the international level
-
తెలంగాణ రాష్ట్రంలోనే గుర్తింపు
నిజామాబాద్ స్పోర్ట్స్: నేను పదమూడు సంవత్సరాలుగా హాకీ ఆడుతూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాను. గత ప్రభుత్వాలు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే క్రీడలకు, క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందుతుంది్ఱూఎఖఖీా అని అంతర్జాతీయ క్రీడా కారిణి యెండల సౌందర్య అన్నారు. బుధవారం నిజామాబాద్లోని కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు రూ.25లక్షల నగదు, 250 గజాల ఇంటిస్థలం, ఇంటి నిర్మాణానికి రూ.15లక్షలు ప్రకటించడంపై ఆమె సంతోషాన్ని ప్రకటించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ తనను కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లినట్లు సౌందర్య తెలిపారు. మాకు సీఎం 15 నిముషాల సమయం కేటాయించారు. నేను సాధించిన పతకాలు, మెడల్స్, చూపించగానే చాలా సంతోషంగా సీఎం ఫీలయ్యారు. ఇంతగా సాధించినావు గదా గత ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించలేదా అని బాధపడ్డారు. వెంటనే నాకు ప్రభుత్వం నుంచి గౌరవం దక్కేలా చేశారు. ముఖ్యమంత్రికి, ఎంపీ కవిత, ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్త, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్కు, మాజీ పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ డి శ్రీనివాస్లకు, తనకు గుర్తింపు ఇచ్చిన ప్రింట్, ఎల క్ట్రానిక్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సౌందర్య పేర్కొన్నారు. తనలాంటి క్రీడాకారులకు, ప్రతిభ ఉన్న వారు చాలా మంది ఉన్నప్పటికీ ప్రోత్సాహం కరువైందన్నారు. క్రీడాకారుల్లో ప్రతిభ వెలికితీయడానికి కోచ్లు అత్యవసరం అని అన్నారు. తద్వారా తెలంగాణ రాష్ట్రం పేరును ప్రపంచ దేశాల్లో క్రీడల్లో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి వీలుంటుందన్నారు. తనకు సమైక్య రాష్ట్రంలో ఎలాంటి గుర్తింపు రాలేదని, కేవలం తెలంగాణ వచ్చిన తర్వాతే ప్రభుత్వం ప్రత్యేక గౌరవం అందించిందని సౌందర్య పునరుద్ఘాటించారు. క్రీడాకారులు కూడా ఎదైనా ఆటలో ప్రావీణ్యం సాధించడానికి కఠోర శిక్షణ తీసుకోవాలన్నారు. ప్రస్తుతం తాను భారత హాకీజట్టుకు వైస్కెప్టెన్గా వ్యవహరిస్తున్నాని సౌందర్య తెలిపారు. -
వ్యవసాయం చేస్తోంది!
దీక్ష సంపాదించిన వాడికే ఖర్చు పెట్టే అర్హత ఉంటుంది, అది దాతృత్వంతో ఇచ్చే విరాళమైనా సొంతంగా సంపాదించింది అయితే ఆ ఆనందమే వేరు... అని అంటుంది కేటీ . అనాథల ఆకలిని తీర్చడానికి పాటు పడుతోంది ఈ యువతి. ఏడేళ్ల కిందట తొమ్మిదేళ్ల వయసులో కేటీ సేవా దృక్పథం చిగురు తొడిగింది. ఇప్పుడు మొగ్గగా విరిసింది. అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. దాతృత్వం కొద్దీ తమ దగ్గర ఉన్న డబ్బును విరాళంగా ఇచ్చిన వారిని చూసి ఉంటాం. వ్యక్తిగతంగా కష్టపడి వలంటీర్లుగా పేరు తెచ్చుకొన్నవారిని కూడా చూస్తున్నాం. అయితే ఈ రెండింటికీ భిన్నంగా సొంతంగా పంటలు పండించి, ఆ పంటను విరాళంగా ఇస్తోంది కేటీ స్టాగ్లియానో(16). కాలిఫోర్నియాలోని సన్నీవేల్ ప్రాంతానికి చెందిన కేటీ ఇప్పటి వరకూ లెక్కలేనన్ని రోజులపాటు కొన్ని వందల మంది ఆకలిని తీర్చింది. వివిధ అనాథ ఆశ్రమాలకు నిత్యం కాయగూరలను సరఫరా చేస్తూ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకొంది. ఖాళీ స్థలమే సేవకు పెట్టుబడి... ఇంటి పక్కనే ఖాళీగా ఉన్న జాగాను సద్వినియోగం చేయాలన్న ఆలోచన కేటీ తల్లిదండ్రులది. అందులో భాగంగా వారు స్థలాన్ని చదును చేసి క్యాబేజీ పండించాలని అనుకొన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులతో పాటు పాలుపంచుకొంది కేటీ. ఖాళీ సమయంలో కలిసి పనిచేసి క్యాబేజీ సాగు చేశారు. మంచి దిగుబడి సాధించారు. అప్పటికే కేటీలో స్థానిక అనాథ ఆశ్రమంపట్ల అపారమైన జాలి ఉంది. తనకంటే తల్లిదండ్రులు ఉన్నారు అన్నీ చూసుకొంటారు. మరి వారికోసం ఎవరున్నారు? వారి కోసం ఏదైనా చేస్తే బావుటుందనేది ఆమె భావన. ఈ నేపథ్యంలో తాము పండించిన క్యాబేజీని మార్కెట్కు తరలించి అమ్మడం కన్నా, అనాథాశ్రమానికి డొనేట్ చేస్తే ఎలా ఉంటుంది? ఆ మాటే కేటీ తల్లిదండ్రులను అడిగింది. ఆమె తల్లిదండ్రులు కూడా సరదాగా పనిచేశాం, ఖాళీ స్థలంలో సాగు చేశాం... అనే భావనతో కేటీ మాటకు సరేనన్నారు. ఆ క్యాబేజీని అనాథాశ్రమాలకు ఇచ్చారు. ఆ విషయంలో కలిగిన తృప్తి కేటీని అమితానందపరిచింది. పరోపకారంలో ఉన్న ఆనందాన్ని మరింతగా ఆస్వాధించాలన్న ఆలోచనకు కారణమైంది. అంతే అదే జాగాలో మరో పంటను పెట్టే విధంగా తల్లిదండ్రులను ఒప్పించింది. ఈ సారి తనే ఎక్కువ బాధ్యతలు తీసుకొంటూ ఉత్సాహంతో పనిచేసింది. క్యాబేజీతో పాటు కాప్సికం, టమాటో, బీర జాతికి చెందిన వివిధ పంటలను సాగు చేయించింది. యథాతథంగా స్థానిక అనాథాశ్రమాలకు కాయగూరలను ఇచ్చింది. అక్కడ నుంచి అదే తీరున దూసుకెళ్తోంది కేటీ. చేస్తున్న పని గురించి చెప్పి క్లాస్మేట్లను కలసిరమ్మని కోరింది. ఈమె పిలుపునందుకొని అనేక మంది టీనేజర్లు ఈ సాగుబడిలో పాలుపంచుకొన్నారు. మంది ఎక్కువయ్యాక తమ వ్యవసాయాన్ని మరింతగా విస్తరించింది. స్థానికుల అనుమతి తీసుకొని సమీపంలోని ఖాళీ స్థలాల్లో పంటలు సాగు చేయసాగింది. డొనేషన్ల రూపంలో కొంత డబ్బును సేకరించి యంత్రాలతో పనులు చేయించింది. ఇప్పుడు కేటీ ఆధ్వర్యంలో చాలా ఎకరాల భూమి సాగవుతోంది. అన్ని చోట్లా ఆహారపంటలే... అలా కొన్ని వందల కేజీల కాయగూరలను అనాథాశ్రమాలకు చేరవేస్తున్నారు. ఇప్పుడు కేటీ శ్రమను, ఆమె దృక్పథాన్ని మెచ్చుకోనివారంటూ లేరు. స్వయంగా ఉత్పాదనకు పూనుకొని ఇలా సేవా నిరతిని కొనసాగిస్తున్న ఆమెను అనాథల ఆకలిని తీరుస్తున్న వ్యక్తిగా గుర్తించాయి అనేక స్వచ్ఛంద సంస్థలు.‘నో హంగ్రీ చిల్డ్రన్’ పేరుతో సేవా ఉద్యమాన్ని కొనసాగిస్తూ సాగును మరింత విస్తరిస్తూ అనాథలకు ఆహారాన్ని అందిస్తున్న కేటీ సేవలో ఉన్నంత ఆనందం ఇంకెక్కడా లభించదని అంటోంది. ఆ ఆనందం జీవితకాలం పొందాలన్నదే తనకోరిక అంటోంది. మంచికోరికే! *************** ఇంటి పక్కనే ఖాళీగా ఉన్న జాగాను సద్వినియోగం చేయాలన్న ఆలోచన కేటీ తల్లిదండ్రులది. అందులో భాగంగా వారు స్థలాన్ని చదును చేసి క్యాబేజీ పండించాలనే అనుకొన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులతో పాటు పాలుపంచుకొంది కేటీ. ఖాళీ సమయంలో కలిసి పనిచేసి క్యాబేజీ సాగు చేశారు. మంచి దిగుబడినా సాధించారు. అప్పటికే కేటీలో స్థానిక అనాథ ఆశ్రమంపట్ల అపారమైన జాలి నిండి ఉంది.