సాయి దేదీప్య జోడీకి టైటిల్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) అండర్-18 బాలికల సూపర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో సారుుదేదీప్య జోడీ విజేతగా నిలిచింది. డబుల్స్ ఫైనల్లో సారుుదేదీప్య (తెలంగాణ)- షేక్ ముబషిరా (ఏపీ) ద్వయం 6-2, 7-5తో శ్రీయ (ఏపీ)- తేజస్విని (మహారాష్ట్ర) జోడీపై గెలుపొంది టైటిల్ను దక్కించుకుంది. కాగా సింగిల్స్ విభాగంలో దేదీప్య రన్నరప్తో సరిపెట్టుకుంది. గురువారం జరిగిన ఫైనల్లో 4-6, 1-6తో శ్రీయ (ఏపీ) చేతిలో ఓడిపోయింది.