intervention
-
సిరియాలో జోక్యం ముస్లింల అణచివేత
రష్యా రాజధాని మాస్కోలో తాజాగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ (ఐసిస్) చేసిన అమానవీయ దాడి ప్రపంచాన్ని నిర్ఘాంతపరిచింది. రష్యాపై దాడులు ఐసిస్కు కొత్తేమీ కాదు. కొన్నేళ్ల కింద రష్యా పౌరులే లక్ష్యంగా విమానాన్నే బాంబుతో పేల్చేసి 244 మందిని బలి తీసుకున్న చరిత్ర దానిది! కాబూల్లోని రష్యా రాయబార కార్యాలయంపైనా దాడులకు తెగబడింది. సిరియా అంతర్యుద్ధంలో తమకు వ్యతిరేకంగా పుతిన్ జోక్యం రష్యాపై ఐసిస్ ఆగ్రహానికి ప్రధాన కారణం. రష్యాలోని ముస్లింలు తీవ్ర అణచివేతకు గురవుతున్నారన్న వార్తలు దాని విద్వేషాన్ని మరింతగా పెంచి పోషించాయి. ఫలితంగా రష్యాకు, ఐసిస్కు మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం నిత్యం నిప్పుల కుంపటి రాజేస్తూనే ఉంది... అలా మొదలైంది... ఐసిస్ అరాచకం 2015లో సిరియాలో అంతర్యుద్ధానికి దారితీసింది. ఐసిస్ను అణిచే ప్రయత్నాల్లో అధ్యక్షుడు బషీర్ అల్ అసద్కు పుతిన్ దన్నుగా నిలిచారు. దాంతో రష్యాపై ఐసిస్ తీవ్ర ద్వేషం పెంచుకుంది. మాస్కోలో తాజా మారణహోమానికి తెగబడింది ఐసిస్ ఖోరసాన్ (ఐసిస్–కె). ఇది అఫ్గానిస్థాన్లో ఐసిస్ అనుబంధ సంస్థ. 2022లో అఫ్గాన్ రాజధాని కాబూల్లోని రష్యా రాయబార కార్యాలయంపై ఆత్మాహుతి దాడి చేసి ఇద్దరు ఉద్యోగులతో పాటు ఎనిమిది మందిని పొట్టన పెట్టుకుంది ఐసిస్–కెనే. దీన్ని పాకిస్థానీ తాలిబాన్ ముఠా సభ్యులు 2015లో ప్రారంభించారు. అఫ్గాన్లో భద్రతా దళాలతో పాటు మంత్రులపై, మైనారిటీలపై వరుస దాడులతో ప్రాచుర్యంలోకి వచి్చంది. 2018కల్లా ప్రపంచంలోని నాలుగు అత్యంత ప్రమాదకరమైన ఉగ్ర సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ఉగ్ర శిక్షణ నిమిత్తం ఇరాక్, సిరియాల్లోని అగ్ర నాయకత్వం నుంచి కోట్లది డాలర్లు అందకుంటూ వచి్చంది. తర్వాత అమెరికా సైన్యం, అఫ్గాన్ కమెండోలు, అఫ్గాన్ తాలిబన్ల ముప్పేట దాడితో ఐసిస్–కె ఆగడాలకు కళ్లెం పడింది. అమెరికా వైమానిక దాడులు దాని అగ్ర నాయకత్వాన్ని దాదాపుగా తుడిచిపెట్టేశాయి. 2021లో అమెరికా సైన్యం అఫ్గాన్ నుంచి వైదొలగడంతో ఐసిస్–కె మళ్లీ పుంజుకుంది. అదే ఏడాది కాబూల్ విమానాశ్రయంపై దాడి చేసి 13 మంది అమెరికా సైనికులతో పాటు ఏకంగా 170 మంది పౌరులను బలి తీసుకుంది. కొన్నేళ్లుగా అఫ్గాన్ ఆవల కూడా విస్తరిస్తోంది. గత జనవరిలో ఇరాన్లో దివంగత మేజర్ జనరల్ ఖాసీం సులేమానీ స్మారక ర్యాలీపై ఆత్మాహుతి దాడికి తెగబడి 84 మందిని పొట్టన పెట్టుకుంది. ఇస్తాంబుల్లో ఓ చర్చిపైనా దాడి చేసింది. పుతిన్ను, ఆయన విధానాలను ఐసిస్–కె తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెగలపరంగా తమ ప్రబల శత్రువులైన తాలిబన్లతో పుతిన్ సాన్నిహిత్యం రష్యాపై విద్వేషాన్ని మరింత ఎగదోసింది. దీనికి తోడు రష్యాలో ముస్లింలపై అణచివేత పెరుగుతోందని ఆమ్నెస్టీతో పాటు పలు హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. రష్యాలో ముస్లింలు 2 కోట్ల దాకా ఉంటారని అంచనా. మతపరమైన ప్రార్థనలు కూడా చేసుకోలేనంతగా వారిపై తీవ్ర అణచివేత చర్యలు కొనసాగుతున్నాయని, విద్య, ఉపాధి తదితరాల్లో నూ వివక్ష కొనసాగుతోందని వార్తలొస్తున్నాయి. ఉక్రెయిన్ నుంచి ఆక్రమించుకున్న క్రిమియాలో కూడా ముస్లింలపై రష్యా తీవ్ర ఆంక్షలు అమలు చేస్తోందని చెబుతున్నారు. ఇవన్నీ ఐసిస్–కెకు మరింత కంటగింపుగా మారాయి. హిజాబ్ ముస్లిం సంప్రదాయం కాదంటూ పుతిన్ చేసిన వ్యాఖ్యలు రష్యాపై దాని ద్వేషాన్ని మరింతగా పెంచాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత్లోకి మయన్మార్ సైనికులు.. కేంద్రానికి మిజోరం అభ్యర్థన
గౌహతి: మయన్మార్లో కొన్ని రోజులుగా దేశ సైనిక ప్రభుత్వం, అక్కడి ప్రజాస్వామ్య సాయుధ దళాలకు మధ్య ఉద్రిత్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మయన్మార్ ఆర్మీ(జుంటా) సైనికులు భారత సరిహద్దులు దాటి భారత్లోని మీజోరంకి వరుసకడుతున్నారు. దీంతో మిజోరం ప్రభుత్వం అప్రమత్తమైంది. మీజోరం భూభాగంలోకి చొచ్చుకువస్తున్న జుంటా సైనికులను వెంటనే మయన్మార్కు తిరిగి పంపిచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. సుమారు 600 మంది మయన్మార్ ఆర్మీ సైనికులు సరిహద్దు దాటి మిజోరం రాష్ట్రంలోకి వచ్చారు. జుంటా ఆర్మీ స్థావరాలను ఆ దేశ అంతర్గత ఘర్షణలో భాగంగా ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు సంస్థ అరకన్ ఆర్మీ (AA) స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఆర్మీ సైనికులు మిజోరంలోని సరిహద్దు లాంగ్ట్లై జిల్లాలోకి వచ్చారు. ప్రస్తుతం మయన్మార్ ఆర్మీ సైనికులు అస్సాం రైఫిల్స్ సైనిక క్యాంప్లో ఆశ్రయం పొందుతున్నారు. పెద్ద ఎత్తున సరిహద్దు దాటుకొని మిజోరం వైపు వస్తున్న మయన్మార్ సైనికులను వెనక్కి పంపిచాలని మిజోరం సీఎం లాల్దుహోమ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరినట్లు మిజోరం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సరిహద్దులో పెరుగుతున్న ఉద్రిత్త పరిస్థితుల నేపథ్యంలో తిరిగి స్థిరత్వం నెలకొల్పడానికి మయన్మార్ సైనికులు వెనక్కి పంపించాలని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. ఇక.. ఇటీవల తరచూ మయన్మార్ సైనికలు భారత సరిహద్దులు దాటుకొని మిజోరం రాష్ట్రంలోకి వస్తున్నారని మిజోరం సీఎం లాల్దుహోమ తెలిపారు. మనవతా సాయం కింద మయన్మార్ సైనికులకు తాము సైనిక క్యాంప్లో సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇలా 450 మంది జుంటా సైనికులను వెనక్కి పంపించినట్లు తెలిపారు. 2021 నుంచి మయన్మార్లో సైనిక ప్రభుత్వం.. ఇక్కడి ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు సంస్థల నుంచి తీవ్రమైన తిరుగుబాటును ఎదుర్కొంటోంది. ఇప్పటికే పలు నగరాల్లోని సైనిక స్థావరాలను తిరుగుబాటు సంస్థలు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చదవండి: గాంధీలను మించిన అవినీతి పరులు ఎవరైనా ఉంటారా? -
కేరళ వైద్యురాలిపై దాడి: కేంద్ర ఆరోగ్యమంత్రికి వైద్యుల సంఘం లేఖ
కేరళలో ఓ యవ వైద్యురాలు చికిత్స చేస్తుండగా.. పేషెంట్ దాడిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా కేరళ రాష్ట్రంలోని వ్యైద్యులు, ఆరోగ్యకార్యకర్తల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి కూడా. ఈ నేపథ్యంలోనే వైద్యుల సంఘం ఫెడరేషన్ ఆప్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఎఫ్ఓఆర్డీఏ) ఈ ఘటనపై సత్వరమే చర్యలు తీసుకోవడమే గాక ఆరోగ్య సంరక్షణాధికారుల భద్రతను కూడా పర్యవేక్షించాల్సిందిగా పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ విషయమై గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాకు లేఖ రాసింది. లేఖలో ఆ సంఘటనను డ్యూటీలో ఉండగా జరిగిన క్రూరమైన హింసాత్మక చర్యగా పేర్కొనడమే గాక తక్షణమే చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం చేయాల్సిందిగా అభ్యర్థించింది. అలాగే బాధితురాలిని పోగొట్టుకున్న కుటుంబానికి తగిన మొత్తంలో నష్ట పరిహారాన్ని, ఆమె కుటుంబానికి ఉచిత ఆరోగ్య సదుపాయం అందించాలని లేఖలో పేర్కొంది వైద్యుల సంఘం. ఈ క్రమంలో సదరు వైద్యుల సంఘం ఎఫ్ఓఆర్డీఏతో సంబంధం ఉన్న అన్ని రెసిడెంట్ డాక్టర్స్ అసోసీయేషన్(ఆర్డీఏ)లను సదరు వైద్యురాలి మృతికి సంతాపాన్ని పాటించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే బాధితురాలి మృతికి సంతాపంగా నల్ల రిబ్బన్లు, క్యాండిలైట్స్తో మార్చ్ నిర్వహించి..ఆమె కోసం కొద్దిసేపు మౌనం పాటించాలని కోరింది. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించడమే గాక సదరు వైద్యురాలి మృతికి సంతాపం తెలిపారు కూడా. పైగా సత్వరమే ఈ ఘటనపై దర్యాప్తు జరిపిస్తామని హామీ కూడా ఇచ్చారు. కాగా, కేరళలోని కొల్లాం జిల్లా కొట్టారక్క ప్రాంతలో పోలీసులు బుధవారం ఆస్పత్రికి తీసుకువచ్చిన సందీప్ అనే సస్పెన్షన్కు గురయ్యిన ఉపాధ్యాయుడి దాడిలోనే సదరు వైద్యురాలి మృతి చెందింది. కుటుంబ సభ్యులతో గొడవపడి గాయడిన అతడిని పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకురావడంతోనే ఈ దారుణం చోటు చేసుకుంది. (చదవండి: కేరళలో వైద్యురాలి మృతి కలకలం..చికిత్స చేస్తుండగా పేషెంట్..) -
లింగ, మతప్రమేయం లేని... ఉమ్మడి చట్టాలు చేయొచ్చా?
న్యూఢిల్లీ: శాసన వ్యవస్థ పరిధిలోని అంశాలపై న్యాయ వ్యవస్థ జోక్యంపై సుప్రీంకోర్టు సోమవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. పెళ్లిళ్లు, విడాకులు, మనోవర్తి, వారసత్వం వంటి అంశాల్లో లింగ, మతప్రమేయం లేకుండా పౌరులందరికీ సమానంగా వర్తించేలా ఉమ్మడి చట్టాలు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పి.ఎస్.నరసింహ, జె.బి.పార్డీవాలా ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘వీటిపై శాసన వ్యవస్థకు కోర్టులు సలహాలు, సూచనలు ఇవ్వొచ్చా? ఈ మేరకు కేంద్రానికి నిర్దేశాలు జారీ చేయొచ్చా?’’ అంటూ సందేహాలు లేవనెత్తింది. శాసన వ్యవస్థ పరిధిలోని ఈ అంశాలపై న్యాయ జోక్యం ఏ మేరకు ఉండొచ్చన్నదే ఇక్కడ కీలక ప్రశ్న అని అభిప్రాయపడింది. ఇలాంటి అంశాల్లో ఉమ్మడి చట్టాలకు అభ్యంతరం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. విచారణను ధర్మాసనం నాలు గు వారాల పాటు వాయిదా వేసింది. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించాలో, వద్దో అప్పుడు తేలుస్తామని పేర్కొంది. ‘అందరికీ ఒకే వివాహ వయసు’ పిటిషన్ కొట్టివేత స్త్రీ, పురుషులందరికీ చట్టబద్ధంగా ఒకే కనీస వివాహ వయసుండేలా చట్టం తేవాలంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ను సీజేఐ ధర్మాసనం కొట్టేసింది. ‘ఇది పార్లమెంటు పరిధిలోని అంశం. దానిపై మేం చట్టం చేయలేం. రాజ్యాంగానికి మేం మాత్రమే ఏకైక పరిరక్షకులం కాదు. పార్లమెంటు కూడా ఆ భారం వహిస్తోంది’ అని అభిప్రాయపడింది. కనీస వివాహ వయసు పురుషులకు 21 ఏళ్లు, మహిళలకు 18 ఏళ్లు. -
బతుకులు మార్చే పథకాలు పప్పుబెల్లాలా?
సాక్షి, అమరావతి: అందరికీ వైద్యం... విద్య విషయంలో అసమానతలను రూపుమాపడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంచేసింది. గ్రామీణ – పట్టణాల మధ్య అంతరాలు లేకుండా చూడటం కూడా ప్రాథమిక బాధ్యతల్లో ఒకటని... ఈ లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వాలు తప్పనిసరిగా తగినన్ని నిధుల్ని ఖర్చు చేసి తీరాల్సిందేనని పార్టీ స్పష్టంచేసింది. ఈ దిశగా ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల అసలు ఉద్దేశాలను తెలుసుకోకుండా... వీటన్నిటినీ ఉచితాలంటూ విమర్శించటం తగదని స్పష్టంచేసింది. ఉచితాలను... సామాజిక–ఆర్థిక ప్రయోజనాలతో అమలు చేసే పథకాలను ఒకేగాటన కట్టి మాట్లాడటమంటే అది రాజ్యాంగ స్ఫూర్తిని అవమానించటమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో పార్టీ బుధవారంనాడు ఇంటర్వెన్షన్ పిటిషన్ దాఖలు చేసింది. ఉచిత పథకాల అమలుపై అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ వేసిన పిటిషన్లో జోక్యం చేసుకుంటూ... తన వాదనలు కూడా వినాలంటూ వైఎస్సార్ సీపీ తరఫున పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ఈ పిటిషన్ దాఖలు వేశారు. పథకాల ఉద్దేశాలు తెలుసుకోకుండానే వాటిని ఉచితాలనటాన్ని తప్పుబడుతూ... ‘మనదేశం సంక్షేమ రాజ్యం కూడా. రాజ్యాంగ నిర్మాతలు నిర్ధేశించిన సమానత్వ లక్ష్యాలను సాధించే దిశగా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రరాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై ఉంది’’ అని పేర్కొన్నారు. పిటిషన్లోని ముఖ్యాంశాలివీ... అలాంటి పార్టీలపై కఠిన చర్యలు తీసుకోవాలి... ‘నిష్ప్రయోజనమైన, నిరర్థకమైన, ఓటర్లను మభ్యపెట్టేందుకు ఉద్దేశించిన పథకాలను ఉచితాలుగా అభివర్ణించడంలో ఎలాంటి తప్పూలేదు. కానీ విస్తృత సామాజిక–ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన, సమాజంలో నిస్పృహలను తొలగించేందుకు అమలు చేస్తున్న పథకాలకు ఉచితాలనే రంగు పులమడం రాజ్యాంగాన్ని అవమానించడమే. కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ లబ్దిని పొందేందుకు పథకాలను అమలు చేస్తున్న మాట వాస్తవం. అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల్లో ఓటర్లు తమకు అనుకూలంగా ఓట్లు వేసేందుకు వీలుగా ఎన్నికల ముందు హడావుడిగా ఆయా పథకాలను అమలు చేసిన ఘటనలు గతంలో చాలానే ఉన్నాయి. ఓటర్లను ఏమార్చడమే ఆ రాజకీయ పార్టీల ప్రధాన ఉద్దేశం. తద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. అలాంటి రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చేస్తే పార్టీలు బాధ్యతారహితంగా వ్యవహరించకుండా అడ్డుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి వాటిని కూడా ఉచితాలంటారా? ‘మరోవైపు అందరితోనూ చర్చించి, చాలా స్పష్టతతో, పథకాల లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని, ఎన్నికలకు ముందే తమ చిత్తశుద్ధిని ఓటర్లకు తెలియచేసి మరీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న పార్టీలు కూడా ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పథకాలను పలు అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ అంతే చిత్తశుద్ధితో వాటిని ఆ పార్టీలు అమలు చేస్తున్నాయి. ఇలాంటి సంక్షేమ పథకాలను ఉచితాలుగా అభివర్ణించడం ఎంత మాత్రం సహేతుకం కాదు.’ ఆదాయాన్ని సమకూర్చని ఆస్తి కూడా ఆస్తేనా? ‘మూలధన వ్యయం కోసం అప్పు చేయడం సమర్థనీయమని, రెవిన్యూ వ్యయం కోసం అప్పు చేయడం వినాశనకరమనే విస్తృతమైన అభిప్రాయం ఒకటి అందరిలోనూ బలంగా ఉంది. ఇది అన్ని సందర్భాల్లోనూ కరెక్టేనా అనేది లోతుగా తరచి చూడాలి. నగదు ఆధారిత ప్రభుత్వ గణాంక వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన కంటికి కనిపించే ఆస్తిని కూడబెట్టడాన్ని మూలధన వ్యయం అంటున్నాం. ప్రస్తుతం ఉన్న ఆస్తుల వినియోగం పెంచడాన్ని కూడా దీనికిందికే తీసుకొస్తున్నాం. ఈ మూలధన వ్యయం కోసం కంటికి కనిపించే ఆస్తులను సృష్టించడం తప్పనిసరి. అయితే విశ్వవ్యాప్త గణాంక సూత్రాల ప్రకారం, ఓ సంస్థకు ఆదాయాన్ని సమకూర్చని ఆస్తిని ఆ సంస్థ ఆస్తిగా ఎంత మాత్రం గుర్తించడానికి వీల్లేదు. భవిష్యత్తు ఆర్థిక ప్రయోజనాల నిమిత్తం ఖర్చుచేసే సామర్థ్యాన్ని కలిగి ఉండటమే ఇక్కడ ప్రధానం.’ విభజన వల్ల రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయింది... ‘ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయానికొస్తే, 2014లో రాష్ట్ర విభజన జరిగింది. దీని వల్ల రాష్ట్రం ఆర్థికంగా ఎంతో నష్టపోయింది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ జనాభా 58 శాతం ఉన్నప్పటికీ, 45 శాతం రెవిన్యూ మాత్రమే కలిగి ఉంది. అంతే కాక 2014–19 కాలంలో అప్పటి ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో పురోగతి కుంటుపడింది. నాబార్డ్ ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజివ్ సర్వే 2016–17 ప్రకారం రాష్ట్రంలో వ్యవసాయ కుటుంబాల రుణభారం అత్యధికంగా ఉంది. ఈ రుణభారం రాష్ట్రంలో 76 శాతం. అదే జాతీయ సగటు చూసుకుంటే కేవలం 47 శాతం. ఇక విద్య విషయానికొస్తే, రాష్ట్రంలో ప్రాథమిక విద్య గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) అతి తక్కువగా 84.48 శాతం ఉంది. జాతీయ సగటు 99 శాతం. స్మాల్ హెల్ప్ గ్రూప్ (ఎస్హెచ్జీ) అప్పుల విషయానికొస్తే, 1,85,925 ఖాతాలు (23 శాతం ఎస్హెచ్జీ ఖాతాలు) గడువు దాటినవిగా మారితే, 84,056 ఖాతాలు (11శాతం ఎస్హెచ్జీ ఖాతాలు) నిరర్థకంగా మారాయి.’ ఆ బాధ్యత మా ప్రభుత్వంపై ఉంది... ‘వీటన్నింటినీ ఎదుర్కోవడానికి ప్రభావవంతమైన పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత మా కొత్త ప్రభుత్వంపై పడింది. గత ప్రభుత్వ పనితీరు వల్ల నిస్పృహలో కూరుకుపోయిన ప్రజలు మాపై ఎంతో నమ్మకాన్ని, విశ్వాసాన్ని చూపించి గెలిపించారు. ఉదాహరణకు, విద్యా రంగంలో సరఫరా వైపు, డిమాండ్ వైపు ఉన్న అడ్డంకులను, సమస్యలను తొలగించేందుకు సమగ్ర పరిష్కారం చూపాలన్న నిశ్చితాభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం అన్నది ఇప్పుడు సరఫరా వైపు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు అత్యవసరం.’ నాడు–నేడుతో సమూల మార్పులు... ‘దీన్ని ఇప్పుడు మనబడి–నాడు నేడు పథకం కింద అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో 56,555 పాఠశాలలను రూపాంతరీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మంచి మరుగుదొడ్లు, అందుబాటులో నీరు, నాణ్యమైన మంచి నీటి సదుపాయం, రంగులతో సహా పెద్ద, చిన్న రిపేర్లు చేయడం, ఫ్యాన్లు, లైట్లు, విద్యార్థులకు అవసరమైన ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్, ప్రహరీగోడ, వంటగది, అదనపు తరగతి వంటి 11 రకాల సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించాం. అవసరమైన చోట డిజిటల్ క్లాసు రూములు కూడా ఏర్పాటు చేశాం. ఈ పథకాన్ని ప్రస్తుతం మూడు దశల్లో అమలు చేస్తున్నాం. గోరుముద్ద పథకం కింద పిల్లల పౌష్టికాహారాన్ని దృష్టిలో పెట్టుకుని అత్యంత నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నాం. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు బైజూస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ విద్యా సంవత్సరంలో 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లను సైతం పంపిణీ చేయనున్నాం. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు సీబీఎస్ఈతో కలిసి పనిచేస్తున్నాం. అంతర్జాతీయ పోటీని తట్టుకునే దిశగా ప్రాథమిక దశలోనే గట్టి పట్టు సాధించేందుకు ఆంగ్ల మాధ్యమం ఆవశ్యకతను గుర్తించాం. భవిష్యత్తు సవాళ్లకు పిల్లలను సిద్ధం చేసేందుకు అందరికీ ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నాం. ఇదే సమయంలో విద్యార్థుల ఎన్రోల్మెంట్ను పెంచడాన్ని ఎంత మాత్రం విస్మరించడం లేదు.’ పేదరికం అడ్డుపడకూడదన్న ఉద్దేశంతో అమ్మ ఒడి... ‘అలాగే విద్యార్థుల చదువులకు తల్లిదండ్రుల పేదరికం అడ్డుకాకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అమ్మ ఒడి పేరుతో పేరుతో ఓ వినూత్న పథకాన్ని తీసుకొచ్చింది. తమ పిల్లలను పాఠశాలకు పంపే ప్రతి తల్లి ఖాతాలో ఏడాదికి రూ.15వేలను జమ చేస్తున్నాం. ఇందుకు విద్యార్థుల కనీస హాజరు 75 శాతంగా నిర్ణయించాం. ఈ అమ్మ ఒడి పథకం విజయవంతం కావడమన్నది బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఎంతో దోహదపడుతుంది. పైన చెప్పిన రాష్ట్ర ప్రభుత్వ చర్యలన్నింటి వల్ల విద్యా రంగంలో గణనీయమైన పురోగతి సాధించాం. ప్రభుత్వ పాఠశాలల్లో 1–9 తరగతుల్లో చేరే విద్యార్థుల సంఖ్య 37.20 లక్షల నుంచి 44.30 లక్షలకు పెరిగింది. పాఠశాల విద్య మాత్రమే కాక, ఉన్నత విద్యలో ప్రమాణాలు, ఉపాధి అవకాశాలు పెంచేందుకు విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలను అమలు చేస్తున్నాం. వీటన్నింటి అమలు వల్ల మొత్తం విద్యా రంగంలో గణనీయమైన మార్పు సాధించాం.’ రైతుల కోసం రైతు భరోసా... ‘వ్యవసాయ రంగం విషయానికొస్తే, రాష్ట్రంలో 60 శాతం మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. నాబార్డ్ నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో దుర్భర పేదరికం, రుణభారంతో రైతులు అల్లాడుతున్నారు. రైతుల బాధ తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది. వ్యవసాయ పెట్టుబడి సాయం అందిస్తోంది. ఇందుకోసం వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సాయం ఇది. వ్యవసాయ పంట రుణాలపై వడ్డీని మాఫీ చేసేందుకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు పథకాన్ని తీసుకొచ్చాం. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ను అందిస్తున్నాం.’ స్వయం సహాయ బృందాల బలోపేతానికి చర్యలు... ‘స్వయం సహాయ బృందాలను బలోపేతం చేశాం. వీటిలో నెలకొని ఉన్న నిరాశా, నిస్పృహలను తొలగించేందుకు చర్యలు చేపట్టాం. ఇచ్చిన హామీని గత ప్రభుత్వం నిలబెట్టుకోకపోవడం వల్ల ఈ స్వయం సహాయ బృందాల రుణ క్రమశిక్షణ దారుణంగా దెబ్బతింది. ఈ పరిస్థితిని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నాలుగు వాయిదాల్లో నిధులను ఈ బృందాలకు అందిస్తున్నాం. ఆదాయ మార్గాలను పెంచేందుకు ఈ బృందాలకు పలు పెట్టుబడి అవకాశాలను చూపుతున్నాం. ఈ చర్యల వల్ల కరోనా వంటి విపత్కర పరిస్థితులను ఈ స్వయం సహాయ బృందాలు తట్టుకుని సమర్థవంతంగా నిలబడ్డాయి. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి, రైతు భరోసా తదితర పథకాలను ఉచితాలుగా అభివర్ణిస్తున్నారు. ఈ పథకాల అవసరం, వాటి ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే వాటిని ఉచితాలుగా పేర్కొంటుండటం తీవ్ర అభ్యంతరకరం.’ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు భారీ ఖర్చు చేయాల్సి వచ్చింది... ‘పొరుగుదేశమైన శ్రీలంక, ఇతర దేశాలు ఆర్థికంగా కుప్పకూలిన పరిస్థితుల్లో, ఇప్పుడు ఆర్థిక స్థిరత్వానికి చైతన్యం పెరిగింది. రుణభార ఒత్తిడిని తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. గత రెండు సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా అప్పు అన్నది పెద్ద భారంగా మారింది. కోవిడ్ వల్ల ఎన్నడూ ఎదురుకాని భయానక పరిస్థితులల వల్ల అన్నీ రంగాలు మూతపడటంతో తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఆదాయాలు గణనీయంగా తగ్గినప్పటికీ, ప్రజల కోసం ఖర్చు పెంచాల్సిన అవసరం వచ్చింది. ఈ ఖర్చు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అత్యావశ్యకం. 2020–21లో కేంద్ర ప్రభుత్వ అప్పు ఆందోళనకర స్థాయిలో పెరిగింది. అయితే ఇందుకు సంబంధించిన ఖర్చు ప్రజల జీవితాలను, ఆర్థిక వ్యవస్థను కాపాడింది. ఆర్థికపరమైన క్రమశిక్షణ వల్ల స్థూల దేశీయోత్పత్తి (జీడిపీ)తో పోలిస్తే ఆ తదుపరి సంవత్సరం కేంద్ర ప్రభుత్వ అప్పు గణనీయంగా తగ్గింది.’ కేంద్రం తీరు వల్ల రాష్ట్రాల పరిస్థితి అలా మారింది... ‘ఇక రాష్ట్ర ప్రభుత్వాల విషయానికొస్తే వాటి ఆర్థిక పరిస్థితి కూడా ఒత్తిడిలోనే ఉంది. ఆర్థికపరమైన అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద మొత్తంలో ప్రజల కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. అంతేకాక సెస్సుల్లో, స్థూల పన్ను ఆదాయాల్లో వాటాలు పెంచడటం, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాలు తగ్గించేయడం వంటి కేంద్ర ప్రభుత్వ చర్యలు కూడా రాష్ట్రాల పరిస్థితిని అధ్వాన్నంగా మార్చాయి.’ ఆర్థిక లోటు తక్కువగానే ఉంది... ‘పై టేబుల్ను పరిశీలిస్తే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా ఎంత ఉందో అర్థమవుతోంది. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాల వాటాను 41 శాతం సిఫారసు చేస్తే కేంద్రం కేవలం 29.35 శాతంగా నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికొస్తే, రాష్ట్రంపై రుణభారాన్ని తగ్గించాలన్న స్పృహతోనే ఉన్నాం. 2022 ఆర్థిక సంవత్సరంలో రుణ పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. 2021–22 కాగ్ లెక్కల ప్రకారం రాష్ట్ర ఆదాయ లోటు రూ.8370.51 కోట్లు ఉండగా, ఆర్థిక లోటు రూ.25,194 కోట్లుగా ఉంది. దీన్ని జీఎస్డీపీ నిష్పత్తిలో పోలిస్తే ఆర్థిక లోటు 2.10 శాతం కన్నా తక్కువగా ఉంది. వాస్తవానికి 2021–22 సంవత్సరానికి 15 వ ఆర్థిక సంఘం ఆర్థిక లోటును 4.5 శాతం గా సిఫారసు చేసింది. ’ ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంక్షేమ పథకాలను అమలు చేయాలి... ‘సామాజిక–ఆర్థిక ప్రగతిలో ప్రభుత్వాలు, అవి అమలు చేసే పథకాలన్నవి కీలక పాత్ర పోషిస్తాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా ప్రజల పట్ల ఎన్నికైన ప్రభుత్వాలు తమ బాధ్యతను నెరవేర్చాల్సి ఉంటుంది. ప్రజల అంచెంచల విశ్వాసంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు వారికే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే వారి అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలను తీసుకొచ్చి, వాటిని సమర్థవంతంగా అమలు చేయాల్సి ఉంటుంది.’ అని సాయిరెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. చదవండి: వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు -
తైవాన్పై జోక్యం చేసుకోవద్దు
బీజింగ్: తైవాన్తో తమ సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను చైనా అధినేత జిన్పింగ్ గట్టిగా హెచ్చరించారు. వ్యూహాత్మక కారణాలతో ప్రపంచంలోని రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య విభేదాలు మంచిది కాదని కూడా జిన్ పింగ్ పేర్కొన్నట్లు చైనా వెల్లడించింది. ఇలాంటి వైఖరి ప్రపంచ ఆర్థిక పురోగతిపై పెను ప్రభావం చూపుతుందన్నారు. ‘చైనా ప్రధాన భూభాగం నుంచి వేరుపడేలా తైవాన్ను ప్రేరేపించే వెలుపలి శక్తులను ఎదుర్కొంటాం. 140 కోట్ల చైనా ప్రజల అభీష్టమైన సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకుంటాం. నిప్పుతో ఆడాలనుకుంటే భస్మం అవుతారు’అంటూ గట్టి హెచ్చరికలు పంపింది. ఒకే చైనా విధానాన్ని అమెరికా గౌరవించాలని పేర్కొంది. ఆర్థిక మాంద్యం ప్రమాదాన్ని తగ్గించడం, స్థూల ఆర్థిక విధానాలను సమన్వయం చేయడం, కోవిడ్తో పోరాటం, ప్రాంతీయ ఉద్రిక్తలను తగ్గించుకోవడం వంటి వాటిపై సహకరించాలని అమెరికాను జిన్పింగ్ కోరారని చైనా ఒక ప్రకటనలో వివరించింది. గురువారం ఈ ఇద్దరు నేతలు దాదాపు మూడు గంటలపాటు సుదీర్ఘంగా ఫోన్ సంభాషణ జరిపిన విషయం తెలిసిందే. మరోవైపు అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ స్పీకర్ నాన్సీ పెలోసీ త్వరలో తైవాన్ సందర్శిస్తారంటూ వస్తున్న వార్తలపై చైనాలింకా స్పందించలేదు. అయితే, బైడెన్, జిన్పింగ్ నవంబర్లో ఇండొనేసియాలో జరిగే జి–20 భేటీలో ముఖాముఖి సమావేశమయ్యే అవకాశాలున్నాయని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. -
అమెరికా ఎన్నికల్లో కుట్ర లేదు
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణల వ్యవహారంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గొప్ప ఊరట లభించింది. 2016లో ప్రచార సమయంలో ట్రంప్ ప్రచార బృందం రష్యాతో కలసి కుట్రకు పాల్పడిందనడానికి ఆధారాలు లేవని విచారణ కమిటీ తేల్చింది. సుమారు రెండేళ్లుగా ట్రంప్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమించిన ఈ వ్యవహారంపై ప్రత్యేక న్యాయవాది రాబర్ట్ ముల్లర్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ముల్లర్ సమర్పించిన నివేదికను సమీక్షించిన అటార్నీ జనరల్ విలియం బార్ అందులోని సారాంశంతో నాలుగు పేజీల లేఖను ఆదివారం అమెరికా కాంగ్రెస్ ముందుకు తెచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు రష్యా ప్రయత్నాలు, విచారణకు ట్రంప్ అడ్డుపడ్డారా? లాంటి విషయాలను బార్ ప్రముఖంగా ప్రస్తావించారు. ట్రంప్ ప్రచారానికి సాయం చేస్తామని రష్యా నుంచి పలు వ్యక్తిగత ప్రతిపాదనలు వచ్చినా, ఎన్నికల్లో ఎలాంటి కుట్ర జరగలేదని ముల్లర్ విచారణలో తేలిందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడిపై ఇలాంటి విచారణ జరగడం సిగ్గుచేటని ట్రంప్ పేర్కొన్నారు. ముల్లర్ నివేదికను సంపూర్ణంగా బహిర్గతం చేయాలని విపక్ష డెమొక్రాట్లు డిమాండ్ చేశారు. ఇన్నాళ్లుగా ట్రంప్ చెబుతున్నదే నిజమని రుజువైందని శ్వేతసౌధం వ్యాఖ్యానించింది. ముల్లర్ నివేదికను బహిర్గతం చేసినా ట్రంప్కు ఎలాంటి సమస్య ఉండదని తెలిపింది. ముల్లర్ విచారణ ముగిసిన నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాము జోక్యం చేసుకున్నామన్న ఆరోపణల్ని రష్యా మరోసారి తోసిపుచ్చింది. ఆ నిర్ణయాలు ‘అడ్డగింత’తో సమానమా? ట్రంప్ ప్రచార బృందం లేదా సంబంధిత వ్యక్తులు 2016 ఎన్నికల సమయంలో రష్యాతో కలసి పనిచేశారనడానికి, కుట్రకు పాల్పడ్డారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ముల్లర్ నివేదిక పేర్కొన్నట్లు బార్ తన లేఖలో కాంగ్రెస్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే ట్రంప్ చట్టవిరుద్ధంగా విచారణ ప్రక్రియకు అడ్డుతగిలారా? లేదా? అన్న విషయంలో ముల్లర్ ఓ నిర్ధారణకు రాలేకపోయారని తెలిపారు. ట్రంప్ న్యాయ ప్రక్రియకు విఘాతం కలిగించారని నివేదిక తేల్చకపోయినా, ఈ వ్యవహారంలో ఆయన్ని నిర్దోషిగా ప్రకటించలేదని వెల్లడించారు. విచారణ సమయంలో అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాలు న్యాయ ప్రక్రియను అడ్డుకోవడంతో సమానమా? లాంటివి చాలా క్లిష్టమైన అంశాలని, కాబట్టి వాటి జోలికి పోకూడదని ముల్లర్ నిర్ణయించినట్లు తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే ఎఫ్బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమీని తొలగించడంతో పాటు ట్రంప్ తీసుకున్న ఇతర నిర్ణయాలు విచారణపై పలు సందేహాలకు తావిచ్చాయి. ముల్లర్ విచారణ ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో ట్రంప్ను ఓడించాలని డెమొక్రాట్లు యోచిస్తున్నారు. రష్యాతో ట్రంప్ కుమ్మక్కయినట్లు తేలితే, ఆయనను అభిశంసించాలని కూడా ఆలోచిస్తున్నారు. ఎన్నికల్లో రష్యా జోక్యం ఆరోపణల నుంచి తనకు సంపూర్ణ విముక్తి లభించిందని ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. బార్ లేఖతో ఎన్ని సమాధానాలు లభించాయో అంతే సంఖ్యలో కొత్త ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయని డెమొక్రాట్లు ఆరోపించారు. తాను నిర్దోషినని ప్రకటించుకున్న ట్రంప్ వ్యాఖ్యలు ముల్లర్ నివేదికకు విరుద్ధంగా ఉన్నాయని, కాబట్టి ఆయన మాటల్ని విశ్వసించరాదని పేర్కొన్నారు. ముల్లర్ పూర్తి నివేదికను పరిశీలించాలని బార్కు సూచించారు. -
నెహ్రూ మ్యూజియంలో జోక్యం వద్దు
న్యూఢిల్లీ: దేశరాజధానిలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ(ఎన్ఎంఎంఎల్)లో భారత మాజీ ప్రధానులందరికీ కేంద్రం చోటు కల్పించాలని అనుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదనీ, మొత్తం దేశానికి సంబంధించిన వారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎన్ఎంఎంఎల్ ఉన్న తీన్మూర్తి కాంప్లెక్స్లో జోక్యం చేసుకోవద్దని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి మన్మోహన్ లేఖ రాశారు. ‘ప్రజల మనోభావాలను గౌరవించి తీన్మూర్తి కాంప్లెక్స్లో ఉన్న నెహ్రూ స్మారక మ్యూజియంను అలాగే ఉంచండి. దీనివల్ల దేశ చరిత్రను, వారసత్వాన్ని గౌరవించినవారు అవుతారు. నెహ్రూ కేవలం కాంగ్రెస్ పార్టీకే కాదు మొత్తం దేశానికి సంబంధించినవారు. నెహ్రూ ఔన్నత్యం, గొప్పతనాన్ని ఆయన రాజకీయ ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తారు. బీజేపీ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని వాజ్పేయి కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేదు. కానీ ప్రస్తుతం భారత ప్రభుత్వం దీన్ని మార్చాలనుకుంటోంది’ అని మన్మోహన్ లేఖలో తెలిపారు. భారత తొలి ప్రధానిగా నెహ్రూ దేశం, ప్రపంచంపై గొప్ప ప్రభావం చూపారని మన్మోహన్ వెల్లడించారు. -
బీసీసీఐ జోక్యం చేసుకోదు
ముంబై: క్రికెటర్ల వ్యక్తిగత, వైవాహిక విషయాల్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జోక్యం చేసుకోదని తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా స్పష్టం చేశారు. తనను కలిసిన పేసర్ మొహమ్మద్ షమీ భార్య హసీన్ జహాన్కు ఇదే విషయాన్ని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. షమీ తనను శారీరకంగా, మానసికంగా హింసించాడని ఇటీవల హసీన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు పలు కేసులు మోపిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో బోర్డు నుంచి కూడా ఒత్తిడి తేవాలని భావించిన ఆమె ఖన్నాను వ్యక్తిగతంగా కలిసింది. కానీ ఆయన మాత్రం వ్యక్తిగత వ్యవహారాల్లో బోర్డు ఎంతమాత్రం కలుగజేసుకోదని, కుటుంబ పరిధిలోనే సమస్యను పరిష్కరించుకోవాలని ఆమెకు సూచించినట్లు తెలిపారు. త్వరలో జరిగే ఐపీఎల్, అనంతరం జరిగే ఇంగ్లండ్ సిరీస్లో షమీ రాణించాలని ఆశిస్తున్నట్లు ఖన్నా తెలిపారు. -
డొనాల్డ్ ట్రంప్కు షాక్
సాక్షి నాలెడ్జ్ సెంటర్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై విచారణలో కొత్త మలుపు. దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచార కమిటీ మాజీ మేనేజర్ పాల్ మనఫోర్ట్, అతని వ్యాపార సహాయకుడు రిక్ గేట్స్ దేశానికి వ్యతిరేకంగా కుట్ర, మనీ లాండరింగ్, ఇతర ఆరోపణలపై సోమవారం లొంగిపోవడం సంచలనం సృష్టించింది. రష్యా జోక్యంపై ఎఫ్బీఐ మాజీ చీఫ్ రాబర్ట్ ముల్లర్ ఆధ్వర్యంలో సాగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ అరెస్టు జరగడంతో మున్ముందు ఎలాంటి సంచలనాలు వెలుగులోకి వస్తాయోనన్న ఆసక్తి నెలకొంది. విదేశీ కంపెనీలు, బ్యాంకు ఖాతాల ద్వారా మనఫోర్ట్, రిక్ గేట్స్లు వందల కోట్లు తరలించారని ఫెడరల్ అధికారులు వాషింగ్టన్ ఫెడరల్ కోర్టుకు తెలిపారు. ఈ పరిణామం అమెరికాను, ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ను కొత్త రాజకీయ సంక్షోభంలోకి నెడుతుందా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామాలపై వైట్హౌస్లో న్యాయవాదులతో ట్రంప్ సమీక్షించినట్లు సమాచారం. ఆదివారం ట్విటర్లో ఆయన ప్రతిపక్ష డెమోక్రాట్లను తిట్టిపోశారు. రిపబ్లికన్లు నిలిచి సంస్కరణలు అమలు చేస్తుంటే.. అభివృద్ధిని అడ్డుకునేం దుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం, ట్రంప్ బృందం, రష్యా అధికారుల మధ్య సహకారంపై అనేక ఆరోపణలు వచ్చాయి. వీటిపై దర్యాప్తునకు రాబర్ట్ ముల్లర్ను మేలో న్యాయశాఖ స్పెషల్ కౌన్సెల్గా నియమించింది. రష్యా పాత్రపైనే కాకుండా ఇతర అంశాలపైనా పరిశీలన చేసే అధికారాన్ని ముల్లర్కు కల్పించారు. ట్రంప్పై ఆరోపణలేంటీ?: గతేడాది జూన్ 20– డిసెంబర్ 13 మధ్య ట్రంప్, రష్యాల మధ్య సంబంధాలపై బ్రిటీష్ నిఘా మాజీ అధికారి క్రిస్టోఫర్ స్టీల్ సమాచారాన్ని సేకరించాడు. రష్యాకు చెందిన అనేకమందిని ఇంటర్వ్యూ చేసి రహస్య సమాచారాన్ని సిద్ధం చేశాడు. పాశ్చాత్య దేశాల కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు ట్రంప్కు రష్యా మద్దతు తెలిపిందని క్రిస్టోఫర్ అరోపించారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కు మేలు జరిగేలా రష్యా సహకరించిందని అమెరికా నిఘాసంస్థలు కూడా నిర్ధారణకు వచ్చాయి. రష్యా పాత్రపై అనేక ఆధారాలు వెలుగుచూడడంతో ముల్లర్ నేతృత్వంలో దర్యాప్తు మొదలైంది. -
బ్యాంకు ఉద్యోగుల ఫెడరేషన్ సంచలన వ్యాఖ్యలు
ముంబై: ఏటీఎంలలో నగదు కొరతతో ప్రజల ఇబ్బందుల నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగుల ఫెడరేషన్ మండిపడుతోంది. నూతనంగా ప్రవేశపెట్టిన నోట్లను తగినంతగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఎఫ్ఐ) కోరింది. బీఎఫ్ఎఫ్ఐ 12 వ రాష్ట్ర సదస్సు సందర్భంగా కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు టి నరేంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెన్సీ రద్దుతో నకిలీ కరెన్సీ, నల్లధనం వెలికి వస్తుందన్న ప్రభుత్వ వాదనను కొట్టిపారేసిన ఆయన ఈ చర్య పేదల కష్టాలను మరింత పెంచిందని ఆరోపించారు. పెద్దనోట్ల రద్దుతో దేశంలో ఏర్పడిన పరిస్థితులపై కేంద్ర జోక్యం చేసుకోవాలన్నారు. కరెన్సీ లభ్యతను మెరుగుపర్చి ప్రజలకు మరింత భరోసా ఇవ్వాలని కోరారు. కరెన్సీని అందుబాటులోకి తీసుకురావడంలో, ఆర్థిక వ్యవస్థ నిర్వహణలోపంతో కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ వైఫల్యం బహిర్గతమైందన్నారు నరేంద్రన్. ప్రయివేటీకరణ, బడాబాబులకు వత్తాసు పలికే చర్యల కారణంగానే ఈ పరిస్థితి నెలకొందన్నారు. .ప్రయివేట్ కాంట్రాక్టర్ ఏజెన్సీల కారణంగా ప్రజలు ఏటీఎంల నుంచి నగదును పొందలేకపోతున్నారని మండిపడ్డారు . దీంతో దేశంలో అప్రకటిత ఆర్థిక అత్యవసర పరిస్థితి నెలకొందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రత్యామ్నాయ చర్యలు, కరెన్సీలు లభ్యతపై భరోసా లేకుండా తీసుకున్న నిర్ణయంతో ప్రజల అవసరాలను తీర్చలేని పరిస్థితికి బ్యాంకులు నెట్టబడ్డాయనీ, దీంతో ప్రజలకు, బ్యాంకు ఉద్యోగులకు మధ్య లేనిపోని విభేదాలు తలెత్తుతున్నాయని నరేంద్రన్ వ్యాఖ్యానించారు. కరెన్సీ బ్యాన్ తదనంతర పరిణమాలపై సరైన హోంవర్క్ లేకుండానే ఆర్థిక వ్యవస్థలో 6 శాతా వాటా ఉన్న పెద్ద కరెన్సీ నోట్ల రద్దును ప్రకటించారని ఆయన విమర్శించారు. -
ప్రధాని జోక్యం చేసుకోవాలి
గాలింపును తీవ్రతరం చేయాలి కోస్ట్గార్డ్ విమాన అధికారుల సతీమణులు వినతి చెన్నై, సాక్షి ప్రతినిధి: కోస్ట్గార్డ్ విమానం గల్లంతై పదిరోజులైనా అచూకీ లేనందున ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాలని అదే విమానంలో ప్రయాణించిన అధికారుల సతీమణులు బుధవారం విజ్ఞప్తి చేశారు.చెన్నై కోస్ట్గార్డ్ విమానం ఈనెల 8వ తేదీ రాత్రి చెన్నై నుంచి పుదుచ్చేరికి బయలుదేరి తిరుగు ప్రయాణంలో గల్లంతైన సంగతి పాఠకులకు విదితమే. ఆ విమానంలో సుభాష్ సురేష్, సోనీ, విద్యాసాగర్ అనే అధికారులు ప్రయాణిస్తున్నారు. ఈ ముగ్గురి ఆచూకీ లేదు. అదే రోజు రాత్రి 9.23 గంటల సమయంలో శీర్కాళీ-చిదంబరం మద్య ప్రయాణిస్తుండగా చివరిసారిగా సిగ్నల్ అందుకున్నట్లు నిర్ధారణకు వచ్చిన అధికారులు ఆ ప్రాంతంలో గాలిస్తున్నారు. గత పదిరోజులుగా తీవ్రస్థాయిలో గాలిస్తున్నా విమానం ఆచూకీ లభించలేదు. మూడురోజుల క్రితం జరిపిన గాలింపులో కూలిపోయిన విమానం బ్లాక్బాక్స్ నుండి సిగ్నల్స్ తగిలాయి. అయితే అవి స్పష్టంగా లేకపోవడం, తరచూ కట్ కావడంతో గాలింపు చర్యల్లో గందరగోళం నెలకొంది. గాలింపు వివరాలను గల్లంతైన అధికారుల కుటుంబాలకు అధికారులు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నారు. అయితే పదిరోజుల పాటూ భర్తల కోసం నిరీక్షించిన వారి సతీమణులు బుధవారం ప్రధానికి తమ గోడును వినిపించుకున్నారు. భారత సైన్యం పనితీరుపై తమకు ఎంతో నమ్మకం, గౌరవం ఉందని చెప్పారు. అయితే విమానం గల్లంతైన రాత్రి నుండి తమ భర్తల కోసం ఎదురుచూస్తూ నిద్రలేకుండా గడుపుతున్నామని వారు చెప్పారు. ప్రధానిగా ప్రత్యక్ష జోక్యం చేసుకోవడం వల్ల గాలింపు చర్యల్లో మరింత వేగం సాధ్యమని విద్యాసాగర్ భార్య సుష్మా తవాలా, సోని భార్య అమృత విన్నవించారు. పెలైట్ సుభాష్ సురేష్ భార్య దీపలక్ష్మి సైతం ప్రధానికి ట్వీట్ చేశారు. ‘ నా దైవ భక్తి వృథాపోదు, భర్త ఖచ్చితంగా ప్రాణాలతో తిరిగి వస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. ఏడాదిన్నర వయస్సున్న కుమారుడు ఇషాన్ను సైతం పెలైట్ చేయాలన్నదే సుభాష్ డ్రీమ్. కోస్ట్గార్డ్ విమాన గాలింపు వివరాలను ఎప్పటికప్పుడు బహిరంగ పరిస్తే పనుల్లో వేగం సాధ్యమవుతుందని ఆమె ప్రధానికి విన్నవించారు. -
సీమాంద్ర కాంగ్రెస్ నేతలతో ముగిసిన రాష్ట్రపతి భేటీ