడం ఇంగ్లండ్కు కాస్త కలిసొచ్చింది! ఈ క్రమంలో డాసన్ 65 బంతుల్లో వన్డేల్లో తన తొలి అర్ధసెంచరీ సాధించగా, రూట్ 57 బంతుల్లో కెరీర్లో 46వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. శతక భాగస్వామ్యం తర్వాత డాసన్ను అవుట్ చేసి అక్షర్ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత మరో 30 పరుగులకు ఇంగ్లండ్ చివరి 3 వికెట్లు కోల్పోగా, రూట్ అజేయంగా నిలిచాడు. రోహిత్, కోహ్లి విఫలం... ఛేదనలో భారత్కు సరైన ఆరంభం లభించలేదు. తడబడుతూనే ఆడిన రోహిత్ శర్మ (21 బంతుల్లో 11; 1 ఫోర్) భారీ షాట్కు ప్రయత్నించి వెనుదిరగ్గా, ఆర్చర్ చక్కటి బంతితో కోహ్లి (5)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కెపె్టన్ గిల్కు మరో ఎండ్ నుంచి శ్రేయస్ అయ్యర్ (35; 2 ఫోర్లు) సహకరించాడు. వీరిద్దరు 101 పరుగులు జత చేశారు. ఈ దశలో తొడ కండరాలు పట్టేయడంతో గిల్ మైదానం వీడగా... మూడు పరుగుల వ్యవధిలో అయ్యర్, రాహుల్ (1) వెనుదిరిగాడు. ఈ దశలో భారత్పై కొంత ఒత్తిడి కనిపించింది. అయితే సుందర్, అక్షర్ చక్కటి ప్రదర్శనతో జట్టును గెలుపు దిశగా నడిపించారు. 39 బంతుల్లోనే అక్షర్ నాలుగో అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత కూడా ఈ ఇద్దరు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా గెలుపు ఖాయం చేశారు. రషీద్ బౌలింగ్లో భారీ సిక్స్తో సుందర్ 63 బంతుల్లో తన రెండో హాఫ్ సెంచరీని చేరుకోవడంతో పాటు మ్యాచ్ను ముగించాడు.స్కోరు వివరాలుఇంగ్లండ్ ఇన్నింగ్స్: డకెట్ (సి) బుమ్రా (బి) బ్రార్ 43; బెతెల్ (సి) సుందర్ (బి) బ్రార్ 14; రూట్ (నాటౌట్) 76; బ్రూక్ (సి) రోహిత్ (బి) బుమ్రా 1; బట్లర్ (సి) బ్రార్ (బి) ప్రసిధ్ 5; కరన్ (సి) రాహుల్ (బి) ప్రసిధ్ 0; జాక్స్ (సి) రాహుల్ (బి) దూబే 20; డాసన్ (సి) రోహిత్ (బి) అక్షర్ 68; ఆర్చర్ (సి) సుందర్ (బి) అక్షర్ 12; రషీద్ (స్టంప్డ్) రాహుల్ (బి) అక్షర్ 1; టంగ్ (బి) అక్షర్ 0; ఎక్స్ట్రాలు 18; మొత్తం (47.5 ఓవర్లలో ఆలౌట్) 258. వికెట్ల పతనం: 1–61, 2–63, 3–64, 4–80, 5–80, 6–107, 7–228, 8–250, 9–258, 10–258. బౌలింగ్: బుమ్రా 9–0–31–1, ప్రసిధ్ 10–2–50–2, గుర్నూర్ బ్రార్ 9–0–61–2, శివమ్ దూబే 6–0–27–1, సుందర్ 4–0–13–0, అక్షర్ పటేల్ 9.5–0–62–4.భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) బ్రూక్ (బి) కరన్ 11; గిల్ (రిటైర్డ్హర్ట్) 80; కోహ్లి (ఎల్బీ) (బి) ఆర్చర్ 5; అయ్యర్ (రనౌట్) 35; సుందర్ (నాటౌట్) 52; రాహుల్ (బి) టంగ్ 1; అక్షర్ (నాటౌట్) 57; ఎక్స్ట్రాలు 21; మొత్తం (45.2 ఓవర్లలో 4 వికెట్లకు) 262. వికెట్ల పతనం: 1–43, 2–48, 3–157, 4–160.బౌలింగ్: ఆర్చర్ 10–0–60–1, టంగ్ 10–0–50–1, స్యామ్ కరన్ 10–0–55–1, రషీద్ 5.2–0–34–0, బెతెల్ 1–0–10–0, డాసన్ 2–0–10–0, జాక్స్ 7–0–43–0. -
భారత్తో తొలి వన్డే.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్తో రేపు (జులై 14) జరుగబోయే తొలి వన్డే (మూడు మ్యాచ్ల సిరీస్) కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) తమ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించింది. బ్యాటింగ్ విభాగంలో కీలక మార్పులు చేసిన ఆతిథ్య జట్టు, యువ ఆల్రౌండర్ జేకబ్ బెతెల్ను ఓపెనర్గా బరిలోకి దింపాలని నిర్ణయించింది.జేకబ్ బెతెల్, బెన్ డకెట్ ఇన్నింగ్స్ను ప్రారంభించనుండగా, అనుభవజ్ఞుడు జో రూట్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ నాలుగో స్థానంలో, జోస్ బట్లర్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయడంతో పాటు వికెట్ కీపర్గా వ్యవహరించనున్నాడు.బౌలింగ్ విభాగంలో సామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ పేస్ బాధ్యతలు చేపట్టనుండగా.. విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్ స్పిన్ విభాగాన్ని బలోపేతం చేయనున్నారు. భారత బ్యాటింగ్ బలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంగ్లండ్ ముగ్గురు స్పిన్నర్లతో సమతూక జట్టును రూపొందించింది.ఇటీవల టీ20 సిరీస్లో భారత్పై ఆధిపత్యం చెలాయించిన ఇంగ్లండ్, అదే జోరును వన్డేల్లోనూ కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ నాయకత్వంలో భారత్ విజయంతో సిరీస్ను ఆరంభించాలని భావిస్తోంది. రేపటి మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత తుది జట్టును ప్రకటించాల్సి ఉంది.ఇంగ్లండ్ ప్లేయింగ్ XI:జేకబ్ బెతెల్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కరన్, విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్. -
చారిత్రక విజయానికి అడుగు దూరంలో టీమిండియా
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు చారిత్రక విజయానికి చేరువైంది. రెండో ఇన్నింగ్స్ను 341/7 వద్ద డిక్లేర్ చేసిన భారత్, ఇంగ్లండ్కు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తీవ్ర ఒత్తిడికి లోనై 130 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది (మూడో రోజు ఆట ముగిసే సమయానికి). దీంతో భారత్ విజయానికి మరో నాలుగు వికెట్లు దూరంలో మాత్రమే ఉంది. చివరి రోజు ఆట మిగిలి ఉంది. ఇంగ్లండ్ ఇంకా 327 పరుగులు వెనుకపడి ఉంది. ఏమి జరిగినా ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవడం అసాధ్యం. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ను సయాలీ సత్ఘరే, క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా కలిసి దెబ్బ కొట్టారు. వీరు ముగ్గురు తలో 2 వికెట్లు తీశారు. ఆట ముగిసే సమయానికి యామీ జోన్స్ (52), సోఫీ ఎక్లెస్టోన్ (1) క్రీజ్లో ఉన్నారు.అంతకుముందు యస్తిక భాటియా (113) సూపర్ సెంచరీతో, ఆఖర్లో రిచా ఘోష్ (50 నాటౌట్) మెరుపు అర్ద శతకంతో చెలరేగడంతో భారత్ రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసింది. స్మృతి మంధాన (70) అర్ద సెంచరీతో సత్తా చాటింది. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ 5 వికెట్లతో రాణించింది.దీనికి ముందు క్రాంతి గౌడ్ (17-7-37-5) ధాటికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే ఆలౌటైంది. క్రాంతికి జతగా సయాలి సత్ఘరే (2-40), స్నేహ్ రాణా (2-41), దీప్తి శర్మ (1-10) కూడా రాణించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో యామీ జోన్స్ (52) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (44) ఓ మోస్తరు స్కోర్ చేసింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసింది. స్మృతి మంధాన (83), హర్మన్ప్రీత్ కౌర్ (58), దీప్తి శర్మ (57) అర్ద సెంచరీలతో రాణించారు.కాగా, భారత్-ఇంగ్లండ్ మధ్య లార్డ్స్లో జరుగతున్న తొలి మహిళల టెస్ట్ మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్లో ఐదు వికెట్ల ఘనత, సెంచరీ చేసి క్రాంతి గౌడ్, యస్తిక భాటియా ప్రతిష్ఠాత్మక లార్డ్స్ ఆనర్స్ బోర్డులో తమ పేర్లను చిరస్థాయిగా లిఖించుకున్నారు. లార్డ్స్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బౌలర్గా క్రాంతి.. తొలి సెంచరీ చేసిన బ్యాటర్ యస్తిక రికార్డు సృష్టించారు. -
భారత జట్టులోకి యార్కర్ల కింగ్.. ఎవరంటే?
ఇంగ్లండ్ వన్డేలతో పాటు జింబాబ్వే టూర్కు ఎంపిక చేసిన భారత జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హర్షిత్ రాణా తొడ కండరాల గాయం కారణంగా ఇంగ్లండ్తో వన్డేలకు దూరమయ్యాడు. అతడి స్ధానంలో ఢిల్లీ పేసర్ ప్రిన్స్ యాదవ్ను జట్టులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. గత నెలలో అఫ్గానిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్లో ప్రిన్స్ అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ సిరీస్లో ఆకట్టుకున్నప్పటికి, హర్షిత్ రాణా తిరిగి రావడంతో వన్డే జట్టులో చోటు కోల్పోయాడు. అయితే మళ్లీ ఇప్పడు హర్షిత్ గాయం బారిన పడడంతో ప్రిన్స్ మరోసారి వన్డేల్లో ఆడే అవకాశం లభించింది. ప్రిన్స్ కొత్త బంతితో పాటు డెత్ ఓవర్లలో అద్భుత బౌలింగ్ చేయగలడు. పిన్ పాయింట్ యార్కర్ల వేయడంలో దిట్ట. అందుకే అతడిని సెలక్టర్లు పరిగణలోకి తీసుకున్నారు.ఇక మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా తొడ కండరాల గాయం కారణంగా జింబాబ్వేలతో టీ20కు దూరమయ్యాడు. అతడి స్ధానాన్ని లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్తో భర్తీ చేశారు. ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైనప్పటికి బిష్ణోయ్కు సెలక్టర్లు మరో అవకాశమిచ్చారు. మంగళవారం నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.ఇంగ్లండ్ వన్డేలకు భారత జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ సింగ్ పటేల్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్,జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్జింబాబ్వే టీ20లకు భారత జట్టు: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ , శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్జ్, రింకు సింగ్, హర్ష్ దూబే, యాక్ షర్మా థావ్, ప్రిన్స్ షర్మా థావ్, ప్రిన్స్ యాదవ్, మే ప్రభసిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), రవి బిష్ణోయ్ -
'అతడు పేరుకే ఆల్రౌండర్.. చూస్తుంటే నవ్వొస్తుంది'
టీమిండియా ఆల్రౌండర్ శివమ్ దూబేపై బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మరోసారి విమర్శలు గుప్పించారు. వరుసగా విఫలమవుతున్నప్పటికి జట్టులో దూబేను కొనసాగించడాన్ని ఆయన తప్పుబట్టారు. కాగా ఆల్రౌండర్గా జట్టులో ఉన్న దూబే తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇంగ్లండ్ పిచ్లపై షార్ట్ బంతులను ఆడలేక అతడు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. శనివారం రోజ్బౌల్ వేదికగా జరిగిన ఐదో టీ20లో కూడా దూబే దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఒక ఓవర్ బౌలింగ్ చేసిన దూబే.. రెండు వికెట్లు పడగొట్టినప్పటికి ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు.బ్యాటింగ్లో కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన అతడు కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాకుండా ఫీల్డింగ్లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను దూబే జారవిడిచాడు. 3 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్న బ్రూక్ ఏకంగా 95 రన్స్ చేశాడు. దీంతో దూబే ఫీల్డింగ్ తీరుపై కూడా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు."శివమ్ దూబే ఉంటే మైదానంలో మనం మ్యాచ్లు గెలవడం కష్టమే. బంతి ఎటు వెళ్తుందో అంచనా వేయకుండా దాని చుట్టూ తిరుగుతుంటాడు. అతడు చాలా నెమ్మదిగా, అయోమయంగా ఉంటున్నాడు. ఐపీఎల్ అయినా, అంతర్జాతీయ క్రికెట్ అయినా అతను క్యాచ్లు వదిలేయడం అలవాటుగా మార్చుకున్నాడు. అసలు దూబే లాంటి ఆటగాడిని ఆల్రౌండర్ అనడమే ఒక జోక్. అతడిని ఇంటర్ననేషనల్ క్రికెటర్ అంటే నవ్వుస్తోంది. దూబే క్యాచ్ వదిలేయడం వల్లే ప్రిన్స్ యాదవ్ రిథమ్ దెబ్బతింది. దూబే ఆ క్యాచ్ పట్టుకుని ఉంటే, మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేదని" శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన జోస్ బట్లర్.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా -
చరిత్ర సృష్టించిన జోస్ బట్లర్.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా
టీమిండియాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 4-0 తేడాతో ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. సౌతాంప్టాన్ వేదికగా జరిగిన ఐదో టీ20లోనూ ఆతిథ్య ఇంగ్లండ్ అదరగొట్టింది. భారత్ను 56 పరుగుల తేడాతో బ్రూక్ సేన చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.గత కొన్నాళ్లగా పేలవ ఫామ్తో సతమవుతున్న బట్లర్.. ఈ మ్యాచ్లో మాత్రం భారత బౌలర్లను ఉతిరాకేశాడు. రోజ్బౌల్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. బట్లర్ కేవలం 64 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్స్లతో 131 పరుగులు చేశాడు. ఈ క్రమంలో బట్లర్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.బట్లర్ సాధించిన రికార్డులు ఇవే👉అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని అధిగమించి మూడో స్ధానానికి బట్లర్ చేరుకున్నాడు.👉108 పరుగల వ్యక్తిగత స్కోర్ వద్ద బట్లర్ ఈ ఫీట్ సాధించాడు. విరాట్ తన టీ20 కెరీర్లో 4,188 పరుగులు చేయగా.. బట్లర్ ఇప్పటివరకు 4,212 రన్స్ చేశాడు. ఈ జాబితాలో అగ్రస్ధానంలో బాబర్ ఆజం(4,596) ఉండగా, రెండో స్ధానంలో రోహిత్ శర్మ(4,231) కొనసాగుతున్నాడు.👉అంతర్జాతీయ టీ20ల్లో భారత్పై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్గా బట్లర్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు వెస్టిండీస్ స్టార్ ఓపెనర్ ఎవిన్ లూయిస్(125 నాటౌట్) పేరిట ఉండేది.👉తాజా మ్యాచ్తో లూయిస్ ఆల్టైమ్ రికార్డును జోస్ ది బాస్(131) బ్రేక్ చేశాడు. టీ20ల్లో బట్లర్కే ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. అదేవిధంగా ఇంగ్లండ్ తరపున అత్యధిక స్కోర్ సాధించిన రెండో బ్యాటర్గా బట్లర్ నిలిచాడు. తొలి స్దానంలో ఫిల్ సాల్ట్(141) ఉన్నాడు. -
బ్యాటింగ్, బౌలింగ్ కాదు.. టీమిండియా ప్రధాన సమస్య అదే
టీ20 ప్రపంచకప్-2026 ఛాంపియన్ టీమిండియా ప్రస్తుతం తమ పేలవ ఆట తీరుతో అభిమానులను తీవ్ర నిరాశపరుస్తోంది. యూకే పర్యటనలో భారత జట్టు వరుసగా ఐర్లాండ్, ఇంగ్లండ్లతో టీ20 సిరీస్లను కోల్పోయింది. కనీసం రోజ్బౌల్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఆఖరి టీ20లోనైనా గెలిచి టీమిండియా పరువు నిలబెట్టుకుంటుందని ఫ్యాన్స్ భావించారు. కానీ చివరి మ్యాచ్లో కూడా ఓటమి పాలై 4-0 తేడాతో సిరీస్ను ఇంగ్లండ్కు సమర్పించుకుంది. భారత్కు ఇది వరుసగా ఆరో ఓటమి కావడం గమనార్హం. ఈ టూర్ మొత్తం బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ మన జట్టు విఫలమైంది. అయితే బ్యాటింగ్, బౌలింగ్ పక్కన పెడితే.. ప్రస్తుతం టీమిండియాను ప్రధానంగా వేధిస్తున్న మరో సమస్య మరో సమస్య 'ఫీల్డింగ్ వైఫల్యం'.చెత్త ఫీల్డింగ్ కారణంగా భారత్ ఘోర ఓటములను మూటకట్టుకోవాల్సి వస్తోంది. రోజ్బౌల్ వేదికగా జరిగిన ఐదో టీ20లోనూ భారత ఫీల్డింగ్ వైఫల్యం బయటపడింది. శివమ్ దూబే వదిలేసిన సునాయస క్యాచ్.. టీమిండియా ఓటమిని శాసించిందే అనే చెప్పాలి.కొంపముంచిన దూబేటాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు ఓపెనర్ ఫిల్ సాల్ట్ను అవుట్ చేసి ప్రసిద్ద్ కృష్ణ ఆరంభంలోనే షాకిచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హ్యారీ బ్రూక్ తన ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆరో ఓవర్లో ప్రిన్స్ యాదవ్ ఆఫ్ స్టంప్నకు వెలుపల ఒక షార్ట్ పిచ్ డెలివరీని సంధించాడు. ఆ డెలివరీని బ్రూక్ స్క్వేర్ లెగ్' వైపు పుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు.కానీ బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని 'థర్డ్ మ్యాన్' దిశగా గాల్లోకి లేచింది. అయితే ఇన్ఫీల్డ్ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిన దూబే ఆ క్యాచ్ను అందుకుంటాడని అంతా భావించారు. కానీ బంతి గమనాన్ని అంచనా వేయడంలో దూబే పూర్తిగా విఫలమయ్యాడు. బంతిని దాటి ముందుకు వెళ్లిపోయాడు. కనీసం బంతి అతడి చేతికి కూడా తాకలేదు. దీంతో లడ్డూలాంటి క్యాచ్ నేలపాలైంది ఇందుకు భారత్ భారీ మూల్యం చెల్లించుకుంది. 3 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న బ్రూక్.. ఆ తర్వాత భారత బౌలర్లను ఉతికారేశాడు.కేవలం 46 బంతుల్లోనే 95 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బట్లర్తో కలిసి రెండో వికెట్కు ఏకంగా 233 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని హ్యరీ నెలకొల్పాడు. ఒకవేళ ఆ క్యాచ్ను దూబే అందుకుని ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. ఈ సిరీస్ మొత్తంగా భారత్ మొత్తంగా 5 క్యాచ్లు డ్రాప్ చేసింది.చెత్త రికార్డుఈ ఒక్క సిరీస్లో మాత్రమే కాదు గత కొన్నాళ్లగా భారత ఫీల్డింగ్ ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. టీ20 ప్రపంచకప్-2026 నుంచి టీమిండియా ఫీల్డర్లు దాదాపుగా ప్రతీ మ్యాచ్లోనూ క్యాచ్లను జారవిడుస్తున్నారు. ప్రస్తుతం అత్యంత చెత్త క్యాచ్ రికార్డు ఉన్న జట్లలో బంగ్లాదేశ్, ఐర్లాండ్ తర్వాత భారత్ మూడో స్థానంలో నిలిచింది.టీ20 ప్రపంచకప్లో అయితే మెన్ ఇన్ బ్లూ ఏకంగా 13 క్యాచ్లను నేలపాలు చేసింది. వీలైనంత త్వరగా భారత జట్టును తమ ఫీల్డింగ్ను మెరుగుపరుచుకోపోతే మరిన్ని ఓటములను చవిచూడాల్సి వస్తోంది. ఇంగ్లండ్ టూర్ తర్వాత భారత ఫీల్డింగ్ కోచ్ పదవి నుంచి టి. దిలీప్ తప్పుకోనున్నట్లు సమాచారం. -
వైభవ్కు క్లాస్పీకిన గౌతమ్ గంభీర్
భారీ అంచనాలతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఇంగ్లండ్ పర్యటన చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ సిరీస్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన వైభవ్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. 15 ఏళ్ల వైభవ్.. షార్ట్ పిచ్ బంతులను ఆడలేక ఇబ్బందిపడుతున్నాడు. తన అరంగేట్ర మ్యాచ్లో స్టంపౌట్గా వెనుదిరిగిన వైభవ్.. తర్వాతి రెండు మ్యాచ్లలోనూ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో దొరికిపోయాడు. మొత్తంగా మూడు మ్యాచ్లలో కలిపి సూర్యవంశీ కేవలం 42 పరుగులు చేశాడు. అయితే వరుస మ్యాచ్ల్లోనూ విఫలమైనందుకు గాను వైభవ్కు.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ క్లాస్ తీసుకున్నట్లు 'రేస్పోర్ట్స్' తమ కథనంలో పేర్కొంది. కాగా నాలుగో టీ20 అనంతరం గంభీర్, బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్లు కలిసి తొలుత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో ఏదో విషయం తీవ్రంగా చర్చించారు. ఆ తర్వాత శ్రేయస్ పోస్ట్-మ్యాచ్ ప్రెజెంటేషన్కు వెళ్లడంతో, గంభీర్ సూర్యవంశీతో మాట్లాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు ఐదో టీ20 శనివారం రోజ్బౌల్ వేదికగా జరగనుంది. ఇప్పటికే సిరీస్ను కోల్పోయిన టీమిండియా.. కనీసం చివరి మ్యాచ్లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.చదవండి: ENG vs IND: 'అతడు భయపడుతున్నాడు.. జట్టు నుంచి తీసేయండి' -
భారత జట్టులో కీలక మార్పులు!.. తిలక్కు నో ఛాన్స్?
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఓటముల పరంపర కొనసాగుతోంది. గురువారం బ్రిస్టల్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో భారత జట్టు 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో శ్రేయస్ సేన కోల్పోయింది. ఇది భారత్కు వరుసగా రెండో సిరీస్ ఓటమి. అంతకుముందు ఐర్లాండ్తో జరిగిన సిరీస్లో మెన్ ఇన్ బ్లూ క్లీన్ స్వీప్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆఖరి టీ20 సౌతాంప్టన్ వేదికగా శనివారం జరగనుంది. కనీసం చివరి మ్యాచ్లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్లో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.సంజూ ఇన్.. వైభవ్కు మరో ఛాన్స్?గత మూడు మ్యాచ్లకు బెంచ్కే పరిమితమైన స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ను తిరిగి తుది జట్టులోకి తీసుకోవాలని మేనెజ్మెంట్ భావిస్తోంది. అయితే సంజూ స్ధానంలో ఎంట్రీ ఇచ్చిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని కూడా ప్లేయింగ్ ఎలెవన్లో కొనసాగించాలని గంభీర్ అండ్ కో భావిస్తుందంట.వరుసగా మూడు మ్యాచ్ల్లో విఫలమైనప్పటికి, వైభవ్కు మేనేజ్మెంట్ మరో ఛాన్స్ ఇవ్వాలని చూస్తోంది. అయితే సంజూ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసే అవకాశముంది. వరుసగా విఫలమవుతున్న వైస్ కెప్టెన్ తిలక్ వర్మను తుది జట్టు నుంచి తప్పించనున్నట్లు సమాచారం. అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ను కూడా పక్కన పెట్టనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. చివరి మ్యాచ్లో ఆల్రౌండర్ సూర్యన్ష్ షెడ్గేకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.ఐదో టీ20కు భారత తుది జట్టు(అంచనా)వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ -
'అతడు భయపడుతున్నాడు.. జట్టు నుంచి తీసేయండి'
బ్రిస్టల్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో భారత్ ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో కోల్పోయింది. అయితే ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(80 నాటౌట్) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణ ప్రదర్శన కనబరిచారు.పవర్ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయినప్పటికి మిడిల్ ఓవర్లలో అయ్యర్ మెరుపులు మెరిపించడంతో భారత్ భారీ స్కోర్ సాధిస్తుందని అంతా భావించారు. కానీ మిగితా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. ముఖ్యంగా ఆల్రౌండర్ శివమ్ దూబే అయితే గల్లీ క్రికెటర్ కంటే దారుణంగా ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లు వేసిన షార్ట్ పిచ్ బంతులకు దూబే ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. 23 బంతులు ఎదుర్కొని కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో దూబేపై భారత మాజీ ఓపెనర్ క్రిష్ణమచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. అతడి జిడ్డు బ్యాటింగ్ కారణంగానే భారత్ ఆఖరిలో పరుగులు సాధించలేకపోయిందని అతడు మండిపడ్డాడు.ఇంగ్లండ్ పిచ్లపై ఆడేందుకు దూబే భయపడుతున్నట్లు అనిపిస్తుంది. తొందరగా అవుట్ అయ్యి పెవిలియన్కు వెళ్లిపోవాలన్నట్లగా అతడు బ్యాటింగ్ చేశాడు. అతడి ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం తీవ్రంగా ఇబ్బందిపడుతున్న బ్యాటర్లలో దూబే ఒకడు. ఒకటో రెండు సిక్స్లు కొట్టి అవుట్ అవుతున్నాడు. ఈ మ్యాచ్లో అయితే మరి చెత్తగా ఆడాడు. అతడు బౌలింగ్ కూడా ఎక్కువగా చేయడం లేదు. నేనే గనుక సెలక్షన్ కమిటీలో భాగంగా ఉంటే దూబేను పక్కనపెట్టి అతడి స్థానంలో కేఎల్ రాహుల్ను తీసుకొస్తాను అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లలో పేర్కొన్నాడు. -
ఐపీఎల్లో హీరో.. అక్కడ మాత్రం జీరో
యూకే పర్యటనలో భారత జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీమిండియా.. ఇప్పుడు ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో కోల్పోయింది. తొలి టీ20 వర్షార్పణం కాగా, తర్వాత వరుసగా మూడు మ్యాచ్లలో ఓటమి పాలై సిరీస్ను ఇంగ్లండ్కు అప్పగించింది.ఐపీఎల్లో కెప్టెన్గా విజయవంతమైన శ్రేయస్ అయ్యర్.. అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం తన మార్క్ చూపించలేకపోతున్నాడు. తొలి విజయం కోసం అతడు అతృతగా ఎదురు చూస్తున్నాడు. అతడి సారథ్యంలో భారత్ వరుసగా ఐదు మ్యాచ్లలో ఓటమి పాలై రెండు సిరీస్లను కోల్పోయింది.ఇక యూకే టూర్లో భారత బ్యాటింగ్ విభాగం దారుణంగా విఫలమైంది. కెప్టెన్ శ్రేయస్, అభిషేక్ శర్మ మినహా మిగితా బ్యాటర్లంతా పూర్తిగా తేలిపోయారు. టీ20 ప్రపంచకప్-2026 హీరో సంజూ శాంసన్ కూడా ఈ పర్యటనలో నిరాశపరిచాడు.మూడు మ్యాచ్లలో సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితం కావడంతో సంజూను తుది జట్టు నుంచి తప్పించారు. అతడి స్ధానంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశమిచ్చారు. కానీ భారీ అంచనాలతో అంతర్జాతీయ కెరీర్ను మొదలు పెట్టిన వైభవ్.. తన మొదటి మూడు మ్యాచ్లలో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. మూడు మ్యాచ్లు కలిపి కేవలం 42 పరుగులు మాత్రమే చేశాడు.కిషన్కు ఏమైంది?మరోవైపు వరల్డ్ నంబర్ టీ20 బ్యాటర్ ఇషాన్ కిషన్ సైతం దారుణంగా విఫలమయ్యాడు. టీ20 ప్రపంచకప్తో పాటు ఐపీఎల్లో దుమ్ములేపిన కిషన్.. ఆ ఫామ్ను యూకే పర్యటనలో మాత్రం కొనసాగించలేకపోయాడు. ఒకేరకమైన బంతులకు పదే పదే అవుట్ అవుతూ నిరాశపరుస్తున్నాడు. గత 6 ఇన్నింగ్స్ల్లో ఈ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేవలం 79 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అతని యావరేజ్ 13.2 కాగా, స్ట్రైక్ రేట్ 108.2 మాత్రమే. సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీల గురించిన చర్చల నడుమ.. కిషన్ వైఫల్యాలు అంతగా హైలెట్ కాలేదు.కానీ కీలకమైన మూడో స్ధానంలో బ్యాటింగ్ వచ్చి తన చెత్త ప్రదర్శనతో కిషన్ భారత ఓటమికి ఓ కారణమయ్యాడు. వైస్ కెప్టెన్ తిలక్ వర్మ కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. తన స్లో బ్యాటింగ్తో మాజీ క్రికెటర్లకు టార్గెట్ అవుతున్నాడు.కాగా భారత్లో ఫ్లాట్ పిచ్లకు అలవాటు పడడం కారణంగానే విదేశీ పరిస్థితులపై మన బ్యాటర్ల రాణించలేకపోతున్నారన్న విమర్శలు వస్తుస్తున్నాయి. ఇంగ్లండ్ పిచ్లపై ఉండే అదనపు బౌన్స్, మూవ్మెంట్ను అంచనా వేయడంలో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమవుతున్నారు.తొలి టీ20 నుంచే షార్ట్ పిచ్ బంతులకు వికెట్లు సమర్పించుకుంటున్నారు. కనీసం చివరి టీ20లోనైనా గెలిచి పరువు కాపాడుకుంటారో లేదో చూడాలి. ఐదో టీ20 శనివారం సౌతాంప్టన్ వేదికగా జరగనుంది. -
నాలుగో టీ20 మ్యాచ్లో భారత్పై ఇంగ్లండ్ విజయం
బ్రిస్టల్ వేదికగా జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్లో భారత్పై ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నిర్ణీత 159 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి ఇంకా 37 బంతులు మిగిలి ఉండగానే సాధించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టంతో 158 పరుగులు చేసింది.ఇంగ్లండ్ బ్యాటర్లు ఫిలిప్ సాల్ట్ 59, హ్యారీ బ్రూక్ 79 పరుగులతో నాటౌట్గా నిలిచారు. ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అజేయ ఇన్నింగ్స్తో తమ జట్టుకు విజయాన్ని అందించాడు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ ఒక వికెట్ పడగొట్టాడు. 3.5 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్షదీప్ సింగ్ 41 పరుగులు ఇచ్చాడు.భారత జట్టు బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వైభవ్ సూర్యవంశీ(15), అభిషేక్ శర్మ(16), ఇషాన్ కిషన్(4) వంటి టాపార్డర్ బ్యాటర్లు విఫలమైన చోట.. ఇంగ్లండ్ బౌలర్లకు శ్రేయస్ చుక్కలు చూపించాడు. తన ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన శ్రేయస్, క్రీజులో సెటిల్ అయ్యాక బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. 49 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు శివమ్ దూబే(22) పర్వాలేదన్పించాడు.సిరీస్ ఇంగ్లండ్ కైవసం5 మ్యాచ్ల టీ20 సిరీస్ను ఇంగ్లండ్ ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచుల్లో మూడు మ్యాచ్లను ఇంగ్లండ్ గెలిచింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. భారత్ ఒక్క మ్యాచ్నూ గెలవలేదు. ఇక ఆఖరి మ్యాచ్ సౌతాంప్టన్ వేదికగా జూలై 11న జరగనుంది. -
శ్రేయస్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?
బ్రిస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వైభవ్ సూర్యవంశీ(15), అభిషేక్ శర్మ(16), ఇషాన్ కిషన్(4) వంటి టాపార్డర్ బ్యాటర్లు విఫలమైన చోట.. ఇంగ్లండ్ బౌలర్లకు శ్రేయస్ చుక్కలు చూపించాడు. తన ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన శ్రేయస్, క్రీజులో సెటిల్ అయ్యాక బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. ఓ వైపు క్రమం తప్పకొండా వికెట్లు పడుతున్నప్పటికి, అయ్యర్ తన దూకుడును కొనసాగించాడు. 49 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు శివమ్ దూబే(22) పర్వాలేదన్పించాడు. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగుల స్కోర్ సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. విల్ జాక్స్, అదిల్ రషీద్ చెరో వికెట్ సాధించారు. -
వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాప్
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వరుసగా మూడో మ్యాచ్లోనూ నిరాశపరిచాడు. బ్రిస్టల్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టీ20లో వైభవ్ మరోసారి నామమాత్రపు స్కోర్కే పరిమితమయ్యాడు. రెండో టీ20 మాదిరే షార్ట్ పిచ్ డెలివరీకి వైభవ్ దొరికిపోయాడు.తొలి ఓవర్లో జోఫ్రా ఆర్చర్ను ఆచితూచి ఆడిన వైభవ్.. రెండో ఓవర్ వేసిన జోష్ టంగ్ బౌలింగ్లో వరుసగా ఫోర్, సిక్స్ బాది తన రిథమ్ను అందుకున్నాడు. కానీ తర్వాత ఓవర్లో ఆర్చర్ వేసిన షార్ట్ లెంగ్త్ బంతికి భారీ షాట్ ఆడబోయి వైభవ్ ఔటయ్యాడు.షార్ట్ లెంగ్త్ బంతిని 'పుల్' షాట్ ఆడేందుకు సూర్యవంశీ ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. మిడ్-ఆన్ వద్ద ఉన్న సామ్ కుర్రాన్ సునాయస క్యాచ్ను అందుకున్నాడు. దీంతో 10 బంతుల్లో ఒక ఫోర్, సిక్స్తో కేవలం 15 పరుగులు చేసి వైభవ్ ఔటయ్యాడు.వైభవ్ గత రెండు మ్యాచ్లలో 14, 13 స్కోర్లను నమోదు చేశాడు. మొత్తంగా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో మొదటి మూడు మ్యాచ్లలో 42 పరుగులు చేశాడు. కాగా వైభవ్కు ఛాన్స్ ఇవ్వడం కోసం స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ను సైతం పక్కన పెట్టారు. కానీ వైభవ్ మాత్రం తన లభించిన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నాడు.Similar type of dismissals ☠️Weakness of Vaibhav Sooryavanshi which the bowlers have started exploiting....Need to work on this in the coming days else it will be difficult...#ENGvsIND pic.twitter.com/uDkthonNnB— Wanderer (@vkyash18oz) July 9, 2026 -
ఇంగ్లండ్తో నాలుగో టీ20.. బ్యాటింగ్ భారత్దే
బ్రిస్టల్ వేదికగా నాలుగో టీ20లో ఇంగ్లండ్-భారత్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్కు భారత ప్లేయర్లు హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి దూరమయ్యారు. వారిద్దరి స్ధానంలో వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ద్ కృష్ణ తుది జట్టులోకి వచ్చారు. కాగా మరోసారి సంజూ శాంసన్కు నిరాశే ఎదురైంది. వైభవ్ సూర్యవంశీని తుది జట్టులో కొనసాగించారు. ఇక ఇంగ్లండ్ కూడా ఓ మార్పుతో బరిలోకి దిగింది. లియామ్ డాసన్ స్ధానంలో రెహాన్ అహ్మద్ ప్లేయింగ్ ఎలెవన్లోకి వచ్చాడు.తుది జట్లుఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్భారత్: అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ -
టీమిండియాకు చుక్కలు చూపించాడు.. కట్ చేస్తే! భారీ రివార్డ్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) తాజాగా ప్రకటించిన బ్యాటర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దుమ్ములేపాడు. ఇంగ్లండ్ టూర్లో శ్రేయస్ కెప్టెన్గా విఫలమైనప్పటికి బ్యాటర్గా మాత్రం రాణించాడు. ఈ సిరీస్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన అయ్యర్.. 150.68 స్ట్రైక్ రేట్తో 110 పరుగులు చేశాడు.ఈ ప్రదర్శన కారణంగా శ్రేయస్ బ్యాటర్ల ర్యాంకింగ్స్లో ఏకంగా 425 స్థానాలు ఎగబాకి 93వ స్థానానికి చేరుకున్నాడు. ఇక ఇంగ్లండ్ యువ సంచలనం జాకబ్ బెథల్ తొలిసారి టాప్-10 లోకి దూసుకొచ్చాడు. బెథల్.. మార్ష్, బ్రెవిస్ వంటి స్టార్ క్రికెటర్లను వెనక్కి నెట్టి 8వ స్ధానానికి చేరుకున్నాడు. కాగా మాంచెస్టర్ టీ20లో బెథల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 191 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్లు ఇద్దరూ డకౌట్ అయినా.. బెథెల్ మాత్రం 46 బంతుల్లో 76 పరుగులు చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఇందుకు ఫలితంగా ర్యాంకింగ్స్లో బెథల్కు భారీ రివార్డు లభించింది. తొలి రెండు స్ధానాల్లో భారత ఆటగాళ్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలు కొనసాగుతున్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆదిల్ రషీద్, సామ్ కరన్ తమ స్ధానాలను మెరుగుపరుచుకున్నారు. భారత్పై ఇప్పటివరకు 3 వికెట్లు పడగొట్టిన రషీద్, ఒక స్థానం ఎగబాకి 3వ స్థానానికి చేరుకున్నాడు. సామ్ కరన్ బౌలింగ్ జాబితాలో 71 స్ధానం, ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో 13వ స్ధానం సొంతం చేసుకున్నాడు. ఆల్రౌండర్ల జాబితాలో భారత ఆటగాడు శివమ్ దూబే టాప్-10 నుంచి బయటకు వెళ్లిపోయాడు.చదవండి: IND vs ENG: సూర్యకుమార్ గుర్తొస్తున్నాడు -
IND vs ENG: సూర్యకుమార్ గుర్తొస్తున్నాడు
దేశం మారిన టీమిండియా ఆట తీరు మాత్రం మారలేదు. పసికూన ఐర్లాండ్ చేతిలో క్లీన్స్వీప్ అయిన భారత జట్టు.. ఇప్పుడు ఇంగ్లండ్ గడ్డపై కూడా అదే పరాభవం దిశగా కొనసాగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్లో భారత్ 2-0 తేడాతో వెనుకబడి ఉంది.వరుసగా రెండు టీ20 ప్రపంచకప్లలో అద్భుతాలు చేసిన టీమిండియా.. యూకే పర్యటనలో మాత్రం తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. మన జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమై ఘోర పరాజయాలను మూట కట్టుకుంది. ఒకప్పుడు వరుస దైపాక్షిక సిరీస్లను సొంతం చేసుకున్న భారత్.. ఇప్పుడు అదే వరుసగా ఓటములు చవిచూడడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కెప్టెన్సీ మార్పు కారణంగానే టీమిండియాకు ఈ పరిస్థితి ఏర్పడందని సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెడుతున్నారు. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఉండి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఐర్లాండ్ టూర్కు ముందు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్గా టీ20 ప్రపంచకప్ను భారత్కు అందించి మూడు నెలల తిరగకముందే సూర్యకుమార్ యాదవ్పై వేటు వేశారు. కెప్టెన్గానే కాకుండా పూర్తిగా జట్టు నుంచే తప్పించారు. పేలవ ఫామ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సందర్భంగా చీఫ్ సెలక్టర్ అగార్కర్ కానీ స్పష్టం చేశాడు.అతడి స్ధానంలో మరో ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్కు అప్పగించారు. దాదాపు రెండేళ్లగా భారత టీ20 జట్టులోనే లేని అయ్యర్ను తీసుకొచ్చి కెప్టెన్గా చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. భారత జట్టును అద్భుతంగా నడిపించిన సూర్యను పక్కన పెట్టడాన్ని చాలా మంది తప్పుపట్టారు. కానీ అయ్యర్ కూడా సూర్యలానే జట్టును విజయ పథంలో నడిపిస్తాడని టీమ్ మేనెజ్మెంట్తో పాటు బీసీసీఐ కూడా నమ్మింది. కానీ వారి నమ్మకాన్ని శ్రేయస్ వమ్ము చేశాడు.అక్కడ సక్సెస్.. ఇక్కడ ఫ్లాప్ఐపీఎల్లో సక్సెస్ఫుల్ కెప్టెన్గా పేరు సంపాదించిన శ్రేయస్ అయ్యర్.. టీమిండియా సారథిగా మాత్రం తన మార్క్ చూపించలేకపోతున్నాడు. భారత కెప్టెన్గా తొలి విజయం కోసం అయ్యర్ ఎదురు చూస్తున్నాడు. అతడి నాయకత్వంలో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో అన్నింటిలోనూ భారత్ ఓటమి పాలైంది. అతడి కెప్టెన్సీలోనే తొలిసారి ఐర్లాండ్తో సిరీస్ కోల్పోయి భారత్ ఘోర పరభావాన్ని మూటకట్టుకుంది. ఇప్పుడు ఇంగ్లండ్తో జరిగిన మూడో టీ20లో 76 పరుగులకే కుప్పకూలి మరో చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. కెప్టెన్గా సరైన నిర్ణయాలు తీసుకోవడంలో శ్రేయస్ విఫలమవుతున్నాడు. మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20లో డెత్ ఓవర్లో స్పిన్నర్తో బౌలింగ్ చేయించి.. భారత ఓటమికి కారణమయ్యాడు. దీంతో అయ్యర్ కెప్టెన్సీపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. కెప్టెన్గా శ్రేయస్ కంటే సూర్య ఎంతో బెటర్ అన్న వాదనలు వినిపిస్తున్నాయి.సలాం సూర్య భాయ్!నిజంగానే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ రికార్డు అద్భుతంగా ఉంది. అతడి కెప్టెన్సీలో 52 టీ20లు టీమిండియా.. 42 మ్యాచ్లలో విజయం సాధించింది. అంతేకాకుండా అతడి సారథ్యంలోనే భారత్ ఆసియా కప్ (2025)తో పాటు 2026 టీ20 ప్రపంచకప్ టైటిల్ను కూడా సొంతం చేసుకుంది. సూర్యకుమార్ కెప్టెన్సీ కాలంలో టీమిండియా ఒక్క అంతర్జాతీయ టీ20 సిరీస్ను కూడా కోల్పోలేదు. ఆడిన 8 ద్వైపాక్షిక సిరీస్లను క్లీన్ స్వీప్ లేదా విజయంతో ముగించింది. -
'కెరీర్ నాశనం చేసుకుంటున్నావు.. అతడిని చూసి నేర్చుకో'
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ తన టీ20 కెరీర్లో అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నాడు. టీ20 ప్రపంచకప్-2026లో ప్లేయర్ ఆఫ్ది టోర్నమెంట్గా నిలిచిన సంజూ.. ఇప్పుడు నెలల వ్యవధిలోనే జట్టులో చోటు కోల్పోవడం తీవ్ర చర్చానీయంశమైంది. కేవలం మూడు మ్యాచ్లలో విఫలమైనందున అతడిని జట్టు నుంచి తప్పించారు. ఐపీఎల్-2026లో దుమ్ములేపి ఐర్లాండ్ పర్యటనకు వచ్చిన సంజా.. అక్కడ మాత్రం తన జోరును కొనసాగించలేకపోయాడు. ఐర్లాండ్తో జరిగిన రెండు మ్యాచ్లలోనూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. ఆ తర్వాత ఇంగ్లండ్తో తొలి టీ20లో కూడా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ను పక్కన పెట్టి.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకొచ్చారు. రెండు, మూడు టీ20ల్లో సంజూ బెంచ్కే పరిమితమయ్యాడు. అంతేకాకుండా జింబాబ్వేతో సిరీస్కు ఏకంగా ప్రధాన జట్టు నుంచే సంజూను తప్పించారు. సీనియర్ బ్యాటర్లంతా జట్టులో ఉన్నప్పటికి సంజూ ఒక్కడే పేరే లేకపోవడం అందరిని ఆశ్యర్యపరిచింది. కావాలనే సంజూను పక్కన పెట్టారని అభిమానులు సెలక్టర్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫిట్నెస్ సమస్యల పరంగా సంజూను జట్టు నుంచి తప్పించిండొచ్చు అని అతడు అభిప్రాయపడ్డాడు."ఫిట్నెస్ లోపం వల్లే సంజూ శాంసన్ను జట్టు నుంచి తప్పించారని అనుకుంటున్నాను. ఒకవేళ అదే కారణమైతే, సెలక్టర్లు, టీమ్ మేనెజ్మెంట్ తీసుకున్నది సరైన నిర్ణయమే అని చెప్పాలి. అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ, శారీరక దృఢత్వం లోపం వల్ల శాంసన్ తన కెరీర్ను నాశనం చేసుకుంటున్నాడు. ఈ దశలో అతను విరాట్ కోహ్లిని రోల్ మోడల్గా తీసుకుని ఫిట్నెస్పై దృష్టి పెట్టాలని" ఎక్స్ వేదికగా మంజ్రేకర్ రాసుకొచ్చాడు. కాగా సంజూకు అయితే ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేవు. కేవలం ఫామ్ కారణంగా పక్కన పెట్టామని హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ మూడో టీ20 అనంతరం స్పష్టం చేశాడు. అయితే జింబాబ్వే టూర్కు ఎంపిక కానప్పటికి ఆసియా క్రీడలకు వెళ్లే భారత జట్టులో మాత్రం శాంసన్ చోటు దక్కించుకున్నాడు. -
టాస్ గెలిచిన టీమిండియా.. శ్రేయస్ అరుదైన ఫీట్
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రెండో టీ20లో ఓటమి పాలైన భారత్ ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ను 1-1తో సమం చేయాలని భావిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం విజయం సాధించి ఆధిక్యంలో నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ మ్యాచ్కు టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగింది. రవి బిష్ణోయి స్థానంలో ప్రిన్స్ యాదవ్ తుదిజట్టులోకి రాగా.. ఇంగ్లండ్ జట్టు ఎలాంటి మార్పులు చేయలేదు. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా, రెండో టీ20లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో భారత్పై విజయాన్ని అందుకుంది.అయితే మ్యాచ్ ఆరంభానికి ముందే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ఫీట్ సాధించాడు. భారత టీ20 కెప్టెన్గా అయ్యర్ టాస్ గెలవడం ఇది ఐదోసారి. ఈ నేపథ్యంలో అంతర్ర్జాతీయ టీ20 క్రికెట్లో టీమిండియా కెప్టెన్లలో అత్యధికసార్లు టాస్ నెగ్గిన జాబితాలో శ్రేయస్ అయ్యర్ రోహిత్ శర్మ, ధోనిలతో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. వీరికంటే ముందు ఎంఎస్ ధోని ఏడుసార్లు (మే 2010 నుంచి ఫిబ్రవరి 2012 వరకు), విరాట్ కోహ్లి ఆరుసార్లు (ఆగస్టు 2019 నుంచి డిసెంబర్ 2019 వరకు), తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్భారత్: అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శివమ్ దూబే, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి🚨 Toss 🚨#TeamIndia have won the toss and elected to bowl first at Trent Bridge.Updates ▶️ https://t.co/jan4S8zsaV#ENGvIND pic.twitter.com/ptcxBFxRP5— BCCI (@BCCI) July 7, 2026చదవండి: సెమీస్కు దూసుకెళ్లిన గాఫ్.. పిన్న వయస్కురాలిగా చరిత్ర -
మూడో టీ20కు ముందు వైభవ్కు గాయం
ఇంగ్లండ్తో మూడో టీ20కి ముందు భారత్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ స్వల్పంగా గాయపడ్డాడు. అయితే ఈ విషయమై ఎలాంటి ఆందోళన అవసరం లేదని మేనేజ్మెంట్ వర్గాలు వివరణ ఇచ్చాయి. నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్లో వైభవ్ నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, త్రో-డౌన్ స్పెషలిస్ట్ విసిరిన బంతి అతడి ఛాతిపై బలంగా తాకింది. దీంతో అతడు వెంటనే నెట్స్ నుంచి బయటకు వచ్చాడు. జట్టు వైద్యుడు పరీక్షించిన అనంతరం కొద్దిసేపటికే మళ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. దీంతో అతడికి ఎలాంటి తీవ్రమైన గాయం లేదని స్పష్టమైంది. ఈ ఘటన తర్వాత భారత శిబిరంలో ఆందోళన నెలకొన్నప్పటికీ, వైభవ్ మళ్లీ నెట్స్లోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.కాగా, నాటింగ్హమ్ వేదికగా ఇవాళ రాత్రి 10 గంటలకు (భారతకాలమానం ప్రకారం) ప్రారంభమయ్యే మూడో టీ20లో వైభవ్ ఓపెనర్గా బరిలోకి దిగడం ఖాయమే. జులై 4న జరిగిన రెండో టీ20తో టీమిండియా అరంగేట్రం చేసిన ఈ చిచ్చరపిడుగు, ఆ మ్యాచ్లో మంచి షాట్లు (10 బంతుల్లో 14; 2 సిక్సర్లు) ఆడినప్పటికీ భారీ స్కోర్ చేయలేకపోయాడు.దీంతో నేటి మ్యాచ్లో వైభవ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పై ఈ సిరీస్లో భారత్ 0-1తో వెనుకపడి ఉంది. ఈ పరిస్థితుల్లో వైభవ్ ఓ మెరుపు ఇన్నింగ్స్ ఆడితే టీమిండియా సిరీస్లో కుదురుకోవచ్చు.ఈ సిరీస్లో తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొంది 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. వాస్తవానికి రెండో టీ20లో టీమిండియానే గెలవాల్సి ఉండింది. అయితే కీలక దశలో రవి భిష్ణోయ్ ఓ ఖరీదైన ఓవర్ వేసి టీమిండియా కొంపముంచాడు. ఈ మ్యాచ్లో ఓటమి తర్వాత అభిమానులు భిష్ణోయ్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ చెత్త ప్రదర్శన తర్వాత భిష్ణోయ్ నేటి మ్యాచ్లో ఆడటం దాదాపుగా అసాధ్యమే. -
టీమిండియాలోకి విధ్వంసకర వీరుడు.. రెండేళ్ల తర్వాత రీఎంట్రీ
ముంబై స్టార్ ఆల్రౌండర్ శివమ్ దూబే దాదాపు రెండేళ్ల తర్వాత భారత వన్డే జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు గాయం కారణంగా దూరమైన ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి స్ధానాన్ని దూబేతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ భర్తీ చేసింది. టీ20 జట్టులో కీలక సభ్యునిగా ఉన్న దూబే.. వన్డేల్లో మాత్రం భారత్ తరపున 2024 ఆగస్టులో ఆడాడు. అప్పటి నుంచి కేవలం వన్డేలకు మాత్రమే దూబే పరిమితమయ్యాడు. కానీ ఇప్పుడు నితీశ్కు గాయం కావడంతో ఈ సీఎస్కే విధ్వంసకర వీరుడికి వన్డేల్లో పునరాగనమం చేసే అవకాశం లభించింది. నితీష్ కుమార్ రెడ్డి ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. అతడు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పొందుతున్నాడు. దీంతో అతడు ఇంగ్లండ్తో వన్డే సిరీస్తో పాటు జూలై 23 నుంచి ప్రారంభం కాబోయే జింబాబ్వే టీ20 సిరీస్కు కూడా దూరమయ్యాడు.ఇంగ్లండ్తో వన్డేలకు భారత జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కె.ఎల్. రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, శివమ్ దూబే.సంజూపై వేటుకాగా జింబాబ్వేతో టీ20 సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్పై సెలక్టర్లు వేటు వేశారు. అతడి స్ధానంలో పంజాబ్ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ను ఎంపిక చేశారు. అదేవిధంగా వైభవ్ సూర్యవంశీని కూడా కొనసాగించారు. ఇంగ్లండ్ సిరీస్లో ఆడుతున్న అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణలకు విశ్రాంతినిచ్చారు. అశోక్ శర్మ, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్లు జట్టులోకి రాగా, ఫినిషర్ రింకూ సింగ్ తిరిగి జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.జింబాబ్వేతో టీ20కు భారత జట్టుశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ప్రభ్సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్. -
వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్..!
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఒక్క మ్యాచ్కే పక్కన పెట్టనున్నారా? అంటే అవునానే క్రికెట్ వర్గాలు. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో వైభవ్ అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. భారత్ తరపున డెబ్యూ చేసిన అతి పిన్నవయష్కుడిగా చరిత్రను తిరగరాసిన సూర్యవంశీ.. తన మొదటి మ్యాచ్లో మాత్రం విఫలమయ్యాడు. సీనియర్ బ్యాటర్ సంజూ శాంసన్ స్ధానంలో తుది జట్టులోకి వచ్చిన వైభవ్, తన మార్క్ను చూపించలేకపోయాడు. 10 బంతులు ఎదుర్కొని కేవలం 14 పరుగులు చేసి నిరాశపరిచాడు. దీంతో శాంసన్ను తిరిగి ప్లేయింగ్ ఎలెవన్లోకి తీసుకు రావాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అండ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే మూడో టీ20లో భారత్ కచ్చితంగా గెలవాల్సిందే. ప్రస్తుతం ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. దీంతో కీలకమైన మూడో టీ20లో శాంసన్ తిరిగి ఆడనున్నట్లు సమాచారం.టీ20 ప్రపంచకప్-2026లో ప్లేయర్ ఆఫ్ది టోర్నీగా నిలిచిన శాంసన్.. యూకే పర్యటనలో మాత్రం తీవ్ర నిరాశపరిచాడు. వరుసగా మూడు మ్యాచ్లలో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే అతడిని పక్కన పెట్టి వైభవ్ను తుది జట్టులోకి తీసుకున్నారు. కానీ అతడు కూడా విఫలం కావడంతో సీనియర్ అయిన సంజూకే మళ్లీ అవకాశమివ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెలఖారులో జింబాబ్వేతో జరిగే టీ20 సిరీస్లో వైభవ్ను పూర్తి స్ధాయిలో ఆడించే యోచనలో మేనెజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మూడు టీ20ల సిరీస్ కోసం భారత క్రికెట్ జూలై ఆఖరిలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్ సీనియర్ ప్లేయర్ అభిషేక్ శర్మకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది. ఈ క్రమంలో వైభవ్ భారత ఇన్నింగ్స్ను ప్రారంభించేందుకు అస్కారం ఉంది.చదవండి: శ్రీలంక గడ్డపై ద్రవిడ్ కుమారుడి విశ్వరూపం! -
ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన రోహిత్ శర్మ
ఇంగ్లండ్-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ మరో 8 రోజుల్లో ప్రారంభం కానుంది. తొలి వన్డే ఎడ్జ్బాస్టన్ వేదికగా జూలై 14న జరగనుంది. ఈ సిరీస్ కోసం భారత స్టార్ ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టాడు. ఇంగ్లండ్కు చేరుకున్న రోహిత్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన ప్రాక్టీస్ను మొదలు పెట్టాడు. వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరగబోయే ఈ సిరీస్లో సత్తాచాటాలని హిట్మ్యాన్ ఉవ్విళ్లూరుతున్నాడు. చివరగా అఫ్గానిస్తాన్తో వన్డేల్లో కూడా ఈ ముంబైకర్ రాణించాడు. ఇప్పుడు అదే ఫామ్ను ఇంగ్లీష్ గడ్డపై కొనసాగించేందుకు రోహిత్ సన్నదమవుతున్నాడు. మరోవైపు అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు గాయం కారణంగా దూరమైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దీంతో ఇంగ్లండ్తో వన్డేల్లో కోహ్లి ఆడనున్నాడు. ప్రస్తుతం లండన్లో ఉన్న విరాట్ త్వరలోనే భారత జట్టుతో కలిసే అవకాశముంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సైతం జట్టుతో చేరనున్నాడు. అతడు కూడా తన బౌలింగ్ ప్రాక్టీస్ను మొదలు పెట్టాడు. అయితే ఇంగ్లండ్ టూర్కు స్టార్ ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి గాయం కారణంగా దూరమయ్యారు. నితీశ్ స్ధానంలో సూర్యన్ష్ షెడ్గేని జట్టులోకి తీసుకున్నారు.ఇంగ్లండ్తో వన్డేలకు భారత జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, సూర్యన్ష్ షెడ్గే , కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్.చదవండి: శ్రీలంక గడ్డపై ద్రవిడ్ కుమారుడి విశ్వరూపం! -
టీమిండియాలోకి యార్కర్ల కింగ్.. ఇక ఇంగ్లండ్కు చుక్కలే?
టీమిండియా కెప్టెన్గా తొలి విజయం కోసం శ్రేయస్ అయ్యర్ నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. సూర్యకుమార్ యాదవ్ స్ధానంలో భారత టీ20 పగ్గాలను చేపట్టిన శ్రేయస్.. జట్టును విజయపథంలో నడిపించడంలో విఫలమవుతున్నాడు. అతడి సారథ్యలో భారత జట్టు వరుసగా మూడు ఓటములను చూవిచూసింది.ఐర్లాండ్తో తొలిసారి సిరీస్ను కోల్పోయిన భారత్, ఇప్పుడు ఇంగ్లండ్ టూర్లో అదే తీరును కనబరుస్తోంది. తొలి టీ20 వర్షార్పణం కాగా.. రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో మెన్ ఇన్ బ్లూ ఓటమి పాలైంది. ఇప్పుడు శ్రేయస్ సేన ఆతిథ్య జట్టుతో ట్రెండ్బ్రిడ్జ్ వేదికగా మూడో టీ20లో తలపడేందుకు సిద్దమైంది. ఈ మ్యాచ్తో తిరిగి గెలుపు బాట పట్టాలని భారత్ పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో భారత తుది జట్టులో ఓ మార్పు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.బిష్ణోయ్పై వేటురెండో టీ20లో దారుణంగా విఫలమైన స్పిన్నర్ రవి బిష్ణోయ్పై వేటు వేసేందుకు టీమ్ మేనెజ్మెంట్ సిద్దమైనట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ తిరిగి జట్టులోకి తీసుకోనున్నట్లు సమాచారం. ప్రిన్స్ యాదవ్ ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో డెబ్యూ చేశాడు.తన అరంగేట్ర మ్యాచ్లో ప్రిన్స్ అదరగొట్టాడు. 4 ఓవర్ల కోటాలో కేవలం 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అయినప్పటికి ఇంగ్లండ్తో తొలి రెండో టీ20లకు స్పిన్నర్ బిష్ణోయ్ కోసం ప్రిన్స్ను గంభీర్ అండ్ కో పక్కన పెట్టింది. కానీ బిష్ణోయ్ పూర్తిగా తేలిపోవడంతో ప్రిన్స్ యాదవ్ తిరిగి ప్లేయింగ్ ఎలెవన్లోకి రావడం దాదాపు ఖాయమైనట్లే. ఈ ఢిల్లీ పేసర్కు కొత్త బంతితో పాటు డెత్ ఓవర్లలో అద్భుత బౌలింగ్ చేయగలడు. పిన్ పాయింట్ యార్కర్ల వేయడంలో దిట్ట. ప్రిన్స్ యాదవ్ పేసర్లు హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్లతో కలిసి బంతిని పంచుకోనున్నాడు. కాగా ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరపున ప్రిన్స్ అసాధరణ ప్రదర్శన చేశాడు. దీంతో జాతీయ సెలక్టర్ల నుంచి అతడికి పిలుపు వచ్చింది. అఫ్గాన్ సిరీస్లో వన్డే అరంగేట్రం కూడా చేశాడు.చదవండి: శ్రీలంక గడ్డపై ద్రవిడ్ కుమారుడి విశ్వరూపం! -
రవి బిష్ణోయ్ చెత్త రికార్డు.. టీ20ల్లో తొలి ప్లేయర్గా
టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ తనకు లభించిన సువర్ణ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. చాన్నాళ్ల తర్వాత భారత జట్టులోకి వచ్చిన బిష్ణోయ్.. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో ఘోర ప్రదర్శన కనబరిచాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో ఒక్క వికెట్ కూడా పడగొట్టకుండా 60 పరుగులు ఇచ్చాడు. అతడి చెత్త బౌలింగే భారత ఓటమికి ప్రదాన కారణంగా చెప్పుకోవాలి. . లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ జట్టుకు చివరి నాలుగు ఓవర్లలో 49 పరుగులు అవసరమయ్యాయి. ఈ సమయంలో 17 ఓవర్ వేసిన బిష్ణోయ్ 29 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ స్వరూపామే మారిపోయింది. ఈ ఓవర్లో అతడు ఏకంగా రెండు నో బాల్స్.. రెండు ఫ్రీ హిట్లను బెతల్ సిక్సర్లుగా మలిచాడు. ఇదే మ్యాచ్లో అంతకుముంద బిష్ణోయ్ ఓ నోబాల్ వేశాడు. దీంతో ఈ రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక అంతర్జాతీయ టీ20లో మూడు నోబాల్స్ వేసిన తొలి ఐసీసీ ఫుల్-మెంబర్ దేశ బౌలర్గా రవి బిష్ణోయ్ ఆ వాంఛనీయ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతేకాకుండా టీ20ల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన మూడో భారత బౌలర్గా బిష్ణోయ్ నిలిచాడు. ఈ జాబితాలో 2020లో న్యూజిలాండ్పై శివమ్ దూబె 34 రన్స్, 2016లో వెస్టిండీస్పై స్టువర్ట్ బిన్నీ ఒకే ఓవర్లో 32 పరుగులు సమర్పించుకున్నారు. -
వైభవ్ తప్పు చేశాడు.. అస్సలు ఊహించలేదు: సునీల్ గవాస్కర్
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఘనమైన అరంగేట్రం లభించలేదు. శనివారం మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో డెబ్యూ చేసిన వైభవ్.. కేవలం 14 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. రెండు సిక్సర్లు కొట్టి మంచి టచ్లో కనిపించిన ఈ చిచ్చర పిడుగు, విల్ జాక్స్ బౌలింగ్లో స్టంపౌటయ్యాడు. భారత ఇన్నింగ్స్ ఐదో ఓవర్ వేసిన జాక్స్.. ఐదో బంతిని వైభవ్కు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా సంధించాడు. అయితే బంతిని సరిగ్గా అంచనా వేయడంలో విఫలమైన వైభవ్, ఫ్రంట్ ఫుట్కు వచ్చి కట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి మిస్స్ అయ్యి వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేతికి వెళ్లింది. బట్లర్ స్టంప్స్ను గిరాటేశాడు. దీంతో వైభవ్ తొలి మ్యాచ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ నేపథ్యంలో కామెంటరీ బాక్స్లో ఉన్న భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో వైభవ్ అలాంటి షాట్ ఆడాల్సిన అవసరం లేదని, బౌలర్ ట్రాప్లో చిక్కుకున్నాడని గవాస్కర్ అభిప్రాయపడ్డారు."అది వైభవ్ ఆడే షాట్ కాదు. అనవసరంగా క్రీజు వదలి బయటకు వచ్చాడు. కట్షాట్ ఆడుతాడని ఊహించలేదు. అతడి అసలైన బలం కవర్ డ్రైవ్" అని ఆయన అన్నారు. అంతకుముందు మ్యాచ్ ప్రారంభంలో గవాస్కర్ మాట్లాడుతూ.. సూర్యవంశీ ఇప్పుడు భారత్ ముద్దుబిడ్డగా మారాడు. ప్రతి ఒక్కరూ అతడి రాణించాలని కోరుకుంటున్నారు.అతడు తనదైన శైలిలో మొదటి బంతి నుంచి దూకుడుగా ఆడుతాడని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. కాగా సంజూ శాంసన్ స్ధానంలో వైభవ్కు తుది జట్టులో చోటు దక్కింది. ఈ బిహార్ క్రికెటర్కు మరో అవకాశమిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మూడో టీ20లో కూడా వైభవ్ ఆడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జూలై 7న మూడో టీ20 ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా జరగనుంది. -
పసికూన చేతిలో పరాభవం.. ఇంగ్లండ్లోనూ అదే తడబాటు
టీ20ల్లో వరల్డ్ నంబర్ వన్, వరుసగా రెండు పొట్టి ప్రపంచకప్ టైటిల్స్ గెలుచుకున్న టీమిండియాకు ఏమైంది? తమకు కలిసొచ్చిన టీ20 ఫార్మాట్లో ఎందుకు విఫలమవుతోంది? ఒకప్పుడు పసికూనలను ఆటాడుకున్న భారత్,..ఇప్పుడు ఐర్లాండ్ వంటి చిన్న జట్టు చేతిలో సైతం ఘోర పరాభవాన్ని మూట కట్టుకుని అబాసుపాలైంది. ఐర్లాండ్ టూర్లో ఎదురైన ఓటముల నుంచి టీమిండియా ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదు. ఇంగ్లండ్ గడ్డపై అదే తీరును భారత్ కొనసాగిస్తోంది. మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయింది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. దీంతో మెన్ ఇన్ బ్లూ వరుసగా మూడో ఓటమి చవిచూసింది. అసలు కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఈ సరికొత్త ‘టమిండియా’ ఎందుకు తడబడుతోంది? లోపాలు ఎక్కడున్నాయి? వాటిపై ఓ లుక్కేద్దాం.కెప్టెన్సీ మార్పు కొంపముంచిందా?ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్లకు ముందు భారత్కు టీ20 ప్రపంచకప్ను అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై బీసీసీఐ సెలక్షన్ కమిటీ వేటు వేసింది. కెప్టెన్సీ నుంచి మాత్రమే కాకుండా జట్టు నుంచే సూర్యను తప్పించింది. పేలవ ఫామ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ అజిత్ అగార్కర్ తెలిపాడు. అతడి స్ధానంలో మరో ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్కు భారత టీ20 జట్టు పగ్గాలను బీసీసీఐ అప్పగించింది. దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్లో కెప్టెన్గా విజయవంతమైన అయ్యర్.. అంతర్జాతీయ క్రికెట్లో కూడా టీమిండియాను అదేవిధంగా నడిపిస్తాడని అంతా భావించారు. కానీ అయ్యర్ ఆరంభంలోనే అందరి అంచనాలను తారు మారు చేశాడు. కెప్టెన్గా తన తొలి మూడు మ్యాచ్లలోనూ ఓటమి చవిచూశాడు. అయితే సూర్య విషయానికి వస్తే.. అతడి ఫామ్ దిగజారిన మాట వాస్తవే. కానీ కెప్టెన్గా మాత్రం అతడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ సుమారు 80 శాతం విజయాలను సాధించింది. ఆసియాకప్, ప్రపంచకప్లతో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి ప్రధాన టీ20 సిరీస్లో కూడా భారత్ గెలుపొందింది. దీంతో ఇప్పుడు సూర్యను అంతా గుర్తు చేసుకుంటున్నారు. సూర్య వుంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరో కనీసం మూడో టీ20లోనైనా అయ్యర్ కెప్టెన్గా తొలి విజయాన్ని అందుకుంటాడో లేదో వేచి చూడాలి.సరిపోని స్కోర్లు.. స్ట్రైక్ రేట్ పెంచాల్సిందేఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 190 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ.. ఆధునిక టీ20 క్రికెట్లో అది ఏ మాత్రం సరిపోదని మరోసారి రుజువైంది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చెప్పినట్లు, ఈ మ్యాచ్లో భారత్ మరో 20 పరుగులు తక్కువగా చేసింది. అంతేకాకుండా మిడిల్ ఓవర్లలో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడలేకపోతున్నారు. అభిషేక్ శర్మ తనదైన శైలిలో పవర్ప్లేలో దుమ్ములేపుతుంటే.. ఆ తర్వాత రన్రేట్ను అదే వేగంతో కొనసాగించడంలో మన బ్యాటర్లు విఫలమవుతున్నారు. ఐర్లాండ్ సిరీస్లో కూడా ఇదే జరిగింది. మిడిల్ ఓవర్లలో వికెట్లు కాపాడుకునే క్రమంలో డాట్ బాల్స్ ఎక్కువగా ఆడుతున్నారు. దీంతో స్కోర్ వేగం తగ్గి భారీ టార్గెట్లను ప్రత్యర్ధి ముందు భారత్ ఉంచలేకపోతుంది. కచ్చితంగా భారత బ్యాటర్లు తమ స్ట్రైక్ రేట్ పెంచాల్సిందే.తేలిపోతున్న బౌలర్లుమరోవైపు భారత బౌలింగ్ విభాగంలో సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. పరుగులను కట్టడి చేయలేక తేలిపోతున్నారు. మాంచెస్టర్ టీ20లో కూడా అదే జరిగింది. 190 పరుగులను డిఫెండ్ చేసుకునే క్రమంలో భారత బౌలర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఇంగ్లండ్ బ్యాటర్లు స్వీప్లు, రివర్స్ స్పీప్లు ఆడుతుంటే.. మన బౌలర్లు కనీసం లెంగ్త్ను కూడా మార్చలేదు.కీలక సమయాల్లో చెత్త బంతులు వేసి మ్యాచ్ను ఇంగ్లండ్కు అప్పగించారు. అర్ష్దీప్ మినహా ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రాణా వంటి పేసర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. టీమిండియా తమ తదుపరి మ్యాచ్లలో విజయం సాధించాలంటే కచ్చితంగా బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో మెరుగ్గా రాణించాల్సిందే. లేదంటే యూకే పర్యటనలో మరో సిరీస్ ఓటమి తప్పదు. -
వైభవ్ కోసం శాంసన్పై వేటు.. మైదానంలోనే ఓదార్చిన గంభీర్!
జెంటిల్ మ్యాన్ గేమ్ క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ఎన్ని సెంచరీలు చేసినా.. సిక్సర్లు కొట్టినా.. రికార్డులు తిరగరాసినా.. ఒక్క రెండు మ్యాచ్లలో విఫలమైతే జట్టులో చోటు కోల్పవాల్సిందే. ఇప్పుడు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ విషయంలో అదే జరిగింది.టీ20 ప్రపంచకప్ 2026 టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్.. ఇప్పుడు తుది జట్టులో తన స్ధానాన్ని కోల్పోయాడు. ఇటీవల ఐర్లాండ్ సిరీస్లో వరుసగా రెండు మ్యాచ్లలో నిరాశపరిచిన సంజూ.. ఆ తర్వాత ఇంగ్లండ్తో తొలి టీ20లో కూడా అదే తీరును కనబరిచాడు.దీంతో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో రెండో టీ20కు సంజూను టీమ్ మేనెజెమెంట్ తుది జట్టు నుంచి తప్పించింది. అతడి స్ధానంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకు అవకాశమిచ్చారు. సూర్యవంశీ కూడా తనకు లభించిన ఛాన్స్ను సద్వినియోగపరుచుకోలేకపోయాడు. 10 బంతుల్లో 14 పరుగులు చేసి వైభవ్ ఔటయ్యాడు.శాంసన్ను ఓదార్చిన గంభీర్కాగా ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కకపోవడంతో సంజూ శాంసన్ను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఓదార్చాడు. టాస్ తర్వాత కోచ్ గంభీర్, శాంసన్తో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సీఎస్కే వికెట్ కీపర్ బ్యాటర్ భుజంపై గంభీర్ చేయి వేసి ధైర్యం చెబుతూ కనిపించారు.శాంసన్ ఐపీఎల్-2026లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 14 ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలతో 477 పరుగులు చేశాడు. అయినప్పటికి వరుసగా మూడు మ్యాచ్లలో ఫెయిల్ కావడంతో సంజూ బెంచ్కే పరిమితమయ్యాడు.Good to see Gautam Gambhir having a chat with Sanju Samson. That's always one thing you need from the management. pic.twitter.com/woihQi2l82— Pitch Perfect (@_pitch__perfect) July 4, 2026 -
వైభవ్ ఫెయిల్.. అయినా భారత్ భారీ స్కోర్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టీ20లో భారత బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు స్కోర్ సాధించింది.భారత ఇన్నింగ్స్లో అరంగేట్ర ఆటగాడు వైభవ్ సూర్యవంశీ(14) విఫలమైనప్పటికి.. ఇషాన్ కిషన్(40 బంతుల్లో 49), అభిషేక్ శర్మ(43), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(37), తిలక్ వర్మ(24) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కుర్రాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్, విల్ జాక్స్, డాసన్ తలా వికెట్ సాధించారు. వైభవ్ రెండు భారీ సిక్స్లు కొట్టి మంచి టచ్లో కనిపించినప్పటికి.. తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోర్గా మలుచుకోలేకపోయాడు. 10 బంతుల్లో కేవలం 14 పరుగులు చేసి సూర్యవంశీ స్టంపౌటయ్యాడు.తుదిజట్లుటీమిండియావైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.ఇంగ్లండ్ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జేకబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్. -
నాడు సచిన్.. నేడు వైభవ్! తొలి మ్యాచ్లో ఇద్దరూ ఒకేలా?
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అరంగేట్ర మ్యాచ్లో బ్యాట్ ఝళిపించలేకపోయాడు. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టీ20లో డెబ్యూ చేసిన వైభవ్.. నామమాత్రపు స్కోర్కే పరిమితమయ్యాడు. సంజూ శాంసన్ స్థానంలో భారీ అంచనాల మధ్య తుది జట్టులోకి వచ్చిన ఈ వండర్ కిడ్, అంతర్జాతీయ క్రికెట్ ఒత్తిడిని తట్టుకోలేక భారత ఇన్నింగ్స్ ఆరంభంలోనే పెవిలియన్కు చేరాడు. ఇంగ్లండ్ స్పీడ్ స్టార్ జోఫ్రా ఆర్చర్ను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలచడంతో.. మాంచెస్టర్లో వైభవ్ షో ఖాయమని అంతా అనుకున్నారు.కానీ స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్లో వైభవ్ అనవసర షాట్కు ప్రయత్నించి స్టంపౌట్గా వెనుదిరిగాడు. మొత్తంగా 10 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. రెండు సిక్సర్ల సాయంతో కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు.అయితే అరంగేట్రంలో వైభవ్ రాణించకపోయినప్పటికి ఓ చారిత్రత్మక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అతి పిన్న వయష్కుడిగా లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండూల్కర్(16) రికార్డును సూర్యవంశీ బ్రేక్ చేశాడు. వైభవ్ కేవలం 15 ఏళ్ల వయస్సులోనే అరంగేట్రం చేశాడు.నాడు సచిన్.. నేడు వైభవ్కాగా ఈ మ్యాచ్లో విఫలమైన వైభవ్కు నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు. సచిన్తో వైభవ్ను పోలుస్తున్నారు. మాస్టర్ బ్లాస్టర్ కూడా తన అరంగేట్ర మ్యాచ్లో పాకిస్తాన్పై కేవలం 15 పరుగులు చేసి.. వకార్ యనిస్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఇప్పుడు సూర్యవంశీ కూడా దాదాపు అదే స్కోర్ వద్ద అవుట్ కావడంతో.. ఈ చిచ్చర పిడుగు కూడా సచిన్లా లెజెండరీ క్రికెటర్ అవుతాడని అభిమానులు జోస్యం చెబుతున్నారు.First Ball Archer To Sooryavanshi = SIX 🔥Bumrah, Boult, Starc, Hazlewood, Bhuvneshwar, Siraj, Rabada, Pat Cummins Now Jofra Archer 🔥Jigra Cahiye 15 Ki Age Me Itne Bade Bade Bowlers Ko SIXES Maarne Ke Liye Broo ☠️#VaibhavSooryavanshi 💎🔥📈#ENGvIND…— Manraj (@jatt_on_x) July 4, 2026 -
వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.. సచిన్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నిరీక్షణకు తెరపడింది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టీ20లో వైభవ్కు భారత తుది జట్టులో చోటు దక్కింది. సంజూ శాంసన్ స్ధానంలో వైభవ్ను ప్లేయింగ్ ఎలెవన్లోకి తీసుకున్నారు. దీంతో భారత సీనియర్ జట్టు తరపున డెబ్యూ చేసిన అతి పిన్న వయష్కుడిగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును సూర్యవంశీ బ్రేక్ చేశాడు. సచిన్ 16 ఏళ్ల వయస్సులోఅరంగేట్రం చేయగా.. వైభవ్ కేవలం 15 ఏళ్ల 99 రోజుల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ చేతుల మీదగా వైభవ్ భారత క్యాప్ను అందుకున్నాడు.ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం రెండు మార్పులు చేసింది. జోష్ టంగ్ ఇంగ్లండ్ తరపున డెబ్యూ చేయగా.. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తిరిగి జట్టులోకి వచ్చాడు.తుదిజట్లుటీమిండియావైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.ఇంగ్లండ్ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జేకబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ -
అతడిలో సచిన్, కోహ్లి కనిపిస్తున్నారు.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి: కపిల్ దేవ్
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కోసం అభిమానులతో దిగ్గజ క్రికెటర్లు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐర్లాండ్ సిరీస్కు జట్టుతో పాటు ఉన్నప్పటికి డెబ్యూ చేసే అవకాశం రాలేదు.ఇప్పుడు కనీసం ఇంగ్లండ్ టూర్లోనైనా 15 ఏళ్ల సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ భారత మాజీ కెప్టెన్, లెజెండ్ కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించారు. సూర్యవంశీలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల స్థాయి ప్రతిభ కనిపిస్తోందని ఆయన అన్నారు. వయసుతో సంబంధం లేకుండా అతడి టాలెంట్ను చూసి అవకాశమివ్వాలని కపిల్ సూచించారు."వైభవ్కు సూర్యవంశీకి అద్భుతమైన టాలెంట్ ఉంది. అతడు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి అంతటి ప్రతిభావంతుడు. ఈ యువ ఆటగాడు టీ20 ఫార్మాట్కు సరిగ్గా సరిపోతాడు. ప్రపంచంలో ఇలాంటి రేర్ టాలెంట్ ఉన్నవాళ్లు ఒక శాతం కూడా ఉండరు. ఇంత చిన్న వయస్సులో ఈ తరహా బ్యాటింగ్ చేయడం నిజంగా అద్భుతం. అయితే మిగిలిన ఫార్మాట్లలో అతడు తనని తాను ఇంకా నిరూపించుకోవాల్సి ఉంది. అతడు టెస్ట్ క్రికెట్లో వరుసగా ఐదు ఓవర్ల పాటు మెయిడెన్లు ఆడగలడా? అనేది చూడాలి. నేను ఇప్పటివరకు పెద్దగా అతడి ఆట చూడలేదు.కానీ ఎక్కడకు వెళ్లినా అతడి గురించే చర్చనడుస్తోంది. ఈ యువ ఆటగాడిపై ఇప్పుడే అతిగా హైప్ క్రియేట్ చేస్తాన్నమని నాకనిపిస్తోంది. అతడిపై అనవసర ఒత్తిడి క్రియేట్ చేయకూడదు. ఈ వయసులో అంతటి అవగాహన ఉండదు. అతడికి కొంత సమయం ఇవ్వాలి.అయితే సచిన్ కూడా దాదాపు ఇదే వయస్సులో(16) అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అప్పటిలో మేము కూడా ఇంత చిన్న వయస్సు ప్లేయర్ ఆడించి తప్పు చేస్తాన్నామా? అని అనుకున్నాం. కానీ గత చరిత్రను పరిశీలిస్తే.. టాలెంట్ ఉన్నప్పుడు ఆలస్యం చేయకూడదని అర్థమవుతుంది. అందుకే వైభవ్ను వయస్సు బట్టి కాకుండా టాలెంట్ను చూసి జట్టులోకి తీసుకోవాలని" కపిల్ దేవ్ పేర్కొన్నారు.చదవండి: IPL 2026: రహానేపై వేటు.. కేకేఆర్ కెప్టెన్గా విధ్వంసకర ప్లేయర్! -
భారత్తో వన్డే సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! స్టార్లు వచ్చేశారు
టీమిండియాతో స్వదేశంలో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్కు స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కెప్టెన్గా వ్యవహరించనుండగా.. జోస్ బట్లర్, సామ్ కరన్, జో రూట్, ఆదిల్ రషీద్ వంటి సీనియర్ ఆటగాళ్లు జట్టులో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.అంతేకాకుండా దాదాపు ఎనిమిదిల నెలల తర్వాత స్పీడ్ స్టార్ జోఫ్రా ఆర్చర్ ఇంగ్లండ్ వన్డే జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. గాయం కారణంగా ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్కు ఆర్చర్ దూరమయ్యాడు. ఇప్పుడు అతడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో వన్డేలకు కూడా అతడిని ఎంపిక చేశారు. ఆర్చర్తో పాటు శ్రీలంక టూర్కు దూరమైన ఫాస్ట్ బౌలర్లు గుస్ అట్కిన్సన్, సాకిబ్ మహమూద్లు కూడా తిరిగి జట్టులోకి వచ్చారు. అలాగే ఈ జట్టులో 22 ఏళ్ల స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ జేమ్స్ కోల్స్కు చోటు దక్కింది. లిస్ట్-ఎ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తుండడంతో సీనియర్ జట్టుకు అతడిని సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ ససెక్స్ యువ ఆటగాడు టీ20 జట్టులో కూడా సభ్యునిగా ఉన్నాడు. ఈ మూడు వన్డేల సిరీస్ జూలై 14 నుండి జూలై 19 వరకు జరగనుంది. భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.వన్డే సిరీస్ షెడ్యూల్ వివరాలు:మొదటి వన్డే: జూలై 14 – ఎడ్జ్బాస్టన్ (బర్మింగ్హామ్)రెండవ వన్డే: జూలై 16 – సోఫియా గార్డెన్స్ (కార్డిఫ్)మూడవ వన్డే: జూలై 19 – లార్డ్స్ (లండన్)ఇంగ్లండ్ వన్డే జట్టు:హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, జేమ్స్ కోల్స్, సామ్ కరన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, జో రూట్, జోష్ టంగ్. -
టీమిండియాకు బ్యాడ్ న్యూస్..! ఇంగ్లండ్ జట్టులోకి స్పీడ్ గన్ ఎంట్రీ?
మాంచెస్టర్ వేదికగా శనివారం ఇంగ్లండ్తో రెండో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కావడంతో ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి శుభారంభం చేయాలని భారత్ పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్కు ముందు శ్రేయస్ అయ్యర్ సేనకు ఓ బ్యాడ్ న్యూస్. తొలి టీ20కు దూరంగా ఇంగ్లండ్ స్పీడ్ స్టార్ జోఫ్రా ఆర్చర్.. ఇప్పుడు రెండో మ్యాచ్లో ఆడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జట్టుతో కలిసిన అతడు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో చివరి రెండు మ్యాచ్ల్లో అవిరామంగా బౌలింగ్ చేయడంతో, ఆర్చర్కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మొదటి టీ20 నుంచి తప్పించింది. అయితే మిగిలిన నాలుగు టీ20ల్లో జోఫ్రా ఆడనున్నాడు. శనివారం నాటి మ్యాచ్లో అతడు లూక్ వుడ్ లేదా లియామ్ డాసన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఆర్చర్ పునరాగమనం చేస్తే ఇంగ్లీష్ జట్టు బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారనుంది. పవర్ప్లేలో ఈ రాజస్తాన్ స్పీడ్ స్టార్ను ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఐపీఎల్లో అత్యధిక సార్లు తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టి తన శుభారంభాన్ని అందించేవాడు. కొత్త బంతితో అతడు అద్భుతాలు చేస్తాడు. సరైన లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేసి బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో ఆర్చర్ దిట్ట. మరి భారత టాపార్డర్ బ్యాటర్లు ఆర్చర్ను ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. టీ20 ప్రపంచకప్-2026 తర్వాత ఆర్చర్ ఆడుతున్న మొదటి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.భారత్తో రెండో టీ20కు ఇంగ్లండ్ తుది జట్టు(అంచనా)ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్ -
'వైభవ్ సూర్యవంశీ వద్దు.. అతడినే జట్టులో కొనసాగించాలి'
యూకే పర్యటనలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైన సంజూ.. ఇప్పుడు ఇంగ్లండ్లో అదే తీరును కనబరుస్తున్నాడు. వర్షం కారణంగా రద్దు అయిన తొలి టీ20లో శాంసన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు.దీంతో అతడిని పక్కన పెట్టి బెంచ్పై ఉన్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశమివ్వాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంజూకు మద్దతుగా భారత మాజీ క్రికెటర్ సబా కరీం నిలిచాడు. ఫామ్ కోల్పోయినప్పటికీ శాంసన్నే టాప్ ఆర్డర్లో కొనసాగించాలని కరీం అభిప్రాయపడ్డాడు.టీ20 ప్రపంచకప్-2026తో పాటు ఐపీఎల్లో దుమ్ములేపిన ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్.. యూకే గడ్డపై తన మార్క్ చూపించలేకపోతున్నాడు. సంజూ తన చివరి 10 విదేశీ టీ20లలో ఐదుసార్లు డకౌట్, రెండుసార్లు వందకు పైగా స్కోర్లు సాధించాడు. మరో మూడుసార్లుసింగిల్ డిజిట్ స్కోర్లు నమోదు చేశాడు. ఏదేమైనప్పటికి శాంసన్ తన టీ20 కెరీర్లో మాత్రం నిలకడగా రాణించలేకపోతున్నాడనే చెప్పాలి.సంజూ శాంసన్ను ప్రస్తుతానికి జట్టు నుంచి తప్పించే సాహసం మేనెజ్మెంట్ చేయకపోవచ్చు. ఎందుకంటే అతడొక అద్భుతమైన ప్లేయర్. సంజూకి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించే సత్తా ఉంది. అతడు ఐపీఎల్లో కూడా అదరగొట్టాడు. అంతకుముందు టీ20 ప్రపంచకప్లో ప్లేయర్ ఆఫ్ది టోర్నీగా నిలిచాడు.ఒకట్రెండు మ్యాచ్లలో విఫలమైనంత మాత్రాన అతడి విమర్శించడం సరికాదు. సంజూ కూడా ఇదే ఆలోచిస్తూ ఉంటాడు. వైభవ్ ఆడకపోయినప్పటికి సీనియర్ ప్లేయర్లతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోని చాలా విషయాలు నేర్చుకుంటున్నాడు. అతడికి టాలెంట్ ఉన్నప్పటికి ప్రస్తుత పోటీలో అవకాశం ఎదురు చూడక తప్పదు అని సబా కరీం స్టార్ స్పోర్ట్స్ డిబేట్లో పేర్కొన్నాడు. -
వైభవ్ సూర్యవంశీకి పెరుగుతున్న మద్దతు
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్లకు నామమాత్రంగా ఎంపిక చేశారే తప్పిస్తే, ఇప్పటివరకు అతడికి ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. పసికూన ఐర్లాండ్పైనే అతడు అరంగేట్రం చేస్తాడని అంతా అనుకున్నా.. అక్కడ అది జరగలేదు. ఇంగ్లండ్లో అయినా అరంగేట్రం చేసే ఛాన్స్ ఇస్తారా అంటే, అదీ లేనట్లే కనిపిస్తుంది.తాజాగా ముగిసిన తొలి టీ20లో వైభవ్కు తుది జట్టులో చోటు దక్కలేదు. మున్ముందు జరిగే నాలుగు మ్యాచ్ల్లో దక్కుతుందన్న నమ్మకం కూడా లేదు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీకి మద్దతు పెరుగుతుంది. అతడిని ఎట్టిపరిస్థితుల్లో రెండో టీ20లో ఆడించాలని అభిమానులు సహా చాలామంది మాజీలు డిమాండ్ చేస్తున్నారు.ఈ జాబితాలోకి కొత్తగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా చేరాడు. రవిశాస్త్రి ఈ డిమాండ్ను వినిపించే క్రమంలో ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై పరోక్ష విమర్శలు గుప్పించాడు. అనుభవం పేరుతో వరుసగా విఫలమవుతున్నా, సంజూ శాంసన్కు అవకాశాలు ఇస్తున్నారన్నట్లు మాట్లాడాడు.వాస్తవానికి వైభవ్కు ఐర్లాండ్ సిరీస్లోనే అవకాశం ఇవ్వాల్సిందని, చిన్న గ్రౌండ్స్లో అతని భయం లేని బ్యాటింగ్ బాగా ఉపయోగపడేదని అభిప్రాయపడ్డాడు. వైభవ్ ఇప్పటికే ఐపీఎల్లో అగ్రశ్రేణి బౌలర్లను ఎదుర్కొని అద్భుత ప్రదర్శనలు ఇచ్చాడని.. ఇంగ్లండ్ అండర్-19 పర్యటనలో కూడా అతని ప్రదర్శనలు బలంగా ఉన్నాయని.. ఇప్పటికైనా వైభవ్ అవకాశాలు ఇవ్వడం సమంజసమని అభిప్రాయపడ్డాడు.శాస్త్రి సహా చాలామంది మాజీలు, అభిమానులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటే.. టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం అనుభవం, పరిస్థితులు, బ్యాటింగ్ కాంబినేషన్ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సంజూ శాంసన్కు వరుసగా విఫలమవుతున్నా, అవకాశాలు వస్తున్నాయి. మరి రెండో టీ20లోనైనా వైభవ్కు అవకాశమిస్తారో లేదో చూడాలి. -
దూబే సిక్సర్ల వర్షం.. ఇంగ్లండ్ టార్గెట్ 190 రన్స్
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ (59), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 68) అర్ధసెంచరీలతో రాణించారు. ఆఖర్లో శివమ్ దూబే (21 బంతుల్లో 42 నాటౌట్) పవర్హిట్టింగ్తో టీమిండియా భారీ స్కోరు చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహ్మూద్ 3 వికెట్లు తీయగా, ఆదిల్ రషీద్, సామ్ కరన్లు చెరో వికెట్ పడగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ సంజూ శాంసన్ ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే ఇషాన్ కిషన్ దురదృష్టవశాత్తూ రనౌట్గా వెనుదిరిగాడు. దీంతో భారత్ 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో అభిషేక్, శ్రేయస్లు కలిసి భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఈ ఇద్దరు మూడో వికెట్కు 82 పరుగులు జోడించిన తర్వాత అభిషేక్ శర్మ వెనుదిరిగాడు. అప్పటివరకు స్లోగా ఆడిన అయ్యర్ వేగం పెంచాడు. ఈ దశలో 38 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. అయితే స్కోరును పెంచే క్రమంలో అయ్యర్ ఔటైనప్పటికీ ఫినిషర్ రోల్కు న్యాయం చేస్తూ శివమ్ దూబే సిక్సర్లతో విరుచుకుపడడంతో టీమిండియా 180 పరుగుల మార్క్ను దాటింది. -
టాస్ గెలిచిన టీమిండియా.. ఇంగ్లండ్ లక్ష్యం ఎంతంటే?
👉ఇంగ్లండ్, టీమిండియా మధ్య జరుగుతున్న మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్, అభిషేక్ ఫిఫ్టీలతో రాణించగా.. ఆఖర్లో దూబే సిక్సర్ల వర్షం కురిపించాడు.👉ఇంగ్లండ్తో తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 38 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్ సాధించాడు. ప్రస్తుతం టీమిండియా 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది.👉12 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసిందిశ్రేయస్ అయ్యర్ (39), తిలక్ వర్మ (11) క్రీజులో ఉన్నారు. అంతకముందు అభిషేక్ శర్మ (59) ఎల్బీగా వెనుదిరిగాడు.20 బంతుల్లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఫిఫ్టీ సాధించాడు. 8 ఓవర్లలో టీమిండియా 2 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. దంచుతున్న అభిషేక్ శర్మఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టిస్తున్నాడు. 5 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. అభిషేక్ 16 బంతుల్లో 44 పరుగులతో ఆడుతుండగా, కెప్టెన్ అయ్యర్ ఆరు పరుగులతో సహకరిస్తున్నాడు. చెస్టర్-లె-స్ట్రీట్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా తొలి టీ20లో ఇంగ్లండ్-భారత్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మరోసారి నిరాశే ఎదురైంది.తుది జట్టులో అతడికి చోటు దక్కలేదు. ఇక ఈ మ్యాచ్లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. వరుణ్ చక్రవర్తి తిరిగి జట్టులోకి వచ్చాడు. రవి బిష్ణోయ్కు కూడా ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కింది.తుది జట్లుఇంగ్లండ్ : ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్భారత్: సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి -
'వైభవ్ సూర్యవంశీ ఆట చూసి షాకయ్యా.. మరో స్టీవ్ వా'
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భారత సీనియర్ జట్టు తరపున అరంగేట్రం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఐర్లాండ్ సిరీస్కు ఎంపికైనప్పటికి అతడికి ప్లేయింగ్ ఎలెవన్లో మాత్రం చోటు దక్కలేదు. ఇప్పుడు వైభవ్ టీమిండియాతో పాటు ఐదు మ్యాచ్ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాడు. కనీసం ఇగ్లండ్ సిరీస్లోనైనా ఈ చిచ్చర పిడుగును ఆడించాలని మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీపై ఇంగ్లండ్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ మ్యాట్ ప్రయర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియా లెజెండ్ స్టీవ్ వాతో వైభవ్ను ప్రయర్ పోల్చాడు. వైభవ్ అద్భుతమైన ఆటగాడని, ఒత్తిడిని తట్టుకుని రాణించే సత్తా ఉందని అతడు కొనియాడాడు.వైభవ్కు కేవలం టాలెంట్ మాత్రమే కాదు, స్టీవ్ వా తరహా మానసిక దృఢత్వం కూడా ఉంది. నామమాత్రపు మ్యాచ్లలో ఆడడం కాదు, క్లిష్ట సమయాల్లో కూడా రాణించేవాడే అసలైన క్రికెటర్. వైభవ్ ఇప్పటివరకు ఆడిన దాదాపు అన్ని కీలక మ్యాచ్లలోనూ సత్తాచాటాడు. ప్రపంచం మొత్తం చూస్తున్న అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్, ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్ల్లో ఒత్తిడిని చిత్తు చేస్తూ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు ఆడాడు.ఇదే అతడి స్పెషాలిటీ. వరల్డ్క్లాస్ బౌలర్లు అయితన జస్ప్రీత్ బుమ్రా, పాట్ కమిన్స్ ఎంతో అనుభవం ఉన్న ఆటగాళ్లే ఎదుర్కోలేకపోయారు. కానీ 15 ఏళ్ల కుర్రాడు వారి బౌలింగ్ను ఉతికారేశాడు. అతడికి అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. బ్యాట్ స్పీడ్ కూడా చూడటానికి చాలా బాగుంది. వైభవ్ ఖచ్చితంగా భారత క్రికెట్కు ఫ్యూచర్ స్టార్ అవుతాడు అని టాక్ స్పోర్ట్స్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: ENG vs IND: భారత్ తుది జట్టు ఇదే! వైభవ్కు నో ఛాన్స్ -
ENG vs IND: భారత్ తుది జట్టు ఇదే! వైభవ్కు నో ఛాన్స్
ఐర్లాండ్ చేతిలో ఎదురైన ఘోర పరాభావం తర్వాత తొలి మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సిద్దమైంది. బుధవారం డుర్హమ్ వేదికగా ఇంగ్లండ్తో మొదటి టీ20లో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తిరిగి కమ్బ్యాక్ ఇవ్వాలని మెన్ ఇన్ బ్లూ పట్టుదలతో ఉంది.బౌన్సీ పిచ్లపై రాణించేందుకు భారత బ్యాటర్లు నెట్స్లో తీవ్రంగా శ్రమించారు. అయితే ఈ మ్యాచ్కు ముందు శ్రేయస్ సేనకు ఓ గుడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా ఐర్లాండ్ టూర్కు దూరమైన స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తిరిగి కమ్బ్యాక్ ఇచ్చాడు. ఇంగ్లండ్తో తొలి టీ20లో చక్రవర్తి బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. అతడు పునరాగమనం చేస్తే పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ సూర్యన్ష్ షెడ్గేను పక్కన పెట్టే అవకాశముంది.మరోవైపు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్కు కూడా బెంచ్కే పరిమితమయ్యే అవకాశముంది. ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ, సంజూ శాంసన్లను కొనసాగించాలని టీమ్ మేనెజ్మెంట్ నిర్ణయించే అవకాశముంది.ఐర్లాండ్ సిరీస్లో సంజూ విఫలమైనప్పటికి.. ఇంగ్లండ్ సిరీస్లో తిరిగి పుంజుకుంటాడని కోచ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బలంగా నమ్ముతున్నారు. ఒకవేళ తొలి మూడు టీ20లలో శాంసన్ విఫలమైతే వైభవ్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.అదేవిధంగా యువ పేసర్ ప్రిన్స్ యాదవ్కు మరో అవకాశమిచ్చేందుకు మేనెజ్మెంట్ సిద్దమైనట్లు సమాచారం. బ్యాటింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోపోవచ్చు. ఇంగ్లండ్ ఇప్పటికే తమ తుది జట్టును ప్రకటించింది. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్కు ఇంగ్లండ్ క్రికెట్ విశ్రాంతి ఇచ్చింది.తుది జట్లుభారత్(అంచనా): అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వరుణ్ చక్రవర్తిఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్, సాకిబ్ మహమూద్ -
గంభీర్కు గవాస్కర్ స్ట్రాంగ్ వార్నింగ్! "వైభవ్ను ఆడించండి"
-
నేటి నుంచే భారత్-ఇంగ్లండ్ వైట్బాల్ సిరీస్
ఐర్లాండ్తో టీ20 సిరీస్ను 0-2తో చేజార్చుకున్న టీమిండియా.. ఇవాల్టి నుంచి ఇంగ్లండ్ పర్యటనలో వైట్బాల్ సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ సిరీస్కు సంబంధించిన పూర్తి షెడ్యూల్, జట్లు, ప్రత్యక్ష ప్రసారల వివరాలను ఇక్కడ చూద్దాం.ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్ జరుగనుంది. చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 10 గంటలకు తొలి టీ20 ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ సోనీ టీవీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. సోనీ లివ్, జియో హాట్స్టార్లో స్ట్రిమింగ్ జరుగనుంది.పూర్తి షెడ్యూల్జులై 1: తొలి టీ20- రివర్సైడ్ గ్రౌండ్, చెస్టర్ లీ స్ట్రీట్ రా. 10:00 గంటలకు)జులై 4: రెండో టీ20 – ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్ (సా. 7:00 గంటలకు)జులై 7: మూడో టీ20 – ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్హామ్ (రా. 10:00 గంటలకు)జులై 9: నాలుగో టీ20 – బ్రిస్టల్ (రా. 10:00 గంటలకు)జులై 11: ఐదో టీ20 – సౌతాంప్టన్ (సా. 7:00 గంటలకు)వన్డే సిరీస్జులై 14: తొలి వన్డే – ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్ (సా. 5:30 గంటలకు)జులై 16: రెండో వన్డే – కార్డిఫ్ (సా. 5:30 గంటలకు)జులై 19: మూడో వన్డే – లార్డ్స్, లండన్ (మ. 3:30 గంటలకు)జట్లు..భారత టీ20 జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీఇంగ్లండ్ టీ20 జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, టామ్ బాంటన్, జోర్డాన్ కాక్స్, జాకబ్ బెతెల్, జేమ్స్ కోల్స్, సామ్ కరన్, లియామ్ డాసన్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సోన్నీ బేకర్, సాకిబ్ మహ్మూద్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్భారత వన్డే జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), ష్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ఇంగ్లండ్ వన్డే జట్టును ప్రకటించాల్సి ఉందిప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..?భారత్-ఇంగ్లండ్ టీ20, వన్డే సిరీస్ల ప్రత్యక్ష ప్రసారం సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానళ్లలో అందుబాటులో ఉంటుంది. లైవ్ స్ట్రీమింగ్ను సోనీ లివ్, జియో హాట్స్టార్ యాప్లలో వీక్షించవచ్చు. -
వైభవ్ విషయంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలను తిప్పికొట్టిన శ్రేయస్
ఐర్లాండ్ సిరీస్లో వైభవ్ సూర్యవంశీకి టీమిండియా అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వకపోవడంపై పెద్ద వివాదం నడుస్తోంది. ఆ సిరీస్లో వైభవ్ తప్పక అరంగేట్రం చేస్తాడని అందరూ అనుకున్నా, చివరికి అతనికి ప్లేయింగ్ XIలో చోటు దక్కలేదు. దీంతో టీమిండియా మేనేజ్మెంట్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ గౌతమ్ గంభీర్పై విమర్శలు వెల్లువెత్తాయి.ఈ వివాదంలోకి రాజకీయ నాయకులు కూడా ఎంటయ్యారు. బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వైభవ్ను ఐర్లాండ్ సిరీస్లో ఆడించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రేయస్ అయ్యర్, గౌతమ్ గంభీర్ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు సూచించినా వైభవ్ను తుది జట్టులోకి తీసుకోలేదంటూ టీమిండియా మేనేజ్మెంట్పై ధ్వజమెత్తారు. ఓ ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ పేపర్ స్టేట్మెంట్ను సోషల్మీడియాలో ట్యాగ్ చేస్తూ టీమిండియా సిస్టమ్పై అసహనం వ్యక్తం చేశారు.గిరిరాజ్ సింగ్ చేసిన రచ్చపై టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తాజాగా స్పందించాడు. ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు ముందు మీడియాతో మాట్లాడుతూ..తాను సోషల్ మీడియా లేదా న్యూస్ ఛానల్స్లో వచ్చే ఒత్తిడిని పట్టించుకోనని, జట్టు అవసరాలు మరియు ప్రదర్శన ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నాడు. దీంతో వైభవ్ అరంగేట్రంపై వస్తున్న రాజకీయ ఒత్తిడిని నేరుగా తిప్పికొట్టాడు.ఇదిలా ఉంటే, ఇవాళ ఇంగ్లండ్తో జరుగబోయే తొలి టీ20లోనూ వైభవ్ అరంగేట్రం అనుమానమేనని తెలుస్తోంది. భారత మేనేజ్మెంట్, కోచ్, కెప్టెన్ అందరూ ముక్తకంఠంతో ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్కు వత్తాసు పలుకుతున్నారు. దీన్ని బట్టి నేటి మ్యాచ్లోనూ వైభవ్ అరంగేట్రం లేనట్లే అన్న విషయం స్పష్టమవుతుంది. ఈ లెక్కన వైభవ్ అరంగేట్రం కోసం మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు. -
భారీ రికార్డులపై కన్నేసిన అభిషేక్ శర్మ
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ నేటి నుంచి (జులై 1) మొదలుకానుంది. తొలి మ్యాచ్ చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతంది.ఐర్లాండ్ చేతిలో అనూహ్య పరాభవం (0-2తో టీ20 సిరీస్ కోల్పోవడం) తర్వాత భారత్ ఆడుతున్న మొదటి మ్యాచ్ ఇది. ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శన ఎలా ఉండబోతుందోనని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రేయస్ సేన పుంజుకుంటుందా లేక చెత్త ప్రదర్శన కొనసాగిస్తుందా అన్న అంశం భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఇదిలా ఉంటే, ఈ సిరీస్కు ముందు భారత ఆటగాళ్ల ముందున్న పలు వ్యక్తిగత రికార్డులు సైతం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అవేంటో చూద్దాం.రోహిత్ రికార్డుపై కన్నేసిన అభిషేక్ఇంగ్లండ్పై టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్గా రోహిత్ శర్మ (12 ఇన్నింగ్స్లో 387 పరుగులు) చలామణి అవుతున్నాడు. అయితే ఈ రికార్డుపై ప్రస్తుత టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ కన్నేశాడు. ఈ సిరీస్లో అభిషేక్ మరో 100 పరుగులు చేస్తే రోహిత్ రికార్డును బద్దలు కొడతాడు. ప్రస్తుతం అభిషేక్ ఇంగ్లండ్పై టీ20ల్లో ఆరు ఇన్నింగ్స్ల్లోనే 288 పరుగులు చేశాడు.హార్దిక్ రికార్డుకు ఎసరుఇంగ్లండ్పై టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా (27 సిక్సర్లు) ముందున్నాడు. ఈ రికార్డుపై కూడా అభిషేక్ కన్నేశాడు. ఇప్పటికే ఆరు ఇన్నింగ్స్ల్లో 22 సిక్సర్లు బాదిన అతడు.. ఈ సిరీస్లో మరో ఆరు సిక్సర్లు కొడితే హార్దిక్ రికార్డు బద్దలు కొడతాడు.సంజూను ఊరిస్తున్న ధోని రికార్డుఇంగ్లండ్పై టీ20ల్లో ఇప్పటివరకు హాఫ్ సెంచరీలు నమోదు చేసింది ఇద్దరే ఇద్దరు భారత వికెట్కీపర్లు. ధోని, సంజూ ఇంగ్లీష్ టీమ్పై తలో హాఫ్ సెంచరీ చేశారు. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్లో శాంసన్ మరో హాఫ్ సెంచరీ చేస్తే ధోనిని వెనక్కునెట్టి ఈ రికార్డు సోలోగా సాధించవచ్చు.వరుణ్కు సువర్ణావకాశంఇంగ్లండ్పై టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా హార్దిక్ పాండ్యా (21) చలామణి అవుతున్నాడు. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్లో ఈ రికార్డును సాధించేందుకు వరుణ్ చక్రవర్తికి మంచి అవకాశం ఉంది. వరుణ్ ఇప్పటివరకు ఇంగ్లండ్పై 6 ఇన్నింగ్స్ల్లో 15 వికెట్లు తీశాడు. ఈ సిరీస్లో అతడు మరో 7 వికెట్లు తీస్తే ఇంగ్లండ్పై టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా అవతరిస్తాడు. -
వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్..! శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు
యూకే పర్యటనలో ఉన్న టీమిండియాకు మరో కఠిన సవాల్ ఎదురు కానుంది. జూలై 1 నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఇరు జట్ల తొలి టీ20 డర్హామ్ వేదికగా బుధవారం జరగనుంది. ఐర్లాండ్ చేతిలో ఎదరైన ఘోర పరాభవం నుంచి తిరిగి పుంజుకుని ఇంగ్లండ్ గడ్డపై సత్తాచాటాలని భారత్ పట్టుదలతో ఉంది.అయితే ఐర్లాండ్ సిరీస్లో బెంచ్కే పరిమితమైన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని కనీసం ఇంగ్లండ్తో తొలి టీ20లోనా ఆడిస్తారా? లేదా? అన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది. ఐర్లాండ్ సిరీస్లో రెండు మ్యాచ్లలోనూ విఫలమైన సంజూ శాంసన్ స్ధానంలో సూర్యవంశీకి ఛాన్స్ ఇవ్వాలని చాలా మంది సూచిస్తున్నారు. మరికొందరు ఇషాన్ కిషన్ను పక్కన పెట్టి వైభవ్ను తుది జట్టులోకి తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి టీ20కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో శ్రేయస్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా జట్టు కూర్పు కోసం అయ్యర్ను విలేకరులు ప్రశ్నించారు. అయితే తుది జట్టు కాంబినేషన్ను ముందుగానే వెల్లడించడం తనకు ఇష్టం లేదని శ్రేయస్ చెప్పుకొచ్చాడు.తొలి టీ20 కోసం మా ప్రణాళికలను సిద్దం చేసుకున్నాం. అయితే మేము ఏ కాంబినేషన్తో బరిలోకి దిగుతున్నామో బహిరంగంగా వెల్లడించలేను. ఎందుకంటే ప్రత్యర్థులకు మా వ్యూహాలు తెలిసిపోతాయి. అందుకే గోప్యంగా ఉంచాలనుకుంటున్నాను అని శ్రేయస్ పేర్కొన్నాడు.అదేవిధంగా వైభవ్ సూర్యవంశీ గురించి విలేకరులు శ్రేయస్ను మరోసారి ప్రశ్నించారు. అయితే సూర్యవంశీ జట్టులో ఉంటాడా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వకుండా అయ్యర్.. ఈ రాజస్తాన్ చిచ్చరపిడుగుపై ప్రశంసల జల్లు కురిపించాడు."సూర్యవంశీ అద్భుతమైన ఆటగాడు. వైభవ్ వంటి గన్ ప్లేయర్ను బెంచ్లో కూర్చోబెట్టడం కెప్టెన్గా ఎంత కష్టమో నాకు తెలుసు. అలాగే అతడికి ఎప్పుడు అవకాశం ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకోవడం టీమ్ మేనేజ్మెంట్కు కూడా సవాల్గా మారింది. ఎందుకంటే గత కొన్ని సిరీస్లుగా అద్భుతంగా రాణించిన ఎంతో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ప్రస్తుతం జట్టులో ఉన్నారు. కాబట్లట్టి సీనియర్లకు మద్దతుగా నిలవాల్సిన అవసరముంది. కానీ వైభవ్కు ఎప్పుడు అవకాశం వచ్చినా ఖచ్చితంగా అత్యుత్తమంగా రాణిస్తాడన్న నమ్మకం నాకు ఉందని" శ్రేయస్ వెల్లడించాడు. అయితే శ్రేయస్ వ్యాఖ్యలను బట్టి చూస్తే వైభవ్కు మరోసారి నిరాశే ఎదురయ్యే అవకాశముంది.చదవండి: ఆస్ట్రేలియాకు గుడ్ బై.. వేరే దేశానికి ఆడనున్న స్టార్ ఆల్రౌండర్ -
విరాట్ కోహ్లికి సంబంధించి బిగ్ న్యూస్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి సంబంధించి ఓ బిగ్ న్యూస్ అందింది. త్వరలో అతడు వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్కు వెళ్లాల్సి ఉన్నా, ఇంకా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లోనే ఉన్నాడు. విరాట్ ఐపీఎల్ 2026 ఫైనల్లో గాయపడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడు పునరావాస కార్యక్రమంలోనే ఉన్నట్లు తెలుస్తోంది.గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో విరాట్ హ్యామ్స్ట్రింగ్కు గాయమైంది. గాయం ఉన్నప్పటికీ అతడు మొత్తం ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్కు దూరమయ్యాడు.ఫిట్నెస్ క్లియరెన్స్ వచ్చినట్టే.. కానీ..?ఇంగ్లండ్ సిరీస్కు ముందు విరాట్ CoEలో ఫిట్నెస్ టెస్ట్ పూర్తి చేశాడని, అతడికి క్లియరెన్స్ కూడా లభించిందని పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అందుకే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అతడిని జట్టులోకి ఎంపిక చేసినట్లు సమాచారం.అయితే తాజాగా భారత అండర్-19 కెప్టెన్ ఆయుశ్ మాత్రేతో కలిసి విరాట్ CoEలో కనిపించాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అతడు ఇంకా రిహాబిలిటేషన్లోనే ఉన్నాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లండ్తో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జులై 14 నుంచి ప్రారంభమవుతుంది. దీనికి ముందు భారత జట్టు ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతుంది. విరాట్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా ఐర్లాండ్తో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్లో భాగంగా నిన్న జరిగిన తొలి టీ20లో భారత్ చిత్తుగా ఓడింది.అసలు గాయం ఏంటి..?విరాట్కు డిస్టల్ సెమిమెంబ్రానోసస్ టెండన్ టియర్ అనే అరుదైన హ్యామ్స్ట్రింగ్ గాయం అయినట్లు సమాచారం. ఇది మోకాలి వెనుక భాగంలో ఉండే హ్యామ్స్ట్రింగ్ కండరానికి సంబంధించిన గాయం. దీని నుంచి పూర్తిగా కోలుకోవడానికి సాధారణంగా 6 నుంచి 12 వారాలు పట్టే అవకాశం ఉంటుంది. గాయం తీవ్రతను బట్టి కొన్నిసార్లు శస్త్రచికిత్స కూడా అవసరమవుతుంది. -
టీమిండియా ప్లేయింగ్ 11 చూస్తే.. ఇంగ్లాండ్ వణకాల్సిందే
-
భారత్తో టీ20 సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! యువ సంచలనానికి ఛాన్స్
స్వదేశంలో భారత్తో జరగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా హ్యారీ బ్రూక్ వ్యవహరించనున్నాడు. కాగా టీ20 ప్రపంచకప్తో పాటు ఐపీఎల్లోనూ పేలవ ప్రదర్శన కనబరిచిన స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్కు సెలక్టర్లు మరో అవకాశమిచ్చారు. అతడితో పాటు ఆదిల్ రషీద్, పేసర్ జోఫ్రా ఆర్చర్, ఫిల్ సాల్ట్, టామ్ బాంటన్, సామ్ కరన్ వంటి సీనియర్ ప్లేయర్లు ఈ జట్టులో ఉన్నారు. మరోవైపు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన జోర్డాన్ కాక్స్, సన్నీ బేకర్, సాకిబ్ మహమూద్లు తిరిగి జట్టులోకి వచ్చారు. యువ ఆటగాళ్లు జాకబ్ బెథెల్, విల్ జాక్స్, జోష్ టంగ్ కూడా తమ స్ధానాలను నిలబెట్టుకున్నారు.అయితే ఈ సిరీస్కు స్టార్ ఆల్రౌండర్లు బ్రైడన్ కార్స్, జేమీ ఓవర్టన్లు ఇద్దరూ గాయాల కారణంగా దూరమయ్యారు. దీంతో ససెక్స్ ఆల్రౌండర్ 22 ఏళ్ల జేమ్స్ కోల్స్ తొలిసారి ఇంగ్లండ్ జాతీయ జట్టులో చోటు దక్కింది. టీ20 క్రికెట్లో కోల్స్కు అద్భుతమైన రికార్డు ఉంది. 71 టీ20 మ్యాచ్లు ఆడిన కోల్స్.. 1,373 పరుగులతో పాటు 53 వికెట్లు పడగొట్టాడు. వైటాలిటీ బ్లాస్ట్, ది హండ్రెడ్ టోర్నీలతో పాటు సౌతాఫ్రికా టీ20 వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో ఆడిన అనుభవం ఉంది.భారత్తో సిరీస్ కోసం ఇంగ్లండ్ టీ20 జట్టు:హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సన్నీ బేకర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, జేమ్స్ కోల్స్, జోర్డాన్ కాక్స్, సామ్ కరన్, లియామ్ డాసన్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్. -
ఇంగ్లండ్తో వన్డే సిరీస్.. కోహ్లీ విషయంలో కీలక ప్రకటన!
అప్గానిస్తాన్తో వన్డే సిరీస్కు గాయంతో దూరమైన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ విషయంలో ఒక కీలక అప్డేట్ వచ్చింది. కండరాల గాయంతో బాధపడుతున్న కోహ్లీ వేగంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జూలైలో ఇంగ్లండ్తో జరగనున్న వన్డే సిరీస్కు కోహ్లీ అందుబాటులో ఉంటాడని సమాచారం. ఈ లెక్కన అభిమానులకు కోహ్లీ విషయంలో ఇది గుడ్న్యూస్.జూలై 14 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఐపీఎల్ 2026 సీజన్ సమయంలోనే కోహ్లీ కండరాల గాయంతో సతమతమయ్యాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్లో చివరిదాకా బ్యాటింగ్ చేయడంతో కోహ్లీ కండరాల గాయం తీవ్రత పెరిగిపోయింది. దీంతో ఫైనల్ పూర్తయిన మరుసటి రోజే కోహ్లీ తన కాలిని స్కాన్ చేయించుకున్నాడు. రిపోర్ట్లో కోహ్లి కాలిలో ఉండే డిస్టల్ సెమిమెంబ్రానోనస్ టెండన్ టియర్లో చీలిక వచ్చినట్లు తేలింది. డిస్టల్ సెమిమెంబ్రానోనస్ అనేది మోకాలి వెనుక భాగంలో ఉంటుంది. దీనిలో చీలిక వస్తే అది కాలి కండరాలను తీవ్రంగా బాధిస్తోంది. ఇది అత్యంత అరుదుగా జరుగుతుందని, కోలుకోవడానికి ఒక్కోసారి ఆరు నెలలు సమయం పడుతుందని వైద్యబృందం తెలిపింది. కానీ కోహ్లీ విషయంలో అద్భుతం జరిగిందని, అతడి అసామాన్యమైన ఫిట్నెస్ కారణంగా నాలుగు వారాల్లోనే పూర్తిగా కోలుకుంటాడని పేర్కొన్నారు. దీంతో ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు కోహ్లీ అందుబాటులో ఉంటాడనే వార్తలు వస్తున్న వేళ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్లో ఇప్పటికే చాలా రికార్డులు తన పేరిట లిఖించుకున్న కోహ్లీ సచిన్ వంద అంతర్జాతీయ సెంచరీల రికార్డును అందుకుంటాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది. 37 ఏళ్ల కోహ్లీ కెరీర్లో ఇప్పటివరకు 85 అంతర్జాతీయ సెంచరీలున్నాయి. 2027 వన్డే ప్రపంచకప్ కోహ్లీకి ఆఖరి టోర్నీ అని ప్రచారం జరుగుతున్న వేళ టీమిండియా ఆ టోర్నీ వచ్చేలోగా స్వదేశం, విదేశం కలిపి సుమారు 28 నుంచి 30 వన్డేల వరకు ఆడే అవకాశముంది. ఇందులోనే ఆసియా కప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ ఉన్నాయి. ఈ లెక్కన సచిన్ రికార్డును బద్దలు కొట్టడానికి కోహ్లీకి ఇది మంచి అవకాశమని చెప్పొచ్చు.చదవండి: భారత తుది జట్టు ఇదే.. అతడికి నో ఛాన్స్! యార్కర్ల కింగ్ అరంగేట్రం? -
భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్లో కీలక మార్పు
త్వరలో స్వదేశంలో భారత్తో జరుగబోయే 5 మ్యాచ్ల టీ20 సిరీస్కు సంబంధించి ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ వీక్షకుల సంఖ్య పెంచేందుకు మూడు మ్యాచ్ల ప్రారంభ సమయాలను మార్చింది.వాస్తవానికి ఈ మ్యాచ్లు స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు) ప్రారంభం కావాల్సి ఉంది. అయితే బ్రాడ్కాస్టర్లతో చర్చల అనంతరం వాటిని సాయంత్రం 5.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు) ప్రారంభించాలని నిర్ణయించారు.ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం భారత ప్రేక్షకులే. భారత్లో క్రికెట్కు ఉన్న విపరీతమైన ఆదరణ దృష్ట్యా, మ్యాచ్లు మరింత ఎక్కువ మంది వీక్షించేలా టైమింగ్ను మార్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో బ్రిటన్కు చెందిన స్కై స్పోర్ట్స్, భారత్కు చెందిన సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లతో ECB సంప్రదింపులు జరిపింది.కాగా, జూలై 1 నుంచి 19 వరకు భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటనుంది. ఈ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేలు జరుగనున్నాయి. టీ20 సిరీస్ కోసం భారత జట్టును తాజాగా ప్రకటించారు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత జట్టు ఈ సిరీస్కు సిద్ధమవుతోంది. 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ తొలిసారి సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవడంతో ఈ పర్యటనపై మరింత ఆసక్తి నెలకొంది. -
నేడే భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకు ఛాన్స్?
2026 టీ20 వరల్డ్ చాంపియన్గా నిలిచిన తర్వాత భారత్ తమ తర్వాతి సిరీస్కు సమాయత్తమవుతోంది. ఐర్లాండ్, ఇంగ్లండ్లలో జరిగే సిరీస్లలో తలపడే భారత జట్లను నేడు సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది. జూన్ 26న ప్రారంభమయ్యే ఈ టూర్లో భాగంగా ముందుగా ఐర్లాండ్తో 2 టి20లు జరుగుతాయి. ఆ తర్వాత ఇంగ్లండ్తో 5 టి20లు, 3 వన్డేలు ఉంటాయి. వీటితో పాటు సెప్టెంబర్–అక్టోబర్లలో జపాన్లో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే టీమ్ను కూడా అజిత్ అగార్కర్ నాయకత్వంలోని కమిటీ ఎంపిక చేస్తుంది. సూర్యకుమార్పై వేటు తప్పదా! రెండు ఫార్మాట్లలో రెగ్యులర్ సభ్యుల ఎంపికను మినహాయిస్తే రెండు అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. టి20 కెపె్టన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్ను తొలగించడం ఖాయమైపోయింది. అతని సారథ్యంలో వరల్డ్ కప్ గెలుచుకున్న వెంటనే ఇది చోటు చేసుకోనుండటం గమనార్హం. 2025లో ఐసీసీ టోర్నీ చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకొని ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన తర్వాత కూడా రోహిత్ శర్మ తన కెపె్టన్సీని కోల్పోయాడు. సూర్య విషయంలో కూడా అదే జరుగుతోంది. అయితే రోహిత్ ఆటగాడిగా తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగాడు. కానీ సూర్య టీమ్లో కూడా చోటు కోల్పోనున్నాడు. వరల్డ్ కప్ నెగ్గినా సుదీర్ఘ కాలంగా అతని ఫామ్ పేలవంగా ఉంది. వరల్డ్ కప్లో 9 ఇన్నింగ్స్లలో కలిపి 242 పరుగులే చేసిన సూర్య... ఐపీఎల్లోనూ దానిని కొనసాగిస్తూ 13 ఇన్నింగ్స్లలో 270 పరుగులే చేయగలిగాడు. 2028 టీ20 వరల్డ్ కప్, అదే ఏడాది జరిగే లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ను దృష్టిలో ఉంచుకొని టి20 టీమ్ను సిద్ధం చేస్తున్న సెలక్టర్లు 36 ఏళ్ల సూర్యకు మరో అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. సూర్య స్థానంలో మరో ముంబైకర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడంతో పాటు బ్యాటింగ్ ఆర్డర్లో అతని నాలుగో స్థానాన్ని కూడా భర్తీ చేయనున్నాడు. శ్రేయస్ 2023 డిసెంబర్లో భారత్ తరఫున చివరిసారిగా టి20 ఆడినా...ఐపీఎల్లో తన బ్యాటింగ్తో పాటు కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. మూడు వేర్వేరు ఫ్రాంచైజీలను ఐపీఎల్ ఫైనల్కు చేర్చిన అతని నాయకత్వంలో 2024లో కోల్కతా విజేతగా నిలవగా... 2020, 2025లో ఢిల్లీ, పంజాబ్కు రన్నరప్గా నిలిచాయి. లాంఛనమేనా! మరోవైపు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ భారత జట్టులోకి రావడం లాంఛనమే కావచ్చు. అసాధారణ ఆటతో అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకున్న వైభవ్ను ఎంపిక చేసేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. ఐపీఎల్లో ఏకంగా 237.30 సగటుతో అతను 776 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. అయితే భారత టీ20 జట్టు టాప్–3 అభిషేక్ శర్మ, సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్లతో పటిష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో వైభవ్ను ఆడించడం కష్టంగా అనిపిస్తున్నా... ఆసియా క్రీడలకు మాత్రం అతను ఎంపిక కావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. -
టి20 ప్రపంచకప్లో తుది పోరుకు భారత్. సెమీస్లో 7 పరుగులతో ఇంగ్లండ్పై గెలుపు
-
వైభవ్ సూర్యవంశీ అరెస్ట్కు డిమాండ్
హరారే వేదికగా నిన్న (ఫిబ్రవరి 6) జరిగిన అండర్-19 ప్రపంచకప్ 2026 ఫైనల్లో ఇంగ్లండ్పై భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, ఆరోసారి జగజ్జేతగా ఆవిర్భవించింది. ఈ మ్యాచ్లో యంగ్ ఇండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి భారత్ను గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్ అండర్ 19 క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమమైందిగా కీర్తించబడుతుంది. ఈ ఇన్నింగ్స్లో వైభవ్ కేవలం 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 175 పరుగులు చేశాడు. అండర్ 19 లెవెల్లోనే కాదు, యావత్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్లలో ఇదీ ఒకటిగా నిలిచిపోతుంది. ఈ ఇన్నింగ్స్లో వైభవ్ విధ్వంసం నభూతో నభవిష్యతి అన్నట్లుగా సాగింది. 14 కుర్ర వైభవ్ ఇంగ్లండ్ బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు. పడ్డ బంతిని పడ్డట్టు ఎడాపెడా బాదాడు. వైభవ్లోని ఫైర్ చూసి ఇంగ్లండ్ బౌలర్లు వణికిపోయారు. ఏం చేయాలో.. బంతిని ఎక్కడ వేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. వైభవ్ను ఆపడం ఇంగ్లండ్ బౌలర్ల వల్ల కాలేదు. విచక్షణారాహిత్యంగా సాగిన వైభవ్ ఇన్నింగ్స్ యావత్ క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. 14 ఏళ్ల పిల్లాడు ఇంతలా రెచ్చిపోవడమేంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. వైభవ్ విధ్వంసాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు మారణహోమంగా అభివర్ణిస్తున్నారు. ఐస్లాండ్ క్రికెట్ అయితే ఓ అడుగు ముందుకేసి వైభవ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఐస్లాండ్ క్రికెట్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. ఇంగ్లండ్ బౌలర్లపై వైభవ్ విరుచుకుపడిన తీరును ఐస్లాండ్ క్రికెట్ ఎక్స్ రేటెడ్ హింసగా పేర్కొంది. Someone arrest Vaibhav Sooryavanshi right now. This violence on the field against the English bowlers is X-rated!— Iceland Cricket (@icelandcricket) February 6, 2026ఐస్లాండ్ క్రికెట్ ఈ ట్వీట్ను సరదాగా చేసినా, నెటిజన్లు దీన్ని నిజంగానే అన్వయించుకుంటున్నారు. ఎందుకంటే, ఇంగ్లండ్ బౌలర్లపై వైభవ్ విరుచుకుపడిన తీరు ఎక్స్ రేటెడ్ హింసలాగే ఉంది. ఆ బాదుడు నిజంగానే ఇంగ్లండ్ ఆటగాళ్లను భయబ్రాంతులకు గురి చేసింది. ఇది తలచుకొని వారు కొన్ని నెలలైనా సుఖంగా నిద్రపోలేరు. అంతలా సాగించి వైభవ్ బీభత్సం.ఈ సునామీ ఇన్నింగ్స్తో వైభవ్ ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు. ఇందులో అత్యధిక సిక్సర్లు, ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ వంటి భారీ రికార్డులు కూడా ఉన్నాయి. వైభవ్ ఊచకోత కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్స్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్.అనంతరం కష్టసాధ్యమైన ఛేదనలో ఇంగ్లండ్ అద్భుతంగా పోరాడింది. అయితే లక్ష్యం అతి భారిది కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. కాలెబ్ (115) వీరోచిత శతకంతో ఆకట్టుకున్నాడు. చివరికి ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటై, 100 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. వరల్డ్ రికార్డు బ్రేక్
అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో భారత బ్యాటర్లు జూలు విధిల్చారు. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన భారత యువ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అయితే కనీవినీ ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టించాడు.హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఓపెనర్ ఆరోన్ జార్జ్ త్వరగా ఔటైనప్పటికి వైభవ్ మాత్రం కెప్టెన్ ఆయూష్ మాత్రేతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అతడి బ్యాటింగ్ చూసి ప్రత్యర్ది బౌలర్లు గజగజ వణికిపోయారు. ఈ క్రమంలో అతడు కేవలం 55 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు.ఓవరాల్గా సూర్యవంశీ 80 బంతుల్లో 175 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. అతడితో పాటు మాత్రే(53), అభిజ్ఞాన్ కుండు(40), కనిష్క్ చౌహాన్(37) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ మింటో మూడు వికెట్లు పడగొట్టగా.. సెబాస్టియన్ మోర్గాన్, అలెక్స్ గ్రీన్ తలా రెండు వికెట్లు సాధించారు.టీమిండియా సరికొత్త చరిత్రఅండర్-19 ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. అండర్-19 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్పై ఆసీస్ 253 పరుగులు చేసింది. తాజా మ్యాచ్లో 411 పరుగులు చేసిన యంగ్ ఇండియా.. కంగారుల ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేసింది.అండర్-19 ప్రపంచకప్లో 400 పరుగుల మార్కును అత్యధిక సార్లు దాటిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. టీమిండియా మూడు సార్లు 400కు పైగా టోటల్స్ను నమోదు చేసింది. -
వరల్డ్కప్ ఫైనల్లో వైభవ్ విధ్వంసం.. జస్ట్ డబుల్ సెంచరీ మిస్
అండర్-19 ప్రపంచకప్ 2026 ఫైనల్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తుది పోరులో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. అతడి బ్యాటింగ్ తుఫాను ముందు బౌండరీలు చిన్నబోయాయి.ఈ క్రమంలో కేవలం 55 బంతుల్లోనే వంద పరుగుల మార్కును వైభవ్ అందుకున్నాడు. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్గా వైభవ్ రికార్డులకెక్కాడు. తొలి స్దానంలో ఆస్ట్రేలియాకు చెందిన విల్ మలాజ్జుక్(51) ఉన్నాడు. అయతే ఈ ఫైనల్ మ్యాచ్లో వైభవ్ సునాయసంగా డబుల్ సెంచరీ సాధిస్తాడని అంతా భావించారు. కానీ ద్విశతకానికి 25 పరుగుల దూరంలో అతడు నిలిచిపోయాడు. ఓ భారీ షాట్కు ప్రయత్నించి సూర్యవంశీ తన వికెట్ను కోల్పోయాడు. ఓవరాల్గా 80 బంతులు ఎదుర్కొన్న వైభవ్..15 ఫోర్లు, 15 సిక్స్లతో 175 పరుగులు చేశాడు. అతడి విధ్వంసం ఫలితంగా భారత్ స్కోర్ 25 ఓవర్లకే 250 పరుగుల మార్క్ దాటిపోయింది.కెప్టెన్ ఆయుష్ మాత్రేతో కలిసి వైభవ్ సూర్యవంశీ రెండో వికెట్కు 142 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కాగా ఈ మ్యాచ్లో తుపాన్ ఇన్నింగ్స్ ఈ బిహార్ ఆటగాడు పలు వరల్డ్ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.చరిత్ర సృష్టించిన వైభవ్అండర్-19 ప్రపంచకప్ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ ఆటగాడు మైఖేల్ హిల్(12) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో మైఖేల్ హిల్ రికార్డును వైభవ్(15) బ్రేక్ చేశాడు. అదేవిధంగా అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత ఆటగాడిగా 14 ఏళ్ల వైభవ్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు రాజ్ అంగద్ బావా పేరిట ఉండేది. అతడు 2022లో ఉగాండాపై 69 బంతుల్లో సెంచరీ సాధించాడు.Carnage continues as Vaibhav Sooryavanshi brings up 150 in style! 🔥🤩The English bowlers have no answers as the Boss Baby is going all guns blazing with towering sixes! 🙌🏻😮💨ICC Men's #U19WorldCup | FINAL | #INDvENG | LIVE NOW 👉 https://t.co/ZFk8pN9tv3 pic.twitter.com/Dkh4YCXOEC— Star Sports (@StarSportsIndia) February 6, 2026 -
మా ఓటమికి కారణమదే.. చాలా బాధగా ఉంది: టీమిండియా కెప్టెన్
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో భారత జట్టు ఓటముల పరంపర కొనసాగుతోంది. ఆదివారం ఇండోర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 289 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో చివరి ఓవర్లలో తడబడిన భారత జట్టు.. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ను చేజార్చుకుంది.ఇది భారత్కు వరుసగా మూడో ఓటమి. ఈ ఓటమితో భారత్ సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇక మిగిలిన రెండు మ్యాచ్లను గెలిస్తేనే మన అమ్మాయిల జట్టు నేరుగా సెమీఫైనల్స్కు ఆర్హత సాధించనుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ స్పందించింది. స్మృతి మంధాన వికెట్తో మ్యాచ్ ఇంగ్లండ్ వైపు టర్న్ అయిందని హర్మన్ చెప్పుకొచ్చింది."గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయినందుకు చాలా బాధగా ఉంది. స్మృతీ మంధాన వికెట్తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అప్పటివరకు మేము గేమ్లో ఉన్నాము. ఈజీగా గెలుస్తామనుకున్నాము. మంధాన వికెట్ పడిన తర్వాతే మేము పట్టు కోల్పోయాము. కానీ ఇంగ్లండ్ బౌలర్లకు కూడా క్రెడిట్ ఇవ్వాలి.వారు ఆఖరి వరకు అద్భుతంగా బౌలింగ్ చేసి మాపై ఒత్తడి పెంచారు. వరుస క్రమంలో వికెట్లు పడగొట్టి మ్యాచ్ను మా నుంచి లాగేసుకున్నారు. ఈ మ్యాచ్లో మేము అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచాము. ప్రతీది మేము అనుకున్నట్లు సాగింది. కానీ చివరి ఐదు-ఆరు ఓవర్లలో విఫలమయ్యాము. నిజంగా మాకు ఇది హార్ట్ బ్రేకింగ్ మూమెంట్. గత కొంతకాలంగా మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్ను కొనసాగిస్తున్నాము. కానీ దురదృష్టవశాత్తూ ఓడిపోతున్నాము. మాకు తదుపరి మ్యాచ్ చాలా కీలకం. ఈ మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన కనబరిచి విజయం సాధిస్తాము అని ఆశిస్తున్నాను.ఈ మ్యాచ్లో బౌలర్లు కూడా మెరుగ్గా రాణించారు. నాట్ స్కీవర్, హీథర్ క్రీజులో ఉన్నప్పుడు ఇంగ్లండ్ భారీ స్కోర్ చేస్తుందని భావించాము. కానీ మా బౌలర్లు కమ్బ్యాక్ ఇచ్చి వారిని 300 పరుగులలోపు కట్టడి చేశారు. కానీ బౌలింగ్లో కూడా చివరి ఐదు ఓవర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నాము. మేము ఈ విషయంపై డ్రెస్సింగ్ రూమ్లో చర్చించుకుంటున్నాము. ఈ మ్యాచ్లో అదనపు బౌలర్తో ఆడాలనుకున్నాము. అందుకే జెమిమా స్దానంలో రేణుకాను ఆడించాలనుకున్నాము. స్మతి, నేనూ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాము. ఆ తర్వాత రిచా, అమన్ జోత్, దీప్తి లాంటి ప్లేయరర్లు ఉండడంతో ఈజీగా గెలుస్తామనుకున్నాము. ఏదేమైనప్పటికి ఈరోజు అదృష్టం మా వైపు లేదు. తర్వాత మ్యాచ్లో తిరిగి పుంజుకుంటామన్న నమ్మకం ఉంది అని హర్మన్ పేర్కొంది.చదవండి: నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్ -
CWC 2025: చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్
భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ (Deepthi Sharma) వన్డే క్రికెట్లో అరుదైన ఘనత సాధించింది. 2000 పరుగులతో పాటు 150 వికెట్లు తీసిన తొలి భారత ప్లేయర్గా చరిత్ర సృష్టించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ అరుదైన ఫీట్ను నమోదు చేసిన నాలుగో క్రికెటర్గా రికార్డు నెలకొల్పింది.వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) భాగంగా ఇండోర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో (India vs England) ఈ గ్రాండ్ డబుల్ను సాధించింది. ఈ మ్యాచ్లో దీప్తి మొత్తం 4 వికెట్లు తీసి తన వన్డే వికెట్ల సంఖ్యను 153కి పెంచుకుంది. బ్యాటింగ్లో దీప్తి 2607 పరుగులు చేసింది.దీప్తికి ముందు స్టెఫనీ టేలర్ (వెస్టిండీస్, 5873 పరుగులు, 155 వికెట్లు), ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా , 4414, 166), మారిజన్ కాప్ (దక్షిణాఫ్రికా, 3397, 172) మాత్రమే వన్డేల్లో 2500 పరుగులతో పాటు 150 వికెట్లు తీసిన ఆల్రౌండర్లుగా ఉన్నారు.దీప్తి ప్రభంజనంప్రస్తుత వన్డే ప్రపంచకప్లో దీప్తి ప్రభంజనం కొనసాగుతుంది. ఈ మెగా టోర్నీలో ఆమె ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 13 వికెట్లు తీసి లీడింగ్ వికెట్టేకర్గా కొనసాగుతోంది. టోర్నీ ఓపెనర్లో శ్రీలంకపై హాఫ్ సెంచరీ సహా 3 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచింది.మ్యాచ్ విషయానికొస్తే.. దీప్తి శర్మ (10-0-51-4) బంతితో రాణించినప్పటికీ ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. హీథర్ నైట్ (91 బంతుల్లో 109; 15 ఫోర్లు, సిక్స్) మెరుపు సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. నైట్తో పాటు ఓపెనర్ యామీ జోన్స్ (56) రాణించింది. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (38) పర్వాలేదనిపించింది.మరో ఓపెనర్ ట్యామీ బేమౌంట్ 22, సోఫీ డంక్లీ 11, అలైస్ క్యాప్సీ 2, సోఫీ ఎక్లెస్టోన్ 3 పరుగులు చేశారు. ఛార్లోట్ డీన్ (19), లిన్సే స్మిత్ (0) నాటౌట్గా నిలిచారు. భారత బౌలర్లలో దీప్తి శర్మతో పాటు శ్రీ చరణి (10-0-68-2) మాత్రమే వికెట్లు తీసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 42 పరుగులకే ప్రతిక రావల్ (6), హర్లీన్ డియోల్ (24) వికెట్లు కోల్పోవడంతో ఆచితూచి ఆడుతుంది. స్మృతి మంధన (34), కెప్టెన్ హర్మన్ (33) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. 19.1 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 100/2గా ఉంది. చదవండి: టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్.. కోహ్లి సరసన గిల్ -
‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్’గా సిరాజ్
ఇంగ్లండ్తో గత నెలలో ఓవల్లో జరిగిన ఐదో టెస్టులో విశేషంగా రాణించిన భారత పేస్ బౌలర్, హైదరాబాద్ క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’గా ఎంపికయ్యాడు. ఇంగ్లండ్తో ఆగస్టులో జరిగిన చివరి టెస్టులో సిరాజ్ తొమ్మిది వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఆఖరి టెస్టులో గెలిచిన భారత్ ఐదు టెస్టుల సిరీస్ను 2–2తో సమంగా ముగించింది. ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా ఎంపిక కావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ నా కెరీర్లో చిరస్మరణీయమైనది. హోరాహోరీగా జరిగిన ఆ సిరీస్లో నేనూ భాగస్వామి కావడం ఆనందంగా ఉంది’ అని సిరాజ్ వ్యాఖ్యానించాడు. 2021లో ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డులను ప్రారంభించింది. ఇప్పటి వరకు భారత్ నుంచి రిషభ్ పంత్ (2021–జనవరి), రవిచంద్రన్ అశి్వన్ (2021–ఫిబ్రవరి), భువనేశ్వర్ కుమార్ (2021–మార్చి), శ్రేయస్ అయ్యర్ (2022–ఫిబ్రవరి; 2025–మార్చి), విరాట్ కోహ్లి (2022–అక్టోబర్), శుబ్మన్ గిల్ (2023–జనవరి;2023–సెపె్టంబర్; 2025–ఫిబ్రవరి, 2025–జూలై), యశస్వి జైస్వాల్ (2024–ఫిబ్రవరి), జస్ప్రీత్ బుమ్రా (2024–జూన్; 2024–డిసెంబర్) ఈ అవార్డులు గెల్చుకున్నారు. చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
కోహ్లి, గిల్ కాదు.. అతడికి బౌలింగ్ చేయడం కష్టం: ఇంగ్లండ్ స్టార్ పేసర్
మార్క్ వుడ్.. వరల్డ్ క్రికెట్లో అత్యంత వేగంతో బంతులు సంధించే పేస్ బౌలర్లలో ఒకడు. గంటకు 150 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగల సత్తా అతడిది. కానీ ఈ ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ను ఓ బ్యాటర్ భయపెట్టాడంట. సదరు బ్యాటర్కు బౌలింగ్ చేసేందుకు వుడ్ తీవ్రంగా శ్రమించాడంట.ఆ బ్యాటర్ ఎవరో కాదు టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ ఏడాది మార్చి నుంచి గాయం కారణంగా ఇంగ్లండ్ జట్టుకు దూరంగా ఉంటున్న మార్క్ వుడ్.. తిరిగి తన ఫిట్నెస్ను పొందేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. యాషెస్ సిరీస్ సమయానికి గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.అయితే మార్క్ వుడ్ తాజాగా ఓవర్లాప్ క్రికెట్ అనే యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఇప్పటివరకు తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాటర్ ఎవరన్న ప్రశ్న వుడ్కు ఎదురైంది. అందుకు అతడు బదులుగా రోహిత్ శర్మ పేరును చెప్పాడు. 35 ఏళ్ల మార్క్ వుడ్ అన్ని ఫార్మాట్లలోనూ హిట్మ్యాన్ను ఎదుర్కొన్నాడు."నా కెరీర్లో ఇప్పటివరకు నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాటర్ రోహిత్ శర్మ. ఫార్మాట్ ఏదైనా కానీ అతడికి బౌలింగ్ చేసేందుకు ఇబ్బంది పడ్డాను. షార్ట్ బాల్ వేసినప్పుడు అతడిని ఔట్ చేసే అవకాశం ఉందని అనిపిస్తుంది. కానీ ఆ రోజు అతడు మంచి రిథమ్లో ఉంటే అపడం ఎవరి తరం కాదు. భారీ షాట్లతో విరుచుకుపడతాడు" అని వుడ్ పేర్కొన్నాడు.అదేవిధంగా విరాట్ కోహ్లి గురుంచి కూడా వుడ్ మాట్లాడాడు. "కోహ్లికి అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ప్రతీ బౌలర్కు అతడి నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. కానీ ఆఫ్సైడ్ ఫోర్త్, ఫిఫ్త్ స్టంప్లైన్లో వచ్చే బంతులు ఆడే విషయంలో మాత్రం అతడికి బలహీనత ఉంది. వాటికి తప్ప మరో బంతికి అతడిని అవుట్ చేయడం చాలా కష్టం" అని మార్క్ వుడ్ చెప్పుకొచ్చాడు. యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా ద్వయం స్టీవ్ స్మిత్, మిచెల్ మార్ష్లకు బౌలింగ్ చేయడం కష్టమని ఈ ఇంగ్లీష్ స్పీడ్ స్టార్ తెలిపాడు.చదవండి: పాక్, భారత్, శ్రీలంక కాదు.. ఆసియాకప్ గెలిచేది వాళ్లే: పాక్ మాజీ క్రికెటర్ -
ఆ క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను: ఇంగ్లండ్ స్పిన్నర్
ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ వేసిన బంతి భారత ఆటగాడు సిరాజ్ బ్యాట్ను తాకి కింద పడిన బంతి అనూహ్యంగా అతని వెనుక వైపునకు వెళ్లి స్టంప్స్కు తగిలింది. అంతే...చివరి వికెట్ తీసిన ఇంగ్లండ్ లార్డ్స్ మైదానంలో 22 పరుగులతో అద్భుత విజయాన్ని అందుకుంది. అప్పటికే 29 బంతులు ఆడి జడేజాకు సహకరించిన సిరాజ్ తీవ్ర నిరాశలో మునిగిపోగా, బౌలర్ బషీర్ సంబరాలు చేసుకున్న ఈ దృశ్యం అభిమానులను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈ మ్యాచ్లో ఎడమ చేతికి గాయమైన బషీర్ రెండో ఇన్నింగ్స్లో 35 బంతులు మాత్రమే వేసి ఈ కీలక వికెట్ పడగొట్టాడు. ఈ ఘటనను బషీర్ చాలా సంతోషంగా గుర్తు చేసుకున్నాడు. ఆ అనుభూతి తాను ఎప్పటికీ మర్చిపోలేనని అతను వ్యాఖ్యానించాడు. ‘మేం పట్టుదలగా ప్రయత్నిస్తున్నా వికెట్ మాత్రం దక్కడం లేదు. బయట కూర్చున్న నేను ఎలాగైనా మైదానంలోకి దిగాలని పదే పదే కోరుకున్నాను. నాపై నమ్మకంతో స్టోక్స్ అవకాశం ఇచ్చాడు. నేను మ్యాచ్ ఫలితాన్ని మార్చగలగడం సంతోషాన్నిచ్చింది.సిల్లీ పాయింట్లో రూట్ను పెట్టి సిరాజ్పై ఒత్తిడి పెంచుతూ ప్రతీ బంతి భిన్నంగా వేసేందుకు ప్రయతి్నంచాం. సిరాజ్ ఆ బంతిని ఆడాక అసలేం అర్థం కాలేదు. అందరూ ఎటు పోయింది అని చూస్తున్నారు. నాకైతే అస్సలు కనిపించలేదు. మావాళ్ల స్పందన చూసిన తర్వాతే నేనూ స్పందించాను.ఆ క్షణం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. లార్డ్స్లాంటి ప్రత్యేక మైదానంలో స్టేడియం నిండుగా ఉన్న అభిమానుల మధ్య లభించిన ఆ ఆనందానికి మించి ఇంకేం ఉంటుంది’ అని బషీర్ భావోద్వేగం ప్రదర్శించాడు. ఇంగ్లండ్ మాజీ ఆల్రౌండర్ మొయిన్ అలీ ఇచ్చిన సూచనలతోనే తన ఆఫ్ స్పిన్ బౌలింగ్ ఎంతో మెరుగైందని బషీర్ అన్నాడు. తనకు అలీ ఎంతో సహకరించాడని బషీర్ చెప్పాడు.‘తొలి టెస్టు సమయంలోనే మొయిన్ అలీని కలిశాను. క్యారమ్ బాల్ వేయమని అతను ప్రోత్సహించాడు. దాంతో ప్రాక్టీస్తో మెరుగుపర్చుకున్నా. ఇంగ్లండ్లో ఒక ఆఫ్స్పిన్నర్ రాణించడం అంత సులువు కాదు. అలీ నన్ను సరిగ్గా మార్గనిర్దేశనం చేశాడు. ఇంగ్లండ్ శిబిరానికి ఆయన వచ్చిన తర్వాత నా మీద నాకు నమ్మకం పెరిగింది’ అని బషీర్ వెల్లడించాడు.లార్డ్స్ మ్యాచ్ తర్వాత గాయంతో బషీర్ చివరి రెండు టెస్టులకు దూరమయ్యాడు. భారత్తో సిరీస్ చాలా అద్భుతంగా సాగిందని, పలువురు గొప్ప ఆటగాళ్లకు ప్రత్యరి్థగా తలపడి తాను ఎంతో నేర్చుకున్నానన్న ఈ ఇంగ్లండ్ స్పిన్నర్...తన ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. -
బుమ్రా మూడు మ్యాచ్లు ఆడితే తప్పేంటి? విమర్శకులకు భువీ కౌంటర్
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వర్క్లోడ్ మెనెజ్మెంట్లో భాగంగా కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడటంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ముగిసిన ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో తొలి టెస్టు ఆడిన బుమ్రా రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్నాడు.ఆ తర్వాత మళ్లీ మూడు, నాలుగు టెస్టుల్లో ఆడాడు. ఈ క్రమంలో కీలకమైన ఆఖరి టెస్టుకు బుమ్రా దూరమయ్యాడు. ఐదో టెస్టుకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడాన్ని చాలా మంది మాజీలు తప్పుబట్టారు.వర్క్లోడ్ ఉన్నప్పటికి ముఖ్యమైన మ్యాచ్కు ఎలా విశ్రాంతి ఇస్తారని, ముందే మూడు మ్యాచ్లు మాత్రమే ఆడాతాడని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో బుమ్రా తన సహచర పేసర్ భువనేశ్వర్ కుమార్ మద్దతుగా నిలిచాడు. బుమ్రా 5 టెస్టుల్లో మూడు ఆడినా ఎటువంటి సమస్యలేదు అని భువీ అన్నారు."జస్ప్రీత్ బుమ్రా గత కొన్ని సంవత్సరాలుగా అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నాడు. ప్రతీ ఫార్మాట్లోనూ తన బెస్ట్ను ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. మిగితా వారితో పోలిస్తే బుమ్రా బౌలింగ్ యాక్షన్ కాస్త భిన్నంగా ఉంటుంది. అటువంటి యాక్షన్ ఉన్నప్పుడు బుమ్రానే కాదు మరొకరైనా గాయాల బారిన పడొచ్చు. బుమ్రా ఎల్లప్పుడూ క్లిష్టమైన పరిస్థితుల్లో బౌలింగ్ చేస్తాడు.ఇది అతడిపై మానసిక, శారీరక ఒత్తిడిని కలుగుజేస్తుంది. బుమ్రా లాంటి బౌలర్ సేవలను సుదీర్ఘ కాలం పాటు ఉపయోగించుకోవాలంటే, కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. అతడు ఇంగ్లండ్ సిరీస్లో ఐదు మ్యాచ్లలో మూడింట మాత్రమే ఆడడం నాకేమి తప్పు అన్పించలేదు. ఒక ఆటగాడు మొత్తం ఐదు మ్యాచ్లు ఆడకపోవచ్చు, కానీ ఆడిన మూడు మ్యాచ్లలో తన ప్రభావాన్ని చూపితే చాలు. బుమ్రా కూడా అంతే. ఆడిన మూడు మ్యాచ్లలోనూ తన ఇంపాక్ట్ చూపించాడు" అని పాడ్కాస్ట్ టాక్ విత్ మన్వేంద్రకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భువనేశ్వర్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిన బుమ్రా 14 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.చదవండి: Independence Day: కోహ్లి అలా.. గంభీర్ ఇలా.. పోస్ట్ వైరల్ -
గిల్ ఒక అత్యద్బుతం.. వారిద్దరూ కూడా నిజంగా గ్రేట్: యువరాజ్
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో కెప్టెన్గా, బ్యాటర్గా గిల్ వందకు వంద మార్క్లు కొట్టేశాడు. కెప్టెన్గా తన తొలి సిరీస్లోనే అందరని ఆకట్టుకున్నాడు.అతడి సారథ్యంలోని భారత జట్టు ఐదు మ్యాచ్ల సిరీస్ను 2-2 సమం చేసింది. అదేవిధంగా ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో గిల్ 754 లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో గిల్పై టీమిండియా లెజెండరీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్ వంటి కఠిన పరిస్థితుల్లో జట్టును బాగా నడిపించాడని గిల్ను యువీ కొనియాడాడు. కాగా గిల్ రోల్ మోడల్ యువీనే కావడం విశేషం."ఇంగ్లండ్ టూర్కు ముందు గిల్ విదేశీ రికార్డులపై ఎన్నో సందేహాలు, ప్రశ్నలు ఉండేవి. కానీ వాటిన్నటిని ఒక్క సిరీస్తో చెరిపేశాడు. కెప్టెన్ అయ్యాక అతడు ఇంగ్లండ్ వంటి కఠిన పరిస్థితుల్లో ఏకంగా నాలుగు టెస్టు సెంచరీలు చేశాడు. కెప్టెన్గా తన తొలి టెస్టు సిరీస్లో ఈ విధమైన ప్రదర్శన కనబరిచడం నిజంగా అత్యద్బుతం. ఓవల్లో చారిత్రత్మక విజయం సాధించిన భారత జట్టు పట్ల చాలా గర్వంగా ఉంది. డ్రా అయినప్పటికి సిరీస్ మనదేనని భావిస్తున్నాను. ఎందుకంటే ఇది యువ భారత జట్టు. ఇంగ్లండ్ వంటి జట్టుతో సిరీస్ డ్రా చేయడం అంత సులువు కాదు. అదేవిధంగా జడేజా, వాషింగ్టన్ సుందర్లు కూడా అద్బుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. చాలా రోజుల తర్వాత ఇద్దరూ భారత బ్యాటర్లు సెంచరీలు చేసి మ్యాచ్ను డ్రా ముగించడం చూశాను. జడేజా ఎప్పటి నుంచో జట్టుకు తన సేవలను అందిస్తున్నాడు. కానీ సుందర్ మాత్రం ఈ తరహా ప్రదర్శన చేయడం చాలా గ్రేట్" అని యువరాజ్ ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: కెప్టెన్గా రుతురాజ్పై వేటు.. జట్టులో పృథ్వీషాకు చోటు -
టెస్ట్ క్రికెట్లో సరికొత్త చరిత్ర
డిజిటల్ వీక్షణకు సంబంధించి టెస్ట్ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించబడింది. భారత్, ఇంగ్లండ్ మధ్య టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ-2025లో భాగంగా జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ను (చివరి రోజు ఓ దశలో) ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫాం JioHotstar ద్వారా రికార్డు స్థాయిలో 13 మిలియన్ మంది వీక్షించారు. డిజిటల్ వీక్షణలో ఇది ఆల్టైమ్ రికార్డు. గతంలో ఏ టెస్ట్ మ్యాచ్కు ఒకేసారి ఇంత వ్యూయర్షిప్ దక్కలేదు. ఈ మ్యాచ్ డిజిటల్ వ్యూయర్షిప్ రికార్డులను తిరగరాసింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్లో భారత్ ఇంగ్లండ్ను 6 పరుగుల స్వల్ప తేడాతో ఓడించి 5 మ్యాచ్ల సిరీస్ను 2-2తో డ్రా చేసుకుంది. చివరి రోజు (ఆగస్ట్ 4) ఇంగ్లండ్ గెలుపుకు 35 పరుగులు అవసరమైన దశలో (చేతిలో 4 వికెట్లు ఉండగా) భారత పేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుతం చేశాడు. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డి (3 వికెట్లు తీసి) టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.రికార్డులు బద్దలుటెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ-2025లో ఒక్కో మ్యాచ్ ఒక్కో ప్రత్యేక అనుభూతిని మిగిల్చింది. ఈ సిరీస్లోని ఐదు మ్యాచ్లు చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగాయి. టెస్ట్ క్రికెట్లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. దీన్ని బట్టి చూస్తే భారత్, ఇంగ్లండ్ మధ్య పోటీ ఏ రేంజ్లో సాగిందో ఇట్టే అర్దమవుతుంది.నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ సిరీస్ను విశ్వవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు వేర్వేరు మాధ్యమాల ద్వారా రికార్డు స్థాయిలో వీక్షించారు. డిజిటల్కు సంబంధించి ఈ సిరీస్ ఆల్టైమ్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సిరీస్ను జియో హాట్స్టార్ ద్వారా 170 మిలియన్లకు పైగా వీక్షించారు. డిజిటల్ ప్లాట్ఫాం చరిత్రలో ఏ టెస్ట్ సిరీస్ను ఇంత మంది వీక్షించలేదు. డిజిటల్లో అత్యధిక రీచ్ను దక్కించుకున్న సిరీస్గా టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ-2025 చరిత్రలో నిలిచిపోతుంది. -
'సిరాజ్ ఒక పోరాట యోధుడు'.. హైదరాబాదీపై పాక్ దిగ్గజం ప్రశంసలు
ఓవల్లో టెస్టులో ఇంగ్లండ్పై అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్పై పాక్ లెజెండరీ పేసర్ వసీం అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. సిరాజ్ ఇక సపోర్ట్ బౌలర్ కాదని, ప్రధాన పేసర్ అని అక్రమ్ కొనియాడాడు.ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ చివరి మ్యాచ్లో సిరాజ్ అద్బుతం చేశాడు. రెండు ఇన్నింగ్స్లలో తొమ్మిది వికెట్లు పడగొట్టి భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్ను 2-2తో భారత్ సమం చేసింది. ఓవరాల్గా ఈ సిరీస్లో సిరాజ్(23) లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. అంతేకాకుండా సిరాజ్ సిరీస్ మొత్తంగా 1000 పైగా బంతులను బౌలింగ్ చేసి తన ఫిట్నెస్ ఎంటో చాటిచెప్పాడు."సిరాజ్కు తపన, పట్టుదల ఎక్కువ. ఓవల్ టెస్టులో సిరాజ్ ప్రదర్శన గురుంచి ఎంత చెప్పుకొన్న తక్కువే అవుతోంది. నిజంగా అతడు అద్బుతం చేశాడు. ఐదు టెస్టుల్లో దాదాపు 186 ఓవర్లు బౌలింగ్ చేసి, ఆఖరి రోజు కూడా అంతే ఉత్సాహంగా ఉండటం నిజంగా గ్రేట్. అతడు శారీరకంగా, మానసికంగా శారీరకంగా చాలా దృడంగా ఉన్నాడు.సిరాజ్ ఇకపై కేవలం సపోర్ట్ బౌలర్ కాదు. బుమ్రా గైర్హజరీలో భారత పేసర్ పేస్ ఎటాక్ను సిరాజ్ లీడ్ చేస్తున్నాడు. హ్యారీ బ్రూక్ క్యాచ్ను సిరాజ్ విడిచిపెట్టినప్పటికి, తన ఏకాగ్రతను, ఆత్మవిశ్వాసాన్ని ఏ మాత్రం కోల్పోలేదు. అది ఒక పోరాట యోధుడి లక్షణం.టెస్ట్ క్రికెట్ ఎప్పటికీ తన ఉనికిని కోల్పోదు. నేను పనిలో ఉన్నప్పుడు క్రికెట్ చాలా అరుదుగా చూస్తూ ఉంటాను. కానీ ఆఖరి రోజు ఆటను చూసేందుకు టీవీకి అతుక్కుపోయాను" అని టెలికాం ఆసియా స్పోర్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆక్రమ్ పేర్కొన్నాడు.చదవండి: ఆసియాకప్-2025కు శుబ్మన్ గిల్ దూరం!? -
అతడొక రియల్ హీరో.. భారత క్రికెట్కు అటువంటి వారే కావాలి: కపిల్ దేవ్
ఆండర్సన్- టెండూల్కర్ ట్రోఫీ 2025లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో సిరాజ్ మొత్తంగా 23 వికెట్లతో సత్తాచాటాడు. తొలి నాలుగు మ్యాచ్లు పక్కన పెడితే ఆఖరి టెస్టులో సిరాజ్ ప్రదర్శన గురించి ఎంత చెప్పుకొన్న తక్కువే.చారిత్రత్మక ఓవల్ మైదానంలో సిరాజ్ మియా బంతితో మ్యాజిక్ చేశాడు. ఈ మ్యాచ్లో తొమ్మిది వికెట్లు పడగొట్టి భారత జట్టు మరుపురాని విజయాన్ని అందించాడు. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు కావాల్సిన సమయంలో సిరాజ్ వేసిన బంతులు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి.ఈ మ్యాచ్ ముగిసి దాదాపు ఆరు రోజులు అవుతున్నప్పటికి సిరాజ్ ప్రదర్శనను ఎవరూ మర్చిపోలేకపోతున్నారు. ఈ క్రమంలో సిరాజ్పై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించారు. సిరాజ్ లాంటి బౌలర్లు భారత జట్టుకు మరింత మంది కావాలని ఆయన అన్నారు."సిరాజ్ రియల్ హీరో. అతడు తన బౌలింగ్ సిద్దాంతాన్ని నమ్ముకున్నాడు. అతిగా ఏదీ ప్రయత్నించలేదు. సరైన లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేయడం, ముఖ్యంగా ఆఫ్ స్టంప్ చుట్టూ బంతులు వేస్తూ ప్రత్యర్ధిని బెంబెలెత్తించాడు. జస్ప్రీత్ బుమ్రా గైర్హజరీలో బౌలింగ్ ఎటాక్ను లీడ్ చేశాడు. భారత క్రికెట్కు సిరాజ్ లాంటి వాళ్లు మరి కొంతమంది అవసరం. ఆఖరి రోజు ఆటలో సిరాజ్ చాలా కన్ఫిడెన్స్గా ఉన్నాడు. జట్టు గెలుపు బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. డేంజరస్ బ్యాటర్ జేమీ స్మిత్ను ఔట్ చేసి టీమిండియా శిబిరంలో ఉత్సాహన్ని నింపాడు. సిరాజ్ నాలుగో రోజు ఆటలో ఒక క్యాచ్ వదిలేసాడు. కానీ ఆ తర్వాత బౌలింగ్లో తన సత్తాచూపించాడు. అతడిలో కనీసం ఒత్తిడి కన్పించలేదు. ఇది కొంతమందికే సాధ్యమని" కపిల్దేవ్ మిడ్ డే కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ పేర్కొన్నారు.చదవండి: IND-A vs AUS-A: టీమిండియా ఘోర ఓటమి.. 73 పరుగులకే ఆలౌట్ -
ఆ జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్(Shubman Gill) కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో ఆడేందుకు గిల్ సిద్దమయ్యాడు. స్వదేశంలో వెస్టిండీస్, సౌతాఫ్రికాలతో టెస్టు సిరీస్లను దృష్టిలో పెట్టుకుని గిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నార్త్జోన్ కెప్టెన్గా గిల్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. తాజాగా ప్రకటించిన జట్టులో గిల్తో పాటు యువ పేసర్లు అర్ష్దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్ కూడా చోటు దక్కించుకున్నారు. గిల్కు డిప్యూటీగా అంకిత్ కుమార్ ఎంపికయ్యాడు.ఇంగ్లండ్పై గడ్డపై అదుర్స్..ఇంగ్లండ్పై శుబ్మన్ గిల్ కెప్టెన్గా, ఆటగాడిగా అదరగొట్టాడు. ఈ పంజాబ్ ఆటగాడు కెప్టెన్గా తన తొలి సిరీస్లో మంచి మార్క్లు కొట్టేశాడు. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్ను గిల్ సారథ్యంలోని భారత జట్టు 2-2తో సమం చేసింది. సిరీస్ సమంగా ముగియడంలో గిల్ది కీలక పాత్ర.ఈ సిరీస్లో గిల్ పరుగులు వరద పారించాడు. ఐదు మ్యాచ్లలో 75.40 సగటుతో 754 పరుగులు చేసి గిల్ ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా నిలిచాడు. ఎడ్జ్బాస్టన్లో జరిగిన రెండో టెస్టులో గిల్(261) ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. అదే మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో 161 పరుగులు చేశాడు.ఒక టెస్టు మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్గా గిల్(430) నిలిచాడు. గిల్ ఇంకా ఇంగ్లండ్లోనే ఉన్నాడు. త్వరలోనే భారత్కు రానున్న గిల్.. ఈ నెల ఆఖరిలో జరగనున్న దులీప్ ట్రోఫీలో ఆడనున్నాడు. ఆగష్టు 28- 31వరకు జరగనున్న తొలి క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్జోన్తో నార్త్ జోన్ తలపడనుంది.ఒకవేళ నార్త్ జోన్ సెమీఫైనల్కు చేరిన గిల్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఆసియాకప్లో కూడా గిల్ ఆడనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నుంచి అంతర్జాతీయ సిరీస్లలో గిల్ బీజీబీజీగా గడపనున్నాడు. తొలుత ఆసియాకప్, ఆతర్వాత వెస్టిండీస్తో టెస్టు సిరీస్, ఆస్ట్రేలియాతో వైట్బాల్ సిరీస్లలో ఆడనున్నాడు. ఆసీస్ టూర్ ముగిసిన వెంటనే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో సౌతాఫ్రికాతో భారత్ తలపడనుంది.దులిప్ ట్రోఫీ-2025కి నార్త్జోన్ జట్టు ఇదేశుభమన్ గిల్ (కెప్టెన్), శుభమ్ ఖజురియా, అంకిత్ కుమార్ (వైస్ కెప్టెన్), ఆయుష్ బదోని, యశ్ ధుల్, అంకిత్ కల్సి, నిశాంత్ సింధు, సాహిల్ లోత్రా, మయాంక్ దాగర్, యుధ్వీర్ సింగ్ చరక్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఆకిబ్ నబీ, కన్హయ్య వాధావాన్.చదవండి: IND vs WI: అతడి ఖేల్ ఖతం.. శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీ పక్కా! -
అతడి ఖేల్ ఖతం.. శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీ పక్కా!
ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన టీమిండియా వెటరన్ కరుణ్ నాయర్పై వేటు పడనుందా? అంటే అవును అనే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. ఒక్క ఛాన్స్ అంటూ ఏడేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులో రీ ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్.. తన పేలవ ప్రదర్శనలతో నిరాశపరిచాడు. ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో నాయర్ మొత్తంగా నాలుగు మ్యాచ్లు ఆడి కేవలం 205 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిపై వేటు వేసేందుకు అజిత్ అగర్కారర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సిద్దమైనట్లు తెలుస్తోంది.శ్రేయస్ రీ ఎంట్రీ.. అతడి స్ధానంలో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు చోటు ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఆక్టోబర్లో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్తో అయ్యర్ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయ్యర్ చివరగా టెస్టుల్లో భారత తరపున 2024లో ఇంగ్లండ్పై ఆడాడు.ఆ తర్వాత జట్టుతో పాటు సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో కూడా తన స్ధానాన్ని అయ్యర్ కోల్పోయాడు. అయితే దేశవాళీ టోర్నీలో అద్బుతంగా రాణించి తిరిగి జాతీయ జట్టులోకి ఈ ముంబైకర్ వచ్చాడు. కానీ కేవలం వన్డే జట్టులో మాత్రమే అతడికి చోటు దక్కింది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025ను భారత్ సొంతం చేసుకోవడంలో అయ్యర్ది కీలక పాత్ర. ఆ తర్వాత ఐపీఎల్లో కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతడిని ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం అయ్యర్ బదులుగా కరుణ్ నాయర్కు అవకాశమిచ్చారు. కరుణ్ నాయర్ తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. ఈ క్రమంలో సెలక్టర్లు మళ్లీ అయ్యర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయ్యర్ లాంటి ప్లేయర్ కావాలి..భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో అయ్యర్ లాంటి అనుభవజ్ఞుడైన మిడిలార్డర్ బ్యాటర్ అవసరం. అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో మాకు లోటు స్పష్టంగా కన్పించింది. స్పిన్నర్లను శ్రేయస్ అయ్యర్ అద్బుతంగా ఆడగలడుజ స్వదేశంలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్లో స్పిన్ బాగా ఆడిగలిగే ఆటగాళ్లు కీలకంగా మారనున్నారు. దీంతో అయ్యర్ను కచ్చితంగా సెలక్టర్లు ఎంపిక చేస్తారని" ఓ బీసీసీఐ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు.శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు 14 టెస్టులు ఆడి 36.86 సగటుతో 811 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీతో పాటు ఐదు ఆర్ధ శతకాలు ఉన్నాయి.చదవండి: టీమిండియా స్టార్ ప్లేయర్కు గాయం.. కీలక టోర్నీకి దూరం? -
కరుణ్ నాయర్ కంటే సుదర్శన్ బెటరా? ఇద్దరికి ఎన్ని మార్కులంటే?
ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ-2025లో పరుగుల వరద పారింది. భారత్, ఇంగ్లండ్ జట్లు కలిపి 7000 కంటే ఎక్కువ పరుగులు సాధించారు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే సిరీస్లో 7000 పైగా పరుగులు చేయడం ఇది రెండో సారి మాత్రమే. కానీ టీమిండియా తరపున మూడో స్దానంలో బ్యాటింగ్కు వచ్చిన వారు మాత్రం ఈ రన్ ఫీస్ట్లో తమ మార్క్ చూపించలేకపోయారు. సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ ఆ స్ధానంలో బ్యాటింగ్ చేసి 241 పరుగులు మాత్రమే సాధించారు.నిరాశపరిచిన నాయర్..ఎనిమిదేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేసిన కరుణ్ నాయర్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఈ సిరీస్లో నాయర్ రెండు వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేసాడు. మొత్తంగా నాలుగు మ్యాచ్లు ఆడి కేవలం 205 పరుగులు మాత్రమే చేశాడు.మరోవైపు సుదర్శన్ కూడా పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. కానీ ఇది అతడికి తొలి టెస్టు సిరీస్. మొత్తంగా మూడు మ్యాచ్లు ఆడిన సుదర్శన్ 23.33 సగటుతో 140 పరుగులు మాత్రమే చేశాడు. కానీ అనుభవజ్ఞుడైన కరుణ్ నుంచి మాత్రం అభిమానులు మెరుగైన ప్రదర్శనను ఆశించారు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ వీరిద్దరి ప్రదర్శనకు మార్క్లు వేశాడు. కరుణ్ నాయర్ కంటే సాయిసుదర్శన్కు ఇర్ఫాన్ పఠాన్ మెరుగైన రేటింగ్ ఇచ్చాడు.పదికి నాలుగు.."ఇంగ్లండ్ పర్యటనలో కరుణ్ నాయర్ ప్రదర్శనకు పదికి నాలుగు మార్కులు వేస్తాను. సిరీస్ అంతటా అతడు మరీ అంత పేలవమైన ప్రదర్శనలు కనబరచలేదు. అతడు తనకు లభించిన ఆరంభాలను భారీ స్కోర్లగా మలుచుకోలేకపోయాడు. ఒకే ఒక హాఫ్ సెంచరీతో సిరీస్ను ముగించాడు. ఈ సిరీస్లో అతడికి చాలా అవకాశాలు లభించాయి. క్రికెట్ అతడికి ఖచ్చితంగా రెండవ అవకాశమిచ్చేందని చెప్పాలి. కానీ దానిని అతడు ఉపయోగించుకోలేకపోయాడు. ముఖ్యంగా లార్డ్స్ టెస్టులో భారత్ను గెలిపించే ఛాన్స్ అతడికి ఉండేది. కానీ అక్కడ కూడా అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఆ మ్యాచ్లో అతడు క్రీజులో కుదురుకున్నట్లు కన్పించాడు. కానీ సడన్గా పేలవ షాట్ ఆడి ఔటయ్యాడు. బౌన్సర్ బంతులకు అతడు కొంచెం ఇబ్బంది పడుతున్నాడు.పదికి ఐదు.."సాయిసుదర్శన్కు పదికి ఐదు మార్క్లు ఇవ్వాలనుకుంటున్నాను. అతడి బ్యాటింగ్ టెక్నిక్ అద్బుతంగా ఉంటుంది. అతడు తన బ్యాటింగ్లో బలహీనతలను అధిగమించాడు. తొలి టెస్టులో కంటే మిగితా మ్యాచ్ల్లో కాస్త మెరుగ్గా కన్పించాడు. అతడికి లభించిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకునేవాడు. కానీ ఈసారి అలా చేయలేకపోయాడు. అయితే సాయి అన్ని మ్యాచ్లు ఆడి ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవని నేను అనుకుంటున్నాను తన యూట్యూబ్ ఛానల్లో పఠాన్ పేర్కొన్నాడు. -
ICC rankings: రఫ్ఫాడించిన సిరాజ్.. ఏకంగా 12 స్థానాలు జంప్
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్.. ఇప్పుడు ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాకింగ్స్లోనూ సత్తాచాటాడు. సిరాజ్ మియా తన కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంక్ను సాధించాడు. సిరాజ్ 674 రేటింగ్ పాయింట్లతో ఏకంగా 12 స్ధానాలు ఎగబాకి 15వ ర్యాంక్కు చేరుకున్నాడు. ఈ హైదరాబాదీ టెస్టు బౌలర్ల ర్యాకింగ్స్లో టాప్ 15లో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి.దుమ్ములేపిన సిరాజ్..ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో ఈ భారత ఫాస్ట్ బౌలర్ సంచలన ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా ఓవల్ టెస్టులో టీమిండియా చారిత్రత్మక విజయం సాధించడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఆఖరి టెస్టులో సిరాజ్ తొమ్మది వికెట్లు పడగొట్టి భారత్కు మరుపురాని విజయాన్ని అందించాడు. మొత్తంగా ఈ సిరీస్లో 23 సిరాజ్ వికెట్లతో సత్తాచాటాడు. ఇందులో రెండు ఫైవ్ వికెట్ల హాల్స్ కూడా ఉన్నాయి.ప్రసిద్ద్ అదుర్స్..ఇక ఓవల్ టెస్టులో సిరాజ్తో పాటు మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబరిచిన ప్రసిద్ద్ కృష్ణ సైతం తన ర్యాంక్ను మెరుగుపరుచుకున్నాడు. ప్రసిద్ద్ ఏకంగా 25 స్థానాలు ఎగబాకి 59వ ర్యాంక్కు చేరుకున్నాడు. ప్రసిద్ద్ ఐదో టెస్టులో మొత్తంగా ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే తన కెరీర్ బెస్ట్ ర్యాంక్ను కృష్ణ సాధించాడు. కాగా బౌలర్ల ర్యాకింగ్స్లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(889) అగ్రస్దానంలో కొనసాగుతుండగా.. కగిసో రబాడ రెండో స్దానంలో నిలిచాడు.టాప్-5 లోకి జైశ్వాల్..ఇక ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ టాప్ 5లోకి తిరిగొచ్చాడు. ఇంగ్లండ్తో ఐదో టెస్టులో జైశ్వాల్ అద్బుత సెంచరీతో మెరిశాడు. అదేవిధంగా ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్లలో విఫలమైన శుబ్మన్ గిల్ నాలుగు స్ధానాలు దిగజారి 13వ ర్యాంక్కు పడిపోయాడు.చదవండి: IND vs ENG: వ్యాజ్లెన్ వాడారు.. గిల్ సేనపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు -
Rishabh Pant: ఆటలో ధీరుడు.. గుణంలో కర్ణుడు
టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో, మానవత్వం ప్రదర్శించడంలోనూ అంతే దూకుడుగా ఉంటాడు. ఇటీవల ఇంగ్లండ్ గడ్డపై పాదం ఫ్రాక్చర్ అయినా బరిలోకి దిగి యావత్ క్రికెట్ ప్రపంచంచే జేజేలు పలికించుకున్న పంత్.. తాజాగా ఓ చర్య ద్వారా గొప్ప మానవతావాది అని నిరూపించుకున్నాడు.కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్ జిల్లాలోని రబ్కవి గ్రామానికి చెందిన జ్యోతి కనబుర్ మఠ్ అనే విద్యార్థిని చదువుకు ఆర్దిక సాయం చేసి తన గొప్ప మనసును చాటుకున్నాడు. జ్యోతి 12వ తరగతిలో 85 శాతం మార్కులు సాధించింది. BCA చదవాలన్న ఆశతో ఉన్న ఆమెకు రూ. 40,000 ఫీజు కట్టలేని పరిస్థితి ఏర్పడింది. తండ్రి టీ కొట్టు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో, రిషబ్ పంత్ స్పందించి జులై 17న నేరుగా కాలేజీకి ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించాడు. “నీ కలలు నిజమవ్వాలి” అంటూ ఆమెకు భరోసా ఇచ్చాడు.పంత్ చేసిన ఈ పనికి యావత్ మానవాళి జేజేలు కొడుతుంది. ఆటలో ధీరుడు, గుణంలో కర్ణుడు అంటూ ఆకాశానికెత్తుతుంది. రియల్ హీరో అంటూ కొనియాడుతుంది. వాస్తవానికి పంత్కు ఇలాంటి దానాలు కొత్త కాదు. గతంలో చాలా సందర్భాల్లో పేదలకు ఆర్దిక సాయం చేశాడు. రిషబ్ పంత్ ఫౌండేషన్ ద్వారా తనకు వచ్చే ఆదాయంలో 10 శాతం పేదలకు పంచి పెడుతున్నాడు. విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో అవసరమైన వారికి తగు సాయం చేస్తుంటాడు.గతంలో ఓ సందర్భంలో పంత్ మాట్లాడుతూ.. క్రికెట్ వల్ల నాకు లభించిన ప్రతిదానికి నేను కృతజ్ఞుడిని. ఇప్పుడు సమాజానికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నానని అన్నాడు.తన ఆటతీరుతో విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను మెప్పించిన పంత్.. తన మానవతా గుణంతో దేశ ప్రజల మనసులు గెలుచుకుంటున్నాడు. సమాజానికి సేవ చేయాలనే తపనతో ఉన్న పంత్ చర్యలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. కాగా, తాజాగా ముగిసిన టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అయితే దురదృష్టవశాత్తు నాలుగో టెస్ట్ సందర్భంగా గాయపడి చివరి మ్యాచ్కు దూరమయ్యాడు. నాలుగో టెస్ట్లో పాదం ఫ్రాక్చర్ అయినా పంత్ బ్యాటింగ్కు దిగి అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్లో పంత్ 7 ఇన్నింగ్స్ల్లో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సాయంతో 479 పరుగులు చేసి, ఆరో లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ సిరీస్ను భారత్ 2-2తో సమం చేసుకుంది. -
చరిత్ర సృష్టించిన జో రూట్.. టెస్ట్ క్రికెట్లో తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్లో ఓ సింగిల్ బౌలర్ బౌలింగ్లో 600 పరుగులు సాధించిన తొలి బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రూట్.. టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజాపై ఈ ఘనత సాధించాడు. తాజాగా ముగిసిన టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో రూట్ ఈ ఫీట్ను నమోదు చేశాడు. రూట్ జడేజా బౌలింగ్లో ఇప్పటివరకు 602 పరుగులు సాధించాడు. ప్రపంచంలో ఏ బ్యాటర్ ఓ సింగిల్ బౌలర్ బౌలింగ్లో ఇన్ని పరుగులు సాధించలేదు. ఈ జాబితాలో రూట్ తర్వాతి స్థానంలో స్టీవ్ స్మిత్ ఉన్నాడు. స్మిత్ ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో 577 పరుగులు చేశాడు. రూట్, స్మిత్ తర్వాతి స్థానంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఉన్నాడు. కోహ్లి ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయోన్ బౌలింగ్లో 573 పరుగులు సాధించాడు.కాగా, టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ-2025లో రూట్-జడేజా మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. ఈ సిరీస్లో జడేజా రూట్ను ఒక్కసారే (నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్) ఔట్ చేసినా ఇరువురి మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్లుగా సాగింది. అంకెల ప్రకారం చూస్తే జడేజాపై రూట్ పైచేయి సాధించినట్లు కనిపించినా, జడ్డూను ఎదుర్కొనేందుకు రూట్ ఇబ్బంది పడ్డాడు. వాస్తవంగా ఉపఖండలో జడేజాను ఎదుర్కోవడం రూట్కు కత్తి మీద సాము అవుతుంది. స్పిన్కు అనుకూలించే పిచ్లపై జడేజా బౌలింగ్లో రూట్ చాలా ఇబ్బంది పడ్డాడు. జడ్డూ తన కెరీర్లో రూట్ను మొత్తం 9 సార్లు ఔట్ చేశాడు. తద్వారా ఓ బ్యాటర్ను అత్యధిక సార్లు ఔట్ చేసిన బౌలర్గానూ రికార్డు కలిగి ఉన్నాడు.ఇదిలా ఉంటే, తాజాగా ముగిసిన టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ డ్రాగా ముగిసింది. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలో రెండు మ్యాచ్లు గెలువగా.. ఓ మ్యాచ్ డ్రా అయ్యింది. హోరాహోరీగా సాగిన ఈ సిరీస్లో ఇంగ్లండ్ 1,3 టెస్ట్లు గెలువగా.. భారత్ 2,5 మ్యాచ్ల్లో విజయం సాధించింది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఐదో టెస్ట్లో భారత్ 6 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించింది.ఈ మ్యాచ్ చివరి రోజు భారత్ 35 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవాల్సి ఉండగా.. సిరాజ్ అద్భుతం చేశాడు. ఇంగ్లండ్ చేతిలో ఉండిన 4 వికెట్లలో 3 వికెట్లు తీసి భారత్కు చిరస్మరణీయ విజయాన్నందించాడు.374 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓ దశలో పటిష్ట స్థితిలో (301/3) ఉన్నప్పటికీ.. భారత బౌలర్లు మ్యాచ్పై ఆశలు వదులుకోకుండా వీరోచితంగా పోరాడారు. ముఖ్యంగా సిరాజ్ ఓటమిని ఒప్పుకునే ప్రసక్తే లేదన్నట్లు ముందుకు సాగాడు. అతనికి ప్రసిద్ద్ సహకరించాడు. వీరిద్దరు కలిపి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో 9 వికెట్లు తీశారు. సెకెండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు సహా మ్యాచ్ మొత్తంలో 9 వికెట్లు తీసిన సిరాజ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
టీమిండియా గెలుస్తుందని నాకు ముందే తెలుసు: సౌరవ్ గంగూలీ
లండన్లోని ది ఓవల్లో ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా 6 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్కంఠభరితంగా ఐదో రోజు ఆటలో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ మ్యాజిక్ చేశాడు. ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు కావల్సిన నేపథ్యంలో సిరాజ్ బంతితో ప్రత్యర్ధి జట్టును బోల్తా కొట్టించాడు. చివరి రోజు ఆటలో మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ను దెబ్బతీశాడు. అతడితో పాటు ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ సాధించాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో సిరాజ్ 9 వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్ 8 వికెట్లు సాధించాడు. కాగా ఓవల్లో చారిత్రత్మక విజయం సాధించిన భారత జట్టు సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆఖరి టెస్టులో గెలిచి భారత్ సిరీస్ సమం చేస్తుందని తనకు ముందే తెలుసని టీమిండిమా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు."నాలుగవ రోజు ఆట ముగిసిన తర్వాత టీమిండియా గెలుస్తుందనే నమ్మకం నాకు కలిగింది. పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంది. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేశారు" అని గంగూలీ ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అదేవిధంగా ఉత్కంఠపోరులో విజయం తర్వాత భారత జట్టును కొనియాడుతూ గంగూలీ ఓ ట్విట్ కూడాచేశాడు."అసాధారణ సిరీస్. అమోఘమైన ఫలితం. జడేజా, వాషింగ్టన్ సుందర్, రిషభ్ పంత్, సిరాజ్... అందరూ నిలకడగా ఆడారు. భారత జట్టు విజయాల ఆకలితో ఉన్నట్లు మనవాళ్లు తమ ఆటతీరుతో నిరూపించారు" దాదా ఎక్స్లో రాసుకొచ్చారు.చదవండి: మా బ్యాటర్లు భయపడ్డారు.. కానీ అతడు ఉండుంటే గెలిచేవాళ్లం: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
ఇక్కడున్నా బిర్యానీ తక్కువే.. ఆ ఫుడ్ అసలే తినడు: సిరాజ్ సోదరుడు
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీని టీమిండియా సమం చేయడంలో మహ్మద్ సిరాజ్ది కీలక పాత్ర. ఈ ట్రోఫీలో భాగంగా ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్టులో సిరాజ్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఓటమి తప్పదనుకున్న చోట సిరాజ్ తన బౌలింగ్తో మ్యాజిక్ చేశాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు పడగొట్టి భారత జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో సిరాజ్ మియా తొమ్మిది వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు.ఒకే ఒక్కడు.. ఈ ఒక్క మ్యాచ్లోనే కాదు సిరీస్ అసాంతం మహ్మద్ సిరాజ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా సిరాజ్ ఫిట్నెస్ గురుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది. ఈ సిరీస్లో తన సహచర ఆటగాళ్లు ఫిట్నెస్ సమస్యలతో ఒకట్రెండు మ్యాచ్లకు దూరమైనప్పటికి.. సిరాజ్ మాత్రం అలుపెరుగని యోధుడిలా అన్ని మ్యాచ్లల్లోనూ ఆడాడు. ఇంగ్లండ్ - భారత్ టెస్టు సిరీస్లో ఐదు మ్యాచ్లు ఆడిన ఏకైక బౌలర్గా సిరాజ్ నిలిచాడు. ఎటువంటి వర్క్ లోడ్ భావించకుండా ఈ సిరీస్లో దాదాపు వెయ్యికి పైగా బంతులు వేశాడు. ఎన్నో లాంగ్ స్పెల్స్ కూడా బౌలింగ్ చేశాడు. కానీ ఎప్పుడూ కూడా సిరాజ్ అలిసిపోయినట్లు కన్పించలేదు. తాజాగా మహ్మద్ సిరాజ్ ఫిట్నెస్ సీక్రెట్ను అతడి సోదరుడు మొహమ్మద్ ఇస్మాయిల్ భయటపెట్టాడు."సిరాజ్ తన ఫిట్నెస్పై ఎక్కువగా దృష్టి సారిస్తాడు. అతడు జంక్ ఫుడ్కు దూరంగా ఉంటాడు. సరైన డైట్ ప్లాన్ను పాటిస్తాడు. సిరాజ్ హైదరాబాద్లో ఉన్నా కూడా బిర్యానీని చాలా అరుదుగా తింటాడు. అది కూడా ఇంట్లో తాయారు చేస్తే తింటాడు. కానీ పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్ల జోలికి అస్సలు పోడు. తన శరీరం పట్ల చాలా క్రమశిక్షణతో ఉంటాడు" అని ఇస్మాయిల్ ఇండియా టూడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్లో సిరాజ్ మొత్తంగా 23 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు ఫైవ్ వికెట్ హాల్స్ ఉన్నాయి.చదవండి: ‘డ్రా’ అయినందుకే ఇంత సంబరమా?.. అవును.. కొన్ని పొరపాట్లున్నా.. -
'మా బ్యాటర్లు భయపడ్డారు.. కానీ అతడు ఉండుంటే గెలిచేవాళ్లం'
క్రికెట్ అభిమానులను దాదాపు నెల రోజుల పాటు అలరించిన ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీకి సోమవారం(ఆగస్టు 4)తో ఎండ్ కార్డ్ పడింది. ఈ ట్రోఫీలో భాగంగా ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లండ్పై భారత్ 6 పరుగుల తేడాతో ఉత్కంఠభరితమైన విజయాన్ని సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ 2-2తో సమమైంది.ఈ విజయంలో భారత పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ కీలక పాత్ర పోషించారు. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు అవసరమవ్వగా.. భారత్ గెలుపునకు 4 వికెట్లు కావాల్సి ఉండేది. ఈ సమయంలో సిరాజ్, ప్రసిద్ద్ అద్బుతం చేసి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. అయితే భారత చేతిలో ఓటమిని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు జీర్ణించుకుకోలేకపోతున్నారు. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆడుంటే ఓవల్ టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించేందని వాన్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ టోర్నీ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన బెన్ స్టోక్స్ ఆఖరి టెస్టు భుజం గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్దానంలో ఓలీ పోప్ కెప్టెన్గా వ్యవహరించాడు."బెన్ స్టోక్స్ ఆడకపోవడమే ఆఖరి టెస్టులో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. ఒకవేళ అతడు జట్టులో ఉండి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది. అతడు జట్టును మానసికంగా సిద్దం చేయడంలో కీలక పాత్ర పోషించేవాడు. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ బ్యాటర్లు భయపడ్డారు. ఒక చిన్న భాగస్వామ్యం వచ్చి వుంటే వారు గెలిచేవారు. కానీ అలా చేయలేకపోయారు. స్పష్టంగా వారిలో తీవ్ర ఒత్తడి కన్పించింది. భారీ షాట్లకు ప్రయత్నించి తమ వికెట్లను కోల్పోయారు" అని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్ పేర్కొన్నాడు. కాగా 374 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లండ్ 367 పరుగులకు ఆలౌటైంది.చదవండి: కన్నీటిపర్యంతమైన గంభీర్.... గూస్బంప్స్ తెప్పించేశారు భయ్యా! వీడియో వైరల్ -
ఇంగ్లండ్తో సిరీస్ ముగిసింది.. టీమిండియా తదుపరి షెడ్యూల్ ఇదే..!
ఇంగ్లండ్లో జరిగిన ఐదు మ్యాచ్ల టెండూల్కర్-ఆండర్సన్ టెస్ట్ సిరీస్ నిన్నటితో (ఆగస్ట్ 5) ముగిసింది. ఈ సిరీస్ వీరోచితమైన పోరాటాల తర్వాత 2-2తో సమమైంది. చివరిదైన ఐదో టెస్ట్ హోరాహోరీగా సాగి అభిమానులకు కావాల్సినంత మజాను అందజేసింది. ఈ మ్యాచ్లో భారత్ ఇంగ్లండ్ను 6 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది.నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా తదుపరి ఆడబోయే మ్యాచ్లపై ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. టీమిండియా మళ్లీ ఎప్పుడు బరిలోకి దిగుతుందని ఫ్యాన్స్ శోధించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టీమిండియా తదుపరి షెడ్యూల్ను మీ ముందుంచుతున్నాము.టెండూల్కర్-ఆండర్సన్ టెస్ట్ సిరీస్ తర్వాత టీమిండియా నెలకు పైగా బ్రేక్ తీసుకుంటుంది. తదుపరి మ్యాచ్ను వచ్చే నెల 10న ఆసియా కప్లో భాగంగా యూఏఈతో ఆడనుంది. ఈసారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో అబుదాబీ, దుబాయ్ల్లో జరుగనుంది. ఈ ఖండాంతర టోర్నీలో భారత్ రెండో మ్యాచ్ను చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఆడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్లో జరుగనుంది. అనంతరం భారత్ సెప్టెంబర్ 19న ఒమన్తో అబుదాబీలో పోటీపడనుంది. ఆసియా కప్ గ్రూప్ దశలో భారత్ ఈ మూడు మ్యాచ్లు ఆడనుంది.ఆసియా కప్ సూపర్-4 స్టేజీలో మ్యాచ్లు (భారత్ గ్రూప్-ఏలో ఉంది)B1 vs B2 - 20 సెప్టెంబర్ 2025, దుబాయ్A1 vs A2 - 21 సెప్టెంబర్ 2025, దుబాయ్A2 vs B1 - 23 సెప్టెంబర్ 2025, అబుదాబిA1 vs B2 - 24 సెప్టెంబర్ 2025, దుబాయ్A2 vs B2 - 25 సెప్టెంబర్ 2025, దుబాయ్A1 vs B1 - 26 సెప్టెంబర్ 2025, దుబాయ్సెప్టెంబర్ 28- ఫైనల్ (దుబాయ్)భారత్ వర్సెస్ వెస్టిండీస్ (స్వదేశంలో)అక్టోబర్ 2-6: తొలి టెస్ట్, అహ్మదాబాద్అక్టోబర్ 10-14: రెండో టెస్ట్, ఢిల్లీభారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (ఆస్ట్రేలియాలో)అక్టోబర్ 19: తొలి వన్డే, పెర్త్అక్టోబర్ 23: రెండో వన్డే, అడిలైడ్అక్టోబర్ 25: మూడో వన్డే, సిడ్నీఅక్టోబర్ 29: మొదటి టీ20 కాన్బెర్రాఅక్టోబర్ 31: రెండో టీ20, మెల్బోర్న్నవంబర్ 2: మూడో టీ20, హోబర్ట్నవంబర్ 6: నాలుగో టీ20, కర్రారానవంబర్ 8: ఐదో టీ20, బ్రిస్బేన్భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (స్వదేశంలో)నవంబర్ 14-18: తొలి టెస్ట్, కోల్కతానవంబర్ 22-26: రెండో టెస్ట్, గౌహతినవంబర్ 30: తొలి వన్డే, రాంచీడిసెంబర్ 3: రెండో వన్డే, రాయ్పూర్డిసెంబర్ 6: మూడో వన్డే, వైజాగ్డిసెంబర్ 9: తొలి టీ20, కటక్డిసెంబర్ 11: రెండో టీ20, చండీఘడ్డిసెంబర్ 14: మూడో టీ20, ధర్మశాలడిసెంబర్ 17:నాలుగో టీ20, లక్నోడిసెంబర్ 19: ఐదో టీ20, అహ్మదాబాద్ -
టీమిండియా సరికొత్త చరిత్ర.. రికార్డుల జాతర
ఇంగ్లండ్తో జరిగిన టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ-2025 రికార్డులకు అడ్డాగా మారింది. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో చాలా రికార్డులు తిరగరాయబడ్డాయి. వీటిలో సింహభాగం భారత్, భారత్ ఆటగాళ్ల ఖాతాలో పడ్డాయి. జట్టు పరంగా టీమిండియా ఓ సరికొత్త రికార్డు నెలకొల్పింది.ఓ టెస్ట్ సిరీస్లో ఆస్ట్రేలియా తర్వాత రెండో అత్యధిక పరుగులు నమోదు చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈ సిరీస్లో భారత్ 42.32 సగటున 3809 పరుగులు చేసింది. 1989 యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా అత్యధికంగా 3877 పరుగులు చేసింది. తాజా సిరీస్లో భారత్ కేవలం 5 టెస్ట్ల్లోనే ఈ పరుగులు చేయగా.. ఆసీస్ నాటి యాషెస్ సిరీస్లో 6 టెస్ట్లు ఆడి భారత్ కంటే కేవలం 68 పరుగులే ఎక్కువ చేసింది.ఈ రికార్డుతో పాటు టెండూల్కర్-ఆండర్సన్ సిరీస్ మరిన్ని రికార్డులకు వేదికైంది. ఆ రికార్డులపై ఓ లుక్కేద్దాం.భారత్-ఇంగ్లండ్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక పరుగులు- శుభ్మన్ గిల్ (5 మ్యాచ్ల్లో 754 పరుగులు). గతంలో ఈ రికార్డు గ్రహం గూచ్ (752) పేరిట ఉండేది.ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్- శుభ్మన్ గిల్. గతంలో ఈ రికార్డు సునీల్ గవాస్కర్ (732) పేరిట ఉండేది.SENA దేశాల్లో జరిగిన సిరీస్ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్: శుభ్మన్ గిల్, గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లి (692) పేరిట ఉండేది.టెస్ట్ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన భారత కెప్టెన్: శుభ్మన్ గిల్ (269 ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో). గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లి (254) పేరిట ఉండేది.SENA దేశాల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సిన ఆసియా కెప్టెన్: శుభ్మన్ గిల్. గతంలో ఈ రికార్డు తిలకరత్నే దిల్షన్ (193) పేరిట ఉండేది.ఓ టెస్ట్ మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన పర్యాటక బ్యాటర్: శుభ్మన్ గిల్ (430, ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో 269+161). గతంలో ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ (426) పేరిట ఉండేది.ఒకే టెస్ట్లో సెంచరీ, 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి ఇంగ్లండ్ కెప్టెన్: బెన్ స్టోక్స్ (నాలుగో టెస్ట్)ఒకే టెస్ట్లో రెండు సెంచరీలు చేసిన తొలి భారత వికెట్కీపర్: రిషబ్ పంత్ (హెడింగ్లే టెస్ట్)టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకిన జో రూట్: ఈ సిరీస్లో రూట్ ద్రవిడ్, కల్లిస్, రికీ పాంటింగ్లను అధిగమించి టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ లిస్ట్లో సచిన్ టెండూల్కర్ టాప్లో ఉన్నాడు.వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో 6000 పరుగులు చేసిన తొలి బ్యాటర్: జో రూట్SENA దేశాల్లో 150 వికెట్లు తీసిన తొలి ఆసియా బౌలర్: బుమ్రా (61 ఇన్నింగ్స్ల్లో)ఓ సిరీస్లో రెండో అత్యధిక పరుగులు (ఇరు జట్లు): ఈ సిరీస్లో భారత్, ఇంగ్లండ్ కలిపి 7000 పైచిలుకు పరుగులు నమోదు చేశాయి. 1993 యాషెస్ సిరీస్లో మాత్రమే ఈ ఘనత నమోదైంది.భారత్ అత్యల్ప, అతి భారీ విజయాలు (పరుగుల పరంగా): భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యల్ప, అతి భారీ విజయాలు ఈ సిరీస్లోనే నమోదయ్యాయి. ఈ సిరీస్లోని ఓవల్ టెస్ట్లో భారత్ 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందగా.. ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో 336 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. -
చిరస్మరణీయ విజయం.. ఇంగ్లండ్ను వెనక్కు నెట్టిన టీమిండియా
ఓవల్ టెస్ట్ విజయానంతరం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (2025-27) పాయింట్ల పట్టికలో భారత్ ఇంగ్లండ్ను వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లండ్ నాలుగో స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్కు ముందు భారత్ నాలుగో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ మూడో ప్లేస్లో ఉండింది.ఈ మ్యాచ్ విజయానంతరం భారత్ విజయాల శాతం 46.67గా ఉండగా.. ఇంగ్లండ్ విన్నింగ్ పర్సంటేజ్ 43.33కు పడిపోయింది. ఆస్ట్రేలియా (100), శ్రీలంక (66.67) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. 16.67 విజయాల శాతంతో బంగ్లాదేశ్ ఐదో ప్లేస్లో ఉంది. వెస్టిండీస్ ఈ సైకిల్లో ఆడిన మూడు మ్యాచ్ల్లో ఓడి ఆరో స్థానంలో ఉంది. న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా ఈ సైకిల్లో ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.కాగా, ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్లో పర్యటించిన భారత జట్టు 2-2తో సిరీస్ను సమం చేసుకుంది. 1, 3 టెస్ట్ మ్యాచ్లు ఇంగ్లండ్ గెలువగా.. భారత్ 2, 5 మ్యాచ్ల్లో విజయాలు సాధించింది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. డబ్ల్యూటీసీలో భారత్ తదుపరి టెస్ట్ సిరీస్ వెస్టిండీస్తో ఆడనుంది. రెండు మ్యాచ్ల ఈ సిరీస్ భారత్ వేదికగా ఆక్టోబర్ 2 నుంచి ప్రారంభమవుతుంది. తొలి టెస్ట్ అహ్మదాబాద్లో, రెండో టెస్ట్ (అక్టోబర్ 10 నుంచి) ఢిల్లీలో జరుగనున్నాయి.ఇదిలా ఉంటే, హోరాహోరీగా సాగిన ఓవల్ టెస్ట్లో భారత్ 6 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ చివరి రోజు భారత్ 35 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని చిరస్మరణీయ విజయం సాధించింది. భారత బౌలర్లలో సిరాజ్ మ్యాజిక్ చేసి ఇంగ్లండ్ చేతిలో ఉండిన 4 వికెట్లలో 3 వికెట్లు తీశాడు. ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ పడగొట్టాడు.374 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓ దశలో పటిష్ట స్థితిలో (301/3) ఉన్నప్పటికీ.. భారత బౌలర్లు మ్యాచ్పై ఆశలు వదులుకోకుండా వీరోచితంగా పోరాడారు. ముఖ్యంగా సిరాజ్ ఓటమిని ఒప్పుకునే ప్రసక్తే లేదన్నట్లు ముందుకు సాగాడు. అతనికి ప్రసిద్ద్ సహకరించాడు. వీరిద్దరు కలిపి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో 9 వికెట్లు తీశారు. సెకెండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు సహా మ్యాచ్ మొత్తంలో 9 వికెట్లు తీసిన సిరాజ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
దేశమే సర్వస్వం.. దేనికి వెనకాడం.. పంత్ భావోద్వేగ పోస్ట్
క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ టెస్ట్ మ్యాచ్లలో ఇది ఒకటి. ఓవల్ వేదికగా జరిగిన హోరాహోరీ సమరంలో ఇంగ్లండ్పై భారత్ 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని మునివేళ్లపై నిలబెట్టింది. ఆట చివరి రోజు భారత బౌలర్లు ధీరత్వాన్ని ప్రదర్శించి 35 పరుగుల స్వల్ప లక్ష్నాన్ని విజయవంతంగా కాపాడుకున్నారు. ఇంగ్లండ్ చేతిలో 4 వికెట్లుండగా.. సిరాజ్ 3 వికెట్లు తీసి ప్రత్యర్థి నోటి కాడి గెలుపును లాగేసుకున్నాడు. ప్రసిద్ద్ కృష్ణ తన వంతుగా ఓ వికెట్ తీశాడు.374 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓ దశలో పటిష్టమైన స్థితిలో (301/3) ఉన్నప్పటికీ.. భారత బౌలర్లు మ్యాచ్పై ఆశలు వదులుకోకుండా వీరోచితంగా పోరాడారు. ముఖ్యంగా సిరాజ్ ఓటమిని ఒప్పుకునే ప్రసక్తే లేదన్నట్లు ముందుకు సాగాడు. ఈ గెలుపులో సిరాజ్ది ప్రధానపాత్ర. ఈ హైదరాబాదీ పేసర్ అసలుసిసలైన పోరాట యోధుడిలా పోరాడి భారత్కు చిరస్మరణీయ విజయాన్నందించాడు. రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు సహా, మ్యాచ్ మొత్తంలో తొమ్మిది వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.కాగా, ఈ గెలుపు అనంతరం గాయపడిన టీమిండియా హీరో రిషబ్ పంత్ స్పందించాడు. ఇన్స్టా వేదికగా భావోద్వేగమైన పోస్ట్ పెట్టాడు. ఈ సిరీస్లో నాలుగో టెస్ట్ సందర్భంగా గాయపడి, ఐదో టెస్ట్కు దూరంగా ఉన్న పంత్.. టీమిండియా సాధించిన విజయాన్ని పొగడ్తలతో ముంచెత్తాడు. సహచరులను కొనియాడాడు. తన జట్టు పట్ల గర్వంగా ఉన్నానని అన్నాడు. దేశమే సర్వస్వమని తెలిపాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించేప్పుడు సర్వ శక్తులు ఒడ్డి పోరాడతామని అన్నాడు. దేనికి వెనుకాడేది లేదని స్పష్టం చేశాడు.పంత్ మాటల్లో.. ఈ ఇంగ్లండ్ పర్యటన మా నుంచి చాలా అడిగింది. అంతకుమించి తిరిగి ఇచ్చింది. ఈ జట్టు పట్ల చాలా గర్వంగా ఉంది. యువ ఆటగాళ్లు పరిస్థితులకు తగ్గట్టుగా పోరాడిన తీరు అమోఘంగా ఉంది. దేశానికి ప్రాతినిథ్యం వహించడం మాకు సర్వస్వం. ఇది మాలోని ప్రతి విషయాన్ని వెలికి తీస్తుంది. దీనికి మేము గర్వపడుతున్నాము.మా అద్భుతమైన సహాయక సిబ్బందికి, సిరీస్ ఆధ్యాంతం మాకు అండగా నిలబడిన అభిమానులకు ధన్యవాదాలు. ఈ జట్టు ఆకలితో ఉంది. ఐక్యంగా ఉంది. సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత భారత క్రికెట్ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తుంది.కాగా, ఈ సిరీస్లో రిషబ్ పంత్ టీమిండియాకు వైస్ కెప్టెన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో అతను అరివీర భయంకరమైన ఫామ్లో ఉండగా గాయపడ్డాడు. 7 ఇన్నింగ్స్ల్లో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సాయంతో 479 పరుగులు చేశాడు. నాలుగో టెస్ట్లో క్రిస్ వోక్స్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ చేయబోగా పంత్ పాదం ఫ్రాక్చర్కు గురైంది. పాదం ఫ్రాక్చర్ అయినా పంత్ ఆ మ్యాచ్లో బ్యాటింగ్కు దిగి దేశానికి ఆడటమంటే తనకేంటో ప్రపంచం మొత్తానికి నిరూపించాడు. ఆ ఇన్నింగ్స్లో పంత్ కుంటుతూనే హాఫ్ సెంచరీ చేయడం విశేషం. ఓవల్ టెస్ట్లో విజయంతో భారత్ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 2-2తో సమం చేసుకుంది. -
కొన్ని గెలుస్తాం.. కొన్ని ఓడతాం.. కానీ, ఎప్పటికీ లొంగిపోము: గంభీర్
ఓవల్ టెస్ట్లో టీమిండియా చారిత్రక విజయం సాధించిన అనంతరం జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్లను పొగడ్తలతో ముంచెత్తుతూ సోషల్మీడియాలో ఓ కదిలించే పోస్ట్ పెట్టాడు. కొన్ని గెలుస్తాం.. కొన్ని ఓడతాం.. కానీ, ఎప్పటికీ లొంగిపోము. వెల్డన్ బాయ్స్ అంటూ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు. ఈ మెసేజ్తో పాటు గంభీర్ టీమిండియా ఆటగాళ్లు విజయదరహాసంతో ఉన్న పలు ఫోటోలను పోస్ట్ చేశాడు. గంభీర్ చేసిన ఈ పోస్ట్ సోషల్మీడియాలో వైరలవుతోంది.కాగా, ఇంగ్లండ్ సిరీస్ ఆధ్యాంతం టీమిండియా చూపించిన పోరాటస్పూర్తిలో గంభీర్ ప్రధానపాత్ర పోషించాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆశలు వదులుకోకూడదంటూ (Never give up) ఆటగాళ్లలో కసిని రగిల్చాడు. మనది యంగ్ టీమ్ కాదు, గన్ టీమ్ అంటూ ఆటగాళ్లలో ఉత్తేజాన్ని నింపాడు. ఆటగాళ్లను ప్రతి విషయంలో దగ్గరుండి ప్రోత్సహించాడు. కొందరు ఆటగాళ్లు (ఆకాశ్దీప్, జైస్వాల్) విఫలమైప్పుడు వెనకేసుకొచ్చి సత్ఫలితాలు రాబట్టాడు.అవసరమైనప్పుడు దండించాడు. మంచి ప్రదర్శన చేసినప్పుడు ముద్దులతో ముంచెత్తాడు. మొత్తంగా ఈ సిరీస్లో టీమిండియా ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనకు స్పూర్తిదాతగా నిలిచాడు. ఓవల్ టెస్ట్ విజయం తర్వాత గంభీర్లోని చిన్నపిల్లాడు బయటికి వచ్చాడు. విజయగర్వంతో ఊగిపోతూ ఎగిరి గంతులేశాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ను ముద్దులతో ముంచెత్తాడు. టీమిండియా మొత్తాన్ని తీవ్ర భావోద్వేగంతో ఆలింగనం చేసుకున్నాడు. ముఖ్యంగా సిరాజ్పై ప్రశంసలపై వర్షం కురిపించాడు. అతన్ని కెప్టెన్తో పాటు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చోబెట్టి కొత్త ఆనవాయితీకి తెరలేపాడు.ఓవల్ టెస్ట్లో సిరాజ్ చారిత్రక స్పెల్తో భారత్కు అపురూప విజయాన్నందించాడు. చివరి రోజు 35 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవాల్సి ఉండగా.. సిరాజ్ మియా మ్యాజిక్ చేశాడు. ఇంగ్లండ్ చేతిలో 4 వికెట్లుండగా.. 3 వికెట్లు తీసి వారి నోటి కాడి విజయాన్ని లాక్కున్నాడు.ఈ మ్యాచ్ మొత్తం అద్బుతమైన పోరాటాలతో సాగింది. తొలుత భారత్ స్వల్ప స్కోర్కే ఔటైనా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని ఇంగ్లండ్ను కూడా ఓ మోస్తరు స్కోర్కే పరిమితం చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో భారత్ బ్యాటర్లు అద్భుతమే చేశారు. జైస్వాల్, ఆకాశ్దీప్, జడేజా, సుందర్ సూపర్ ఇన్నింగ్స్లు ఆడి భారత్కు భారీ స్కోర్ అందించారు. అనంతరం 374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓ దశలో పటిష్ట స్థితిలో (301/3) ఉన్నప్పటికీ భారత బౌలర్లు మ్యాచ్పై ఆశలను వదులుకోకుండా పోరాడారు. ఇంగ్లండ్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లపై ప్రతాపం చూపించారు. సిరాజ్, ప్రసిద్ద్ నిరుత్సాహపడకుండా వారు చేయాల్సిందంతా చేసి సత్పలితాన్ని రాబట్టారు. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్ను 2-2తో డ్రా చేసుకుంది. -
IND Vs ENG: జో జీతా వహి సిరాజ్
సిరీస్లో ఐదు టెస్టులూ చివరి వరకు ఆడిన ఏకైక పేస్ బౌలర్. ఏకంగా 1113 బంతులు... సిరీస్ తొలిరోజు నుంచి చివరిరోజు వరకు బౌలింగ్లో అదే వేగం, అంతే తీవ్రత... ప్రతీ బంతి వేసే సమయంలో 100 శాతం ఇవ్వాలనే తపన... చేసే పని భారంగా అనిపించలేదు... సుదీర్ఘ సిరీస్లో విశ్రాంతి తీసుకోలేదు. గాయంతో తప్పుకోలేదు, మ్యాచ్ మధ్యలో ఫిట్నెస్ సమస్యలతో ఒక్కసారి కూడా బౌలింగ్కు దూరం కాలేదు... చివరకు అద్భుత రీతిలో మ్యాచ్ను గెలిపించే వరకు ఆగిపోలేదు... ఇలాంటి పోరాటతత్వం, పట్టుదల హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్కే సాధ్యమైంది. 185.3 ఓవర్ల బౌలింగ్ తర్వాత కూడా అతను అలసిపోకుండా ఇప్పుడు మళ్లీ బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండి ‘సై’ అంటున్నాడు. ఈ సిరీస్లో అతని ప్రదర్శనను ప్రశంసించనివారు లేరు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు అథర్టన్, మైకేల్ వాన్, నాసిర్ హుస్సేన్ మాటల్లో చెప్పాలంటే సిరాజ్ సింహంలా పోరాడిన ఒక ‘లయన్ హార్ట్’ బౌలర్. అసలు అతను సిరీస్ ఆసాంతం ఒకే తరహాలో అంతే దూకుడుతో ఎలా బౌలింగ్ చేస్తున్నాడో వారికి కూడా ఆశ్చర్యపర్చింది. ‘దేశం తరఫున ఆడటం అనేదే ఒక ఆటగాడికి లభించే ఎంతో గొప్ప అవకాశం. అలాంటప్పుడు నేను ఎన్ని ఓవర్లు వేశాను, ఎంత ఎక్కువగా కష్టపడుతున్నాను అన్నది అస్సలు పట్టించుకోవాల్సిన విషయమే కాదు. నాలో సత్తా ఉన్నంత వరకు బౌలింగ్ చేస్తూనే ఉంటాను. అదృష్టవశాత్తూ ఇప్పుడు కూడా నేను ఫిట్గా ఉన్నాను’... చివరి టెస్టు ముగిసిన తర్వాత భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ వ్యాఖ్య ఇది. ముందుండి నడిపిస్తూ... టాప్ పేసర్ బుమ్రా మూడు టెస్టులే ఆడతాడని ఖాయమయ్యాక సహజంగానే సీనియర్ అయిన సిరాజ్పై ఎక్కువ బాధ్యత నిలిచింది. దానిని అతను సమర్థంగా నిర్వర్తించాడు. జట్టుకు అవసరమైన ప్రతీ సందర్భంలోనూ సిరాజ్ నేనున్నానంటూ ముందుకు వచ్చాడు. కొత్త బంతి ఇస్తే దానిని సమర్థంగా ఉపయోగించాడు. కాస్త పాతబడిన బంతిని అప్పగిస్తే డ్యూక్ బంతులను వాడుకుంటూ స్వింగ్లో చెలరేగడం అతనికే చెల్లింది. కెప్టెన్ గిల్ అయితే ఇక చాలు బౌలింగ్ చేయలేడు అనిపించిన సమయాల్లో కూడా మళ్లీ సిరాజ్కే బంతిని అప్పగించాడు. కాస్త ఘాటుగా చెప్పాలంటే చెరకు మిషన్లో చెరకు గడను చివరి వరకు వాడుతూ పిప్పి చేసినట్లుగా సిరాజ్ను గిల్ ఉపయోగించుకున్నాడు. అయినా సరే ఎక్కడా తగ్గకుండా కీలక సమయాల్లో కీలక వికెట్లతో భారత్ మ్యాచ్లో పైచేయి సాధించేలా చేశాడు. బుమ్రా ఆడని రెండు టెస్టుల్లో భారత్ గెలిచింది. ఎడ్జ్బాస్టన్లో 7 వికెట్లు తీసిన సిరాజ్, ఓవల్లో 9 వికెట్లు పడగొట్టాడు. సిరీస్లో అతను రెండుసార్లు ఇన్నింగ్స్లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. రెండో టెస్టులో వరుస బంతుల్లో రూట్, స్టోక్స్లను అవుట్ చేయడం, క్రాలీని డకౌట్ చేయడం కీలక మలుపులు కాగా... ఓవల్ తొలి ఇన్నింగ్స్లో అతను తీసిన పోప్, రూట్, బ్రూక్ వికెట్లతోనే తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్కు భారీ ఆధిక్యం దక్కలేదు. మూడో రోజు క్రాలీని బౌల్డ్ చేసిన బంతిని ఎవరూ మర్చిపోలేరు. చివరి రోజు బౌలింగ్ గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిలకడగా సత్తా చాటుతూ... మాంచెస్టర్ టెస్టులో 30 ఓవర్లలో 140 పరుగులు ఇచ్చి ఒకటే వికెట్ తీసినప్పుడు సిరాజ్ బౌలింగ్లో పదును తగ్గినట్లు అనిపించింది. అయితే తర్వాతి మ్యాచ్తోనే అతను తనపై వచ్చిన సందేహాలను పటాపంచలు చేశాడు. చాలా సందర్భాల్లో బుమ్రా నీడలో ఉన్నట్లుగా కనిపించిన సిరాజ్ అవకాశం దక్కిన ప్రతీసారి తానేంటో చూపిస్తున్నాడు. బుమ్రాతో కలిసి ఆడిన టెస్టుల్లోకంటే అతను లేని టెస్టుల్లో చెలరేగిపోతున్నాడు. ఏడాదిన్నర క్రితం కేప్టౌన్ టెస్టులో దక్షిణాఫ్రికాపై 15 పరుగులే ఇచ్చి 6 వికెట్లు తీసినప్పుడే టెస్టు బౌలర్గా సిరాజ్ స్థాయి ఎంతో పెరిగింది. ఆ్రస్టేలియాతో సిరీస్లోనూ 20 వికెట్లు పడగొట్టినా... బుమ్రా అసాధారణ 32 వికెట్ల బౌలింగ్తో పాటు భారత్ సిరీస్ ఓడటంతో అతని ప్రదర్శనకు గుర్తింపు రాలేదు. కానీ ఇప్పుడు ఓడిపోతుందనుకున్న సిరీస్ను సమం చేయడంలో సిరాజ్ పోషించిన పాత్ర అతడిని మరో మెట్టు పైకి ఎక్కించింది. చివరగా... నాలుగో రోజు హ్యారీ బ్రూక్ క్యాచ్ వదిలేయడంతో సిరాజ్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతని అద్భుత బౌలింగ్నూ పట్టించుకోకుండా కొందరు వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్ ఓడి ఉంటే అది అతడిని ఎప్పటికీ వెంటాడేది. కానీ ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న ఈ బౌలర్ అలాంటి అవకాశం ఇవ్వకుండా ఒంటిచేత్తో మ్యాచ్ను ముగించాడు. భారత్ను గెలిపించాడు. తానూ గెలిచాడు. ప్రశంసల వెల్లువటెస్టు క్రికెట్కు వన్నెతెచి్చన సిరీస్ ఇది. ఆఖరి మ్యాచ్ అయితే అద్భుతం. నిజంగా రోమాలు నిక్క»ొడుచుకునేలా చేసింది. సిరీస్ ఫలితం 2–2 అయి వుండొచ్చు. కానీ... ప్రదర్శనతో 10కి 10 మార్కులు తెచ్చుకున్నారు. టీమిండియన్స్ అంతా సూపర్గా ఆడారు. –భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్భారత జట్టు అద్భుత విజయం సాధించింది. సిరాజ్, ప్రసిధ్ కృష్ణ బౌలింగ్లో కనబరిచిన నిబద్ధత, అంకితభావానికి హ్యాట్సాఫ్. సిరాజ్కు నా ప్రత్యేక అభినందనలు. జట్టు కోసం ఏదైనా చేసేందుకు ముందువరుసలో సిద్ధంగా ఉంటాడు. –విరాట్ కోహ్లిసంప్రదాయ క్రికెట్కు ఉన్న మ్యాజిక్ను ఆవిష్కరించిన మ్యాచ్ ఇది. ఓవల్ క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయే మ్యాచ్కు ఆతిథ్యమిచ్చింది. అసాధారణ ఆటతీరుతో టెస్టు ఇమేజ్ పెంచిన భారత్, ఇంగ్లండ్ జట్ల సభ్యులకు నా ప్రత్యేక ప్రశంసలు. –ఐసీసీ చైర్మన్ జై షాసాక్షి క్రీడా విభాగం -
‘పోయింది అనుకున్న మ్యాచ్ గెలిచారు.. నన్ను క్షమించండి’
ఇంగ్లండ్పై ఓవల్ వేదికగా అనూహ్య విజయం సాధించిన టీమిండియాపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. ఇదొక చారిత్రాత్మక విజయమని కొనియాడారు. మన చేతుల్లో మ్యాచ్లో లేదు.. పోయింది అనుకున్న సమయంలో టీమిండియా ఆటగాళ్లు అద్భుతం చేశారన్నారు. తాను కూడా మ్యాచ్ మన నుంచి చేజారిపోయిందనే అనుకున్నానని, అయితే అది తప్పు అని నిరూపించి మన ఆటగాళ్లు అద్భుతమే సృష్టించారని పొగడ్తల వర్షం కురిపించారు. అదే సమయంలో మ్యాచ్ ఓడిపోయే అవకాశం ఉందని తాను చెప్పిన దానికి బదులుగా టీమిండియా సభ్యులకు క్షమాపణలు తెలియజేశారు శశిథరూర్.Words fail me….WHAT A WIN! 🇮🇳🏏 Absolutely exhilarated & ecstatic for #TeamIndia on their series-clinching victory against England! The grit, determination, and passion on display were simply incredible. This team is special. I am sorry that I expressed a spasm of doubt about…— Shashi Tharoor (@ShashiTharoor) August 4, 2025 ‘మ్యాచ్ను టీమిండియా కోల్పోతుందనే అనుకున్నా. ఓటమి ఖాయమని చెప్పాను. అయితే అది తప్పైంది. మన మీద మనం నమ్మకం ఉంచితే అద్భుతాలు సృష్టించవచ్చనే దానికి ఇదొక నిదర్శనం. ఎప్పుడూ మీపై నమ్మకాన్ని కోల్పోకండి’ అంటూ శశిథరూర్ తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ ద్వారా ట్వీట్ చేశారు. ఇంగ్లండ్తో చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఐదో టెస్టులో టీమిండియా ఆరు పరుగుల తేడాతో సంచనల విజయం సాధించింది.లార్డ్స్ టెస్టులో బ్యాట్తో జట్టును గెలిపించలేకపోయిన సిరాజ్.. ఓవల్లో మాత్రం బంతితో తన జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. ఈ కీలక పోరులో సిరాజ్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. బుమ్రా లేని లోటును తెలియనివ్వలేదు. తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు పడగొట్టిన సిరాజ్.. రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లతో సత్తాచాటాడు. మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. ఈ టెస్టులో విజయం సిరీస్ను భారత్ 2-2తో సమం చేసింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. -
చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్.. కపిల్ దేవ్ రికార్డు బ్రేక్
ది ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. తన సంచలన బౌలింగ్తో భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో సిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగాడు. మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. ఈ క్రమంలో సిరాజ్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.సిరాజ్ సాధించిన రికార్డులు ఇవే..👉ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక టెస్టు వికెట్లు తీసిన మూడో భారత బౌలర్గా సిరాజ్ నిలిచాడు. సిరాజ్ ఇప్పటివరకు ఇంగ్లండ్లో 46 టెస్టు వికెట్లు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట ఉండేది.కపిల్ దేవ్ తన టెస్టు కెరీర్లో ఇంగ్లండ్ గడ్డపై 43 వికెట్లు సాధించాడు. తాజా ఇన్నింగ్స్లో స్మిత్ను ఔట్ చేసి ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో జస్ప్రీత్ బుమ్రా(51), ఇషాంత్ శర్మ(51) సంయుక్తంగా ఆగ్రస్ధానంలో ఉన్నారు.👉అదేవిధంగా ఇంగ్లండ్లో జరిగిన ఒక టెస్టు సిరీస్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు (23) తీసిన బౌలర్గా బుమ్రా రికార్డును సిరాజ్ సమం చేశాడు. బుమ్రా 2021-22 పర్యటనలో ఇంగ్లండ్పై 23 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో సిరాజ్ మరో వికెట్ తీసి ఉంటే బుమ్రాను ఆధిగమించేవాడు.👉వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ హిస్టరీలో అత్యధిక సార్లు ఫైవ్ వికెట్ హాల్ సాధించిన నాలుగో బౌలర్గా అక్షర్ పటేల్ రికార్డును సిరాజ్ సమం చేశాడు. అక్షర్ ఇప్పటివరకు 5 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించగా.. సిరాజ్ కూడా సరిగ్గా ఐదు సార్లు ఈ ఫీట్ సాధించాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక త్యధిక సార్లు ఫైవ్ వికెట్ హల్ సాధించిన బౌలర్ల జాబితాలో జస్ప్రీత్ బుమ్రా (12) అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత అశ్విన్ (11), రవీంద్ర జడేజా (6) జడేజా కొనసాగుతున్నారు.ఇక ఈ సిరీస్లో సిరాజ్(23 వికెట్లు) లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు.చదవండి: అతడొక సంచలనం.. ప్రాణం పెట్టి ఆడాడు! ఎంత చెప్పిన తక్కువే: గిల్ -
అతడొక సంచలనం.. ప్రాణం పెట్టి ఆడాడు! ఎంత చెప్పిన తక్కువే: గిల్
ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా అద్బుతమైన విజయంతో ముగించింది. ఆండర్సన్- టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టులో 6 పరుగుల తేడాతో భారత్ చారిత్రత్మక విజయం సాధించింది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ప్రత్యర్ధిని ఓడించి సిరీస్ను 2-2తో భారత్ సమం చేసింది.374 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లండ్ సైతం ఆఖరివరకు పోరాడింది. ఓటమి తప్పదనుకున్న చోట భారత బౌలర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ అద్బుతం చేశారు. 339/6 ఓవర్ నైట్ స్కోర్తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. 85.1 ఓవర్లలో 367 పరుగులకు ఆలౌటైంది.సెకెండ్ ఇన్నింగ్స్లో సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్ నాలుగు వికెట్లు సాధించారు. ఓవరాల్గా రెండు ఇన్నింగ్స్లు కలిపి సిరాజ్ తొమ్మిది, ప్రసిద్ద్ 8 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 224 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 247 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్లో 396 పరుగుల భారీ స్కోర్ చేసి 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక ఈ అద్బుత విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పందించాడు. కీలక మ్యాచ్లో గెలిసి సిరీస్ సమం చేసినందుకు సంతోషంగా ఉందని గిల్ అన్నాడు."ఈ సిరీస్ అసాంతం రెండు జట్లు(భారత్, ఇంగ్లండ్) అద్బుతమైన ప్రదర్శన కనబరిచాయి. ఈ మ్యాచ్ ఐదో రోజు విషయానికి వస్తే.. ఇరు జట్లకు సమంగా విజయ అవకాశాలు ఉండేవి. ఎవరు గెలుస్తారో అంచనా వేయలేని పరిస్థితి. ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి. ఆఖరికి ఈ ఉత్కంఠపోరులో మేము పై చేయి సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది.అందుకే కొత్త బంతిని తీసుకోలేదు..సిరాజ్, ప్రసిద్ద్ లాంటి బౌలర్లు ఇంత అద్బుతంగా బౌలింగ్ చేస్తే ఎవరికైనా కెప్టెన్సీ చాలా సులభం అనిపిస్తుంది. వారిద్దరూ మ్యాచ్ విన్నింగ్ స్పెల్ బౌలింగ్ చేశారు. పాత బంతితో మాకు ఎటువంటి సమస్యలేదన్పించింది. బంతి రెండు వైపులా మంచిగా మూవ్ అయింది. అందుకే కొత్త బంతిని తీసుకులేదు. అయితే ఆరంభంలో మాపై కొంత మాపై ఒత్తడి ఉండేది. కానీ గెలుస్తామన్న నమ్మకం అయితే మాకు ఉండేది. వారిని ఒత్తిడి గురిచేయాలనుకున్నాము. ఒత్తిడిలో ఎటువంటి జట్టు అయినా తప్పిదాలు చేస్తోంది. మా ప్రణాళికలకు తగ్గట్టే బౌలర్లు అద్బుతంగా రాణించారు.ఒక్కడు చాలు..సిరాజ్ ఒక సంచలనం. అటువంటి బౌలర్ ఒకరు జట్టులో ఉండాలని ప్రతీ కెప్టెన్ కోరుకుంటాడు. ఈ ఒక్క మ్యాచ్లోనే కాదు ఈ ఐదు మ్యాచ్ల సిరీస్ మొత్తం అతడు ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. ప్రతీ బంతిని ప్రాణం పెట్టి బౌలింగ్ చేస్తాడు.ఈ విజయానికి మేము అన్ని రకాల ఆర్హులం. ఇక ఈ సిరీస్లో టాప్ రన్స్కోరర్గా నిలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సిరీస్ ఆరంభానికి ముందు నేను చాలా కష్టపడ్డాడు. ఈ సిరీస్లో బెస్ట్ బ్యాటర్గా ఉండడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇప్పుడు నా లక్ష్యాన్ని అందుకున్నాను" పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో గిల్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: ప్రతీకారం తీర్చుకున్న సిరాజ్.. ఓవల్లో భారత్ చారిత్రత్మక విజయంसूरमा नहीं विचलित होते,क्षण एक नहीं धीरज खोते,विघ्नों को गले लगाते हैं,काँटों में राह बनाते हैं।#INDvsENGTest #OvalTest pic.twitter.com/j7W0q1y2RY— Office of Shivraj (@OfficeofSSC) August 4, 2025 -
ప్రతీకారం తీర్చుకున్న సిరాజ్.. ఓవల్లో భారత్ చారిత్రాత్మక విజయం
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలోని ఆఖరి మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన టెస్టు క్రికెట్ మజాను అందించింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఐదో టెస్టులో ఇంగ్లండ్పై 6 పరుగుల తేడాతో టీమిండియా సంచలన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ 2-2తో సమమైంది. ఈ విజయంలో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ది కీలక పాత్ర.సిరాజ్ అద్భుతం..లార్డ్స్ టెస్టులో బ్యాట్తో జట్టును గెలిపించలేకపోయిన సిరాజ్.. ఓవల్లో మాత్రం బంతితో తన జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. ఈ కీలక పోరులో సిరాజ్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. బుమ్రా లేని లోటును తెలియనివ్వలేదు. తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు పడగొట్టిన సిరాజ్.. రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లతో సత్తాచాటాడు. మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు.తొలి ఓవర్లోనే.. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు అవసరమవ్వగా.. భారత్ 4 వికెట్లు కావాల్సి వచ్చాయి. క్రీజులో జేమీ ఓవర్టన్, స్మిత్ ఉండగా.. తొలి ఓవర్ వేసే బాధ్యతను ప్రసిద్ద్ కృష్ణకు గిల్ అప్పగించాడు. అయితే ఆ ఓవర్లో ప్రసిద్ద్ వేసిన తొలి బంతినే ఓవర్టన్ బౌండరీకి తరలించాడు. ఆ తర్వాత నాలుగో బంతికి ఫోర్ రావడంతో ఓ ఓవర్లో ఇంగ్లండ్కు 8 పరుగులు లభించాయి. ఇంగ్లండ్ విజయసమీకరణం 27 పరుగులు మారింది. దీంతో డ్రెస్సింగ్ రూమ్తో పాటు అభిమానుల్లో టెన్షన్ నెలకొంది.మియా ఎంట్రీ..ఈ సమయంలో ఎంట్రీ ఇచ్చిన సిరాజ్ మియా.. తన వేసిన తొలి ఓవర్లోనే స్మిత్ను ఔట్ చేసి భారత శిబిరంలో గెలుపు ఆశలు చిగురించేలా చేశాడు. ఆ తర్వాత జేమీ ఓవర్టన్ను సిరాజ్ అద్బుతమైన ఎల్బీగా పెవిలియన్కు పంపాడు. ఈ సమయంలో సిరాజ్కు ప్రసిద్ద్ తోడయ్యాడు.సంచలన బంతితో టెయిలాండర్ టంగ్ను ప్రసిద్ద్ బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో గాయపడిన క్రిస్ వోక్స్ బ్యాటింగ్కు వచ్చాడు. భుజం ఎముక విరిగినప్పటికి తన జట్టు కోసం వోక్స్ మైదానంలో అడుగుపెట్టాడు. నొప్పిని భరిస్తూనే నాన్స్ట్రైక్ ఎండ్లో అట్కిన్సన్కు సపోర్ట్గా వోక్స్ నిలిచాడు. అనంతరం 84వ ఓవర్లో సిరాజ్ బౌలింగ్లో అట్కిన్సన్ సిక్సర్ కొట్టడంతో మళ్లీ టెన్షన్ నెలకొంది. అంతకుతోడు ధ్రువ్ జురెల్ రనౌట్ మిస్ చేయడంతో ఉత్కంఠ మరింత పెరిగింది.కానీ 86వ ఓవర్ వేసిన సిరాజ్ మియా.. అద్బుతమైన బంతితో అట్కిన్సన్ను బౌల్డ్ చేసి అభిమానుల ఉత్కంఠకు తెరదించాడు. దీంతో 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 367 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో సిరాజ్తో పాటు ప్రసిద్ద్ కృష్ణ 8 వికెట్లతో సత్తాచాటాడు.చదవండి: ENG Vs IND: క్రికెట్ చరిత్రలో అత్యంత సాహసోపేతమైన ఎంట్రీ.. ఒంటిచేత్తో బ్యాటింగ్కు దిగిన వోక్స్ -
వాహ్ సిరాజ్ మియా.. చిరకాలం గుర్తుండిపోయేలా చేశావు..!
ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్ట్లో టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ మ్యాచ్లో ఐదు వికెట్ల ప్రదర్శన సహా మొత్తం 9 వికెట్లు తీసిన సిరాజ్.. ఆట చివరి రోజు అద్బుతం చేశాడు. ఇంగ్లండ్ గెలుపుకు 35 పరుగులు అవసరమైన దశలో తనలోని అత్యుత్తమ టాలెంట్ను వెలికి తీసి ఇంగ్లండ్ గెలుపును అడ్డుకున్నాడు. చివరి రోజు ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ చేతిలో 4 వికెట్లు ఉండగా.. సిరాజ్ మ్యాజిక్ స్పెల్తో మూడు వికెట్లు తీశాడు. మరో వికెట్ను ప్రసిద్ద్ కృష్ణ పడగొట్టాడు.దీంతో ఇంగ్లండ్ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్ను 2-2తో డ్రా చేసుకుంది. ఈ సిరీస్ మొత్తంలో సిరాజ్ విశేషంగా రాణించాడు. 5 మ్యాచ్ల్లో 23 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఈ సిరీస్లో అత్యధిక బంతులు వేసిన బౌలర్ కూడా సిరాజే.374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ హ్యారీ బ్రూక్ (111), జో రూట్ (105) సెంచరీలతో చెలరేగడంతో ఓ దశలో సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే భారత పేసర్లు అనూహ్యంగా పుంజుకోవడంతో చివరి 7 వికెట్లు 66 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. సిరాజ్ చిరకాలం గర్తుండిపోయే స్పెల్ వేసి టీమిండియా అపూర్వ విజయాన్నిందించాడు. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఈ సిరీస్లో ఇంగ్లండ్ 1,3 మ్యాచ్లు గెలువగా.. భారత్ 2, 5 మ్యాచ్ల్లో నెగ్గింది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. -
ENG Vs IND: క్రికెట్ చరిత్రలో అత్యంత సాహసోపేతమైన ఎంట్రీ.. ఒంటిచేత్తో బ్యాటింగ్కు దిగిన వోక్స్
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఎంట్రీకి వేదికైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఆటగాడు క్రిస్ వోక్స్ భుజం విరిగినప్పటికీ ఒంటిచేత్తో బ్యాటింగ్కు దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆట చివరి రోజు ఇంగ్లండ్ గెలుపుకు 18 పరుగులు అవసరమైన దశలో వోక్స్ 11వ నంబర్ ఆటగాడిగా ఎంట్రీ ఇచ్చాడు. అతని ఎంట్రీ సినిమా ఎలివేషన్ను తలపించింది.వోక్స్ బ్యాటింగ్ చేయలేకపోయినా స్ట్రయిక్ రొటేట్ చేసి ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నించాడు. అయితే దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ భారత్ చేతిలో 6 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఫలితంగా భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్ను 2-2తో సమం చేసుకుంది.ఇదే సిరీస్ నాలుగో టెస్ట్లో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ కూడా పాదం ఫ్రాక్చర్ అయినప్పటికీ జట్టు ప్రయోజనాల కోసం బరిలోకి దిగి అందరి మన్ననలు అందుకున్నాడు. 1984లో విండీస్ ఆటగాడు మాల్కమ్ మార్షల్ కూడా వోక్స్ తరహాలోనే ఒంటిచేత్తో బ్యాటింగ్కు దిగాడు. ఇంగ్లండ్తో జరిగిన ఆ మ్యాచ్లో మార్షల్ ఒంటిచేత్తో బౌండరీ బాదిన సన్నివేశాన్ని క్రికెట్ ప్రపంచం ఎన్నటికీ మరిచిపోదు.Arm in a sling, Chris Woakes has arrived to the crease 😱 pic.twitter.com/D4QDscnfXE— Sky Sports Cricket (@SkyCricket) August 4, 2025మ్యాచ్ విషయానికొస్తే.. ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్ట్ హోరాహోరీగా సాగింది. 374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ వీరోచితంగా పోరాడినప్పటికీ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. హ్యారీ బ్రూక్ (111), జో రూట్ (105) అద్బుతమైన శతకాలతో గెలుపుకు గట్టి పునాది వేసినా చివరి వరుస బ్యాటర్లు విఫలం కావడంతో ఇంగ్లండ్కు ఓటమి తప్పలేదు. టీమిండియా పేసర్లు అద్బుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేశారు. ముఖ్యంగా సిరాజ్ చివరి రోజు సింహంలా గర్జించి ముగ్గురు ఇంగ్లండ్ బ్యాటర్లను ఔట్ చేశాడు. ఈ ఇన్నింగ్స్లో సిరాజ్ మొత్తంగా ఐదు వికెట్లు తీశాడు. అతనికి ప్రసిద్ద్ కృష్ణ (27-3-126-4), ఆకాశ్దీప్ (20-4-85-1) సహకరించాడు.అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఈ సిరీస్లో ఇంగ్లండ్ 1,3 మ్యాచ్లు గెలువగా.. భారత్ 2, 5 మ్యాచ్ల్లో నెగ్గింది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. -
IND Vs ENG: సిరాజ్ అద్భుతం.. ఐదో టెస్టులో టీమిండియా సంచలన విజయం
లండన్లోని ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్టులో 6 పరుగుల తేడాతో టీమిండియా సంచలన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీని 2-2తో భారత్ సమం చేసింది. 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 367 పరుగులకు ఆలౌటైంది.ఆఖరి రోజు ఆటలో భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అద్భుతం చేశాడు. ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు.. సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. ఓవరాల్గా సిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు ప్రసిద్ద్ కృష్ణ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.రూట్, బ్రూక్ సెంచరీలు వృథా..ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(105), హ్యారీ బ్రూక్(111) అద్బుతమైన సెంచరీలతో రాణించారు. ఓ దశలో వీరిద్దరూ తమ జట్టును సునయాసంగా గెలిపించేలా కన్పించారు. కానీ ప్రత్యర్ధి జట్టు వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో కథ తారుమారైంది.ఇంగ్లండ్ ఓటమిపాలవ్వడంతో రూట్, బ్రూక్ సెంచరీలు వృథా అయిపోయాయి. కాగా తొలి ఇన్నింగ్స్లో భారత్ 224 పరుగులు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్ను 247 పరుగులకు ముగించింది. ఆ తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్లో మాత్రం భారత్ అదరగొట్టింది. యశస్వి జైశ్వాల్(118) సెంచరీ, ఆకాష్ దీప్(66), రవీంద్ర జడేజా(53), వాషింగ్టన్ సుందర్(53) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ 396 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్కు 374 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్ధేశించింది. ఈ భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు చేధించడంలో చతికలపడింది.చదవండి: IND vs ENG: ప్రతీకారం తీర్చుకున్న సిరాజ్.. ఓవల్లో భారత్ చారిత్రత్మక విజయం -
ప్రసిద్ద్ కృష్ణకు సారీ చెప్పిన సిరాజ్.. వీడియో వైరల్!
లండన్లోని ఓవల్ మైదానం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు రసవత్తర ముగింపునకు చేరుకుంది. ఆఖరి రోజు ఆటలో భారత్ విజయానికి 4 వికెట్లు అవసరమవ్వగా.. ఇంగ్లడ్ తమ గెలుపునకు 35 పరుగులు దూరం నిలిచింది.తొలి సెషన్లో మ్యాచ్ ఫలితం తేలిపోనుంది. ప్రస్తుతం క్రీజులో జేమీ స్మిత్(2), జేమి ఓవర్టన్(0) ఉన్నారు. ఇంగ్లండ్ను ఎలాగైనా ఆలౌట్ చేసి సిరీస్ను సమం చేయాలని పట్టుదలతో భారత బౌలర్లు ఉన్నారు.అయితే మ్యాచ్ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ చిన్న తప్పిదంతో విలన్గా మారిపోయాడు. తన బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లను బోల్తా కొట్టించిన సిరాజ్.. ఫీల్డింగ్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు.కొంపముంచిన సిరాజ్..సెకెండ్ ఇన్నింగ్స్లో విధ్వంసకర సెంచరీతో చెలరేగిన ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్కు ఆరంభంలోనే సిరాజ్ లైఫ్ ఇచ్చేశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 35వ ఓవర్ వేసిన ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో తొలి బంతిని హ్యారీ బ్రూక్ ఫైన్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు. అక్కడే ఉన్న సిరాజ్ మియా క్యాచ్ను అందుకున్నాడు.అయితే క్యాచ్ను అందుకున్న సిరాజ్ తన వెనకే ఉన్న బౌండరీ రోప్ను టచ్ చేశాడు. దీంతో బ్యాటర్కు ఆరు పరుగులు లభించాయి. 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న బ్రూక్.. ఏకంగా 111 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.తర్వాత ప్రసిద్ద్ కృష్ణ వద్దకు సిరాజ్ వెళ్లి క్షమాపణలు చెప్పాడు. ప్రసిద్ద్ కృష్ణ నవ్వుతూ సిరాజ్ను హగ్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే యాదృచ్ఛికంగా బ్రూక్ మళ్లీ సిరాజ్కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.Prasidh Krishna was all of us, watching it unfold 😥 #SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/jB138cMO13— Sony Sports Network (@SonySportsNetwk) August 3, 2025 -
IND VS ENG: 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి..!
భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న 5 టెస్ట్ల టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ-2025 రికార్డులకు అడ్డాగా మారింది. ఈ సిరీస్లో ఏళ్ల నాటి రికార్డులు తిరగరాయబడ్డాయి. కొన్ని విభాగాల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పబడ్డాయి. ఐదో టెస్ట్లో రికార్డుల పరంపర తారాస్థాయికి చేరింది.ఈ మ్యాచ్ నాలుగో రోజు సరికొత్త చరిత్ర సృష్టించబడింది. ఈ సిరీస్లో ఏకంగా 9 మంది బ్యాటర్లు 400 ప్లస్ పరుగులు చేశారు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ సిరీస్లోనూ ఇంత మంది 400 ప్లస్ పరుగులు చేయలేదు.ఈ సిరీస్లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ అత్యధికంగా 754 పరుగులు చేశాడు. గిల్ తర్వాత జో రూట్ (537), కేఎల్ రాహుల్ (532), రవీంద్ర జడేజా (516), హ్యారీ బ్రూక్ (481), రిషబ్ పంత్ (479), బెన్ డకెట్ (462), జేమీ స్మిత్ (434), యశస్వి జైస్వాల్ (411) 400 ప్లస్ పరుగులు చేశారు.గతంలో ఇలా..!వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన 1975-76 సిరీస్లో ఇరు జట్లకు చెందిన 8 మంది బ్యాటర్లు 400 ప్లస్ పరుగులు చేశారు. ఆతర్వాత 1993 యాషెస్ సిరీస్లోనూ ఇదే ఫీట్ రిపైటైంది. అయితే 9 మంది 400 ప్లస్ పరుగులు నమోదు చేయడం మాత్రం ఇదే మొదటిసారి.భారత క్రికెట్ చరిత్రలోనూ ఇదే మొదటిసారిఈ సిరీస్లో ఏకంగా ముగ్గురు భారత బ్యాటర్లు (గిల్, రాహుల్, జడేజా) 500 ప్లస్ పరుగులు చేయడం మరో విశేషం. 93 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఫీట్ నమోదు కాలేదు.మ్యాచ్ విషయానికొస్తే.. ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్ చివరి రోజు ఇంగ్లండ్ గెలవాలంటే 35 పరుగులు, భారత్ గెలుపుకు నాలుగు వికెట్లు కావాలి. నాలుగో రోజు వెలుతురులేమి కారణంగా ఆటను గంట ముందుగా నిలిపి వేశారు.374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. జేమీ ఓవర్టన్ (0), జేమీ స్మిత్ (2) క్రీజ్లో ఉన్నారు. ఈ సిరీస్లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. 1, 3 టెస్ట్ల్లో ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో టెస్ట్ గెలిచింది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. స్కోర్ వివరాలు..భారత్ 224 & 396ఇంగ్లండ్ 247 & 339/6 (76.2) -
ENG VS IND 5th Test: అరుదైన ఘనత సాధించిన సిరాజ్
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ సిరీస్లో 1000 బంతులు వేసిన తొలి బౌలర్గా (ఇరు జట్ల తరఫున) అవతరించాడు. అలాగే 2002 జూన్ నుంచి ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ల్లో అత్యధిక బంతులు బౌల్ చేసిన భారత ఫాస్ట్ బౌలర్గానూ నిలిచాడు. ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్లో ఈ ఘనతలు సాధించాడు. ఈ సిరీస్లో సిరాజ్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గానూ కొనసాగుతున్నాడు. 5 మ్యాచ్ల్లో సిరాజ్ 20 వికెట్లు పడగొట్టాడు.ఐదో టెస్ట్ విషయానికొస్తే.. రసవత్తరంగా సాగుతున్న ఈ మ్యాచ్లో చివరి రోజు ఇంగ్లండ్ గెలవాలంటే 35 పరుగులు, భారత్ గెలుపుకు నాలుగు వికెట్లు కావాలి. నాలుగో రోజు వెలుతురులేమి కారణంగా ఆటను గంట ముందుగా నిలిపి వేశారు.374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27), బ్రూక్ (111), జో రూట్ (105), జేకబ్ బేతెల్ (5) ఔట్ కాగా.. జేమీ స్మిత్ (2), జేమీ ఓవర్టన్ (0) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ 3, సిరాజ్ 2, ఆకాశ్దీప్ ఓ వికెట్ తీశారు.అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది. -
ENG VS IND 5th Test: ఇంగ్లండ్ జట్టుకు శుభవార్త
భారత్-ఇంగ్లండ్ మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్ చివరి రోజు ఇంగ్లండ్ గెలవాలంటే 35 పరుగులు, భారత్ గెలుపుకు నాలుగు వికెట్లు కావాలి. నాలుగో రోజు వెలుతురులేమి కారణంగా ఆటను గంట ముందుగా నిలిపి వేశారు.374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. జేమీ ఓవర్టన్ (0), జేమీ స్మిత్ (2) క్రీజ్లో ఉన్నారు.అంత ఈజీ కాదుఐదో రోజు ఇంగ్లండ్ ఛేదించాల్సిన లక్ష్యం 35 పరుగులే అయినప్పటికీ ఇది అంత ఈజీ కాదు. 22 బంతుల తర్వాత భారత బౌలర్ల చేతికి కొత్త బంతి వస్తుంది. కొత్త బంతితో భారత బౌలర్లను ఎదుర్కోవడం ఇంగ్లండ్ టెయిలెండర్లకు కత్తి మీద సామే అవుతుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా వికెట్ సమర్పించుకోక తప్పదు.ఇలాంటి పరిస్థితుల్లో భారత పేసర్లు సర్వశక్తులు ఒడ్డి వికెట్ల కోసం ప్రయత్నిస్తారు. నాలుగో రోజు చివర్లోనే సిరాజ్, ప్రసిద్ద్ లయను అందుకున్నారు. ఐదో రోజు ఆరంభంలోనే వికెట్ పడితే ఇంగ్లండ్పై తీవ్రమైన ఒత్తిడి వస్తుంది. క్రీజ్లో ఉన్న ఆటగాళ్లలో జేమీ స్మిత్ను తప్పిస్తే ఆట భారత్వైపుకు మళ్లే అవకాశం లేకపోలేదు.ఇంగ్లండ్కు శుభవార్తఈ పరిస్థితుల్లో ఇంగ్లండ్ జట్టుకు శుభవార్త వినిపించింది. తొలి రోజు ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన క్రిస్ వోక్స్ అవసరమైతే బ్యాటింగ్కు వస్తాడని జో రూట్ తెలిపాడు. వోక్స్కు ఎడమ భుజం మిస్ లొకేట్ అయినప్పటికీ జట్టు కోసం గాయాన్ని లెక్క చేయకుండా బ్యాటింగ్కు వస్తాడని రూట్ స్పష్టం చేశాడు. అయినా, మ్యాచ్ అంతవరకు (వోక్స్ బ్యాటింగ్ చేసేంత వరకు) వస్తుందని అనుకోవట్లేదని రూట్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా, ఈ సిరీస్ నాలుగో టెస్ట్లో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ కూడా గాయాన్ని (విరిగిన పాదం) లెక్క చేయకుండా బ్యాటింగ్కు దిగిన విషయం తెలిసిందే.బ్రూక్, రూట్ సెంచరీలు భారీ లక్ష్య ఛేదనలో బ్రూక్ (111), జో రూట్ (105) సెంచరీలు చేసి ఇంగ్లండ్ను గెలుపుతీరాల వరకు తీసుకెళ్లారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడంతో ఇంగ్లండ్ డిఫెన్స్లో పడింది. 36 పరుగుల వ్యవధిలో ఇంగ్లండ్ బ్రూక్, రూట్తో పాటు జేకబ్ బేతెల్ వికెట్ కూడా కోల్పోయి తడబాటుకు లోనైంది. జైస్వాల్ సూపర్ శతకంఅంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్లో 396 పరుగులకు ఆలౌటై, ఇంగ్లండ్కు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది. -
India vs England: ఇంకా ఉంది!
ఆఖరి టెస్టుకు, ఐదు మ్యాచ్ల సిరీస్కు నాలుగో రోజే తెరపడాలి. కానీ వెలుతురు మందగించడంతో ఆగిన ఆట... తర్వాత జోరు వాన కురవడంతో ఎంతకీ కొనసాగలేదు. నాటకీయ ముగింపునకు తెరలేచిన ఈ పోరు తుది ఫలితం నేటికి వాయిదా పడింది. ఆతిథ్య ఇంగ్లండ్ 3–1 ఆధిక్యంతో సిరీస్ గెలుచుకునేందుకు మరో 35 పరుగుల దూరంతో దగ్గరైంది. అలాగే భారత్ కూడా 2–2తో సమం చేసేందుకు అంతే దగ్గరగా ఉంది. ప్రధాన బ్యాటర్లంతా అవుట్కాగా 35 పరుగులు చేసేలోపు 4 వికెట్లు తీస్తే టీమిండియా సమం చేసుకొని సగర్వంగా తిరిగొస్తుంది. లండన్: నాటకీయత మొదలవగానే... ఉత్కంఠ అంతకంతకు పెరగకముందే... ప్రతికూల వాతావరణం ఆటకు ‘రెడ్ సిగ్నల్’ ఇవ్వడంతో ‘టెండూల్కర్–అండర్సన్ ట్రోఫీ’ సిరీస్ ఫలితం నాలుగో రోజు తేలలేదు. ఇన్నాళ్లు జరిగిన నాలుగు టెస్టుల అసలు మజా కంటే చివరి ఐదో టెస్టు ‘కొసరే’ ఇరు జట్లను ఊరిస్తోంది. ఇంగ్లండ్ 374 పరుగులు ఛేదన కాస్తా 35 పరుగుల దూరంలో నిలిచింది. వర్షంతో ఆట నిలిచే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 76.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (98 బంతుల్లో 111; 14 ఫోర్లు, 2 సిక్స్లు), జో రూట్ (152 బంతుల్లో 105; 12 ఫోర్లు) శతక్కొట్టారు. జేమీ స్మిత్ (2 బ్యాటింగ్), ఓవర్టన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 3, సిరాజ్ 2 వికెట్లు తీశారు. ఆకాశ్దీప్కు ఒక వికెట్ దక్కింది. ‘టాప్’ లేపడంతో ఉత్సాహం తొలి సెషన్ భారత శిబిరంలో ఉత్సాహం నింపింది. లక్ష్యఛేదన జట్టులోని ఇద్దరు టాపార్డర్ బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ఓవర్నైట్ స్కోరు 50/1తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన డకెట్ (54, 6 ఫోరు), కెప్టెన్ ఒలీ పోప్ (34 బంతుల్లో 27; 5 ఫోర్లు) నిలకడను ప్రదర్శించారు. ఓవర్నైట్ బ్యాటర్ డకెట్ 76 బంతుల్లో తన అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే ప్రసిధ్ కృష్ణ బౌలింగ్లో స్లిప్లో ఉన్న రాహుల్కు క్యాచ్ ఇచ్చి ని్రష్కమించాడు. మళ్లీ ఐదు ఓవర్ల లోపలే సిరాజ్ చక్కని డెలివరీతో కెపె్టన్ పోప్ను ఎల్బీగా అవుట్ చేశాడు. అప్పటికి ఇంగ్లండ్ 106/3 స్కోరే చేసింది. తర్వాత రూట్, బ్రూక్ పరుగుల బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. తొలి సెషన్లోనే బ్రూక్ అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడి భారత బౌలర్లకు మింగుడుపడిని ఇన్నింగ్స్కు శ్రీకారం చుట్టేశాడు. ఇంగ్లండ్ 164/3 వద్ద లంచ్ బ్రేక్కు వెళ్లింది. బ్రూక్, రూట్ శతకాలు నాలుగో ఇన్నింగ్స్లో తొలి సెషన్లోనే రెండు కీలక వికెట్లు పడిపోవడం బౌలింగ్ జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచుతుంది. అయితే క్రీజులో పాతుకుపోయిన రూట్తో అందివచ్చిన అవకాశాన్ని సది్వనియోగం చేసుకున్న బ్రూక్ సాఫీగా పరుగులు సాధిస్తుండటంతో భారత శిబిరంలోని ఆత్మవిశ్వాసం కాస్తా సన్నగిల్లింది. ఇదే అదనుగా ఇద్దరు లక్ష్యాన్ని కరిగించే పనినిలో ముందడుగు వేశారు. ఈ సెషన్ భారత్ ఆశల్ని చిదిమింది. వన్డేను తలపించే ఆటతీరుతో బ్రూక్ 91 బంతుల్లోనే శతకం సాధించాడు. అతను ని్రష్కమించాక... ఆఖరి సెషన్లో రూట్ 137 బంతుల్లో సెంచరీ చేశాడు. లక్ష్యానికి చేరువైన దశలో బెథెల్ (5), రూట్ అవుటవడంతోనే డ్రామా మొదలైంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 224; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 247; భారత్ రెండో ఇన్నింగ్స్: 396; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (బి) సిరాజ్ 14; డకెట్ (సి) రాహుల్ (బి) ప్రసిధ్కృష్ణ 54; పోప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 27; రూట్ (సి) జురేల్ (బి) ప్రసి«ద్ 105; బ్రూక్ (సి) సిరాజ్ (బి) ఆకాశ్దీప్ 111; బెథెల్ (బి) ప్రసి«ద్కృష్ణ 5; స్మిత్ బ్యాటింగ్ 2; ఓవర్టన్ బ్యాటింగ్ 0; ఎక్స్ట్రాలు 21; మొత్తం (76.2 ఓవర్లలో 6 వికెట్లకు) 339. వికెట్ల పతనం: 1–50, 2–82, 3–106, 4–301, 5–332, 6–337. బౌలింగ్: ఆకాశ్దీప్ 20–4–85–1, ప్రసి«ద్కృష్ణ 22.2–3–109–3, సిరాజ్ 26–5–95–2, సుందర్ 4–0–19–0, జడేజా 4–0–22–0. -
ENG VS IND 5th Test Day 4: నిలిచిపోయిన ఆట
భారత్-ఇంగ్లండ్ మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ఇంగ్లండ్ గెలుపునకు 35 పరుగుల దూరంలో ఉన్నప్పుడు వెలుతురులేమి వల్ల మ్యాచ్ నిలిచిపోయింది. ఆతర్వాత భారీ వర్షం మొదలైంది. దీంతో మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పేశారు. ఆటగాళ్లంతా డ్రెస్సింగ్ రూమ్ల్లో సేద తీరుతున్నారు.ఆట నిలిచిపోయే సమయానికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27), బ్రూక్ (111), జో రూట్ (105), జేకబ్ బేతెల్ (5() ఔట్ కాగా.. జేమీ స్మిత్ (2), జేమీ ఓవర్టన్ (0) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలుపుకు 35 పరుగులు, భారత గెలుపుకు 4 వికెట్లు కావాలి.అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్లో 396 పరుగులకు ఆలౌటై, ఇంగ్లండ్కు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది. -
శతక్కొట్టిన బ్రూక్.. సెంచరీకి చేరువలో రూట్.. గెలుపు దిశగా ఇంగ్లండ్
భారత్తో జరుగుతున్న ఐదో టెస్ట్లో ఇంగ్లండ్ గెలుపు దిశగా సాగుతోంది. 374 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ నాలుగో రోజు టీ విరామం సమయానికి 4 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసి, లక్ష్యానికి మరో 57 పరుగుల దూరంలో ఉంది.హ్యారీ బ్రూక్ (98 బంతుల్లో 111; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర శతకం బాది ఇంగ్లండ్ గెలుపుకు గట్టి పునాది వేయగా.. రూట్ (98 నాటౌట్) సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఉన్నాడు. రూట్కు జతగా జేకబ్ బేతెల్ (1) క్రీజ్లో ఉన్నాడు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27), బ్రూక్ (111) ఔటయ్యారు. భారత బౌలర్లలో సిరాజ్ 2, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్దీప్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 5 వికెట్లు (గాయం కారణంగా వోక్స్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు) తీయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యంగా కనిపిస్తుంది. ఏదైన అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్ల భారత్ గెలవలేదు. ఈ మ్యాచ్లో ఓడితే భారత్ సిరీస్ను కూడా కోల్పోతుంది (1-3లో).అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది. -
చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలో తొలి ఆటగాడు
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో 6000 పరుగులు (69 మ్యాచ్ల్లో) పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. భారత్తో జరుగుతున్న ఐదో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో రూట్ ఈ ఘనత సాధించాడు.టీమిండియా నిర్దేశించిన 374 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. 25 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ డబ్ల్యూటీసీలో 6000 పరుగుల మైలురాయిని తాకాడు.డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ స్మిత్ (4278), మార్నస్ లబూషేన్ (4225), బెన్ స్టోక్స్ (3616), ట్రవిస్ హెడ్ (3300) రూట్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రూట్ డబ్ల్యూటీసీలో 20 సెంచరీలు, 22 అర్ద సెంచరీలు చేయడం గమనార్హం.మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ నిర్దేశించిన లక్ష్యానికి ఇంగ్లండ్ మరో 81 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. హ్యారీ బ్రూక్ (103) అద్భుతమైన సెంచరీతో ఇంగ్లండ్ గెలుపుకు బాటలు వేస్తున్నాడు. రూట్ 83 పరుగుల వద్ద బ్యాటింగ్ను కొనసాగిస్తూ అతనికి సహకరిస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ స్కోర్ 293/3గా ఉంది.క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27) ఔట్ కాగా.. జో రూట్ (59), బ్రూక్ (82) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో సిరాజ్ 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో భారత్ గెలుపుకు కేవలం 6 వికెట్లు (గాయం కారణంగా వోక్స్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు) కావాలి.అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది. -
చరిత్ర సృష్టించిన భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్
భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెండూల్కర్-ఆండర్సన్ టెస్ట్ సిరీస్ రికార్డుపుటల్లోకెక్కింది. ఈ సిరీస్లో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు ఏకంగా 50 అర్ద సెంచరీలు బాదారు. టెస్ట్ క్రికెట్ ఆరంభం నుంచి ఓ సిరీస్లో అత్యధిక హాఫ్ సెంచరీల సంఖ్య ఇదే. 1993 యాషెస్ సిరీస్లోనూ ఇన్నే హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి. తాజాగా టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ ఆల్టైమ్ రికార్డును సమం చేసింది. ఐదో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ చేసిన హాఫ్ సెంచరీ ఈ సిరీస్లో 50వది.టెస్ట్ సిరీస్లో అత్యధిక వ్యక్తిగత 50+ స్కోర్లు50* - ఇంగ్లండ్లో టీమిండియా, 202550 - ది యాషెస్, 199349 - ది యాషెస్, 1920/2146 - ఆస్ట్రేలియాలో వెస్టిండీస్, 1960/6146 - ఆస్ట్రేలియాలో వెస్టిండీస్ 1968/69మ్యాచ్ విషయానికొస్తే.. 374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ గెలుపు దిశగా సాగుతోంది. నాలుగో రోజు రెండో సెషన్ డ్రింక్స్ విరామ సమయానికి ఇంగ్లండ్ లక్ష్యానికి ఇంకా 128 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. ఆ జట్టు స్కోర్ సెకెండ్ ఇన్నింగ్స్లో 246/3గా ఉంది.క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27) ఔట్ కాగా.. జో రూట్ (59), బ్రూక్ (82) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో సిరాజ్ 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో భారత్ గెలుపుకు కేవలం 6 వికెట్లు (గాయం కారణంగా వోక్స్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు) కావాలి.అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది. -
ENG VS IND 5th Test: కోహ్లిని దాటేసిన రాహుల్
టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో దుమ్మురేపుతున్నాడు. బ్యాటింగ్లో 10 ఇన్నింగ్స్ల్లో 532 పరుగులు చేసి సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ సిరీస్లో రాహుల్ ఫీల్డర్గానూ సత్తా చాటాడు. 5 మ్యాచ్ల్లో 6 క్యాచ్లు (ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్ ఇంకా కొనసాగుతుంది) పట్టాడు. స్లిప్స్లో రాహుల్ చాలా అలర్ట్గా ఉంటూ ఇంగ్లండ్ బ్యాటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు.KL RAHUL HAS BEEN FANTASTIC IN SLIPS...!!! 💪 pic.twitter.com/juvyI9uH5R— Johns. (@CricCrazyJohns) August 3, 2025ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్లో రాహుల్ బెన్ డకెట్ (ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో) క్యాచ్ పట్టడంతో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిని అధిగమించాడు. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక క్యాచ్లు పట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో రాహుల్ కోహ్లిని వెనక్కు నెట్టాడు. ఇంగ్లండ్లో కోహ్లి టెస్ట్ల్లో 25 క్యాచ్లు పడితే.. తాజాగా రాహుల్ తన క్యాచ్ల సంఖ్యను 26కు పెంచుకున్నాడు. ఈ విభాగంలో సునీల్ గవాస్కర్ (35), రాహుల్ ద్రవిడ్ (30) మాత్రమే రాహుల్ ముందున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. 374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓ మోస్తరుగా ఆడుతుంది. నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి 3 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27) ఔట్ కాగా.. జో రూట్ (23), బ్రూక్ (38) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో సిరాజ్ 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలంటే ఇంకా 210 పరుగులు చేయాలి. అదే భారత్ గెలుపుకు కేవలం 6 వికెట్లు (గాయం కారణంగా వోక్స్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు) కావాలి. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది. -
ENG VS IND 5th Test: సెంచరీ పూర్తి చేసిన సిరాజ్.. విదేశాల్లో మొనగాడు
ఓవల్ టెస్ట్లో భారత్ పట్టు సాధించింది. ఈ మ్యాచ్లో గెలవాలంటే భారత్ మరో 9 వికెట్లు తీయాలి. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ఇదే మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 324 పరుగులు చేయాలి. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోయి 50 పరుగులు చేసింది. బెన్ డకెట్ 34 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. సిరాజ్ అద్బుతమైన బంతిలో జాక్ క్రాలేను (14) క్లీన్ బౌల్డ్ చేశాడు.క్రాలే వికెట్తో సిరాజ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. విదేశీ టెస్ట్ల్లో సిరాజ్ 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఈ మైలురాయిని సిరాజ్ కేవలం 27 టెస్ట్ల్లో తాకాడు. టెస్ట్ కెరీర్లో మొత్తంగా 119 వికెట్లు తీసిన సిరాజ్ విదేశాల్లోనే సింహభాగం వికెట్లు తీసి ఓవర్సీస్ మొనగాడనిపించుకున్నాడు. సిరాజ్ స్వదేశంలో కేవలం 19 వికెట్లు (14 మ్యాచ్ల్లో) సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ రెండో ఇన్నింగ్స్లో 396 పరుగులు చేసి ఇంగ్లండ్కు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది. -
టీమిండియాతో ఐదో టెస్టు.. 123 ఏళ్ల చరిత్రను ఇంగ్లండ్ తిరగరాస్తుందా?
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలోని ఆఖరి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఈ ఐదో టెస్టులో భారత్ తమ విజయానికి తొమ్మిది వికెట్ల దూరంలో నిలవగా.. ఇంగ్లండ్ గెలుపునకు ఇంకా 324 పరుగులు కావాలి. 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 13.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 50 పరుగులు చేసింది.దాదాపు నాలుగో రోజు ఆటలో ఫలితం తేలే అవకాశముంది. ఎలాగైనా ఇంగ్లండ్ను ఆలౌట్ చేసి సిరీస్ను సమంతో ముగించాలని భారత పట్టుదలతో ఉంది. మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ మాత్రం స్కోర్ ఛేజ్ చేసి ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-1 తేడాతో సొంతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో విజయవంతమైన రన్ఛేజ్లపై ఓ లుక్కేద్దాం. కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో 1880లో తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. 145 సంవత్సరాల ఈ మైదానం చరిత్రలో 300 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఒక్కసారి కూడా ఛేదించలేదు.ఇంగ్లండ్ చరిత్రను తిరగరాస్తుందా?ఈ మైదానంలో అత్యధిక రన్ ఛేజ్ చేసిన రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. 1902లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 263 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్లో ఒక్క వికెట్ తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాకు 141 ఆధిక్యం లభిస్తోంది.అయితే రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడంతో పర్యాటక ఆసీస్ జట్టు కేవలం 121 పరుగులకే ఆలౌటైంది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని కలుపునకుని ఇంగ్లండ్ ముందు కంగారులు 263 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. ఈ టార్గెట్ను ఇంగ్లండ్ తొమ్మిది వికెట్లు కోల్పోయి చేధించింది.ఆ తర్వాత ఓవల్లో రెండవ అత్యధిక రన్ చేజ్ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉంది. విండీస్లో 1963లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో విండీస్ 252 పరుగుల లక్ష్యాన్ని చేధించింది.అనంతరం 1972లో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్తో జరిగిన టెస్టులో 242 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. ఇది ఓవల్ మైదానంలో మూడో అత్యంత విజయవంతమైన రన్ చేజ్గా నిలిచింది.ఈ మైదానంలో చివరగా 2024లో శ్రీలంక జట్టు ఇంగ్లండ్పై 219 పరుగుల లక్ష్యాన్ని చేజ్ చేసింది. ఇది ఓవల్లో ఐదో అత్యంత విజయవంతమైన రన్ చేజ్గా నిలిచింది. ఇప్పుడు భారత్ విధించిన లక్ష్యాన్ని ఛేదిస్తే 123 ఏళ్ల చరిత్రను తిరగరాస్తుంది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన జడేజా.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
చరిత్ర సృష్టించిన జడేజా.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా దుమ్ములేపాడు. ది ఓవల్లో జరుగుతున్న ఐదో టెస్టులోనూ జడ్డూ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో జడేజా కీలక హాఫ్ సెంచరీ సాధించాడు.77 బంతుల్లో 5 ఫోర్లతో 53 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో అతడికిది ఆరో హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. మొత్తంగా ఈ సిరీస్లో జడేజా 516 పరుగులతో పాటు 7 వికెట్లు పడగొట్టాడు. తద్వారా జడేజా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.జడేజా సాధించిన రికార్డులు ఇవే..👉ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్టు సిరీస్లో ఆరు లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్కు వచ్చి 6 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా జడ్డూ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ గ్యారీ సోబర్స్ పేరిట ఉండేది. గ్యారీ సోబర్స్ 1966లో ఇంగ్లండ్ పర్యటనలో ఒకే సిరీస్లో ఐదు హాఫ్ సెంచరీలు సాధించారు. తాజా మ్యాచ్తో సోబర్స్ రికార్డును జడ్డూ బ్రేక్ చేశాడు.👉అదేవిధంగా ఓ టెస్టు సిరీస్లో ఆరు లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా సర్ రవీంద్ర జడేజా నిలిచాడు. జడేజా ఈ సిరీస్లో 516 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం వివిఎస్ లక్ష్మణ్ పేరిట ఉండేది. 2002లో వెస్టిండీస్తో సిరీస్లో లక్ష్మణ్ 474 పరుగులు చేశాడు.👉ఇంగ్లండ్ గడ్డపై ఒక సిరీస్లో అత్యధికసార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాడిగా జడేజా( 6 సార్లు) నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత లెజెండ్ సునీల్ గవాస్కర్ పేరిట ఉండేది. గవాస్కర్ 1979లో ఇంగ్లండ్ పర్యటనలో ఒకే సిరీస్లో 5 సార్లు ఏభైకి పైగా స్కోర్లు నమోదు చేశాడు.తొమ్మిది వికెట్ల దూరంలో..కాగా ఓవల్ టెస్టులో భారత్ గెలిచేందుకు 9 వికెట్ల దూరంలో నిలిచింది. 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 13.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 50 పరుగులు చేసింది. అంతకుముందు భారత్ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 396 పరుగులకు ఆలౌటైంది.చదవండి: WCL: డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ.. ఫైనల్లో పాక్ చిత్తు! టైటిల్ సౌతాఫ్రికాదే -
అతడొక లెజెండ్.. కానీ అలా ప్రవర్తిస్తాడని అనుకోలేదు: భారత స్టార్ బౌలర్
ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. బౌలర్లు సత్తా చాటుతున్న మ్యాచ్లో ఇరు జట్లు సమంగా ముందుకు వెళ్తున్నాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(51), ఆకాష్ దీప్(4) ఉన్నారు.ప్రస్తుతం టీమిండియా 52 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే రెండో ఆటలో టీమిండియా పేసర్ ప్రసిద్ద్ కృష్ణ , ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రూట్ను ప్రసిద్ద్ స్లెడ్జింగ్ చేయగా.. అందుకు అతడు సీరియస్గా స్పందించాడు.ప్రసిద్ద్కు భారత ఆటగాళ్లు మద్దతుగా నిలవడంతో మైదానంలో కాసేపు గందరగోళం నెలకొంది. అంపైర్ల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. అయితే రెండో రోజు ఆట అనంతరం ఈ వివాదంపై ప్రసిద్ద్ కృష్ణ స్పందించాడు. తను చేసిన స్లెడ్జింగ్ పై జో రూట్ స్పందన ఆశ్చర్యపరిచిందని కర్ణాటక స్పీడ్ స్టార్ వెల్లడించాడు."జో రూట్ను స్లెడ్జ్ చేయడం మా ప్రణాళికలలో భాగమే. కానీ ఆ చిన్న మాటలకు రూట్ అంత కోపంగా స్పందిస్తాడని నేను ఊహించలేదు. నేను మంచి రిథమ్లో ఉండి బౌలింగ్ చేస్తున్నప్పుడు కొన్ని సార్లు ఇలానే జరుగుతోంది. అంటే బ్యాటర్ ఏకగ్రాతను దెబ్బతీసేందుకు అలా చేస్తాను. నా మాటలకు రియాక్ట్ అయ్యి బ్యాటర్ ఏదైనా తప్పు చేస్తే మాకు వికెట్ వచ్చే అవకాశముంటుంది. ఇదంతా గేమ్లో భాగమే. కానీ జోరూట్ అంటే నాకు చాలా ఇష్టం. మైదానం వెలుపల మేమిద్దరం మంచి స్నేహితులం. అతొడక లెజెండరీ క్రికెటర్. ఇదొక చిన్న విషయం. ఈ విషయం ఇక్కడతో వదిలేయండి" అంటూ రెండో రోజు ఆట అనంతరం కృష్ణ ప్రెస్కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. కాగా తొలి ఇన్నింగ్స్లో ప్రసిద్ద్ కృష్ణ నాలుగు వికెట్లు పడగొట్టాడు.చదవండి: IND vs ENG: చూస్తూ ఊరుకోవాలా? అంపైర్పై కేఎల్ రాహుల్ ఫైర్! వీడియో వైరల్🔥"You want us to just bat, bowl & go home?"🔥KL Rahul BLASTS at umpire Dharmasena in fiery defence of Prasidh Krishna! 😤⚡Tension hits the roof as Rahul says, "What do you want us to do, keep quiet?" 🗣️💥Captain steps up. Drama unfolds. Cricket gets REAL! 🏏🔥#KLRahul… pic.twitter.com/KaID8ddhda— Nihar Ranjan (@Niharra98749805) August 1, 2025 -
చూస్తూ ఊరుకోవాలా? అంపైర్పై కేఎల్ రాహుల్ ఫైర్! వీడియో వైరల్
ది ఓవల్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో ఆటతో పాటు మాటలు కూడా హైలెట్గా నిలుస్తున్నాయి. రెండో రోజు ఆట సందర్బంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ను ఔట్ చేసిన అనంతరం ఆకాష్ దీప్ అతడి భుజంపై చెయ్యి వేసి మరి సెంఢాప్ ఇవ్వడం.. మైదానంలో ప్రశాంతంగా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే జో రూట్, ప్రసిద్ధ్ కృష్ణతో గొడవపడడం వంటి సంఘటనలు జరిగాయి. అంతేకాకుండా భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సైతం ఆన్ఫీల్డ్ అంపైర్ కుమార ధర్మసేనతో మాటల యుద్దానికి దిగాడు.అసలేమి జరిగిందంటే?ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 22వ ఓవర్ వేసిన ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో జో రూట్.. ఐదో బంతిని థర్డ్ మ్యాన్ మీదుగా బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలో రూట్ వైపు చూస్తూ ప్రసిద్ద్ ఏదో అన్నాడు. దీంతో రూట్ కూడా బదులుగా కృష్ణపై సీరియస్ అయ్యాడు.అంతేకాకుండా రూట్ అంపైర్కు కూడా ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ప్రసిద్ద్ మద్దతుగా కేఎల్ రాహుల్ నిలిచాడు. గొడవ దేని గురించి అని తెలుసుకోవడానికి కుమార్ ధర్మసేనతో రాహుల్ మాట్లాడాడు. కానీ ధర్మసేన ఇచ్చిన సమాధానంపై కేఎల్ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో కాసేపు అంపైర్తో రాహుల్ వాదించాడు. ఆ తర్వాత ఎవరి ఫీల్డింగ్ స్దానాలకు వారు వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగింది.అంపైర్-రాహుల్ మధ్య జరిగిన సంభాషణ ఇదే..రాహుల్: మమ్మల్ని ఏం చేయమంటారు? నిశ్శబ్దంగా ఉండమంటారా?ధర్మసేన: ఏ బౌలర్ అయినా నీ దగ్గరికి వచ్చి గొడవ పడితే నీకు నచ్చుతుందా రాహుల్? ప్రసిద్ద్ అలా చేయడం కరక్ట్ కాదు. మనం అలా ప్రవర్తించకూడదు.రాహుల్: అవతలి వ్యక్తి మమ్మల్ని దూషిస్తే.. చూస్తూ ఊరుకోవాలా? బ్యాటింగ్, బౌలింగ్ చేసి ఇంటికి వెళ్లమంటారా?ధర్మసేన: మ్యాచ్ ముగిశాక మనం మాట్లాడదాం. నువ్వు అలా మాట్లాడడం మాత్రం సరికాదుఈ సంభాషణంతా స్టంప్ మైక్లో రికార్డైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(51), ఆకాష్ దీప్(4) ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 52 పరుగుల ఆధిక్యంలో ఉంది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్..🔥"You want us to just bat, bowl & go home?"🔥KL Rahul BLASTS at umpire Dharmasena in fiery defence of Prasidh Krishna! 😤⚡Tension hits the roof as Rahul says, "What do you want us to do, keep quiet?" 🗣️💥Captain steps up. Drama unfolds. Cricket gets REAL! 🏏🔥#KLRahul… pic.twitter.com/KaID8ddhda— Nihar Ranjan (@Niharra98749805) August 1, 2025 -
IND vs ENG: చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్..
ఓవల్ వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. వరుసగా రెండో రోజును బౌలర్లు శాసించారు. తొలి సెషన్లో ఇంగ్లండ్ బ్యాటర్లు అధిపత్యం చెలాయించినప్పటికి.. లంచ్ విరామం తర్వాత భారత బౌలర్లు అద్బుతమైన కమ్బ్యాక్ ఇచ్చారు.ముఖ్యంగా హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ బంతితో మ్యాజిక్ చేశాడు. మొదటి సెషన్లో భారీగా పరుగులు సమర్పించుకున్న సిరాజ్.. రెండో సెషన్లో మాత్రం ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. సంచలన బంతులతో ఇంగ్లీష్ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు.మొత్తంగా 16.2 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్, 86 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది. సిరాజ్తో పాటు ప్రసిద్ద్ కృష్ణ నాలుగు వికెట్లు పడగొట్టాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది.భారత్ ప్రస్తుతం 52 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఆఖరి టెస్టులో నాలుగు వికెట్లతో చెలరేగిన సిరాజ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.బుమ్రా రికార్డు బద్దలు..ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక ఫోర్ వికెట్ల హాల్స్ సాధించిన భారత బౌలర్గా బుమ్రాను సిరాజ్ అధిగమించాడు. సిరాజ్ మియా ఇప్పటివరకు ఇంగ్లండ్లో 11 టెస్టులు ఆడి ఆరు సార్లు 4 వికెట్ల హాల్ సాధించాడు. 2021లో లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన టెస్టు రెండు ఇన్నింగ్స్లలోనూ సిరాజ్ నాలుగు వికెట్ల ఘనత సాధించాడు. ఆ తర్వాత 2022లో ఎడ్జ్బాస్టన్, 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో 4 వికెట్లను సిరాజ్ పడగొట్టాడు. అదేవిధంగా ప్రస్తుత సిరీస్లో బర్మింగ్హామ్లో నాలుగుకు పైగా వికెట్లు తీసిన సిరాజ్.. మళ్లీ ఇప్పుడు ఓవల్ టెస్టులో 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఈ రేర్ ఫీట్ను తన పేరిట లిఖించుకున్నాడు. కాగా బుమ్రా ఇప్పటివరకు ఇంగ్లండ్ గడ్డపై 5 సార్లు 4 వికెట్ల హాల్ సాధించాడు.అంతేకాకుండా ఈ ఫీట్ సాధించిన ఏషియన్ బౌలర్గానూ వకార్ యూనిస్ రికార్డును సిరాజ్ సమం చేశాడు. పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ ఇంగ్లండ్ గడ్డపై 6 సార్లు నాలుగు వికెట్ల ఘనత సాధించాడు.చదవండి: గ్రాహం థోర్ప్కు నివాళిగా... -
ENG VS IND 5th Test: చెలరేగిన సిరాజ్, ప్రసిద్ద్.. ముగిసిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్
ఓవల్ టెస్ట్లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా పేసర్లు మొహమ్మద్ సిరాజ్ (16.2-1-86-4), ప్రసిద్ద్ కృష్ణ (16-1-62-4), ఆకాశ్దీప్ (17-0-80-1) చెలరేగడంతో ఆతిథ్య జట్టు 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. తొలి రోజు ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన క్రిస్ వోక్స్ మ్యాచ్ మొత్తానికి దూరం కావడంతో బ్యాటింగ్కు రాలేదు. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్కు 247 పరుగుల వద్ద పుల్ స్టాప్ పడింది. ఆ జట్టుకు 23 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే 64, బెన్ డకెట్ 43, ఓలీ పోప్ 22, జో రూట్ 29, హ్యారీ బ్రూక్ 53, జేకబ్ బేతెల్ 6, జేమీ స్మిత్ 8, జేమీ ఓవర్టన్ డకౌటయ్యరు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్మన్ గిల్ 21, కరుణ్ నాయర్ 57, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19, వాషింగ్టన్ సుందర్ 26, సిరాజ్, ప్రసిద్ద్ డకౌట్ అయ్యారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడిన విషయం తెలిసిందే. -
ENG VS IND 5th Test: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన రూట్
ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 242 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పతనం అంచుల్లో ఉంది.ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ (29) పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండిన ఓ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ తన కెరీర్లో స్వదేశంలో జరిగిన టెస్ట్ల్లో 7216 పరుగులు చేయగా.. తాజాగా ఇన్నింగ్స్తో రూట్ (7220) సచిన్ రికార్డును అధిగమించాడు.ఈ విభాగంలో ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ (7578) అగ్రస్థానంలో ఉండగా.. రూట్ సచిన్ను వెనక్కునెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు.స్వదేశంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు..7578 - రికీ పాంటింగ్ - ఆస్ట్రేలియా7220* - జో రూట్ - ఇంగ్లండ్*7216 - సచిన్ టెండూల్కర్ - ఇండియా7167 - మహేల జయవర్ధనే - శ్రీలంక7035 - జాక్వెస్ కల్లిస్ - దక్షిణాఫ్రికామ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్ ఇంగ్లండ్ పతనాన్ని వరుణుడు అడ్డుకున్నాడు. 242 పరుగులకు 8 వికెట్లు కోల్పోయిన దశలో ఒక్కసారిగా భారీ వర్షం ప్రారంభమైంది. ప్రస్తుతం ఇంగ్లండ్ భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ దాటి 18 పరుగుల ఆధిక్యంలో ఉంది. హ్యారీ బ్రూక్ (48), జోష్ టంగ్ (0) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో క్రిస్ వోక్స్ ఆడే అవకాశం లేదు. గాయం కారణంగా వోక్స్ తదుపరి మ్యాచ్కు అందుబాటులో లేడు. తొలి రోజు ఆట సందర్భంగా వోక్స్ భుజానికి తీవ్ర గాయమైంది. -
నిప్పులు చెరుగుతున్న భారత పేసర్లు.. ఇంగ్లండ్ పతనాన్ని అడ్డుకున్న వరుణుడు
ఇంగ్లండ్ పతనాన్ని అడ్డుకున్న వరుణుడుతొలి ఇన్నింగ్స్ ఇంగ్లండ్ పతనాన్ని వరుణుడు అడ్డుకున్నాడు. 242 పరుగులకు 8 వికెట్లు కోల్పోయిన దశలో ఒక్కసారిగా భారీ వర్షం ప్రారంభమైంది. ప్రస్తుతం ఇంగ్లండ్ భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ దాటి 18 పరుగుల ఆధిక్యంలో ఉంది. హ్యారీ బ్రూక్ (48), జోష్ టంగ్ (0) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో క్రిస్ వోక్స్ ఆడే అవకాశం లేదు. గాయం కారణంగా వోక్స్ తదుపరి మ్యాచ్కు అందుబాటులో లేడు. తొలి రోజు ఆట సందర్భంగా వోక్స్ భుజానికి తీవ్ర గాయమైంది.ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్లో భారత పేసర్లు చెలరేగిపోతున్నారు. నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. సిరాజ్ (12-1-66-3), ప్రసిద్ద్ కృష్ణ (11.5-0-51-3), ఆకాశ్దీప్ (17-0-80-1) పోటీ పడి సత్తా చాటుతుండటంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో పతనం అంచుల్లో ఉంది. రెండో రోజు టీ విరామం సమయానికి ఆ జట్టు 215 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.టీ విరామానికి ముందు ఓవర్లో ప్రసిద్ద్ విజృంభించాడు. ఐదు బంతుల వ్యవధిలో జేమీ స్మిత్, జేమీ ఓవర్టన్లను పెవిలియన్కు పంపాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 9 పరుగులు వెనుకపడి ఉంది. హ్యారీ బ్రూక్ (33) ఒంటరి పోరాటం చేస్తున్నాడు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే 64, బెన్ డకెట్ 43, ఓలీ పోప్ 22, జో రూట్ 29, జేకబ్ బేతెల్ 6, జేమీ స్మిత్ 8, జేమీ ఓవర్టన్ డకౌటయ్యాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్మన్ గిల్ 21, కరుణ్ నాయర్ 57, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19, వాషింగ్టన్ సుందర్ 26, సిరాజ్, ప్రసిద్ద్ డకౌట్ అయ్యారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడిన విషయం తెలిసిందే. -
ENG VS IND 5th Test: సిరాజ్ డబుల్ సెంచరీ
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్లో టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్లో ఓలీ పోప్ వికెట్ తీయడంతో అంతర్జాతీయ క్రికెట్లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. సిరాజ్ 41 టెస్ట్ మ్యాచ్ల్లో 117 వికెట్లు.. 44 వన్డేల్లో 71 వికెట్లు.. 16 టీ20ల్లో 14 వికెట్లు తీశాడు.ఈ మ్యాచ్లో సిరాజ్ ఓలీ పోప్ వికెట్ తర్వాత మరో రెండు వికెట్లు కూడా తీశాడు. జో రూట్, బేకబ్ బేతెల్లను పెవిలియన్కు పంపాడు. ఈ మ్యాచ్లో సిరాజ్ ఇప్పటివరకు 3 వికెట్లు తీశాడు. సిరాజ్ తీసిన 3 వికెట్లు ఎల్బీడబ్ల్యూలే కావడం విశేషం.సిరాజ్ చెలరేగడంతో టీమిండియా మ్యాచ్పై ఆశలు సజీవంగా ఉంచుకుంది. సిరాజ్తో పాటు ఆకాశ్దీప్, ప్రసిద్ద్ కృష్ణ (తలో వికెట్) కూడా తలో చేయి వేయడంతో ఇంగ్లండ్ 195 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (64), బెన్ డకెట్ (43), ఓలీ పోప్ (22), జో రూట్ (29), జేకబ్ బేతెల్ (6) ఔట్ కాగా.. హ్యారీ బ్రూక్ (22), జేమీ స్మిత్ (5) క్రీజ్లో ఉన్నారు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్మన్ గిల్ 21, కరుణ్ నాయర్ 57, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19, వాషింగ్టన్ సుందర్ 26, సిరాజ్, ప్రసిద్ద్ డకౌట్ అయ్యారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడిన విషయం తెలిసిందే. -
ENG VS IND 5th Test: రికార్డు తిరగరాసిన టీమిండియా
ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్లో టీమిండియా ఓ రికార్డును తిరగరాసింది. ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగుల విభాగంలో భారత్ తమ పూర్వపు రికార్డును బద్దలు కొట్టింది. 1978-79 వెస్టిండీస్ సిరీస్లో భారత్ ఆరు టెస్ట్ మ్యాచ్లు ఆడి 3270 పరుగులు చేసింది. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్కు ముందు ఓ సిరీస్లో భారత జట్టు చేసిన అత్యధిక పరుగులు ఇవే.ప్రస్తుత సిరీస్తో టీమిండియా తమ పాత రికార్డును బద్దలు కొట్టి కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ ఇంగ్లండ్ సిరీస్లో భారత్ ఐదో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు పాత రికార్డును చెరిపేసింది. తొలి రోజు భారత్ తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఈ స్కోర్తో ఈ సిరీస్లో భారత్ పరుగుల సంఖ్య 3393 పరుగులకు చేరింది.ఈ సిరీస్ మొత్తంలో భారత్ చేసిన ఈ పరుగులు 1995 నుంచి ఓ సిరీస్లో ఓ జట్టుచే చేయబడిన అత్యధిక పరుగులు కూడా కావడం మరో విశేషం.మ్యాచ్ విషయానికొస్తే.. 204/6 స్కోర్ వద్ద రెండు రోజు ఆట ప్రారంభించిన భారత్.. సెషన్ ప్రారంభమైన గంటలోపే 224 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాటర్లు కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్ పెద్దగా పరుగులేమీ జోడించకుండానే పెవిలియన్కు చేరారు. ఆతర్వాత వచ్చిన సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ కనీసం ఖాతా కూడా తెరవకుండానే ఔటయ్యారు.ఇవాల్టి ఆటలో అట్కిన్సన్ వీర లెవెల్లో విజృంభించాడు. చివరి నాలుగు వికెట్లలో మూడు వికెట్లు (సుందర్, సిరాజ్, ప్రసిద్ద్) అతనే తీశాడు. చాలాకాలం తర్వాత అర్దసెంచరీతో రాణించిన కరుణ్ను టంగ్ బోల్తా కొట్టించాడు.ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ (21.4-8-33-5) ధాటికి భారత ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. అట్కిన్సన్కు జోష్ టంగ్ (16-4-57-3), క్రిస్ వోక్స్ (14-1-46-1) సహకరించారు.భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్మన్ గిల్ 21, కరుణ్ నాయర్ 57, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19, వాషింగ్టన్ సుందర్ 26, సిరాజ్, ప్రసిద్ద్ డకౌట్ అయ్యారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ రెండో రోజు రెండో సెషన్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. జాక్ క్రాలే (64), బెన్ డకెట్ (43) ఔట్ కాగా.. ఓలీ పోప్ (18), జో రూట్ (4) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్దీప్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ తీశారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడిన విషయం తెలిసిందే. -
ENG VS IND 5th Test: అట్కిన్సన్ విజృంభణ.. కుప్పకూలిన టీమిండియా
ఇంగ్లండ్తో ఐదో టెస్ట్లో టీమిండియా చెత్త ఆటతీరును ప్రదర్శించింది. తొలి ఇన్నింగ్స్లో కేవలం 224 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ (21.4-8-33-5) ధాటికి భారత ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. అట్కిన్సన్కు జోష్ టంగ్ (16-4-57-3), క్రిస్ వోక్స్ (14-1-46-1) సహకరించారు.204/6 వద్ద రెండు రోజు ఆట ప్రారంభించిన భారత్.. సెషన్ ప్రారంభమైన గంటలోపే ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాటర్లు కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్ పెద్దగా పరుగులేమీ జోడించకుండానే పెవిలియన్కు చేరారు. ఆతర్వాత వచ్చిన సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయారు.ఇవాల్టి ఆటలో అట్కిన్సన్ వీర లెవెల్లో విజృంభించాడు. చివరి నాలుగు వికెట్లలో మూడు వికెట్లు (సుందర్, సిరాజ్, ప్రసిద్ద్) అతనే తీశాడు. చాలాకాలం తర్వాత అర్దసెంచరీతో రాణించిన కరుణ్ను టంగ్ బోల్తా కొట్టించాడు.భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్మన్ గిల్ 21, కరుణ్ నాయర్ 57, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19, వాషింగ్టన్ సుందర్ 26, సిరాజ్, ప్రసిద్ద్ డకౌట్ అయ్యారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడిన విషయం తెలిసిందే. -
భారత్తో ఐదో టెస్ట్.. ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ
టీమిండియాతో ఐదో టెస్ట్లో ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్ భుజం గాయం కారణంగా మ్యాచ్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.వోక్స్ తొలి రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే ప్రయత్నంతో అతని భుజానికి తీవ్ర గాయమైంది. జేమీ ఓవర్టన్ వేసిన 57వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఓవర్లో ఐదో బంతిని కరుణ్ నాయర్ మిడాఫ్ దిశగా షాట్ ఆడగా.. వోక్స్ బంతిని ఆపేందుకు పరిగెత్తుకుంటా వెళ్లాడు. ఆ ప్రయత్నంలో వోక్స్ ఎడమ భుజం నేలకు బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిలలాడిపోయాడు. వెంటనే ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. స్కానింగ్ తీయగా బలమైన గాయమని తేలింది.దీంతో అతను ఐదో టెస్ట్ నుంచి అర్దంతరంగా వైదొలిగాడు. ఈ మ్యాచ్లో వోక్స్ లేని లోటు ఇంగ్లండ్ విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది. ఇంగ్లండ్ తమ స్టార్ పేసర్లు బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ లేకుండానే ఈ మ్యాచ్ బరిలోకి దిగింది. తాజాగా వోక్స్ కూడా దూరం కావడంతో ఇంగ్లండ్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనపడినైట్లంది.ఈ సిరీస్లో అన్ని మ్యాచ్లు ఆడిన వోక్స్ 181 ఓవర్లు వేసి 11 వికెట్లు తీశాడు. గాయపడటానికి ముందు కూడా వోక్స్ ఓ వికెట్ తీశాడు. టీమిండియా తరుపుముక్క అయిన కేఎల్ రాహుల్ను క్లీన్ బౌల్డ్ చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్మన్ గిల్ 21, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19 పరుగులు చేసి ఔట్ కాగా.. కరుణ్ నాయర్ (52), వాషింగ్టన్ సుందర్ (19) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్, టంగ్ తలో 2 వికెట్లు తీయగా.. వోక్స్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. గిల్ రనౌటయ్యాడు. -
టెస్టు క్రికెట్లోకి తిరిగిరానున్న శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్-2025 సీజన్ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో అయ్యర్ ఆడనున్నాడు. దులీప్ ట్రోఫీలో ఆడేందుకు తను సిద్దంగా ఉన్నానని ముంబై క్రికెట్ అసోసియేషన్కు శ్రేయస్ అయ్యర్ తెలియజేసినట్లు సమాచారం.ఈ దేశవాళీ రెడ్బాల్ క్రికెట్ టోర్నీ ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో అయ్యర్ వెస్ట్జోన్ తరపున ఆడనున్నాడు. శ్రేయస్ అయ్యర్తో పాటు టీమిండియా క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్పాండే, శివమ్ దూబేలు కూడా దులీప్ ట్రోఫీలో ఆడనున్నట్లు తెలుస్తోంది. వెస్ట్జోన్ జట్టు ఇప్పటికే సెమీఫైనల్కు క్వాలిఫై అయింది. సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభం కానున్న సెమీస్లో క్వార్టర్ ఫైనల్ విజేతతో వెస్ట్జోన్ తలపడనుంది.ఇక ఇది ఇలా ఉండగా.. వైట్బాల్ క్రికెట్లో తనను తను నిరూపించుకున్న శ్రేయస్ అయ్యర్ ఇంకా టెస్టుల్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు. భారత తరపున ఇప్పటివరకు 14 టెస్టులు ఆడిన అయ్యర్.. 36.86 సగటుతో 811 పరుగులు చేశాడు.అయితే డిమాస్టిక్ క్రికెట్లో మాత్రం అయ్యర్ దుమ్ములేపుతున్నాడు. గత రంజీ ట్రోఫీ సీజన్లో కూడా ఈ ముంబైకర్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతడిని ఇంగ్లండ్తో టెస్టులకు ఎంపిక చేస్తారని భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని పరిగణలోకి తీసుకోలేదు. అతడికి ప్రస్తుతం జట్టులోఅయ్యర్ అద్బుతమైన ఫామ్లో ఉన్నప్పటికి.. టెస్టు జట్టులో అతడికి ఛాన్స్ ఇచ్చేందుకు అవకాశం లేదని ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. అయితే ఇంకా మెరుగ్గా రాణించి టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వడమే లక్ష్యంగా అయ్యర్ ముందుకువెళ్తున్నాడు. ఈ క్రమంలోనే దులీప్ ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నాడు. అయ్యర్ భారత తరపున చివరగా గతేడాది ఫిబ్రవరిలో టెస్టు మ్యాచ్ ఆడాడు.చదవండి: నేను ఎప్పుడూ మోసం చేయలేదు.. సూసైడ్ ఆలోచనలూ వచ్చాయి: చాహల్ -
IND Vs ENG: మొన్నటి వరకు జట్టులో దండగ అన్నారు.. ఇప్పుడు అతడే దిక్కయ్యాడు
ఇంగ్లండ్తో ఐదో టెస్టుకు ముందు భారత తుది జట్టులో ఒక ఆటగాడి పేరు చూసి అంతా ఆశ్చర్యపోయారు. మూడు మ్యాచ్లలో విఫలమైనా మళ్లీ అవకాశమెందుకు ఇచ్చారు? స్వ్కాడ్లో అతడి తప్ప ఇంకా ఎవరూ లేరా? అస్సలు గంభీర్కు కొంచమైనా తెలివిందా? అంటూ మెనెజ్మెంట్పై ప్రశ్నల వర్షం కురిసింది.కానీ సదరు ఆటగాడు ఈ ప్రశ్నలన్నింటికి తన ఆటతోనే సమాధానమిచ్చాడు. ఇదంతా ఎవరి కోసమో మీకు ఇప్పటికే మీకు ఓ అంచనా వచ్చి ఉంటుంది. అవును మీరు అనుకుంటుంది నిజమే, ఇదంతా టీమిండియా వెటరన్ కరుణ్ నాయర్ కోసమే.8 ఏళ్ల నిరీక్షణ తర్వాత...కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్లో అద్బుతంగా రాణించి 8 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేశాడు. కానీ తన రీఎంట్రీలో ఈ కర్ణాటక ఆటగాడు అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న సిరీస్లో వరుసగా మూడు మ్యాచ్లు ఆడిన నాయర్.. ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు.తనకు దక్కిన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యాడు. ఈక్రమంలో నాలుగో టెస్టుకు మెనెజ్మెంట్ అతడికి విశ్రాంతి ఇచ్చింది. దీంతో అతడి అంతర్జాతీయ కెరిర్ ముగిసిందన్న చర్చ నడిచింది. మరికొంతమంది అయితే ఓ అడుగు ముందుకేసి నాయర్ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని ప్రచారం చేశారు.మరో ఛాన్స్.. కానీ కరుణ్ నాయర్కు టీమిండియా మెనెజ్మెంట్ చివరగా మరోసారి అవకాశం కల్పించింది. లండన్లోని ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో ప్రారంభమైన ఐదో టెస్టుకు నాయర్ అనూహ్యంగా ఎంపికయ్యాడు. శార్ధూల్ ఠాకూర్ బదులుగా కరుణ్కు ఛాన్స్ ఇచ్చారు. ఈసారిమాత్రం కరుణ్ నాయర్ తనకు వచ్చిన అవకాశాన్నిరెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.కేఎల్ రాహుల్, యశస్వి జైశ్వాల్, గిల్ వంటి కీలక ఆటగాళ్లు విఫలమైనప్పటికి నాయర్ మాత్రం తన అద్బుత బ్యాటింగ్తో సత్తాచాటాడు. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చెరుగుతున్నచోట నాయర్ తన ఆసాధరణ ప్రదర్శనతో అడ్డుగోడలా నిలిచాడు. ధ్రువ్ జురెల్, సుందర్లతో కలిసి కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ఈ క్రమంలో కరుణ్ తన టెస్టు కెరీర్లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. అంతకుముందు 2016లో ఇంగ్లండ్పై ట్రిపుల్ సెంచరీ చేసిన నాయర్ మళ్లీ ఇప్పుడు అదే జట్టుపై 3146 రోజుల తర్వాత ఆర్ధ శతకం సాధించాడు. నాయర్ 52 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. రెండో రోజు ఆటలో నాయర్ బ్యాటింగ్ చాలా కీలకంగా మారనుంది.చదవండి: IND vs ENG 5th Test: ఇంగ్లండ్కు భారీ షాక్.. మ్యాచ్ మధ్యలోనే అస్పత్రికి -
IND Vs ENG: ఇంగ్లండ్కు భారీ షాక్.. మ్యాచ్ మధ్యలోనే అస్పత్రికి
లండన్లోని ఓవల్ వేదికగా భారత్తో జరుగుతున్న ఐదో టెస్టు తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ పై చేయి సాధించింది. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ల ధాటికి టీమిండియా 6 కీలక వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. అయితే తొలి రోజు ఆట చివరిలో ఇంగ్లండ్కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ క్రిస్ వోక్స్కు తీవ్ర గాయమైంది. బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే ప్రయత్నంతో వోక్స్ భుజానికి గాయమైంది.జెమీ ఓవర్టన్ వేసిన 57వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఓవర్లో ఐదో బంతిని కరుణ్ నాయర్ మిడాఫ్ దిశగా షాట్ ఆడాడు. ఈ క్రమంలో మిడాఫ్లో ఉన్న వోక్స్ బంతిని ఆపేందుకు పరిగెత్తుకుంటా వెళ్లాడు. ఆ ప్రయత్నంలో వోక్స్ ఎడమ భుజం నేలకు బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో సాయంతో ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్ మైదానాన్ని వీడాడు.తర్వాత వెంటనే స్కానింగ్ కోసం అస్ప్రతికి తరలించారు. అతడి గాయం తీవ్రత చూస్తుంటే ఎడమ భుజం డిస్ లోకేట్ అయినట్లు అనిపిస్తోంది. వోక్స్ తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెట్టే సూచనలు కన్పించడం లేదు. అతడి గాయం తీవ్రతపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కాగా తొలి రోజు ఆటలో వోక్స్ ఓ వికెట్ సాధించాడు.అద్భుతమైన ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్ను వోక్స్ బోల్తా కొట్టించాడు. ఒకవేళ వోక్స్ దూరమైతే ఇంగ్లండ్కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఇప్పటికే ఓవల్ టెస్టులో ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, ఆర్చర్ సేవలను కోల్పోయింది. ప్రస్తుతం జట్టులో వోక్స్ తప్ప అనుభవమున్న ఫాస్ట్ బౌలర్ మరొకరు లేరు.చదవండి: IND vs ENG 5th Test: ఆధర్మసేన.. ఇంగ్లండ్కు ఫేవర్గా అంపైర్! ఫ్యాన్స్ ఫైర్ -
IND Vs ENG: అధర్మసేన.. ఇంగ్లండ్కు ఫేవర్గా అంపైర్! ఫ్యాన్స్ ఫైర్
లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా తడబడుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును మిడిలార్డర్ బ్యాటర్ కరుణ్ నాయర్ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. నాయర్ 98 బంతుల్లో 52 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు.అతడితో పాటు వాషింగ్టన్ సుందర్(19) క్రీజులో ఉన్నాడు. భారత బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్(2), కేఎల్ రాహుల్(14), జడేజా(9), గిల్(21) నిరాశపరచగా.. సాయిసుదర్శన్(38) పర్వాలేదన్పించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, అట్కిన్సన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. వోక్స్ ఓ వికెట్ సాధించారు.అంపైర్పై ఫ్యాన్స్ ఫైర్..భారత్ ఇన్నింగ్స్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఫీల్డ్ అంపైర్ కుమార ధర్మసేన వ్యవహారశైలి చర్చకు దారి తీసింది. 13వ ఓవర్ వేసిన టంగ్ భారత బ్యాటర్ సాయి సుదర్శన్కు యార్కర్ సంధించాడు. దానిని ఆడలేక సాయి కింద పడిపోయాడు.బంతి ప్యాడ్స్కు తగలడంతో టంగ్ ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేశాడు. దీనిని ధర్మసేన తిరస్కరించడం వరకు ఓకే. కానీ అవుట్ కాదని చెబుతూనే అతను బంతి ముందే బ్యాట్కు తగిలినట్లుగా కూడా తన వేళ్లతో సైగ చేశాడు.నిబంధనల ప్రకారం డీఆర్ఎస్ కోసం ఇచ్చే 15 సెకన్లు ముగిసే వరకు అంపైర్లు ఏ రీతిలో కూడా ఆటగాళ్లకు సహకరించే సంజ్ఞలు చేయరాదు. కానీ ధర్మసేన ఇలా చేయడం ఇంగ్లండ్కు పరోక్షంగా సహకరించినట్లయింది. తమ అప్పీల్పై నమ్మకం ఉంటే ఇంగ్లండ్ డీఆర్ఎస్కు వెళ్లేది. నాటౌట్గా తేలితే జట్టు రివ్యూ కోల్పోయేది. అంపైర్ వ్యవహరించిన తీరుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి.చదవండి: బుమ్రా ఎంత కాలం ఇలా..! -
ENG VS IND 5th Test: పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
మొదటిరోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి టీమిండియా 204 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ 52(98), వాషింగ్టన్ సుందర్ 19(45) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ , గస్ అట్కిన్సన్ చెరో రెండు వికెట్లు సాధించగా క్రిస్ వోక్స్ ఒక వికెట్ పడగొట్టాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్ట్లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. వర్షం అంతరాయాల నడుమ సాగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 123 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్మన్ గిల్ 21, రవీంద్ర జడేజా 9 పరుగులకు ఔట్ కాగా.. కరుణ్ నాయర్ (9), ధ్రువ్ జురెల్ (0) క్రీజ్లో ఉన్నారు.ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 2, క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్ తలో వికెట్ తీయగా.. శుభ్మన్ గిల్ రనౌటయ్యాడు. ప్రస్తుతం ఔటైన వారంతా మంచి ఫామ్లో ఉన్న ఆటగాళ్లే. కొత్తగా జట్టులోకి వచ్చిన ధ్రువ్, ఈ సిరీస్లోనే ఆరు ఇన్నింగ్స్ల్లో దారుణంగా విఫలమైన కరుణ్ నాయర్ టీమిండియాను ఏమేరకు ఆదుకుంటారో చూడాలి. వీరిద్దరి తర్వాత గత మ్యాచ్ సెంచరీ హీరో వాషింగ్టన్ సుందర్పైనే టీమిండియా ఆశలన్నీ ఉన్నాయి. వీరే టీమిండియాను గట్టెక్కించాలి.కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్, ఇంగ్లండ్ జట్లు చెరో నాలుగు మార్పులు చేశాయి. భారత్ తరఫున రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, అన్షుల్ కంబోజ్ స్థానాల్లో ధ్రువ్ జురెల్, కరుణ్ నాయర్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్దీప్ తుది జట్టులోకి రాగా.. ఇంగ్లండ్ తరఫున బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ స్థానాల్లో జేకబ్ బేతెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, జేమీ ఓవర్టన్ ప్లేయింగ్ ఎలెవెన్లోకి వచ్చారు.ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ సిరీస్ను సమం చేసుకోగలుగుతుంది. ఓడినా, డ్రా అయినా ఇంగ్లండే సిరీస్ ఎగరేసుకుపోతుంది. తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్(వికెట్కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్ -
ENG VS IND 5th Test: ఇంగ్లండ్కు ఫ్రీ గిఫ్ట్.. వీడియో
కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో ఇవాళ (జులై 31) మొదలైన ఐదో టెస్ట్లో టీమిండియా కష్టాల్లో ఉంది. వరుణుడి అంతరాయాల నడుమ సాగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్.. లంచ్ విరామం తర్వాత వర్షం ఆటంకం కలిగించే సమయానికి 3 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది.INDIA HAS GIFTED A WICKET TO ENGLAND IN TOUGH CONDITIONS 💔 pic.twitter.com/K3TweTiVGs— Johns. (@CricCrazyJohns) July 31, 2025ఆట నిలిచిపోయే సమయానికి 10 నిమిషాల ముందు భారత్ ఇంగ్లండ్కు ఓ ఫ్రీ గిఫ్ట్ ఇచ్చింది. శుభ్మన్ గిల్ (21) లేని పరుగు కోసం ప్రయత్నించి అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు. అప్పటికే కష్టాల్లో ఉన్న టీమిండియాను గిల్ రనౌట్ మరింత ఇరకాటంలో పడేసింది. ఈ ఇన్నింగ్స్లో గిల్ మంచి టచ్లో ఉన్నట్లు కనిపించాడు. ఆడిన 35 బంతుల్లో 4 సొగసైన బౌండరీలు బాదాడు.సిరీస్లో తొలి మ్యాచ్ నుంచి భీకర ఫామ్లో ఉన్న గిల్ చీప్గా రనౌట్ కావడాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతకుముందు భారత్ 38 పరుగులకే ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14 పరుగులు చేసి పలాయనం చిత్తగించారు. సాయి సుదర్శన్తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేస్తున్న గిల్ అనవసరంగా రనౌటై టీమిండియాను కష్టాల్లోకి నెట్టేశాడు.ప్రస్తుతం సాయి సుదర్శన్తో (28) పాటు కరుణ్ నాయర్ (0) క్రీజ్లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (రాహుల్), అట్కిన్సన్కు (జైస్వాల్) తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. వరుణుడు టాస్కు ముందు, లంచ్ విరామంలో ఓసారి, తాజాగా మరోసారి ఆటకు అడ్డుతగిలాడు. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం ఈ రోజు ఆట అంతా ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. మధ్యమధ్యలో వరుణుడు పలకరిస్తూ పోతుంటాడు.కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ సిరీస్ను సమం చేసుకోగలుగుతుంది. ఓడినా, డ్రా అయినా ఇంగ్లండే సిరీస్ ఎగరేసుకుపోతుంది. -
KL Rahul: గత 11 ఏళ్లలో ఒకే ఒక్కడు..!
కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో ఇవాళ (జులై 31) మొదలైన ఐదో టెస్ట్లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 40 బంతులు ఎదుర్కొని బౌండరీ సాయంతో 14 పరుగులు చేసి ఔటైన రాహుల్.. ఈ సిరీస్లో తానెదుర్కొన్న బంతుల సంఖ్యను వెయ్యి (1000) దాటించాడు. తద్వారా గత 11 ఏళ్ల ఓ టెస్ట్ సిరీస్లో 1000 బంతులు ఎదుర్కొన్న ఏకైక భారత ఓపెనింగ్ బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన మూడో భారత ఓపెనర్గా నిలిచాడు. రాహుల్కు ముందు మురళీ విజయ్, సునీల్ గవాస్కర్ మాత్రమే ఈ ఘనత సాధించారు.ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో ఐదో టెస్ట్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ లంచ్ విరామం సమయానికి 2 వికెట్ల నష్టానికి 72 పరుగులు (23 ఓవర్లలో) చేసింది. సాయి సుదర్శన్ (25), శుభ్మన్ గిల్ (15) క్రీజ్లో ఉన్నారు. వర్షం అంతరాయం కలిగించడంతో లంచ్ బ్రేక్ను కాస్త ముందుగానే తీసుకున్నారు. వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా లంచ్ తర్వాత కూడా ఆట ఆలస్యమవుతుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు కూడా వరుణుడు అడ్డు తగిలాడు. దీంతో టాస్ కూడా ఆలస్యమైంది.ఆదిలోనే ఎదురుదెబ్బలుటాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (2), కేఎల్ రాహుల్ (14) జట్టు స్కోర్ కనీసం 50 పరుగులు కూడా దాటించకుండానే పెవిలియన్కు చేరారు. జట్టు స్కోర్ 10 పరుగుల వద్ద జైస్వాల్ను అట్కిన్సన్, 38 పరుగుల స్కోర్ వద్ద రాహుల్ను క్రిస్ వోక్స్ బోల్తా కొట్టించారు.చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్ఈ సిరీస్లో భీకర ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్ ఈ ఇన్నింగ్స్లో ఓ ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా సునీల్ గవాస్కర్ రికార్డును ఛేదించాడు.1978/79 వెస్టిండీస్ సిరీస్లో గవాస్కర్ భారత కెప్టెన్గా 732 పరుగులు చేయగా.. ప్రస్తుత సిరీస్లో గిల్ 737* పరుగుల వద్ద బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు.చెరో నాలుగు మార్పులుఈ మ్యాచ్ కోసం భారత్, ఇంగ్లండ్ జట్లు చెరో నాలుగు మార్పులు చేశాయి. భారత్ తరఫున రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, అన్షుల్ కంబోజ్ స్థానాల్లో ధ్రువ్ జురెల్, కరుణ్ నాయర్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్దీప్ తుది జట్టులోకి రాగా.. ఇంగ్లండ్ తరఫున బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ స్థానాల్లో జేకబ్ బేతెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, జేమీ ఓవర్టన్ ప్లేయింగ్ ఎలెవెన్లోకి వచ్చారు.ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ సిరీస్ను సమం చేసుకోగలుగుతుంది. ఓడినా, డ్రా అయినా ఇంగ్లండే సిరీస్ ఎగరేసుకుపోతుంది. తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్(వికెట్కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్ -
చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్.. ఆల్టైమ్ రికార్డు బద్దలు
ఇంగ్లండ్ గడ్డపై ఐదు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ వరుస పెట్టి రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఈ సిరీస్ ఆరంభం నుంచి భీకర ఫామ్లో ఉన్న గిల్.. తాజాగా మరో ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేసి చరిత్ర సృష్టించాడు.లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఇవాళ (జులై 31) ఐదో టెస్ట్ ప్రారంభం కాగా.. భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది. కష్టమైన పిచ్పై తడబడుతూనే బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. స్కోర్ 50 పరుగులు కూడా దాటకుండానే ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (2), కేఎల్ రాహుల్ (14) పెవిలియన్కు చేరారు.ఈ దశలో బరిలోకి దిగిన గిల్.. ఎంతో సంయమనంగా బ్యాటింగ్ చేస్తూ లంచ్ విరామంలోపు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ఈ క్రమంలో గిల్ సునీల్ గవాస్కర్ పేరిట ఉండిన ఓ ఆల్టైమ్ రికార్డును చెరిపేసి చరిత్రపుటల్లో తన పేరును లిఖించుకున్నాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గిల్ ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా సునీల్ గవాస్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.1978/79 వెస్టిండీస్ సిరీస్లో గవాస్కర్ 732 పరుగులు చేయగా.. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్లో గిల్ ఈ రికార్డును తన ఖాతాలో వేసేసుకున్నాడు. ఈ సిరీస్లో గిల్ ఇప్పటివరకు 737* పరుగులు చేశాడు. తొలి రోజు లంచ్ విరామం సమయానికి భారత్ స్కోర్ 72/2గా ఉంది. గిల్ (15), సాయి సుదర్శన్ (25) క్రీజ్లో ఉన్నారు.ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్లు737* - శుభ్మన్ గిల్ vs ENG, 2025732 - సునీల్ గవాస్కర్ vs WI, 1978/79655 - విరాట్ కోహ్లీ vs ENG, 2016/17610 - విరాట్ కోహ్లీ vs SL, 2017/18593 - విరాట్ కోహ్లీ vs ENG, 2018కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్, ఇంగ్లండ్ జట్లు చెరో నాలుగు మార్పులు చేశారు. భారత్ తరఫున రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, అన్షుల్ కంబోజ్ స్థానాల్లో ధ్రువ్ జురెల్, కరుణ్ నాయర్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్దీప్ తుది జట్టులోకి రాగా.. ఇంగ్లండ్ తరఫున బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ స్థానాల్లో జేకబ్ బేతెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, జేమీ ఓవర్టన్ ప్లేయింగ్ ఎలెవెన్లోకి వచ్చారు.ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ సిరీస్ను సమం చేసుకోగలుగుతుంది. ఓడినా, డ్రా అయినా ఇంగ్లండే సిరీస్ ఎగరేసుకుపోతుంది. తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్(వికెట్కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్ -
ENG VS IND 5th Test: టీమిండియాకు భారీ షాక్లు
భారత్, ఇంగ్లండ్ మధ్య లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇవాళ (జులై 31) ఐదో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (2), కేఎల్ రాహుల్ (14) జట్టు స్కోర్ కనీసం 50 పరుగులు కూడా దాటించకుండానే పెవిలియన్కు చేరారు. జట్టు స్కోర్ 10 పరుగుల వద్ద జైస్వాల్ను అట్కిన్సన్, 38 పరుగుల స్కోర్ వద్ద రాహుల్ను క్రిస్ వోక్స్ బోల్తా కొట్టించారు.20 ఓవర్లు ముగిసే సమయానికి జట్టు స్కోర్ 56/2గా ఉంది. సాయి సుదర్శన్ (18), శుభ్మన్ గిల్ (6) క్రీజ్లో ఉన్నారు.కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్, ఇంగ్లండ్ జట్లు చెరో నాలుగు మార్పులు చేశాయి. భారత్ తరఫున రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, అన్షుల్ కంబోజ్ స్థానాల్లో ధ్రువ్ జురెల్, కరుణ్ నాయర్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్దీప్ తుది జట్టులోకి రాగా.. ఇంగ్లండ్ తరఫున బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ స్థానాల్లో జేకబ్ బేతెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, జేమీ ఓవర్టన్ ప్లేయింగ్ ఎలెవెన్లోకి వచ్చారు.ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ సిరీస్ను సమం చేసుకోగలుగుతుంది. ఓడినా, డ్రా అయినా ఇంగ్లండే సిరీస్ ఎగరేసుకుపోతుంది. తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్(వికెట్కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్ -
చెత్త రికార్డును మరింత మెరుగుపర్చుకున్న టీమిండియా
టాస్ విషయంలో టీమిండియా ఇప్పటికే తమ ఖాతాలో ఉన్న చెత్త రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. వరుసగా 14 అంతర్జాతీయ మ్యాచ్ల్లో టాస్ ఓడి.. వరుసగా అత్యధిక మ్యాచ్ల్లో టాస్ ఓడిన జట్టుగా చలామణి అవుతున్న భారత్.. తాజాగా ఇంగ్లండ్తో ఐదో టెస్ట్లోనూ టాస్ ఓడి తమ వరుస టాస్ ఓటముల సంఖ్యను 15కు పెంచుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో ఏ జట్టు ఇప్పటివరకు వరుసగా ఇన్ని మ్యాచ్ల్లో టాస్లు ఓడలేదు.ఇంగ్లండ్తో ఐదో టెస్ట్ కలుపుకొని భారత్ వరుసగా ఐదు టెస్ట్లు, అంతకుముందు 8 వన్డేలు, 2 టీ20ల్లో టాస్ కోల్పోయింది. భారత్ చివరిసారిగా ఈ ఏడాది జనవరిలో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో (రాజ్కోట్లో ఇంగ్లండ్తో జరిగిన టీ20 మ్యాచ్) టాస్ గెలిచింది.టాస్ విషయంలో భారత్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ కూడా ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఇంగ్లండ్తో సిరీస్తోనే భారత కెప్టెన్గా అరంగేట్రం చేసిన గిల్.. ఈ సిరీస్లో వరుసగా ఐదు మ్యాచ్ల్లో టాస్ ఓడాడు. తద్వారా కెప్టెన్గా అరంగేట్రం సిరీస్లోనే ఐదు మ్యాచ్ల్లో టాస్ ఓడిన కెప్టెన్గా నిలిచాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ జట్టు ఐదు మ్యాచ్ల సిరీస్లో అన్ని మ్యాచ్ల్లో టాస్లు ఓడటం ఇది 14వ సారి.మ్యాచ్ విషయానికొస్తే.. లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదనంలో ఇవాళ (జులై 31) మొదలైన ఐదో టెస్ట్లో టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఏకంగా నాలుగు మార్పులు చేసింది. రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, అన్షుల్ కంబోజ్ స్థానాల్లో ధ్రువ్ జురెల్, కరుణ్ నాయర్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్దీప్ తుది జట్టులోకి వచ్చారు.ఈ మ్యాచ్లో కరుణ్ నాయర్కు తుది జట్టులో చోటు దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. గత మ్యాచ్లో బ్యాటింగ్లో ఓ మోస్తరుగా రాణించిన శార్దూల్ ఠాకూర్ను పక్కకు పెట్టి మరీ కరుణ్కు అవకాశం ఇచ్చారు. బహుశా కరుణ్కు ఇదే లాస్ట్ ఛాన్స్ కావచ్చు. ఈ మ్యాచ్లో విఫలమైతే కరుణ్ కెరీర్ సమాప్తమైనట్లే.మరోవైపు ఇంగ్లండ్ సైతం ఈ మ్యాచ్ కోసం నాలుగు మార్పులు చేసింది. స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ స్థానాల్లో జేకబ్ బేతెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, జేమీ ఓవర్టన్ తుది జట్టులోకి వచ్చారు. వర్షం కారణంగా టాస్ కాస్త ఆలస్యమైంది. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది.తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్(వికెట్కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్ -
ENG VS IND 5th Test: మళ్లీ టాస్ ఓడిన భారత్.. జట్టులో ఎవరూ ఊహించని ఆటగాడు
ఇంగ్లండ్ గడ్డపై భారత్ వరుసగా ఐదో మ్యాచ్లో టాస్ ఓడింది. లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదనంలో ఇవాళ (జులై 31) ఐదో టెస్ట్ ప్రారంభం కానుండగా, ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడి ఇంగ్లండ్ తాత్కాలిక సారధి ఓలీ పోప్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఏకంగా నాలుగు మార్పులు చేసింది. రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, అన్షుల్ కంబోజ్ స్థానాల్లో ధ్రువ్ జురెల్, కరుణ్ నాయర్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్దీప్ తుది జట్టులోకి వచ్చారు.ఈ మ్యాచ్లో కరుణ్ నాయర్కు తుది జట్టులో చోటు దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. గత మ్యాచ్లో బ్యాటింగ్లో ఓ మోస్తరుగా రాణించిన శార్దూల్ ఠాకూర్ను పక్కకు పెట్టి మరీ కరుణ్కు అవకాశం ఇచ్చారు. బహుశా కరుణ్కు ఇదే లాస్ట్ ఛాన్స్ కావచ్చు. ఈ మ్యాచ్లో విఫలమైతే కరుణ్ కెరీర్ సమాప్తమైనట్లే.మరోవైపు ఇంగ్లండ్ సైతం ఈ మ్యాచ్ కోసం నాలుగు మార్పులు చేసింది. బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ స్థానాల్లో జేకబ్ బేతెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, జేమీ ఓవర్టన్ తుది జట్టులోకి వచ్చారు. వర్షం కారణంగా టాస్ కాస్త ఆలస్యమైంది. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది.తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్(వికెట్కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్ -
ఇంగ్లండ్తో ఐదో టెస్టు.. వాషింగ్టన్ సుందర్కు నో ఛాన్స్?
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు లండన్లోని ఓవల్ మైదానం వేదికగా మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇండియన్ ప్లేయింగ్ ఎలెవన్ను భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఎంపిక చేశాడు. తన ఎంచుకున్న జట్టులో అద్భుతమైన ఫామ్లో ఉన్న స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు చోప్రా చోటు ఇవ్వలేదు. అతడి స్ధానంలో కుల్దీప్ యాదవ్కు అతడు అవకాశమిచ్చాడు.టాప్ ఆర్డర్లో నో ఛేంజ్గత నాలుగు మ్యాచ్లనే భారత ఇన్నింగ్స్ను రాహుల్, యశస్వి జైశ్వాల్ ప్రారంభించాలి. మూడో స్ధానంలో సాయిసుదర్శన్ బ్యాటింగ్ రావాలి. ఒకవేళ అతడు ఆడకపోతే కరుణ్ నాయర్కు అవకాశం దక్కుతుంది. నాలుగో స్ధానంలో కెప్టెన్ గిల్ బ్యాటింగ్కు వస్తాడు.అందులో ఎటువంటి సందేహం లేదు. రిషబ్ పంత్ జట్టులో ఉండి ఉంటే ఐదో స్ధానం కోసం ఎలాంటి టెన్షన్ ఉండేది కాదు. ఇప్పుడు అతడు స్ధానంలో ధ్రువ్ జురెల్ వస్తాడు. జురెల్ను పంత్ ప్లేస్లో బ్యాటింగ్కు పంపి, ఆరేడు స్ధానాల్లో వరుసగా జడేజా, సుందర్ను ఆడిస్తారో లేదా మార్పులు చేస్తారో వేచి చూడాలి.గెలవాల్సిందే..ఈ మ్యాచ్లో భారత్ గెలవకపోతే సిరీస్ను కోల్పోతుంది. ఈ టెస్టులో టీమిండియా గెలవాలంటే కచ్చితంగా 20 వికెట్లు పడగొట్టాల్సిందే. కాబట్టి బ్యాటింగ్ కంటే బౌలింగ్ డెప్త్ను పెంచుకుంటే బాగుంటుంది. అందుకోసం ఆల్రౌండర్లను జట్టులో తగ్గించాలి.వాషింగ్టన్ సుందర్ బదులుగా కుల్దీప్ యాదవ్, శార్ధూల్ ఠాకూర్ స్ధానంలో కరుణ్ నాయర్ను ఆడించండి. జట్టులో నలుగురు సరైన బౌలర్లు ఉంటే చాలు. వారితో పాటు జడేజా ఐదో బౌలింగ్ ఆప్షన్గా ఉంటాడు అని తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.ఐదో టెస్టుకు చోప్రా ఎంచుకున్న జట్టుకేఎల్ రాహుల్, యశస్వి జైశ్వాల్, సాయిసుదర్శన్, శుబ్మన్ గిల్, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో ఐదో టెస్టు.. టీమిండియాకు బ్యాడ్ న్యూస్ -
ఇంగ్లండ్తో ఐదో టెస్టు.. టీమిండియాకు బ్యాడ్ న్యూస్
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో తుది సమరానికి సమయం అసన్నమైంది. ఈ ట్రోఫీలో భాగంగా గురువారం లండన్లోని ఓవల్ నుంచి ప్రారంభం కానున్న ఐదో టెస్టులో భారత్-ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ప్రస్తుతం ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది.దీంతో ఓవల్ టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్ను సమం చేయాలని గిల్ సేన భావిస్తోంది. అయితే భారత ఆశలకు వరుణుడు బ్రేక్ వేసే అవకాశముంది. ఈ మ్యాచ్లో తొలి రోజు ఆటకు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. వాతావరణ శాఖ సూచన ప్రకారం.. గురువారం(జూలై 31) రోజంతా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంది.తొలి రోజు ఆటలో దాదాపు 4 గంటల పాటు వర్షం పడేందుకు ఆస్కారం ఉన్నట్లు ఆక్యూవెదర్ రిపోర్ట్ వెల్లడించింది. మొదటి రోజు మాత్రమే కాకుండా మిగితా నాలుగు రోజులు కూడా తేలికపాటి జల్లులు కురిసే ఛాన్స్ ఉంది.ఆక్యూ వెదర్ రిపోర్ట్ ప్రకారం..ఉదయం 11- 80 % వర్షం పడే అవకాశం మధ్యాహ్నం 12- 70% వర్షం పడే అవకాశంమధ్యాహ్నం 1 -70% వర్షం పడే అవకాశంమధ్యాహ్నం 2- 60% వర్షం పడే అవకాశంమధ్యాహ్నం 3- 60% వర్షం పడే అవకాశంసాయంత్రం 4- 60% వర్షం పడే అవకాశంసాయంత్రం 5- 40% వర్షం పడే అవకాశంసాయంత్రం 6- 30% వర్షం పడే అవకాశంఇంగ్లండ్ వర్సెస్ భారత్ ఐదవ టెస్ట్వేదిక: కెన్నింగ్టన్ ఓవల్, లండన్తేదీ: జూలై 31-ఆగస్టు 4సమయం: భారత కాలమానం ప్రకారం(మధ్యాహ్నం 3:30)టాస్: మధ్యాహ్నం 3:00 గంటలకు లైవ్ స్ట్రీమింగ్: జియో హాట్స్టార్లైవ్ బ్రాడ్కాస్ట్: సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్తుది జట్ల వివరాలు: భారత్ (అంచనా): శుబ్మన్ గిల్ (కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్, శార్దుల్ ఠాకూర్/ప్రసిధ్ కృష్ణ, అర్ష్ దీప్ సింగ్, ఆకాశ్దీప్, సిరాజ్.ఇంగ్లండ్: ఓలీ పోప్ (కెప్టెన్ ), జాక్ క్రాలీ, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెతెల్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, అట్కిన్సన్, ఒవర్టన్, టంగ్. -
'మాకు రూల్స్ తెలుసు.. చాలా క్రికెట్ ఆడాము'.. పిచ్ క్యూరేటర్పై గిల్ ఫైర్
ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందే అందరి దృష్టిని ఆకర్షించింది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఓవల్ పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం పిచ్ ను పరిశీలిస్తున్న భారత బృందం దగ్గరికి వచ్చిన ఫోర్టిస్.. పిచ్ ను రెండున్నర మీటర్ల దూరం నుంచి పరిశీలించాలని సూచించాడు.అతడి మాటలకు గంభీర్కు చిర్రెత్తుకు వచ్చింది. ఈ క్రమంలో ప్రధాన కోచ్ పిచ్ క్యూరేటర్తో వాగ్వాదానికి దిగాడు. అక్కడే ఉన్న భారత బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్ సైతం లీ ప్రవర్తన పట్ల అసహనం వ్యక్తం చేశాడు. తాజాగా ఈ వివాదంపై టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పందించాడు. లీ ఫోర్టిస్పై గిల్ అగ్రహం వ్యక్తం చేశాడు."నా కెరీర్లో చాలా మ్యాచ్లు ఆడాను. మ్యాచ్కు ముందు ప్రధాన పిచ్ను రెండున్నర మీటర్ల దూరం నుంచి పరిశీలించాలని ఇప్పటివరకు ఏ క్యూరేటర్ కూడా నాతో చెప్పలేదు. రబ్బర్ స్పైక్స్ లేదా బేర్ ఫూట్(చెప్పులు లేకుండా) తో పిచ్ను దగ్గరగా వెళ్లి పరిశీలించవచ్చు. మాకు రూల్స్ తెలుసు.ఒకవేళ స్పైక్స్ ఉన్న షూలను వేసుకున్నట్లయితే క్యూరేటర్ మమ్మల్ని అడ్డుకోవచ్చు. కానీ మేము అటువంటి షూలను ధరించలేదు. అయినా క్యూరేటర్ మమ్మల్ని ఎందుకు ఆపాడో ఆర్ధం కావడం లేదు. మేము ఇప్పటివరకు ఈ సిరీస్లో నాలుగు మ్యాచ్లు ఆడాము. ఏ క్యూరేటర్ కూడా మాకు ఇలాంటి సూచనలు ఇవ్వలేదు" అని ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో గిల్ పేర్కొన్నాడు.కాగా ఐదో టెస్టు గురువారం నుంచి ఓవల్ మైదానం వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేసుకోవాలని భారత్ భావిస్తుంటే.. ఇంగ్లండ్ మాత్రం ఎలాగైనా పర్యటక జట్టును ఓడించి 3-1 తేడాతో సిరీస్ దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో ఐదో టెస్టు.. అర్ష్దీప్ అరంగేట్రం! అతడికి మరోసారి నో ఛాన్స్? -
ఇంగ్లండ్తో ఐదో టెస్టు.. అర్ష్దీప్ అరంగేట్రం! అతడికి మరోసారి నో ఛాన్స్?
లండన్లోని ఓవల్ మైదానం వేదిగా ఇంగ్లండ్తో ఆఖరి టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను 2-2తో సమం చేయాలని భారత జట్టు భావిస్తోంది. ఈ కీలక మ్యాచ్లో ఆడేందుకు భారత్ తమ తుది జట్టులో మూడు మార్పులు చేసే అవకాశముంది. అరంగేట్ర మ్యాచ్లో విఫలమైన అన్షుల్ కాంబోజ్ వేటు వేసేందుకు గంభీర్ అండ్కో సిద్దమైనట్లు తెలుస్తోంది.అదేవిధంగా వర్క్లోడ్ లోడ్ మెనెజ్మెంట్లో భాగంగా జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గాయంతో ఐదో టెస్టుకు దూరమైన పంత్ స్దానంలో ధ్రువ్ జురెల్ జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. ఇక ఈ మ్యాచ్తో టీమిండియా స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నట్లు భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ హింట్ ఇచ్చాడు. "ఆఖరి టెస్టు కోసం అర్ష్దీప్ను సిద్దంగా ఉండమని చెప్పాం. కానీ ఈ సాయంత్రం పిచ్ను పరిశీలించిన తర్వాత ప్లేయింగ్ ఎలెవన్పై నిర్ణయం తీసుకుంటాము" అని గిల్ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. గిల్ వ్యాఖ్యలు బట్టి అర్ష్దీప్ భారత వైట్బాల్ జెర్సీలో కన్పించే ఛాన్స్ ఉంది. పిచ్పై పచ్చిక ఎక్కువగా ఉన్నందున ఫాస్ట్బౌలర్లకు అనుకూలించింది. ఈ క్రమంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కంటే అర్ష్దీప్ వైపే మెనెజ్మెంట్ ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ జట్టు ఒక్క ఫ్రంట్లైన్ స్పిన్నర్ లేకుండా ఆడుతోంది. మాకు మాత్రం జడేజా,వాషింగ్టన్లో రూపంలో ఇద్దు స్పిన్నర్లు ఉన్నారని గిల్ చెప్పుకొచ్చాడు. గిల్ వ్యాఖ్యలు బట్టి కుల్దీప్ బెంచ్కు పరిమితం కావడం దాదాపు ఖాయం.కాగా అన్షుల్ కాంబోజ్ స్దానంలో అర్ష్దీప్, బుమ్రా స్ధానంలో ఆకాష్ దీప్ ఆడనున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అయితే మాంచెస్టర్లో బంతితో విఫలమైన శార్ధూల్ ఠాకూర్ను తుది జట్టులో కొనసాగిస్తారా లేదా వేరే ఆటగాడికి ఛాన్స్ ఇస్తారా అన్నది వేచి చూడాలి.స్టోక్స్ దూరం..మరోవైపు ఆఖరి టెస్టు కోసం ఇంగ్లండ్ తమ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించింది. ఆతిథ్య జట్టు ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగనుంది. ఈ కీలక మ్యాచ్ నుంచి కెప్టెన్ బెన్ స్టోక్స్ భుజం గాయంతో తప్పుకొన్నాడు. స్టోక్స్ స్దానంలో జాకబ్ బెతల్కు అవకాశమిచ్చారు.అదేవిధంగా ఆర్చర్, కార్స్లకు విశ్రాంతినివ్వగా...గత టెస్టులో పూర్తిగా విఫలమైన స్పిన్నర్ డాసన్ను ముందే పక్కన పెట్టారు. వీరి ముగ్గురి స్ధానాల్లో అట్కిన్సన్, ఒవర్టన్, టంగ్ జట్టులోకి వచ్చారు.తుది జట్ల వివరాలు: భారత్ (అంచనా): శుబ్మన్ గిల్ (కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్, శార్దుల్ ఠాకూర్/ప్రసిధ్ కృష్ణ, అర్ష్ దీప్ సింగ్, ఆకాశ్దీప్, సిరాజ్.ఇంగ్లండ్: ఓలీ పోప్ (కెప్టెన్ ), జాక్ క్రాలీ, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెతెల్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, అట్కిన్సన్, ఒవర్టన్, టంగ్.చదవండి: Asia Cup 2025: ఆసియాకప్-2025కు జస్ప్రీత్ బుమ్రా దూరం! అతడు కూడా? -
భారత్తో ఐదో టెస్ట్కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్.. తుది జట్టులో 4 మార్పులు
లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం వేదికగా రేపటి నుంచి (జులై 31) టీమిండియాతో ప్రారంభం కాబోయే ఐదో టెస్ట్కు ముందు ఇంగ్లండ్ జట్టుకు అతి భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, ఇన్ ఫామ్ ప్లేయర్ బెన్ స్టోక్స్ భుజం గాయం కారణంగా కీలకమైన మ్యాచ్కు దూరమయ్యాడు. స్టోక్స్ మాంచెస్టర్లో జరిగిన నాలుగో టెస్ట్లో ఏకంగా 35 ఓవర్లు వేసి గాయాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటర్లు వీరోచితంగా పోరాడుతున్న సమయంలోనే స్టోక్స్ చాలా అసౌకర్యంగా కనిపించాడు. అప్పుడే అతని పని అయిపోయిందని అంతా అనుకున్నారు. నాలుగో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు ఐదుకు పైగా సెషన్లలో ఏకంగా 143 ఓవర్లు బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్ బౌలర్ల రసాన్ని పీల్చారు. స్టోక్స్ దాని బాదితుడే. ఆ మ్యాచ్లో స్టోక్స్ బంతితో పాటు బ్యాట్తోనూ చెలరేగి (5 వికెట్ల ప్రదర్శన సహా 6 వికెట్లు, సెంచరీ) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.అంతకుముందు వారు గెలిచిన మూడో టెస్ట్లోనూ స్టోక్సే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఆ మ్యాచ్లో అతను 77 పరుగులు చేసి, 5 వికెట్లు తీశాడు. ఈ సిరీస్లో లీడింగ్ వికెట్ టేకర్గా (17 వికెట్లు) నిలవడంతో పాటు బ్యాట్తోనూ మంచి టచ్లో ఉన్న స్టోక్స్ కీలకమైన ఐదో టెస్ట్కు దూరం కావడం ఇంగ్లండ్ విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది.కెప్టెన్గా పోప్స్టోక్స్ గైర్హాజరీలో ఐదో టెస్ట్లో ఇంగ్లండ్ కెప్టెన్గా ఓలీ పోప్ వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తుది జట్టును కూడా ప్రకటించింది. ఇందులో ఏకంగా నాలుగు మార్పులు చేసింది. గాయపడిన స్టోక్స్ స్థానంలో జేమీ ఓవర్టన్ తుది జట్టులోకి రాగా.. జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ స్థానాల్లో జేకబ్ బేతెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్లకు తుది జట్టులో స్థానం కల్పించింది. జేకబ్ బేతెల్ ఆరో స్థానంలో బ్యాటింగ్కు వస్తాడని స్పష్టం చేసింది.కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ ప్రస్తుతం 1-2తో వెనుకపడి ఉంది. ఇందులో 1,3 మ్యాచ్లు ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో మ్యాచ్లో విజయం సాధించింది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఐదో టెస్ట్లో భారత్ విజయం సాధిస్తే సిరీస్ సమం అవుతుంది. ఓడినా, డ్రా అయినా ఇంగ్లండ్ వశమవుతుంది. ఇలాంటి కీలక మ్యాచ్లో ఇన్ ఫామ్ ఆల్రౌండర్ స్టోక్స్ లేకపోవడం భారత్కు తప్పక కలిసొచ్చే విషయమే. -
గౌతమ్ గంభీర్కు వార్నింగ్ ఇచ్చిన పిచ్ క్యూరేటర్.. తనదైన శైలిలో ఫైరైన టీమిండియా హెడ్ కోచ్
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్ట్కు వేదికైన కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఇవాళ (జులై 29) ఘర్షనాత్మక వాతావరణం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్పై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినట్లు సమాచారం. HEATED ARGUMENT BETWEEN INDIA'S HEAD COACH GAUTAM GAMBHIR & OVAL STADIUM'S PITCH CURATOR. 🥶🤯 (PTI).pic.twitter.com/WX9R9fWvQ8— Tanuj (@ImTanujSingh) July 29, 2025ఫోర్టిస్పై గంభీర్ ఫైరవడానికి గల అసలు కారణాలు తెలియనప్పటికీ.. పిచ్ ప్రిపరేషన్ విషయంలో వాగ్వాదం తలెత్తినట్లు సోషల్మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియోల ద్వారా తెలుస్తుంది.పిచ్పై అతిగా పచ్చిక అమర్చడాన్ని గంభీర్ వ్యతిరేకించినట్లు సమాచారం. ఈ విషయమై గంభీర్ ఫోర్టిస్ను సంప్రదించగా తలబిరుసుగా సమాధానం చెప్పాడట. Gautam Gambhir has a heated argument with The Oval stadium's pitch curator. 🤯 (Raysportz).pic.twitter.com/RbTyMGcDSV— Tanuj (@ImTanujSingh) July 29, 2025దీంతో చిర్రెత్తిపోయిన గంభీర్ ఫోర్టిస్పై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడని సమాచారం. ఓ దశలో ఫోర్టిస్ గంభీర్పై ఫిర్యాదుకు ధమ్కీ ఇచ్చాడని.. ఇందుకు ప్రతిగా గంభీర్ ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పో అని అన్నాడని సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది.గంభీర్ ఫోర్టిస్పై ఫైరవుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్మీడియాలో ట్రెండ్ అవుతుంది. వీడెవడో పోయి పోయి గంభీర్తో పెట్టుకున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గంభీర్ ముక్కోపి అన్న విషయం తెలిసిందే. అతనికి కోపం వస్తే తనా మనా అని చూడడు. ఇది గతంలో చాలా సందర్భాల్లో చూశాం. 2024 ఐపీఎల్ సందర్భంగా గంభీర్ విరాట్ కోహ్లి లాంటి దిగ్గజ ఆటగాడిని కూడా వదిలిపెట్టలేదు.కాగా, భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్ట్ కోసం ఓవల్ మైదానంలో దట్టమైన పచ్చికతో పిచ్ను తయారు చేసినట్లు తెలుస్తుంది. దీని వల్ల ఇంగ్లండ్ పేసర్లకు అదనపు ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. ఇందుకే గంభీర్ క్యూరేటర్తో గొడవ పడి ఉండవచ్చు.ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-2తో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో మొదటి, మూడు టెస్ట్లు ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో టెస్ట్లో విజయం సాధించింది. తాజాగా జరిగిన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు వీరోచితంగా పోరాడి ఇంగ్లండ్ గెలుపును అడ్డుకున్నారు. జులై 31 నుంచి ఐదో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. ఇంగ్లండ్ గెలిచినా లేదా డ్రా అయినా సిరీస్ వారి వశమే అవుతుంది. -
ఆర్చర్ను పక్కన పెట్టండి.. అతడిని జట్టులోకి తీసుకోండి: బ్రాడ్
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు గెలిచి సిరీస్ను 3-1 సొంతం చేసుకోవాలని భావించిన ఇంగ్లండ్ జట్టుకు టీమిండియా ఝులక్ ఇచ్చింది. ఆ మ్యాచ్ను భారత జట్టు తమ విరోచిత పోరాటంతో డ్రా ముగించింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య ఆఖరి టెస్టు జూలై 31 నుంచి లండన్లోని ఓవెల్ మైదానం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని ఇంగ్లండ్ భావిస్తుంటే.. భారత్ మాత్రం ప్రత్యర్ధిని ఓడించి సిరీస్ సమం చేయాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ టీమ్మెనెజ్మెంట్కు ఆ దేశ మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ కీలక సూచన చేశాడు. ఓవెల్ టెస్టులో జోఫ్రా ఆర్చర్కు బదులుగా గాస్ అట్కినసన్ను ఆడించాలని బ్రాడ్ అభిప్రాయపడ్డాడు."ఐదో టెస్టుకు జోఫ్రా ఆర్చర్కు విశ్రాంతి ఇవ్వాలి. అతడి స్ధానంలో గస్ అట్కిన్సన్ ఆడించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అతడిపై పస్తుతం ఎటువంటి వర్క్లోడ్ లేదు. ఆఖరి టెస్టులో అతడిని ఖచ్చితంగా ఆడించాలి. అట్కిన్సన్ టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు సరైన ప్రత్యర్ధిని ఎదుర్కొలేదు. అదేవిధంగా బ్రైడన్ కార్స్ కూడా బాగా ఆలిసిపోయాడు. నాలుగో టెస్టులో అతడు అంత కంఫర్ట్గా కన్పించలేదు. కానీ ఈ సిరీస్లో అతడు అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. కార్స్కు విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో టీమ్మెనెజ్మెంట్ ఉండొచ్చు. ఒకవేళ అదే జరిగితే అట్కినసన్ జట్టులోకి రావడం ఖాయం. జోష్ టంగ్ రూపంలో కూడా మరో ఆప్షన్ ఉంది. అతడు తొలి టెస్టులో మాత్రమే ఆడాడు. టంగ్ భారత లోయర్ ఆర్డర్ ఆటగాళ్లను ఔట్ చేసి వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ అతడికి అద్బుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. కాబట్టి ఆర్చర్కు ప్రత్యామ్నాయంగా టంగ్ను కూడా జట్టులోకి తీసుకొవచ్చు" అని స్కై స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రాడ్ పేర్కొన్నాడు. -
నా కొడుకు ఏమి తప్పు చేశాడు: సెలక్టర్లపై సుందర్ తండ్రి ఫైర్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టును టీమిండియా డ్రా ముగించడంలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ది కీలక పాత్ర. ఈ మ్యాచ్లో సుందర్ తన విరోచిత పోరాటంతో జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. మరో ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి ఐదో వికెట్కు 203 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు.ఈ తమిళనాడు ఆటగాడు మొత్తంగా 206 బంతులు ఎదుర్కొని 101 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో సుందర్పై అందరూ ప్రంశసల వర్షం కురిపిస్తుంటే.. అతడి తండ్రి మణి సుందర్ మాత్రం కీలక వ్యాఖ్యలు చేశాడు. తన కుమారుడు నిలకడగా రాణిస్తున్నప్పటికి, జాతీయ జట్టులో ఎక్కువగా అవకాశాలు ఇవ్వడం లేదని భారత సెలక్టర్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు"వాషింగ్టన్ తను ఆడిన ప్రతీ మ్యాచ్లోనూ మెరుగైన ప్రదర్శన కనబరిస్తున్నాడు. గత కొంతకాలంగా అతడు నిలకడగా రాణిస్తున్నాడు. కానీ వాషీకి పెద్దగా గుర్తింపు లభించలేదు. భారత జట్టు అభిమానులు సైతం సుందర్ ప్రదర్శనలను గుర్తించడం లేదు. మిగితా ఆటగాళ్లు బాగా ఆడకపోయినా, వారికి క్రమం తప్పకుండా అవకాశాలు లభిస్తున్నాయి. నా కొడుకు మాత్రం బాగా ఆడిన కూడా రెగ్యూలర్గా ఛాన్స్లు లభించలేదు. నాలుగో టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్లో ఐదో స్దానంలో బ్యాటింగ్కు వచ్చినట్లగానే మిగితా మ్యాచ్లలో కూడా అదే పొజిషన్లో అతడిని పంపాలి. వరుసగా 10 మ్యాచ్లలో నా కుమారుడిని ఆడించాలి. ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో వాషీకి చోటు దక్కకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. సెలక్టర్లు అతడి ప్రదర్శలనపై ఓ కన్నేసి ఉంచాలి" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంమ్ సుందర్ పేర్కొన్నాడు.2021లో భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన సుందర్.. ఇప్పటివరకు కేవలం 12 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. 12 మ్యాచ్లలో 44.87 సగటుతో 673 పరుగులు చేసిన వాషీ.. 32 వికెట్లు కూగా పడగొట్టాడు.చదవండి: ‘వేరొకరి భర్తను లాక్కోవడం కూడా మోసమే కదా’ -
ఆఖరి టెస్టులో బుమ్రా ఆడుతాడా? కీలక అప్డేట్ ఇచ్చిన గంభీర్
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ తుది అంకానికి చేరుకుంది. ఈ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదో టెస్టు జూలై 31 నుంచి లండన్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచి లేదా డ్రాగా ముగించైనా సిరీస్ను సొంతం చేసుకోవాలని ఇంగ్లండ్ భావిస్తుంటే, టీమిండియా మాత్రం ప్రత్యర్ధిని ఓడించి సిరీస్ను సమం చేయాలని పట్టుదలతో ఉంది.అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియాను పేస్ బౌలింగ్ కష్టాలు వెంటాడుతున్నాయి. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతుండగా.. ఆకాష్ దీప్ గజ్జ గాయంతో బాధపడుతున్నాడు. అదేవిధంగా చేతి వేలి గాయం కారణంగా లెఫ్ట్మ్ ఆర్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ ఇప్పటికే ఈ సిరీస్ నుంచి తప్పుకొన్నాడు.అతడి స్ధానంలో జట్టులోకి వచ్చిన యువ పేసర్ అన్షుల్ కాంబోజ్.. తన తొలి మ్యాచ్లో తీవ్ర నిరాశపరిచాడు. అంతకుతోడు ఆఖరి రెండు టెస్టులకు దూరంగా ఉన్న పేసర్ ప్రసిద్ద్ కృష్ణ కూడా చెప్పుకోదగ్గ ఫామ్లో లేడు. దీంతో కీలకమైన ఐదో టెస్టులో భారత ఫాస్ట్ బౌలింగ్ కాంబనేషన్ ఎలా ఉంటుందో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బౌలర్ల ఫిట్నెస్పై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక అప్డేట్ ఇచ్చాడు.ఇంగ్లండ్తో చివరి టెస్టు కోసం జస్ప్రీత్ బుమ్రా సహా భారత బౌలింగ్ బృందమంతా సిద్ధంగా ఉందని, ఎలాంటి గాయాల సమస్య లేదని గంభీర్ స్పష్టం చేశాడు. అయితే బుమ్రా విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, తుది జట్టుకు సంబంధించి ఇంకా చర్చ జరగలేదని అతడు పేర్కొన్నాడు. కాగా మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టును టీమిండియా పోరాడి డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1తో ఇంగ్లండ్ ముందంజలో ఉంది.ఇంగ్లండ్తో ఐదో టెస్టుకు భారత తుది జట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్ -
ఇంగ్లండ్తో ఐదో టెస్టు.. భారత జట్టులో కీలక మార్పులు! వారిద్దరిపై వేటు?
ఇంగ్లండ్తో నాలుగో టెస్టును డ్రా ముగించిన భారత జట్టు.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. లండన్లోని ఓవల్ వేదికగా జూలై 31 నుంచి ప్రారంభం కానున్న ఆఖరి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్తో తాడోపేడో తేల్చుకునేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను 2-2తో సమం చేయాలని గిల్ సేన భావిస్తోంది.అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే ఆఖరి టెస్టుకు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ దూరం కాగా.. ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్పై అనుమానాలు నెలకొన్నాయి. మాంచెస్టర్ టెస్టులో బుమ్రా ఫుల్ ఫిట్నెస్గా కన్పించలేదు. ఈ మ్యాచ్లో ఎక్కువ వేగంతో కూడా జస్ప్రీత్ బౌలింగ్ చేయలేకపోయాడు.ఈ స్టార్ పేసర్ 100కు పైగా పరుగులు సమర్పించుకుని కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. మరోవైపు గాయం కారణంగా నాలుగో టెస్టుకు దూరమైన పేసర్ ఆకాష్ దీప్ ఫిట్నెస్పై ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. అయితే కీలకమైన ఐదో టెస్టులో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగే అవకాశముంది.శార్ధూల్ పై వేటు..!వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్ధానంలో ధ్రువ్ జురెల్ తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. పంత్కు ప్రత్నమయ్నాంగా తమిళనాడు వికెట్ కీపర్ జగదీశన్ నారాయణ్ను సెలక్టర్లు ఎంపిక చేసినప్పటికి.. అనుభవం దృష్ట్యా జురెల్ వైపే మెనెజ్మెంట్ ఆసక్తి చూపే అవకాశముంది.అంతేకాకుండా నాలుగో టెస్టులో బంతితో విఫలమైన ఆల్రౌండర్ శార్ధూల్ ఠాకూర్పై కూడా వేటు పడే ఛాన్స్ ఉంది. అతడి స్ధానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ ఎలెవన్లోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అరంగేట్రంలో తీవ్ర నిరాశపరిచిన పేసర్ అన్షుల్ కాంబోజ్ను కూడా ఓవల్ టెస్టుకు పక్కన పెట్టనున్నట్లు సమాచారం.అతడి స్ధానంలో ఆకాష్ దీప్(ఫిట్నెస్కు లోబడి) లేదా ప్రసిద్ద్ కృష్ణకు అవకాశమివ్వాలని గంభీర్ అండ్ కో భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి బుమ్రాకు ఆఖరి టెస్టులో ఆడిస్తారా లేదా విశ్రాంతి ఇస్తారా అన్నది ఇప్పుడు ప్రశార్ధకంగా మారింది. మరోవైపు ఇంగ్లండ్ ఐదో టెస్టుకు తమ జట్టును ప్రకటించింది. బౌలింగ్ ఆల్రౌండర్ జేమి ఓవర్టన్కు తిరిగి మళ్లీ ఇంగ్లీష్ జట్టు సెలక్టర్లు పిలుపునిచ్చారు.ఇంగ్లండ్తో ఐదో టెస్టుకు భారత తుది జట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్చదవండి: వారిద్దరూ అద్బుతం.. మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది: శుబ్మన్ గిల్ -
వారిద్దరూ అద్భుతం.. మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది: శుబ్మన్ గిల్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో ఓటమి అంచుల నుంచి తప్పించుకొని మ్యాచ్ను భారత్ ‘డ్రా’గా ముగించడంపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వచ్చాయి. రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయి టీమిండియా... తర్వాతి ఐదు సెషన్లలో మరో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ప్రత్యర్ధిని నిలువరించగలిగింది. ఇది మన జట్టు పట్టుదలను చూపించింది.మాది ఒక గొప్ప జట్టు..ఈ విషయాన్ని భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాడు. మంచి జట్టుకు, గొప్ప జట్టుకు మధ్య ఉన్న తేడాను తాము చూపించగలిగామని అతను చెప్పాడు. ‘మైదానంలో 143 ఓవర్ల పాటు ఒకే లక్ష్యంతో ఒకే తరహా ఆలోచనతో మానసికంగా దృఢంగా ఉండటం చాలా కష్టం. కానీ మేం దానిని చేసి చూపించాం. ఒక మంచి జట్టుకు, గొప్ప జట్టుకు మధ్య ఇదే ప్రధాన తేడా. ఈ టెస్టులో ఆటతో మాది గొప్ప జట్టని నిరూపించాం’ అని గిల్ వ్యాఖ్యానించాడు.సున్నాకే 2 వికెట్లు కోల్పోయిన దశలో సీనియర్ కేఎల్ రాహుల్తో కలిసి గిల్ నెలకొల్పిన భాగస్వామ్యమే జట్టు రాతను మార్చింది. 70.3 ఓవర్ల వీరి భాగస్వామ్యంలో 188 పరుగులు వచ్చాయి. ఈ పార్ట్నర్షిప్తోనే తాము మ్యాచ్ను కాపాడుకోగలమనే నమ్మకం కలిగిందని గిల్ చెప్పాడు. ‘మా జట్టు పట్టుదలగా ముందుకు వెళ్లాలంటే కావాల్సిన అగ్గిని రగిల్చేందుకు ఒక నిప్పు కణిక అవసరమైంది. నేను, రాహుల్ కలిసి నెలకొల్పిన భాగస్వామ్యం అలాంటిదే. మేం పెట్టుకున్న లక్ష్యాన్ని అందుకోగలమని అప్పుడే అనిపించింది. తుది ఫలితం చాలా సంతోషాన్నిచ్చింది. శనివారం మేం ఉన్న స్థితితో పోలిస్తే మ్యాచ్ను డ్రా చేసుకోవడం ఎంతో సంతృప్తికరం. నా ఇన్నింగ్స్ పట్ల కూడా ఎంతో ఆనందంగా ఉన్నా’ అని గిల్ పేర్కొన్నాడు.భారత్ ఓటమి నుంచి తప్పించుకోవడంలో కీలక పాత్ర పోషించిన జడేజా, సుందర్లపై కూడా కెప్టెన్ ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరు 55.2 ఓవర్లు ఆడి అభేద్యంగా 203 పరుగులు జత చేశారు. ‘జడేజా, సుందర్ క్రీజ్లో ఉన్నప్పుడు కూడా బ్యాటింగ్కు అంత అనుకూల పరిస్థితి ఏమీ లేదు.బంతి అనూహ్యంగా స్పందిస్తోంది. కానీ అలాంటి స్థితి నుంచి ప్రశాంతంగా ఆడుతూ ఇద్దరూ సెంచరీలు సాధించడం చాలా గొప్ప విషయం. ఏకాగ్రత చెదరకుండా ప్రతీ బంతిపై వారు దృష్టి పెట్టి డ్రా వరకు తీసుకెళ్లడం ఎంతో ప్రత్యేకం. ఇది మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అని గిల్ అన్నాడు.చదవండి: IND vs PAK: ‘పాక్తో మ్యాచ్ ఆడాలి’!.. గంగూలీపై అభిమానుల ఆగ్రహం -
అవిశ్రాంత యోధుడు సిరాజ్.. కోహ్లిని కూడా దాటేశాడు..!
హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఇటీవలి కాలంలో టీమిండియా ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా మారిపోయాడు. ముఖ్యంగా టెస్ట్ల్లో అవిశ్రాంత యోధుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా మాంచెస్టర్ టెస్ట్లో పాల్గొన్న సిరాజ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ దశాబ్దంలో (2020ల్లో) భారత్ తరఫున అత్యధిక టెస్ట్లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిని సైతం అధిగమించాడు. విరాట్ 2020 నుంచి టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించకముందు వరకు 39 టెస్ట్లు ఆడగా.. సిరాజ్ మాంచెస్టర్ టెస్ట్తో 40వ టెస్ట్ పూర్తి చేసుకున్నాడు. 2020 డిసెంబర్లో టీమిండియా తరఫున టెస్ట్ అరంగేట్రం చేసిన సిరాజ్.. ఆ ఏడాదంతా (2020) టెస్ట్లు ఆడకపోయినా ఈ దశాబ్దంలో భారత్ తరఫున అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా నిలవడం విశేషం.వర్క్ లోడ్ కారణంగా మేనేజ్మెంట్ రొటేషన్ పాలసీని ప్రవేశపెట్టినప్పటికీ సిరాజ్ టీమిండియా ఆడిన ప్రతి టెస్ట్ మ్యాచ్లోనూ ఆడాల్సి వస్తుంది. పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు క్రమం తప్పకుండా విశ్రాంతినిస్తున్న మేనేజ్మెంట్ సిరాజ్ను మాత్రం దాదాపుగా ప్రతి మ్యాచ్లో ఆడిస్తుంది. లెక్కలు చూసుకోవడానికి ఇది బాగానే ఉన్నా పరిస్థితి ఇలాగే కొనసాగితే సిరాజ్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.పని భారం ఎక్కువై సిరాజ్ గాయాల బారిన పడితే కెరీర్ అర్దంతరంగా ముగిసే ప్రమాదం ఉంది. ఇప్పటికే సిరాజ్ వయసు 31 సంవత్సరాలు. ఇలా నిర్విరామంగా ఆడితే అతని కెరీర్ మరో రెండు, మూడేళ్లకు మించి కొనసాగే అవకాశం ఉండదు. టీమిండియా మేనేజ్మెంట్ ఇకనైనా మేల్కొని సిరాజ్కు కూడా వరుస విరామాల్లో విశ్రాంతి కల్పించకపోతే చేజేతులా ఓ టాలెంటెడ్ క్రికెటర్ కెరీర్ను ప్రమాదంలోకి తోసేసినట్లవుతుంది. సిరాజ్ తాజాగా ముగిసిన మాంచెస్టర్ టెస్ట్లో సింహభాగం బౌలింగ్ చేశాడు. 24 ఏళ్ల యువ పేసర్ అన్షుల్ కంబోజ్ కేవలం 18 ఓవర్లు వేస్తే సిరాజ్ బుమ్రా తర్వాత అత్యధికంగా 30 ఓవర్లు బౌలింగ్ చేశాడు. కెప్టెన్లకు సిరాజ్పై ఉన్న నమ్మకంతో అతనికే తరుచూ బౌలింగ్ రొటేట్ చేస్తున్నారు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇది సమంజసమే అయినప్పటికీ.. ఓ టాలెండెట్ బౌలర్ అర్దంతరంగా ముగిసిపోయే ప్రమాదం ఉంది.సిరాజ్ త్వరలో తన కెరీర్లో 41వ టెస్ట్ ఆడటం కూడా దాదాపుగా ఖరారైంది. ఇంగ్లండ్తో ఐదో టెస్ట్లో ఒకవేళ బుమ్రాకు విశ్రాంతినిచ్చినా సిరాజ్ను మాత్రం తప్పక ఆడిస్తారు. ఈ విషయంలో టీమిండియాకు మరో ఆప్షన్ కూడా లేదు. సత్తా చాటుతాడనుకున్న యువ పేసర్ అన్షుల్ కంబోజ్ నాలుగో టెస్ట్లో ప్రభావం చూపలేకపోయాడు. మరో ఆప్షన్ అయిన ప్రసిద్ద్ కృష్ణను మేనేజ్మెంట్ నమ్మే పరిస్థితుల్లో లేదు. మరో రెండు ఆప్షన్లైన ఆకాశ్దీప్, అర్షదీప్ సింగ్ గాయాలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో జులై 31 నుంచి ప్రారంభమయ్యే ఐదో టెస్ట్లో సిరాజ్ ఆడటం దాదాపుగా ఖాయమనే చెప్పాలి. -
మాంచెస్టర్ టెస్ట్ హీరోలు.. కేఎల్ రాహుల్కు క్రెడిట్ ఇవ్వని ఎల్ఎస్జీ
మాంచెస్టర్ టెస్ట్లో వీరోచితంగా పోరాడి ఇంగ్లండ్ గెలుపును అడ్డుకున్న టీమిండియా హీరోలు కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. అభిమానులు, విశ్లేషకులు, వారు, వీరు అన్న తేడా లేకుండా అందరూ పై నలుగురిని కొనియాడుతున్నారు. ఈ మ్యాచ్లో 311 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన భారత్ (నాలుగో రోజు).. ఖాతా తెరవకుండానే యశస్వి జైస్వాల్ (0), సాయి సుదర్శన్ (0) వికెట్లు కోల్పోయింది.ఈ దశలో కేఎల్ రాహుల్ (90), శుభ్మన్ గిల్ (103) న భూతో న భవిష్యతి అన్న రీతిలో బ్యాటింగ్ చేసి మూడో వికెట్కు రికార్డు స్థాయిలో 188 పరుగులు జోడించారు. ఆతర్వాత వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా (107 నాటౌట్) వీరోచిత శతకాలు బాది మ్యాచ్ను డ్రా చేశారు.పై నలుగురిలో గిల్, జడ్డూ, సుందర్ సెంచరీలు చేయగా.. రాహుల్ తృటిలో ఆ మార్కును చేజార్చుకున్నాడు. స్టోక్స్ అద్బుతమైన బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో రాహుల్ మూడంకెల స్కోర్ను చేరుకోలేకపోయాడు. రాహుల్ సెంచరీ చేయకపోయినా, చారిత్రక ఇన్నింగ్స్ ఆడి, ఇంగ్లండ్ గెలుపును అడ్డుకునేందుకు తొలి మెట్టు పేర్చాడు.అంకెల విషయాన్ని పక్కన పెడితే సున్నాకే 2 వికెట్లు కోల్పోయిన దశలో గిల్తో పాటు రాహుల్ ప్రదర్శించిన పోరాటపటిమ చరిత్రలో నిలిచిపోతుంది. మూడంకెల స్కోర్ అందుకోలేకపోయాడన్న విషయం తప్పించి, సెంచరీలు చేసిన గిల్, జడ్డూ, సుందర్తో పాటు రాహల్ను కూడా వేనోళ్ల పొగడాల్సిందే.The men who made it happen 🫡 pic.twitter.com/6zST20o0Dp— Lucknow Super Giants (@LucknowIPL) July 28, 2025ఇదిలా ఉంటే, ఐపీఎల్లో రాహుల్ మాజీ ఫ్రాంచైజీ అయిన లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం అతని ఇన్నింగ్స్ను విస్మరించి, మిగతా ముగ్గురికి క్రెడిట్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇవాళ (జులై 28) ఉదయం ఎల్ఎస్జీ తమ అధికారిక సోషల్మీడియా ఖాతాలను నుంచి పోస్ట్ చేస్తూ.. The men who made it happen అంటూ గిల్, జడ్డూ, సుందర్కు మాత్రమే క్రెడిట్ ఇచ్చింది. ఇందులో రాహుల్ ప్రస్తావన లేకపోవడాన్ని క్రికెట్ అభిమానులు తప్పుబడుతున్నారు. రాహుల్ అంటే ఎందుకంత చిన్న చూపు అంటూ ఎల్ఎస్జీకి అక్షింతలు వేస్తున్నారు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మ్యాచ్ భారత్ నుంచి చేజారకుండా ఉండటంలో రాహుల్ది కూడా ప్రధానపాత్ర అని అతని అభిమానులు అంటున్నారు. కాగా, ఎల్ఎస్జీ యాజమాన్యానికి రాహుల్ విషయంలో ఇలా ప్రవర్తించడం కొత్తేమీ కాదు. రాహుల్ తమ ఫ్రాంచైజీని వదిలి ఢిల్లీకి వెళ్లాడన్న అక్కసుతో వీలు చిక్కినప్పుడల్లా ఇలాగే ప్రవర్తిస్తుంటుంది. -
బెన్ స్టోక్స్ సరికొత్త చరిత్ర
భారత్, ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటర్లు కేఎల్ రాహుల్ (90), శుభ్మన్ గిల్ (103), వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా (107 నాటౌట్) వీరోచితంగా పోరాడి ఇంగ్లండ్ గెలుపును అడ్డుకున్నారు. 311 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన భారత్.. ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ అనూహ్య రీతిలో పుంజుకుంది. రాహుల్, గిల్, సుందర్, జడ్డూ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్లు ఆడటంతో భారత్ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసింది. జో రూట్ (150), బెన్ స్టోక్స్ (141) భారీ శతకాలతో కదంతొక్కడంతో 669 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4, బుమ్రా, సుందర్ తలో 2, అన్షుల్ కంబోజ్, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, రిషబ్ పంత్ 54, శార్దూల్ ఠాకూర్ 41 రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లు తీశాడు.స్టోక్స్ సరికొత్త చరిత్రఈ మ్యాచ్లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆల్రౌండ్ ప్రదర్శనతో (141 పరుగులు, 6 వికెట్లు) ఇరగదీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ ప్రదర్శన అనంతరం స్టోక్స్ చరిత్రలో ఏ ఇంగ్లండ్ కెప్టెన్కు సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనతను సాధించాడు. ఈ సిరీస్లో స్టోక్స్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 300 పైచిలుకు (304) పరుగులు చేసి, 15కు పైగా (17) వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ ఇతర కెప్టెన్ ఓ సిరీస్లో 300 ప్లస్ పరుగులు చేసి 15 ప్లస్ వికెట్లు తీయలేదు. మరో ఇంగ్లండ్ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ఈ ఘనత సాధించినప్పటికీ సాధారణ ఆటగాడిగానే సాధించాడు. ఈ సిరీస్లో స్టోక్స్ మరో టెస్ట్ ఆడేది ఉండగా.. మరిన్ని పరుగులు, వికెట్లు తీసే అవకాశం ఉంది.నాలుగో టెస్ట్ డ్రా అయినా ఈ సిరీస్లో ఇంగ్లండ్ ఆధిక్యం 2-1తో కొనసాగుతూ ఉంది. చివరిదైన ఐదో టెస్ట్ జులై 31 నుంచి లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో ఒకటి, మూడు మ్యాచ్లు ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో మ్యాచ్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. -
భారత్తో ఐదో టెస్ట్.. మరో ఫాస్ట్ బౌలింగ్ అస్త్రాన్ని ప్రయోగించనున్న ఇంగ్లండ్
జులై 31 నుంచి లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా టీమిండియాతో జరుగబోయే ఐదో టెస్ట్ కోసం అప్డేటెడ్ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) ఇవాళ (జులై 28) ప్రకటించింది. ఈ మ్యాచ్ కోసం నాలుగో టెస్ట్ ఆడిన జట్టును యధాతథంగా కొనసాగించిన ఈసీబీ అదనంగా మరో ఫాస్ట్ బౌలర్ను జట్టులో చేర్చుకుంది. 31 ఏళ్ల జేమీ ఓవర్టన్ ఐదో టెస్ట్ కోసం జట్టులో భాగం కానున్నాడు.నాలుగో టెస్ట్ సందర్భంగా కెప్టెన్ బెన్ స్టోక్స్ అసౌకర్యంగా కనిపించడంతో అతనికి బ్యాకప్గా జేమీని ఎంపిక చేశారు. జేమీ చేరికతో జట్టులో పేసర్ల సంఖ్య ఏడుకు చేరింది. ఇప్పటికే బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, జోష్ టంగ్, గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ లాంటి పేసర్లు జట్టులో ఉన్నారు.జేమీ చివరిగా 2022లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అతనికి కెరీర్లో అదే ఏకైక టెస్ట్ మ్యాచ్. నాడు న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో జేమీ 97 పరుగులు (ఒకే ఇన్నింగ్స్లో) చేసి, 2 వికెట్లు తీశాడు. జేమీ ఇటీవల ముగిసిన ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు.భారత్తో ఐదో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, జాక్ క్రాలే, లియామ్ డాసన్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, ఓల్లీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్కాగా, మాంచెస్టర్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య నిన్న ముగిసిన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు వీరోచితంగా పోరాడారు. 311 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన భారత్ (నాలుగో రోజు).. ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ ఊహకందని రీతిలో పుంజుకుంది.కేఎల్ రాహుల్ (90), శుభ్మన్ గిల్ (103), వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా (107 నాటౌట్) న భూతో న భవిష్యతి అన్న రీతితో బ్యాటింగ్ చేసి మ్యాచ్ను డ్రా చేశారు. ముఖ్యంగా సుందర్-జడేజా జోడీ ప్రదర్శించిన పోరాటపటిమ చరిత్రలో నిలిచిపోనుంది. ఈ మ్యాచ్ డ్రా కావడంతో సిరీస్లో ఇంగ్లండ్ ఆధిపత్యం 2-1తో కొనసాగుతుంది. ఈ సిరీస్లో ఒకటి, మూడు మ్యాచ్లు ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో మ్యాచ్లో విజయం సాధించింది. -
IND vs ENG: సుందర్-జడేజా జోడీ సరికొత్త చరిత్ర..
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టు.. భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోనుంది. ఓటమి తప్పదనుకున్న చోట భారత బ్యాటర్లు అద్బుతం చేశారు. తమ విరోచిత పోరాటంతో మ్యాచ్ను డ్రా ముగించి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకున్నారు.ఈ మ్యాచ్ను భారత్ డ్రా ముగించడంలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లది కీలక పాత్ర. ఆఖరి రోజు ఆటలో కేఎల్ రాహుల్, శుబ్మన్ గిల్ ఔటైన తర్వాత ఈ ఇద్దరు ఆల్రౌండర్లు జట్టు బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు.ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ తమ సెంచరీల మార్క్ను అందుకున్నారు. ఇద్దరూ కలసి ఐదో వికెట్కు 203 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించారు. ఈ క్రమంలో ఈ ఎడమ చేతి వాటం జోడీ ఓ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకున్నారు.ఓల్డ్ట్రాఫర్డ్ మైదానంలో టెస్టుల్లో ఐదో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన భారత జోడీగా సుందర్- జడేజా నిలిచారు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, మహ్మద్ అజారుద్దీన్ పేరిట ఉండేది. ఈ ఇద్దరు లెజెండరీ క్రికెటర్లు 1990లో మాంచెస్టర్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్లో ఐదో వికెట్కు 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తాజా మ్యాచ్తో ఈ ఆల్టైమ్ రికార్డు బ్రేక్ అయ్యింది. ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు జూలై 31 నుంచి లండన్లోని ఓవెల్ వేదికగా జరగనుంది.చదవండి: మీ వాళ్లైతే ఇలాగే చేస్తావా?.. స్టోక్స్పై మండిపడ్డ గంభీర్ -
రిషబ్ పంత్ స్ధానంలో 'వైల్డ్ కార్డ్' ఎంట్రీ.. ఎవరీ జగదీశన్?
లండన్లోని ఓవల్ వేదికగా ఇంగ్లండ్ జరగనున్న ఐదో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. నాలుగో టెస్టులో గాయపడిన స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఓవల్ టెస్టుకు దూరమయ్యాడు. మాంచెస్టర్లో టెస్టులో బంతి బలంగా తాకడంతో కుడి కాలి బొటనవేలి ఫ్రాక్చర్ అయింది. ఈ క్రమంలోనే తిరిగి స్వదేశానికి పయనమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది."మాంచెస్టర్లో ఇంగ్లండ్తో జరిగిన నాల్గవ టెస్ట్ సందర్భంగా పంత్ కుడి పాదానికి ఫ్రాక్చర్ అయింది. దీంతో ఈ సిరీస్లోని ఆఖరి టెస్టుకు అతడు దూరమయ్యాడు. అతడు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉండనున్నాడు. త్వరగా కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని" ఆశిస్తున్నామని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.కాగా ఇది నిజంగా భారత్కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. రిషబ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ సిరీస్లో 4 మ్యాచ్లు ఆడి 479 పరుగులు చేశాడు. ఇక అతడి స్ధానాన్ని వికెట్ కీపర్ బ్యాటర్ నారాయణ్ జగదీశన్తో సెలక్టర్లతో భర్తీ చేశారు.జట్టులో పంత్కు ప్రత్యామ్నాయంగా ధ్రువ్ జురెల్ ఉన్నప్పటికి, బ్యాకప్ వికెట్ కీపర్గా జగదీశన్ను తీసుకున్నారు. జగదీశన్ ఇప్పటికే లండన్కు చేరుకున్నాడు. ఈ క్రమంలో ఎవరీ జగదీశన్ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.ఎవరీ జగదీశన్..?తమిళనాడుకు చెందిన టాలెంటడ్ వికెట్ కీపర్ బ్యాటర్ జగదీశన్.. దేశవాళీ క్రికెట్లో తనకంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో జగదీశన్కు అద్బుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 52 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన నారాయణ్.. 47.50 సగటుతో 3,373 పరుగులు. అందులో 10 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత రంజీ ట్రోఫీ సీజన్లో జగదీశన్ తమిళనాడు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఎనిమిది మ్యాచ్లలో 56.16 సగటుతో 674 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. లిస్ట్-ఎ క్రికెట్, టీ20ల్లో కూడా అతడు అదరగొడుతున్నాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (277).. వరుసగా ఐదు ఇన్నింగ్స్లతో సెంచరీలు చేసిన వరల్డ్ రికార్డు అతడి పేరిట ఉన్నాయి.చదవండి: మీ వాళ్లైతే ఇలాగే చేస్తావా?.. స్టోక్స్పై మండిపడ్డ గంభీర్ -
స్టుపిడ్ పనులు చేయొద్దని బ్రూక్కు ముందే చెప్పా: బెన్ స్టోక్స్
మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వ్యవహరించిన తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. భారత బ్యాటర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లు తమ సెంచరీలకు దగ్గరగా ఉన్నప్పుడు స్టోక్స్.. కరచాలనం చేసి మ్యాచ్ను డ్రాగా ముగించాలని కోరుకున్నాడు.ఇంకా అప్పటికి 15 ఓవర్ల ఆట మిగిలి ఉంది. స్టోక్స్ ప్రతిపాదనను జడేజా, సుందర్లు తిరష్కరించారు. దీంతో స్టోక్స్ ఫ్రస్ట్రేషన్ తారస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో స్టోక్స్తో పాటు తన సహచర ఆటగాళ్లు తమ నోటికి పనిచెప్పారు. క్రీడాస్పూర్తిని మరిచి గల్లీ క్రికెటర్లా ప్రవర్తించారు. టీమిండియాకు డ్రాకు ఒప్పుకోలేదనో అక్కసుతో బ్రూక్తో స్టోక్స్ బౌలింగ్ చేశాడు. సాధరణంగా బ్రూక్ చాలా సందర్భాల్లో పార్ట్ టైమ్ స్పిన్నర్గా తన సేవలను అందించాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం బ్రూక్ స్లోగా ఫుల్ టాస్లు వేస్తూ, ఈజీగా పరుగులు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో బౌలింగ్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ కెప్టెన్ భారత అభిమానుల అగ్రహానికి గురయ్యాడు.కాగాఈ హ్యాండ్షేక్ వివాదంపై మ్యాచ్ అనంతరం స్టోక్స్ స్పందించాడు. డ్రా తప్పదనే ఉద్దేశ్యంతో ముందుగానే హ్యాండ్ షేక్ ఇవ్వాలనుకున్నాను స్టోక్స్ తెలిపాడు."రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లు అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. మ్యాచ్ను వారికి అనుకూలంగా మార్చుకోవడంలో వీరిద్దరి భాగస్వామ్యం కీలకం మారింది. వారు బాగా ఆడారని అప్పటికే మేము ఒప్పుకొన్నాము . 80,90 పరుగులతో నాటౌట్గా ఉండి జట్టును క్లిష్ట పరిస్థితి నుంచి కాపాడడం కంటే, సెంచరీ చేసి ఆజేయంగా డ్రెసింగ్స్ రూమ్కు వెళ్లడం ఎక్కువ సంతృప్తి ఇస్తుందని నేను అనుకోవడం లేదు. సెంచరీకి 10 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ ఏదైనా సరే ఫలితం మాత్రం మారదు. ఆ విషయం వారికి కూడా తెలుసు. చాలా క్లిష్ట పరిస్థితి నుంచి జట్టును కాపాడడంలో విజయం సాధించారు. చివరి మ్యాచ్ కంటే ముందు సిరీస్ ఓటమి నుంచి మీ జట్టును కాపాడారు. అంతకుమించి ఇంకేమి కావాలి.అందుకే బ్రూక్కు ఇచ్చా..ఈ మ్యాచ్లో ఫలితం వచ్చే వచ్చే అవకాశం లేనందున, మిగిలిన ఓవర్లను ఫ్రంట్లైన్ బౌలర్లతో బౌలింగ్ చేయించి రిస్క్ తీసుకోడదని భావించాను. మా ప్రధాన బౌలర్లు వర్క్లోడ్ కారణంగా చాలా ఇబ్బందిపడ్డారు.అందుకే బ్రూక్తో బౌలింగ్ చేయించాను. ఎటువంటి స్టుపిడ్ పనులు చేయోద్దని బ్రూక్కు బంతి ఇచ్చే ముందు చెప్పా. మేము అప్పటికే ఎక్కువ సమయం ఫీల్డింగ్ చేసి అలిసిపోయాము. కానీ పరుగులిచ్చి మ్యాచ్ను తొందరగా ముగించాలని మేము అనుకోలేదు. సహజంగా మనం బౌలింగ్ చేయకపోయినా కూడా ఫీల్డ్లో ఉంటే అలసట వస్తుంది. అందుకే డ్రాకు వెళ్లాలని భావించాను. గంట ఆట మాత్రమే ఉన్నప్పుడు డ్రా కోసం షేక్హ్యాండ్స్ ఇచ్చుకోవచ్చు. కానీ అందుకు భారత్ తిరష్కరించింది" అని పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో స్టోక్స్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
బెన్ స్టోక్స్ నోటి దురుసు.. అస్సలు నీవు కెప్టెన్వేనా? వీడియో వైరల్
మాంచెస్టర్ టెస్టును టీమిండియా ఆద్వితీయ పోరాటంతో డ్రా ముగించింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో తమ ఆశలను భారత్ సజీవంగా నిలుపునకుంది. ఓవర్ నైట్స్కోర్ 171/2తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. కేఎల్ రాహుల్(90) వికెట్ను త్వరగానే కోల్పోయింది.లంచ్ విరామానికి ముందు ఇన్ఫామ్ బ్యాటర్ శుబ్మన్ గిల్(103) కూడా పెవిలియన్కు చేరాడు. దీంతో భారత్ ఓటమి తప్పదని అంతా భావించారు. ఈ క్రమంలో సర్ రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్బుతం చేశారు. వీరిద్దరూ తమ ఆసాధరణ బ్యాటింగ్తో ఇంగ్లండ్ ప్లేయర్లు విసుగుతెప్పించారు.ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికి ఈ జోడీని ఇంగ్లండ్ విడగొట్టలేకపోయింది. ఇద్దరూ కలసి ఐదో వికెట్కు 203 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించారు. అయితే వీరిని ఔట్ చేయలేక అలిసిపోయిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. 15 ఓవర్ల ఆట మిగిలూండగానే చేతులెత్తేశాడు.స్టోక్స్ డ్రా ఆఫర్ చేస్తూ రవీంద్ర జడేజా వద్దకు షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అందుకు జడేజా తిరస్కరించాడు. నాకేమి సంబంధం లేదు, కెప్టెన్ చెప్పినట్లు చేస్తా అని జడ్డూ సమాధనమిచ్చాడు. అయితే అప్పటికే రవీంద్ర జడేజా 89 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 80 పరుగులు చేసి సెంచరీలకు చేరువలో ఉన్నారు. అందుకే వారిద్దరూ డ్రాకు అంగీకరించలేదు. దీంతో సహనం కోల్పోయిన స్టోక్స్ తన నోటికి పనిచెప్పాడు. బ్రూక్, బెన్ డకెట్ బౌలింగ్లో సెంచరీలు చేయాలనుకుంటున్నారా అంటూ జడేజాతో వెటకారంగా అన్నాడు. ఇంగ్లండ్ ప్లేయర్లు కూడా స్టోక్స్కు జతయ్యారు. జాక్ క్రాలీ డ్రాకు ఒప్పుకొవచ్చుగా అని జడేజాతో అన్నాడు.కానీ జడేజా, సుందర్ మాత్రం ఒకే మాటపై ముందుకు వెళ్లారు. స్టోక్స్ అన్నవిధంగానే పార్ట్ టైమ్ స్పిన్నర్ హ్యారీ బ్రూక్కు బంతి అందించాడు. బ్రూక్ గల్లీ క్రికెట్లో బౌలింగ్ చేసినట్లు చేశాడు. అతడి బౌలింగ్లోనే సిక్స్ బాది జడేజా(107) సెంచరీ పూర్తి చేసుకోగా.. ఆ తర్వాత రెండు ఓవర్లకే సుందర్(101) తన తొలి టెస్టు సెంచరీ మార్క్ను అందుకున్నాడు.కాగా ఈ మ్యాచ్లో స్టోక్స్ ప్రవర్తనపై నెటిజన్లు ఫైరవతున్నారు. అస్సలు నీకు క్రీడాస్పూర్తి ఉందా? ఆ స్దానంలో మీ ప్లేయర్లు ఉంటే ప్రత్యర్ధి కెప్టెన్ ఇలా చేస్తే ఊరుకుంటావా? అని సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగాScored a hundred, saved the Test, farmed ♾ aura! 💁♂#RavindraJadeja didn't hesitate, till the end 👀#ENGvIND 👉 5th TEST | Starts THU, 31st July, 2:30 PM | Streaming on JioHotstar! pic.twitter.com/cc3INlS07P— Star Sports (@StarSportsIndia) July 27, 2025


