breaking news
Jena Sena
-
అనుకున్నట్లే అయింది.. ఏపీలో కూటమిని ముంచేసిన..
అనుకున్నట్లే అయింది. ఏపీలో కూటమిని కుమ్ములాటలు పూర్తిగా ముంచేసాయి. సఖ్యత లేని కారణంగానే పార్టీల మధ్య ఓటు బదిలీ జరగలేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఓటు షేర్ బదిలీ కాకపోవడం ఆయా పార్టీలను కలవరపరుస్తోంది. టిడిపి, బిజెపి, జనసేన పార్టీ నేతల్లో గెలుపుపై ధీమా లేక డీలా పడిపోయారు. పోలింగ్ పూర్తయ్యాక బిజెపి, జనసేన నేతలెవరూ మీడియా ముందుకు రాకపోవడం పరిస్ధితికి అద్దం పడుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కూటమి పార్టీల మధ్య అసలేం జరిగిందో చూద్దాం.కూటమిగా జతకడితే విజయం ఖాయమనుకున్న టిడిపి, బిజెపి, జనసేనలలో పోలింగ్ తర్వాత అయోమయం కనిపిస్తోంది. లెక్కలు తేలిన తర్వాత ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి ఓటు షేర్ బదిలీ కాలేదని అర్థం కావడంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. 2014లో టిడిపి, బిజెపి, జనసేనలతో జట్టుకట్టి బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో టిడిపి, బిజెపికి మద్దతు పలికిన జనసేన బరిలోకి దిగలేదు. 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలన్న ఉద్దేశంతో జనసేన విడిగా పోటీ చేసింది. కాని జనసేన ఒక సీటు గెలుచుకోగా..టీడీపీకి 23 మాత్రమే దక్కాయి. 152 సీట్లతో వైఎస్ఆర్సీపీ విజయఢంకా మోగించింది.మళ్ళీ తాజా ఎన్నికలలో ఎట్టి పరిస్ధితుల్లోనైనా వైఎస్సార్ సిపి గెలుపును అడ్డుకోవాలని కుట్రలు, కుతంత్రాలతో 2014లో మాదిరిగా మూడు పార్టీలు మరోసారి కూటమి కట్టాయి. మూడు పార్టీలు కలిస్తే 2019 వచ్చినట్టుగా ఓటు షేర్ దాదాపుగా 50 శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు. అయితే మూడు పార్టీల అంచనాలు పూర్తిగా తలక్రిందులయ్యాయి.ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి కూటమిలో కుమ్ములాటలు పోలింగ్ రోజున దెబ్బేసాయి. కనీసం సగం సీట్లలలోనైనా పోటీ చేస్తుందని భావించిన జనసేన పార్టీ నేతల్ని పవన్ తీరు పూర్తిగా నిరాశపరిచింది. కేవలం 21 అసెంబ్లీ సీట్లకి, రెండు పార్లమెంట్ సీట్లకి జనసేన పరిమితం కావడం ఆ పార్టీ నేతలను పూర్తిగా నైరాశ్యంలోకి నెట్టింది. దీనికి తోడు మొదట నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని చివరి నిమిషంలో పలువురు టీడీపీ నేతల్ని జనసేనలో చేర్చుకుని టిక్కెట్లు ఇవ్వడం పార్టీ సీనియర్ నేతలకి ఆగ్రహం కలిగించింది. గోదావరి జిల్లాల్లో అయితే నియోజకవర్గ ఇన్ చార్జిలకి వెన్నుపోటు పొడుస్తూ జనసేనకు బలం ఉన్న సీట్లను టిడిపికి త్యాగం చేయడం అక్కడి కేడర్ను నిరాశలోకి నెట్టింది. దీంతో పలువురు నేతలు జనసేనకి గుడ్ బై చెప్పి వైఎస్సార్ సిపిలో చేరారు. సీట్ల పంపకాల సమయంలోనే సొంత పార్టీలోనే పవన్ నిప్పు రాజేసుకున్నారు. దీనికి తోడు జనసేన పార్టీ నేతలకి టీడీపీ నుంచి పూర్తి సహకారం లభించలేదు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో టీడీపీ నేత వర్మ చివరి నిమిషం వరకు కంట్లో నలుసుగానే కొనసాగారు. పవన్ కళ్యాణ్ గెలుపొందితే శాశ్వతంగా పిఠాపురం నుంచి తాను దుకాణం సర్ధుకోవాల్సి ఉంటుందనే భయంతో వర్మ తన క్యాడర్ ని పవన్ కి పూర్తిగా సహకరించనివ్వలేదని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో పవన్ తో పాటే వర్మ తిరిగినా టిడిపి ఓటు షేర్ జనసేనకి పూర్తిగా బదిలీ కాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో 21 అసెంబ్లీ స్ధానాలలో ఎన్ని సీట్లలో గెలుస్తామనేది జనసేన చెప్పలేకపోతోంది. ఎన్డీఎ కూటమి గెలుస్తుందంటూ పవన్ పోలింగ్ ముగిసిన తర్వాత కేవలం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. చాలా బలంగా ఉన్నామని చెప్పుకున్న గోదావరి జిల్లాలలోనూ కాపు ఓట్లు తప్పితే బిజెపి, టిడిపి ఓట్లు జనసేనకి పడలేదని ఆ పార్టీ నేతలే వాపోతున్నారు.ఇక బిజెపి కూడా అదే విధమైన అయోమయంతో ఉంది. వాస్తవానికి ఈ పార్టీలో కూడా అంతర్గత కుమ్ములాటలు గెలుపుపై ధీమా లేకుండా చేశాయి. బిజెపి సీనియర్లెవరికీ ఇష్టం లేకపోయినా చివరి నిమిషంలో టిడిపి, జనసేన కూటమితో జతకట్టి పది అసెంబ్లీ స్ధానాలకి, ఆరు పార్లమెంట్ స్ధానాలకి పరిమితం కావడం పార్టీలో సీనియర్లకి మింగుడుపడలేదు. దీంతో పాటు బిజెపిలో మొదట నుంచి ఉన్న వారికి, సీనియర్లకి టిక్కెట్ల కేటాయింపు కోసం సీనియర్లు ఎంత ప్రయత్నించినా..రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి కుతంత్రాలతో ఒరిజినల్ బిజెపి కాస్తా తెలుగు బిజెపిగా మారిపోయింది. ఇక్కడ కూడా విశాఖపై పట్టున్న జివిఎల్ కి టిక్కెట్ రాకుండా తన సోదరుడు బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కోసం పురందేశ్వరి చేసిన కుట్రలతో జీవీఎల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. అలాగే రాజమండ్రి నుంచి పోటీ చేయాలని ఆశించిన సోము వీర్రాజుకి టిక్కెట్ ఇవ్వకపోవడం, హిందూపూర్ ఆశించిన విష్టువర్ధన్ రెడ్డికి టిక్కెట్ రాకుండా పురందేశ్వరి అడ్డుపడ్డారు.ఈ నేపధ్యంలో బీజేపీ అసలు నేతలంతా ప్రచారానికి దూరంగా ఉండిపోయారు. అదే సమయంలో టిడిపి నుంచి బిజెపిలో చేరిన, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్నవారికే టిక్కెట్లు దక్కడం బిజెపిలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది. ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా లాంటి నేతలు వచ్చినపుడు తప్పితే మిగిలిన సమయాలలో పార్టీ అభ్యర్థులకు సొంత పార్టీ నేతలు సహకరించలేదని తెలుస్తోంది. దీనికి తోడు టిడిపి, జనసేన నుంచి కూడా ఓటు బదిలీ కాలేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోందని బిజెపి అభ్యర్ధులు వాపోతున్నారు. జనసేన, టిడిపి ఓట్లు తమకు బదిలీ కాకపోవడం చాలా దెబ్బేసిందని వారు చెబుతున్నారు. దీంతో పాటు పోల్ మేనేజ్ మెంట్ లో పూర్తిగా విఫలమయ్యామని రాష్ట్ర బీజేపీ నాయకులు చెబుతున్నారు.సొంత పార్టీ నేతలకంటే బిజెపి, జనసేనను నమ్ముకుని పూర్తిగా మునిగిపోయామని టిడిపి నేతలు భావిస్తున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటే జనసేన, బిజెపి ఓట్లు తమకు పడకపోవడంపై నైరాశ్యంలో ఉన్నారు. గాజు గ్లాజు గుర్తు ఉన్న చోట మాత్రమే ఓట్లు పడ్డాయని...టిడిపి అభ్యర్ధులు ఉన్న చోట జనసేన ఓట్లు వేయలేదని..చాలా చోట్ల తమకి నచ్చిన పార్టీకి...నేతకి ఓటు వేసుకున్నారని గోదావరి జిల్లాకి చెందిన ఓ టిడిపి నాయకుడు చెబుతున్నారు. గోదావరి జిల్లాలలో టిడిపి, జనసేన కలిస్తే క్లీన్ స్వీప్ అవుతాయని భావించామని కానీ బిజెపితో కలవడం బాగా దెబ్బ కొట్టిందని అంటున్నారు. దీనికి తోడు జనసేన పార్టీ ఓట్లు తమకు పడలేదని..గాజు గ్లాసు లేని చోట పలువురు వైఎస్సార్ సిపికి ఓటు వేయడంతో తమ విజయవకాశాలను దెబ్బ కొట్టిందంటున్నారు. కొన్ని చోట్ల గత అయిదేళ్లగా పార్టీ కోసం కష్టపడిన నేతలని పక్కన పెట్టడం కూడా టిడిపికి మైనస్ అయింది. పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుని కాదని వైఎస్సార్ సిపి బహిషృత నేత రఘరామకృష్ణంరాజుకి ఇవ్వడం జిల్లా వ్యాప్తంగా మైనస్ గా మారిందంటున్నారు.దీనికి తోడు టిడిపి రెబెల్ గా ఉండి నుంచి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు బరిలో ఉండటం కూడా పూర్తిగా వ్యతిరేకమైందంటున్నారు. ఇలా పలు నియోజకవర్గాలలో సొంత పార్టీ నేతలని కాదని బయట పార్టీ వారికి ఇవ్వడం కూటమి అభ్యర్ధుల గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపుతాయంటున్నారు. టిక్కెట్ రాని నేతలంతా చివరి నిమిషంలో కూటమి నేతలకి షాక్ ఇచ్చారని చెబుతున్నారు. మరోవైపు జనసేన, బిజెపి ఓట్లు కూడా పూర్తిగా టిడిపికి పడలేదని ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే గెలుపుపై టిడిపి ధీమా కోల్పోయి..ఓటమి ఖాయమై నేతలంతా నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. -
March 29th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Political News And Election News March 29th Telugu Updates 9:30 PM, March 29th 2024 నెల్లూరు: వింజమూర్లో జరిగిన చంద్రబాబు ప్రజాగళం కార్యక్రమానికి డుమ్మా కొట్టిన ఉదయగిరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు టికెట్ రాలేదని గత కొద్ది రోజులుగా అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఉదయగిరి నియోజకవర్గ కూటమి నాయకులకు వేదికపై దక్కని చోటు 9:00 PM, March 29th 2024 అనంతపురం: కళ్యాణదుర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ టీడీపీకి రాజీనామా యోచనలో కళ్యాణదుర్గం టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు ఉమామహేశ్వర నాయుడును కలిసిన కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి తలారి రంగయ్య, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం పరిశీలకులు ఎంఆర్సీ రెడ్డి టీడీపీ నేత ఉమామహేశ్వర నాయుడును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించిన నేతలు 8:50 PM, March 29th 2024 తాడేపల్లి : చంద్రబాబుపై సీఎం వైఎస్ జగన్ ఫైర్ వైఎస్సార్సీపీలో 50% సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి ఇచ్చాం అని గర్వంగా చెప్పగలుగుతున్నాం అయినా పేదలు రాజకీయంగా ఎదుగుతుంటే మీకు అంత కడుపుమంట ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? వైయస్ఆర్సీపీ లో 50% సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి ఇచ్చాం అని గర్వంగా చెప్పగలుగుతున్నాం. అయినా పేదలు రాజకీయంగా ఎదుగుతుంటే మీకు అంత కడుపుమంట ఎందుకు చంద్రబాబు నాయుడు గారు?#MemanthaSiddham pic.twitter.com/dSxGLtAe9Z — YS Jagan Mohan Reddy (@ysjagan) March 29, 2024 5:50 PM, March 29th 2024 ఎమ్మిగనూరు మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ నా కళ్లముందు ఉన్న ఒక దృశ్యం చూస్తూ ఉంటే ఒక మాట చెప్పాలని ఉంది ఎమ్మిగనూరు సభ ఎప్పటికీ సువర్ణాక్షరాలతో చరిత్రలో నిలిచిపోతుంది వాన చినుకులన్నీ చేరి ఒక్కటైనట్లు, బిందు బిందువు చేరి ఒక సింధువు అయినట్లు ఒక జన సముద్రం కనిపిస్తోంది మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా చేయి చేయి కలిపినట్లుంది జెండాలు జత కట్టిన వారిని, పేదల వ్యతిరేకులను ఓడించి.. మీ వాడిని, మీ బిడ్డని ఆశీర్వదించడం కోసం, గెలిపించడం కోసం ఇక్కడకి రావడం నా పూర్వ జన్మ సుకృతం మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది పెత్తందార్లను ఓడించడానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?\ నేను మీ సోదరుడిగా అడుగుతున్నాను.. రాఖీ కట్టమని ప్రతీ అక్క చెల్లెమ్మను కోరుతున్నాను.. ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి రక్షా బంధన్ కట్టమని అక్కా చెల్లెమ్మలను అడుగుతున్నాను నా చేతికి మాత్రమే కాదు.. ఈ అక్క చెల్లెమ్మల ప్రభుత్వానికి రాఖీ కట్టమని కోరుతున్నాను అక్క చెల్లెమ్మల కోసం 31 లక్షల ఇళ్ల పట్టాలు వారి పేరుతో రిజిస్టేషన్ చేయడమే కాకుండా, అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్న ప్రభుత్వానికి రాఖీ కట్టమని అడుగుతున్నాను. ఎప్పుడూ చూడని విధంగా మహిళల కోసం దిశ యాప్ తీసుకొచ్చిన ప్రభుత్వానికి రక్షా బంధన్ కట్టమని కోరుతా ఉన్నా మీ గ్రామంలోనే అక్క చెల్లెమ్మల కోసం ఒక మహిళా పోలీస్ ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వానికి రక్షా బంధన్ కట్టమని కోరుతా ఉన్నా 4:50 PM, March 29th 2024 విజయవాడ: టీడీపీపై X లో ఘాటైన వ్యాఖ్యలు చేసిన జనసేన నేత పోతిన మహేష్ టీడీపీ నాయకులు జనసేన పార్టీ మీద పెట్టిన శ్రద్ధలో సగం టీడీపీ మీద పెట్టుండాల్సింది అలా చేసుంటే టీడీపీ నాయకులను సెంట్రల్ నియోజకవర్గంలో కాపాడుకోవచ్చు జనసేనలో చీలికలు తెచ్చే పనులుమాని మీ పార్టీని బలపర్చుకోండంటూ చురకలు పొత్తు ధర్మం మాకే కాదు, మీకు కూడా వర్తిస్తుందంటూ పోస్టు పెట్టిన పోతిన మహేష్ 4:29 PM, March 29th 2024 అనంతపురం: మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు టిక్కెట్ ఇవ్వడంపై ఆగ్రహం గుంతకల్లు టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణుల నిరసన చంద్రబాబు ఫ్లెక్సీలు దహనం చేసిన టీడీపీ నేతలు టిక్కెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ 4:15 PM, March 29th 2024 విజయవాడ: సీటు దక్కకపోవడంతో విజయవాడ వెస్ట్ జనసేన నేత పోతిన మహేష్ ఆవేదన పోరాడి పోరాడి కన్నీరు కూడా రావడం లేదు నా బాధను క్రీస్తు శిలువకు చెప్పుకున్నా సీటు కోసం పోరాడినా అవకాశం రాలేదు ప్రతి రోజూ పరీక్ష అంటే ఎలా అంటూ ఉద్వేగానికి లోనైన పోతిన మహేష్ 4:01 PM, March 29th 2024 నెల్లూరు: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు షాక్ ఇచ్చిన కావలి జనం బహిరంగ సభకు జనాలు లేకపోవడంతో సుమారు గంటలు పాటు హెలిపాడ్ దగ్గరే ఉండిపోయిన చంద్రబాబు జనాలను సమీకరించడంలో టిడిపి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి విఫలమయ్యారంటూ చంద్రబాబు ఆగ్రహం రెండు గంటల 50 నిమిషాలకే ప్రత్యేక హెలికాప్టర్లో కావలి జడ్పీ గ్రౌండ్ లో దిగిన చంద్రబాబు నాలుగు గంటలకి ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభ ఉన్నా కూడా.. జనాలు రాకపోవడంతో గ్రౌండ్ లోనే ఉన్న బాబు టిడిపి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఓవరాక్షన్ కారణంగానే ఇలా జరిగిందని తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం కావ్య కృష్ణారెడ్డి నియంతృత్వ పోకడల వల్ల కావలిలో పార్టీ నాశనం అయిందని చంద్రబాబుకు నేతల ఫిర్యాదు 3:59 PM, March 29th 2024 అనంతపురం: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మనస్తాపం అనంతపురం అర్బన్ టిక్కెట్ ఆశించి భంగపడ్డ ప్రభాకర్ చౌదరి చంద్రబాబు తీరును తప్పుబట్టిన టీడీపీ సీనియర్ నేత వైకుంఠం ప్రభాకర్ చౌదరి టీడీపీ లో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు లేదా? టీడీపీ ఓ లిమిటెడ్ కంపెనీలా మారిపోయింది చంద్రబాబు ను కలవాల్సిన అవసరం నాకు లేదు చంద్రబాబు వాడుకుని వదిలేసే రకం ఏ సర్వే ఆధారంగా అనంతపురం టిక్కెట్ను దగ్గుబాటి ప్రసాద్కు ఇచ్చారో చంద్రబాబు చెప్పాలి కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా 3:50 PM, March 29th 2024 ప్రకాశం జిల్లా: గిద్దలూరు నియోజకవర్గంలో మరోసారి ఎగిరేది వైఎస్సార్సీపీ జెండానే: వైఎస్సార్సీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మార్కాపురం ఎమ్మెల్యే, గిద్దలూరు సమన్వయకర్త ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో గిద్దలూరు నియోజకవర్గంలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం సంక్షేమం,అభివృద్ధితో మళ్లీ జగన్ రావాలని కోరుకుంటున్న ప్రజలు సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో అభివృద్ధి చేసుకుందాం సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు నూటికి నూరు శాతం అమలు సీఎం జగన్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని ఒంగోలు పార్లమెంటు, ఏడు అసెంబ్లీ స్థానాలు కైవసం కులం, మతం ప్రాంతం చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చిన నాయకుడు సీఎం జగన్ 3:20 PM, March 29th 2024 అనంతపురం అర్బన్ టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి దగ్గుపాటి ప్రసాద్కు టికెట్ ఇవ్వడంపై ప్రభాకర్ చౌదరి తీవ్ర అసంతృప్తి ఫ్లెక్సీలు తగలబెట్టిన ప్రభాకర్ చౌదరి వర్గీయులు టీడీపీ జిల్లా కార్యాలయంపై దాడి, ఫర్నిచర్ ధ్వంసం 3:15 PM, March 29th 2024 అంబేద్కర్ కోనసీమ జనసేన పార్టీకి పితాని బాలకృష్ణ గుడ్ బై జనసేన పార్టీ, పదవికి రాజీనామా చేసిన పితాని బాలకృష్ణ ఈ నెల 30న(రేపు) సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరనున్న పితాని బాలకృష్ణ 3:03 PM, March 29th 2024 తాడేపల్లి : అవ్వాతాతల అప్యాయతపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్ అవ్వాతాతలకి భరోసా కల్పిస్తూ వారికి అండగా నిలిచిన ప్రభుత్వం మనది అవ్వాతాతల సంక్షేమం కోసం వారికి ఇచ్చే పెన్షన్ను రూ.3000కు పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం మనం చేసిన మంచి దారి పొడువునా వారు చూపిస్తున్న అభిమానంలో కనిపిస్తుంది అవ్వాతాతలకి భరోసా కల్పిస్తూ వారికి అండగా నిలిచిన ప్రభుత్వం మనది. అవ్వాతాతల సంక్షేమం కోసం వారికి ఇచ్చే పెన్షన్ను రూ.3000కు పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. మనం చేసిన మంచి దారిపొడువునా వారు చూపిస్తున్న అభిమానంలో కనిపిస్తుంది.#MemanthaSiddham#VoteForFan pic.twitter.com/C0VOCM7NvQ — YS Jagan Mohan Reddy (@ysjagan) March 29, 2024 2:25 PM, March 29th 2024 బీసీలకు చంద్రబాబు హ్యాండ్ బీసీలకు చంద్రబాబు ఊచకోత లోక్సభ సీట్లలో బీసీలకు ద్రోహం చేసిన చంద్రబాబు టీడీపీ కూటమిలో 25లో కేవలం ఆరు సీట్లు మాత్రమే బీసీలకు... 20 అన్రిజర్వ్ సీట్లలో 11 సీట్లు బీసీలకు ఇచ్చిన వైఎస్సార్సీసీ 2:13 PM, March 29th 2024 పెండింగ్ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల ఖరారు నాలుగు లోక్సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు అభ్యర్థుల్ని ఖరారు చేసి జాబితా విడుదల చేసిన చంద్రబాబు జాబితా విడుదల చేసిన టీడీపీ పంతం నెగ్గించుకున్న గంటా శ్రీనివాస్.. భీమిలి సీటు గంటాకే మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు సీటు జయరాం టికెట్పై మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ తీవ్ర అభ్యంతరాలు జయరాంకు టికెట్ ఇవ్వొద్దని ఆందోళనలు, నిరసనలు పట్టించుకోని చంద్రబాబు అనంత సీనియర్ నేత ప్రభాకరచౌదరికి నిరాశ జేసీ కుటుంబం నుంచి ఈసారి ఒక్కరికే సీటు జేసీ వారసుడు పవన్కుమార్కూ నిరాశే తాపడిత్రి నుంచి అస్మిత్రెడ్డికి ఛాన్స్ 1:45 PM, March 29th 2024 తారాస్థాయికి చేరిన టీడీపీ అసమ్మతి సెగలు తిరుపతి సత్యవేడు నియోజకవర్గంలో తారాస్థాయికి చేరిన టిడిపి అసమ్మతి సెగలు కోనేటి ఆదిమూలం కు టికెట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ టిడిపి నేతలు సమావేశం ఎన్.ఆర్. ఐ రమేష్ నాయుడు నేతృత్వంలో తిరుపతి రాజ్ పార్క్ హోటల్ లో సత్యవేడు టిడిపి అసమ్మతి నేతలు సమావేశం నారాయణ వనం, పిచ్చాటురు, కే.వి.బి.పురం, బుచ్చినాయుడు కండ్రిగ, వరదయ్య పాలెం, సత్యవేడు, నాగల పురం మండలాలుకు చెందిన టీడీపీ నేతలు ,ముఖ్య నాయకులు హాజరు 1:23 PM, March 29th 2024 కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్న ప్రజలు కోడమూరు, వేముగోడు, సార్ గోనెగండ్ల మీదుగా సాగనున్న యాత్ర సాయంత్రం ఎమ్మిగనూరులో వైఎస్సార్సీపీ భారీ బహిరంగ సభ 12:54 PM, March 29th 2024 ఆసక్తికరంగా ధర్మవరం రాజకీయం పొత్తులో భాగంగా బీజేపీ సత్యకుమార్కు సీటు కేటాయింపు మండిపడుతున్న టీడీపీ జనసేన శ్రేణులు బీజేపీ అభ్యర్థికి సహకరించబోమంటూ ప్రకటనలు ఇరు వర్గాల నేతలను పిలిపించుకుని మాట్లాడనున్న టీడీపీ-జనసేన అధినేతలు 12:43 PM, March 29th 2024 నూకసాని వ్యాఖ్యలతో ప్రకాశం టీడీపీలో అలజడి టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జిల్లా టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ సంచలన వ్యాఖ్యలు జిల్లా టీడీపీలో కొందరు అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారు రెండు మూడు రోజుల్లో అలాంటి నేతలకు గట్టి సమాధానం చెబుతా.. పరోక్షంగా రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు , ఒంగోలు అసెంబ్లీ టిడిపి అభ్యర్థి దామచర్ల జనార్దన్ పై వ్యాఖ్యలు గత కొద్దిరోజులుగా దామచర్ల జనార్దన్ కి నూకసాని బాలాజీ కి మధ్య విబేధాలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గా తనకు గౌరవం ఇవ్వలేదని నూకసాని బాలాజీ గుర్రు బీసీ కోటాలో ఒంగోలు ఎంపీ సీటు ఆశించిన నూకసాని నూకసానికి మొండి చేయి చూపించిన చంద్రబాబు ఆవిర్భావ దినోత్సవం రోజునే జిల్లా పార్టీ అధ్యక్షుడు వ్యాఖ్యలు పై జిల్లా లో తీవ్ర చర్చ 12:12 PM, March 29th 2024 దేవినేని ఉమను బుజ్జగిస్తున్న చంద్రబాబు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమకు ఈ ఎన్నికల్లో సీటు నిరాకరణ మైలవరం టికెట్ వలస నేత వసంత కృష్ణకు కేటాయించడంతో దేవినేని నిరాశ పార్టీ బాధ్యతలు అప్పగిస్తానని దేవినేని ఉమకు చెప్పిన చంద్రబాబు దేవినేని ఉమకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమన్వయ బాధ్యతలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాతో పాటు సమన్వయ బాధ్యతలు ఇస్తానని చల్లబర్చే యత్నం 11:30 AM, March 29th 2024 ఉమ్మడి విశాఖ జిల్లా జనసేనలో గందరగోళం సుందరపు విజయ్ కుమార్ పై ఐవీఆర్ఎస్ సర్వే సీటు కేటాయించి నిర్వహించడంపై విజయ్ కుమార్ ఆందోళన విజయ్ కుమార్ యలమంచిలి నుంచి తప్పిస్తారనే ప్రచారం మొదట విశాఖ సౌత్ సీటు వంశీకే అంటూ ప్రచారం తర్వాత జనసేన జాబితాలో కనిపించని వంశీ పేరు సౌత్ నియోజకవర్గంలో ప్రచారానికి సైతం దూరంగా పవన్ కల్యాణ్ చోడవరం సీటు టీడీపీకి కేటాయించడంపై పీవీఎస్ఎన్ రాజు అసంతృప్తి అనుచరులతో సమావేశం భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో చర్చ 11:15 AM, March 29th 2024 అమరావతి: పెండింగ్ సీట్లలో అభ్యర్ధుల ఖరారుపై తేల్చుకోలేకపోతున్న జనసేన 3 అసెంబ్లీ, ఒక లోక్ సభ సీటుపై ఇంకా రాని స్పష్టత డైలమాలోనే బందరు పార్లమెంటు సీటు మరింత సమర్ధవంతమైన అభ్యర్ధుల కోసం పవన్ సెర్చ్ ఆపరేషన్ అంగబలం, అర్ధబలం ఉన్న అభ్యర్ధుల కోసం జనసేన గాలింపు 11:00 AM, March 29th 2024 కృష్ణా జిల్లా గన్నవరంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు టీడీపీ నేతలు పట్టించుకోవడం లేదంటూ జనసేన నేతల ఆవేదన పవన్ చెప్పడంతో టీడీపీకి మద్దతుగా పనిచేస్తున్నాం టీడీపీకి బానిసత్వం చేయడానికి మేం సిద్ధంగా లేం: గన్నవరం జనసేన ఇన్ ఛార్జ్ చలమలశెట్టి రమేష్ బాబు 10:45 AM, March 29th 2024 ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట టీడీపీలో బయటపడ్డ వర్గపోరు పార్టీ అభ్యర్థి శ్రీరాం తాతయ్య పై అసమ్మతి నేతల ఫైర్ కమ్మ సామాజికవర్గ నేతలను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం -స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతామని హెచ్చరిక 10:34 AM, March 29th 2024 జనసేన సీటు.. అయినా పవన్ ప్రచారానికి దూరం?! ఉమ్మడి విశాఖ జిల్లా జనసేనలో గందరగోళం సుందరపు విజయ్ కుమార్ పై ఐవీఆర్ఎస్ సర్వే సీటు కేటాయించి సర్వే నిర్వహించడంపై విజయ్ కుమార్ ఆందోళన విజయ్ కుమార్ ను యలమంచిలి నుంచి తప్పిస్తారనే ప్రచారం మొదట విశాఖ సౌత్ సీటు వంశీకే అంటూ ప్రచారం తరువాత జనసేన జాబితాలో కనిపించని వంశీ పేరు సౌత్ నియోజకవర్గంలో ప్రచారానికి సైతం దూరంగా పవన్ కల్యాణ్ చోడవరం సీటు టీడీపీకి కేటాయించడంపై పి వి ఎస్ ఎన్ రాజు అసంతృప్తి అనుచరులతో రహస్యంగా సమావేశం భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో చర్చ 10:00 AM, March 29th 2024 మూడో రోజు సీఎం వైస్ జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్ యాత్ర పెంచికలపాడు వద్ద ప్రారంభమైంది. 09:53 AM, March 29th 2024 జగ్గయ్యపేట టీడీపీలో భగ్గుమన్న విభేదాలు పెనుగంచిప్రోలులో సమావేశమైన జగ్గయ్యపేట నియోజకవర్గ టీడీపీ అసమ్మతి నేతలు బొల్లా వర్సెస్ శ్రీరామ్ రాజగోపాల్ వర్గాలుగా విడిపోయిన క్యాడర్ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బొల్లా రామకృష్ణ ఆధ్వర్యంలో సమావేశమైన టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ వ్యతిరేక వర్గం పార్టీలో మాకు కనీసం మర్యాద ఇవ్వడం లేదు :బొల్లా రామకృష్ణ ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టెం రఘురాం వర్గీయులుగా మా పై ముద్ర వేశారు :బొల్లా రామకృష్ణ శ్రీరామ్ రాజగోపాల్ కు అధిష్టానం టిక్కెట్ ప్రకటించిన తర్వాత ఇంతవకూ మమ్మల్ని కలుపుకుపోవడం లేదు :బొల్లా రామకృష్ణ నేను టీడీపీ పార్టీ వ్యక్తినే కాదని శ్రీరామ్ రాజగోపాల్ నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు:బొల్లా రామకృష్ణ గత మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధుల గెలుపు కోసం లక్షలాది రూపాయలు వెచ్చించా :బొల్లా రామకృష్ణ నేను అంత ఖర్చు చేశాను కాబట్టే టీడీపీ అభ్యర్ధులు గెలిచారు :బొల్లా రామకృష్ణ టీడీపీ పార్టీ అందరిదీ.. తాతయ్య సొత్తు కాదు:బొల్లా రామకృష్ణ శ్రీరామ్ రాజగోపాల్(తాతయ్య) నాపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి :బొల్లా రామకృష్ణ లేకపోతే నా భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తా:బొల్లా రామకృష్ణ 09:15 AM, March 29th 2024 ‘సార్.. పురందేశ్వరి తీరుతో పార్టీ భ్రష్టుపట్టుకుపోయింది’ వాడి వేడిగా జరిగిన విశాఖ జిల్లా బీజేపీ పదాధికారుల సమావేశం బీజేపీ అగ్ర నేతలు అరుణ్ సింగ్, మధుకర్ జీ హాజరు మీటింగ్లోనే ఆ ఇద్దరిని నిలదీసిన బీజేపీ నాయకులు ఉత్తరాంధ్ర నుంచి సీఎం రమేష్, ఎన్ ఈశ్వరరావుకు సీట్లు ఇవ్వడంపై అసంతృప్తి ఓసి వెలమ, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి ఉత్తరాంధ్రలో సీట్లు ఎలా ఇస్తారని ఆగ్రహం పార్టీ కోసం కష్టపడ్డ మాధవ్, జివిఎల్, సోము వీర్రాజు సీట్లు కేటాయించకపోవడంపై మండిపాటు కాపు సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా ఎందుకు కేటాయించలేదని ప్రశ్నల వర్షం పురందేశ్వరి తీరు వల్ల పార్టీ భ్రష్టుపట్టుకుపోయిందని ఫైర్ అయిన నేతలు ఎంపీ ఎమ్మెల్యే సీట్లలో నాలుగో వంతు సీట్లు కమ్మ సామాజిక వర్గానికే కట్టబెట్టారని ఫిర్యాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ కోసం పని చేయలేమని స్పష్టం చేసిన బీజేపీ నేతలు ఒక్క అసెంబ్లీ స్థానం మహిళలకు కేటాయించక పోవడాన్ని తప్పు పట్టిన నేతలు 08:49 AM, March 29th 2024 నెల్లూరు జిల్లాలో చంద్రబాబు ప్రచారం పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం కావలి, వింజమూరు బహిరంగ సభల్లో పాల్గొననున్న చంద్రబాబు ప్రజా గళం పేరిట ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నేత 08:21 AM, March 29th 2024 ఏప్రిల్ 7న పెందుర్తి లో పవన్ ప్రచారం ఉత్తరాంధ్ర పర్యటనలో పవన్ ప్రచారం షెడ్యూల్ ప్రకటన పెందుర్తి లేదా వేపగుంటలో పవన్ బహిరంగ సభ 07:48 AM, March 29th 2024 Memantha Siddham.. డే 3 షెడ్యూల్ మూడో రోజుకి చేరుకున్న మేమంతా సిద్ధం యాత్ర నేటి(మార్చి 29) సీఎం జగన్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ విడుదల చేసిన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం కర్నూలు జిల్లా పెంచికలపాడు లోని రాత్రి బస చేసిన నుంచి ప్రారంభం కానున్న సీఎం జగన్ బస్సు యాత్ర పెంచికలపాడు నుంచి రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డి చేరిక మధ్యాహ్నాం రాళ్లదొడ్డికి వద్ద భోజన విరామం ఆపై కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గర బహిరంగ సభకు చేరిక సాయంత్రం ఎమ్మిగనూర్ బహిరంగ సభలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం సభ అనంతరం అరెకల్, ఆదోని క్రాస్, విరుపాపురం,బెణిగేరి,ఆస్పరి, చిన్నహుల్తి,పత్తికొండ బైపాస్ చేరిక ఇవాళ రాత్రికి అక్కడి కేజీఎన్ ఫంక్షన్ హాల్ దగ్గర ఏర్పాటు చేసిన శిబిరంలో బస ఇదీ చదవండి: ప్రభం‘జనం’.. సీఎం జగన్ బస్సు యాత్రకు నీరాజనాలు 07:40 AM, March 29th 2024 రఘురామ.. కొత్త పాట ఇంకా నరసాపురం టికెట్ ఆశలు వదులుకోని రఘురామ కృష్ణంరాజు చంద్రబాబు తనకు అన్యాయం చేయరంటూ స్టేట్మెంట్ మోదీ, బాబు, పవన్లపై పూర్తి విశ్వాసం ఉందంటూ వ్యాఖ్యలు బీజేపీ ఢిల్లీ పెద్దలు తనకు బాగా క్లోజ్ అంటూ బిల్డప్పులు ఇచ్చే రఘురామ ఏపీ బీజేపీ అధిష్టానంతో మాత్రం పరిచయం, సాన్నిహిత్యం లేదంటూ సన్నాయి నొక్కులు అందుకే టికెట్ వచ్చి ఉండకపోవచ్చంటూ ఆసక్తికర వ్యాఖ్య 07:35 AM, March 29th 2024 పచ్చ పార్టీ ప్రలోభాలు డబ్బులు ఎరవేసి ప్రత్యర్థి పార్టీ నేతల కొనుగోళ్లు గ్రామస్థాయి నేతలకు రూ.5 లక్షల నుంచి రూ.10లక్షలు.. చోటా నేతలకు రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలు.. పార్టీలో చేరిన వారికి రూ.10వేల చొప్పున చెల్లింపులు అదే మండలస్థాయి ప్రజాప్రతినిధులకు రూ.25 లక్షల నుంచి రూ.30లక్షల వరకు ఆఫర్ అద్దంకి, పర్చూరు, రేపల్లెలోనూ టీడీపీ ప్రలోభాలు బాపట్ల, వేమూరులోనూ ఇదే పరిస్థితి ఓటర్లను నమ్మలేక నేతల కొనుగోలుకు సిద్ధపడిన వైనం బాపట్ల టీడీపీ అభ్యర్థి వర్మ కంపెనీ కంటైనర్లో పట్టుబడ్డ రూ.56 లక్షల నగదు ఆక్వా కంటైనర్ల మాటున పెద్దఎత్తున టీడీపీ నేతలు నగదు రవాణా! పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 07:12 AM, March 29th 2024 మారని బాబు, మళ్లీ పాత హామీలే ప్రజాగళం రోడ్షోలో పాల్గొన్న చంద్రబాబు, టీడీపీ లీడర్లు మళ్లీ పాత హామీల లిస్టును చదివి వినిపించిన చంద్రబాబు ప్రతీ పొలంలో బిందు సేద్యం పెట్టిస్తాను సీమకు గోదావరి జలాలు తీసుకువస్తా రాయలసీమలో ప్రతి చెరువు నింపుతా యువతకు బంగారు భవిష్యత్తు చూపిస్తాను అందరికీ వర్క్ ఫ్రం హోం జాబ్లు ఇప్పిస్తాను ఇంట్లో ఉంటూనే డబ్బులు సంపాదించుకోవచ్చు షర్మిల, సునీతలను మేనేజ్ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలను కూడా నేనే మేనేజ్ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు రాష్ట్రంలో ఇన్ని మార్పులు చేసేందుకు మీ బిడ్డ ప్రభుత్వానికి 58 నెలలు మాత్రమే పట్టింది. అయితే 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇందులో కనీసం 10 శాతం కూడా చేయలేదు. ఒకవేళ చేసుంటే ఎల్లోమీడియా, ఆయన భజనపరులు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసేవారు. కానీ ఇవన్నీ చేసిన నాకు దక్కిన బ… pic.twitter.com/9eGfucnFXQ — YS Jagan Mohan Reddy (@ysjagan) March 28, 2024 సంబంధిత కథనం: అలా చేసుంటే ఎల్లో మీడియా ఆకాశానికెత్తేదే కదా! 07:06 AM, March 29th 2024 అనపర్తిలో TDP ఆగ్రహజ్వాలలు నల్లమిల్లికి టికెట్ ఇవ్వకపోవడంతో భగ్గుమన్న అనపర్తి నల్లమిల్లికి జరిగిన అన్యాయంపై భగ్గుమన్న శ్రేణులు టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై మండిపాటు పార్టీ కరపత్రాలు, జెండా, సైకిల్ దహనం టికెట్ ఇవ్వాల్సిందేనంటూ బిజేపీ ఆఫీస్ ముందు కూర్చున్న పనతల సురేష్ సీటు ఇవ్వలేదంటూ అధిష్టానంపై వరదాపురం సూరి అసంతృప్తి కూటమిలో ఓవైపు ఆందోళనలు.. మరోవైపు సర్దుబాట్లు అనపర్తి తెలుగు తమ్ముళ్లతో చంద్రబాబు చర్చలు పరిస్థితి చక్కదిద్ధేందుకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి చంద్రబాబు ఫోన్ నల్లమిల్లిని బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నం చంద్రబాబుతో నిర్మొహమాటంగా నియోజకవర్గ పరిస్థితి, కార్యకర్తల ఆవేదనను వివరించిన నల్లమిల్లి పార్టీ కోసం ప్రాణాలొడ్డి పోరాడితే తనను బలిచేశారని అధినేతకు స్పష్టం చేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ‘మీకోసం తెగించి పోరాడిన అతికొద్ది మంది నేతలలో నేనూ ఒకడిని’ అని నల్లమిల్లి ఆవేదన నాలుగు దశాబ్దాలపాటు మా కుటుంబం మీ వెంటే ఉందన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అయినా అన్యాయం చేశారన్న నల్లమిల్లి నేటి నుంచి కుటుంబంతో సహా జనంలోకి వెళ్లి తనకు జరిగిన అన్యాయం వివరించి సింపథీ కోసం యత్నించనున్న నల్లమిల్లి 06:51AM, March 29th 2024 మేమంతా సిద్ధం.. ప్రభంజనం నంద్యాల జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్రకు నీరాజనాలు జన సంద్రంలా నంద్యాల.. బహిరంగ సభకు పోటెత్తిన జనం నేడు కర్నూలు జిల్లాలో కొనసాగనున్న యాత్ర ఎమ్మిగనూరులో సాయంత్రం భారీ బహిరంగ సభ 06:42AM, March 29th 2024 అల్లూరి జిల్లా.. బాబుపై సీనియర్ల ఆగ్రహం ఇద్దరికీ నో టికెట్ బీజేపీ నుంచి అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పాంగి రాజారావు టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై పెరుగుతున్న అసంతృప్తి ఇటీవలే అబ్రహం ఫైర్.. అదే రూట్లో దొన్నుదొర తాడోపేడో తేల్చుకునేందుకు విజయవాడకు దొన్నుదొర అరకు అభ్యర్థిగా దొన్నుదొర పేరును మొదట్లోనే ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు టికెట్ బీజేపీకి కేటాయించడంపై ఆగ్రహం 06:42AM, March 29th 2024 ‘తూర్పు’లో తలకిందులు! తూర్పు గోదావరి ఉమ్మడి జిల్లాలో 21 నియోజకవర్గాలు దాదాపు మూడు వంతుల నియోజకవర్గాల్లో మూడు ముక్కలైన టీడీపీ తలో దారీ వెతుక్కుంటున్న కూటమి నేతలు 06:30AM, March 29th 2024 ఓటుతో తలరాతను మార్చుకుందాం: సీఎం జగన్ నంద్యాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెల్ఫోన్ ఉన్న ప్రతి కార్యకర్త ఓ ఎడిటర్, ఓ ఛానల్ ఓనర్ సోషల్ మీడియా ద్వారా ఎల్లో మీడియాను ఏకేద్దాం పొత్తులు, జిత్తులు, ఎత్తులతో మళ్లీ మోసం చేసేందుకు వస్తున్న చంద్రబాబు 77 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఎవ్వరూ చేయని మార్పులు మనం చేశాం 2014 ఎన్నికల మేనిఫెస్టోలోని ఒక్క హామీనైనా చంద్రబాబు నెరవేర్చారా? ప్రతి గ్రామంలో మనం చేసిన అభివృద్ధి కళ్లెదుటే కన్పిస్తోంది పిల్లల భవిష్యత్కు దారి చూపాం.. వైద్య రంగంలో సమూల మార్పులు తెచ్చాం సామాజిక న్యాయం విషయంలో సువర్ణాధ్యాయాన్ని లిఖించాం రాష్ట్రం రూపు రేఖలు మార్చేందుకు మనమంతా సిద్ధమవుదాం ఓటుతో మన తల రాతను మనమే రాసుకుందాం నంద్యాలలో జరిగిన మేమంతా సిద్ధం కార్యక్రమం సూపర్ సక్సెస్🔥#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/PZvGGLdvde — YSR Congress Party (@YSRCParty) March 28, 2024 -
పదేళ్ల తర్వాత మళ్లీ అదే నాటకం.. ఎందుకు కలిశారో చెప్పాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: పదేళ్ల తర్వాత మళ్లీ అదే నాటకం మొదలుపెట్టారని వైస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీకి పొత్తులు కొత్త కాదని మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. పదేళ్ల క్రితం ఆ రోజు ఇచ్చిన హామీలన్నీ తర్వాత మర్చిపోయారని అన్నారు. నాడు విడాకులు తీసుకొని విడిపోయి, దూషించుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీని ఆనాడు చంద్రబాబు ఇష్టానుసారం దూషించారని దుయ్యబట్టారు. ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారని సజ్జల మండిపడ్డారు. సీఎం జగన్ను విమర్శించడమే పని పెట్టుకున్నారని అన్నారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా విమర్శలకే టైమ్ కేటాయించారని మండిపడ్డారు. సభ నిర్వహించడం చేతగాక పోలీసులపై విమర్శలా? అని ప్రశ్నించారు. అర్జెంట్గా అధికారంలోకి రావాలనేది వారి ఆత్రమని దుయ్యబట్టారు. 2014లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? 2024లో మళ్లీ కలిసి స్టేజ్పై ప్రత్యక్షమయ్యారని అన్నారు. మళ్లీ ఇప్పుడెందుకు కలిశారో ప్రజలకు వివరణ ఇవ్వాలని సజ్జల నిలదీశారు. ‘పొత్తు కోసం వెంపర్లాడటం, తర్వాత విడిపోవటం, మళ్ళీ కలవటం ఇదే వీరి పని. అసలు ఎందుకు కలిశారు? ఎందుకు విడిపోయారో కూడా ప్రజలకు చెప్పాలి. 600 హామీలు ఇచ్చి ఎన్ని అమలు చేశారో చెప్పాలి. అర్హులందరికీ స్థలాలు ఇచ్చి, ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ పేరుతో ఎందుకు మోసం చేశారో చెప్పాలి?. మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఒకే స్టేజీ మీదకు వచ్చారు?. ఏపీ ప్రజలను తేలిగ్గా మోసం చేయవచ్చనే ఆలోచనలో కూటమి పార్టీలు ఉన్నాయి. కనీసం చిన్న సభను కూడా జరుపుకోలేని వారు ప్రజలకు ఏం మేలు చేస్తారు?. ప్రధానిని సైతం అవమానపరిచారు. కాంగ్రెస్, వైఎస్సార్సీపీ ఒక్కటేనని మోదీ చెప్పగానే జనం నమ్ముతారా?. చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాష్ట్రానికి కావాల్సిన అంశాల గురించి మోదీని ఎందుకు అడగలేదు?. నాయకుడికి ఒక స్థిరమైన నిజాయితీ ఉండాలి. సీఎం జగన్ ప్రభుత్వంలో 87 శాతం కుటుంబాలు లబ్ది పొందాయి. అందుకే సీఎం జగన్ జగన్ ప్రజలు ఓన్ చేసుకున్నారు. షర్మిల ఎక్కడ నుంచైనా పోటీ చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీ కాబట్టి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని సజ్జల మండిపడ్డారు. -
‘చంద్రబాబు, పవన్ మధ్య సీట్ల పంచాయితీ తేలేది కాదు’
పల్నాడు: రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్సార్సీపీ సిద్ధమైందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైఎస్సార్సీపీ పార్టీ ఎన్నికల్లో గెలిచి అధికారంలో వస్తుందని.. అప్పటివరకు టీడీపీ, జనసేన సీట్ల పంచాయితీ తేలదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు-పవన్ బీజేపీ మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ మధ్య నోట్లు తేల్చుకుంటే తప్ప సీట్లు తేలే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు అద్దె ఇంట్లో పవన్ కల్యాణ్-చంద్రబాబు భేటీ అయ్యారని.. వారు అలా భేటీ అవుతునే ఉంటారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో తెలియదని.. చంద్రబాబు కూడా కుప్పంలో పోటీ చేస్తారో? మరోచోట నుంచి పోటీ చేస్తారో? తెలియదని అన్నారు. అసలు వారు ముందు ఎక్కడ పోటీ చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తాము ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమయ్యామని.. యుద్ధం కూడా అయిపోయిందన్నారు. వైఎస్సార్సీపీ గెలిచి అధికారంలోకి వస్తుందని.. అప్పటిదాకా వాళ్లు(టీడీపీ-జనసేన) సీట్లు తేల్చుకోలేరని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ను నమ్మిన వారు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టేనని మంత్రి అంబటి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ కల్యాణకు ఇచ్చేది ముష్టి సీట్లు మూడో, ముప్పైయో, ఇరవైఐదో ఏమో ముష్టివేస్తూ.. క్యాష్ ఏమో బలంగా ఇస్తారని వివర్శలు చేశారు. -
సీనియర్ నేతకు పొగ పెడుతున్న బాబు.. ఆ నియోజకవర్గం ఎంటీ?
గోదావరి జిల్లాల్లో అదొక కీలకమైన నియోజకవర్గం. పచ్చ పార్టీ నుంచి ఓ సీనియర్ నేత ఎప్పటినుంచో అక్కడ పోటీ చేస్తూ వస్తున్నారు. ఇప్పడు అక్కడ టీడీపీ సీనియర్ నేత మీదకు జనసేనను ఉసిగొలుపుతున్నారు చంద్రబాబు. జనసేన, టీడీపీల్లో ఎవరు పోటీ చేసినా ఈసారి అక్కడ గెలిచేది ఫ్యాన్ పార్టీయే. అయితే టీడీపీ, జనసేన సీటు ఆశిస్తున్న ఇద్దరూ పోటీ చేసేది మేమే అని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుందో చూద్దాం. రాజమండ్రి రూరల్ స్థానం విషయంలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య రసవత్తర పోటీ కొనసాగుతోంది. ఈ స్థానం ఈసారి తనదంటే తనదని టీడీపీ, జనసేన అభ్యర్ధులు పోటీ పడి ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో పొత్తులో ఉన్న టీడీపీ- జనసేన పార్టీలు అసలీ స్థానానికి ఎవరిని అభ్యర్ధిగా ప్రకటిస్తారోనని రెండుపార్టీల క్యాడర్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరోవైపు ఇరువురు అభ్యర్ధులు పైకి అధిష్టానం మాటే శిరోధార్యమని చెపుతున్నా, తామే అభ్యర్ధులమంటూ క్యాడర్కు బహిరంగంగానే చెపుతున్నారు. అయితే రాజమండ్రిలో టీడీపీ తరపున ఆరుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చంద్రబాబు తనకు పొగ పెడుతున్నారనే విషయాన్ని అర్థం చేసుకుని సన్నిహితుల దగ్గర వాపోతున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదిరి టీడీపీలో సీనియర్ నేత. మంత్రిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేసిన గోరంట్ల చంద్రబాబు కంటే కూడా సీనియర్. తనకు ఏ మాత్రం అన్యాయం జరిగిందని భావించినా, వెంటనే తీవ్ర స్థాయిలో పార్టీని, అధినేతను విమర్శిస్తూ అలిగి కావాల్సినంది సాధించుకోవడం ఆయనకు అలవాటు. వరుసగా రెండు సార్లు విజయం సాధించిన రాజమండ్రి రూరల్ స్థానాన్ని ఈసారి జనసేనకు కేటాయించాలని పార్టీ అధిష్టానం భావిస్తుండటం బుచ్చయ్య చౌదిరికి తీవ్ర మనస్తాపం కలిగిస్తోంది. ఓవైపు తానే అభ్యర్ధిని చెపుతున్నా, కచ్చితంగా ఈస్థానాన్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ కు కేటాయించారంటూ విస్తృతంగా ప్రచారం జరగడం బుచ్చయ్యకు మింగుడుపడటంలేదు. రాజమండ్రి రూరల్ స్థానం తనదేనంటూ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందులు దుర్గేష్ ఎప్పటినుంచో నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి పదిరోజులకు ఒకసారి మీడియా సమావేశం నిర్వహించి రూరల్ స్థానం నుండి పోటీచేస్తానంటూ చెపుతున్నారు. టిక్కెట్ ఎవరికిచ్చినా సహకరిస్తామంటూనే పొత్తు ధర్మం ఒకటుంటుందని, దీనికోసం ఎంతటివారైనా త్యాగాలు చేయాల్సి వస్తుందని పరోక్షంగా బుచ్చయ్య చౌదిరికి సంకేతాలిస్తున్నారు. అసలే ఓవైపు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో తన ప్రమేయాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసిన ఆదిరెడ్డి వర్గంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య ఇపుడు రూరల్ స్థానాన్ని కూడా పొత్తు పేరిట జనసేనకు కేటాయిస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని సహించలేకపోతున్నారు. జనసేన నేత దుర్గేష్ మీడియా సమావేశం పెట్టిన మరుసటిరోజే ఆయన కూడా మీడియా సమావేశం నిర్వహించి, తాను రాజమండ్రి రూరల్ స్థానం నుండే పోటీ చేస్తానని ప్రకటిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్లు ఇస్తామని చంద్రబాబు చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నారు. గతంలో కూడా బుచ్చయ్యకు టిక్కెట్ రాదని ప్రచారం జరిగినా ఆఖరు నిమిషంలో ఆయనే అభ్యర్ధంటూ ప్రకటించిన సంఘటనలు ఉన్నాయి. దీంతో అసలు రాజమండ్రి రూరల్ స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారో తెలియక అటు టీడీపీ, ఇటు జనసేన వర్గాలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడ పోటీ చేయడానికైనా సిద్ధమని చెపుతూనే రాజమండ్రి సిటీ స్థానానికైనా రెడీ అంటూ ఆదిరెడ్డి వర్గానికి కూడా జలక్ ఇస్తున్నారు బుచ్చయ్య. సింహం బయటకు వచ్చేవరకేనంటున్న బుచ్చయ్య చౌదిరికి ఈసారి చంద్రబాబు నిజంగానే టిక్కెట్ ఇస్తారో లేక పక్కన పెట్టేస్తారో చూడాలి. చదవండి: ‘మోసానికి, అవినీతికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్’ -
గంటా శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్తు ఏంటో?
ప్రతీ ఎన్నికలోనూ పార్టీనీ నియోజక వర్గాన్నీ మారుస్తూ పోయే అరుదైన రాజకీయ నాయకుడు గంటా శ్రీనివాసరావుకు ఈ సారి మారడానికి నియోజక వర్గం దొరకడం లేదు. ఉన్న నియోజక వర్గంలో తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకున్న గంటా గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన నియోజక వర్గానికే బదలీ అవుదామని అనుకుంటోన్నా అక్కడి టిడిపి-జనసేన నేతలు గంటాకు టికెట్ ఇవ్వనే ఇవ్వద్దని తెగేసి చెబుతున్నారు. దీంతో గంటాకు రాజకీయ భవిష్యత్తు ఏంటో అర్ధం కావడం లేదు. చంద్రబాబు నాయుడి హయాంలో జరిగిన పలు కుంభకోణాల్లో నిందితుడిగా ఉన్న నారాయణ కాలేజీల అధినేత నారాయణకు వియ్యంకుడు అయిన విశాఖ ఉత్తర నియోజక వర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి నియోజక వర్గం దొరికేలా కనిపించడం లేదు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతల నియోజక వర్గాలను సామాజిక సమీకరణలకోసం మారిస్తే.. ఎమ్మెల్యేలను కూడా బదలీ చేస్తారట అంటూ డ్రామాలాడిన చంద్రబాబు తన పార్టీలో ఉంటూ ప్రతీ ఎన్నికలోనూ కొత్త నియోజక వర్గానికి బదలీ అయ్యే గంటా శ్రీనివాసరావు గుర్తుకు రాలేదు కాబోలు. రెండున్నర దశాబ్దాల క్రితం ఉత్తరాంధ్రకు వలస వచ్చిన గంటా శ్రీనివాసరావు 1999లో మొదటి సారి టిడిపి తరపున అనకాపల్లి లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి గెలిచారు. అయిదేళ్ల కాలంలో నియోజక వర్గానికి చేసిందేమీ లేకపోవడంతో వ్యతిరేకత మూటకట్టుకున్నారు. అంతలో 2004 ఎన్నికల నగారా మోగింది. అనకాపల్లి లోక్ సభ స్థానం నుండి పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని భయపడ్డ గంటా చోడవరం అసెంబ్లీ నియోజక వర్గానికి ట్రాన్స్ ఫర్ అయ్యారు. అది కూడా చంద్రబాబు ఆశీస్సులతోనే. అలా ఆ ఎన్నికల్లో చోడవరంలో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అయిదేళ్ల పాటు నియోజక వర్గ ప్రజలను పట్టించుకోకుండా కాలక్షేపం చేశారు. చూస్తూ ఉండగానే 2009 ఎన్నికలు వచ్చాయి. ఈ సారి చోడ వరం నుండి పోటీ చేస్తే ఘోర పరాజయం తప్పదని గ్రహించారు. అంతే కాదు టిడిపి లోనే ఉంటే డిపాజిట్లు రావని గమనించారు. అంతే చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో చేరి అనకాపల్లి నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అయిదేళ్లు పాటు నియోజక వర్గాన్ని గాలికి వదిలేశారు. రాష్ట్ర విభజన జరిగింది. గత ఎన్నికల్లో తాను గెలిచిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం చెందింది. దాంతో 2014 ఎన్నికల్లో మళ్లీ పార్టీ మార్చి టిడిపిలో చేరారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజక వర్గానికి తాను చేసిందేమీ లేకపోవడంతో గెలిచే అవకాశాలు శూన్యమని తెలుసుకున్నారు. అంతే మరోసారి తన నియోజక వర్గాన్ని భీమిలికి ట్రాన్స్ ఫర్ చేశారు. ఆ ఎన్నికల్లోనూ గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. మళ్లీ అయిదేళ్లు పూర్తయ్యింది. భీమిలిలోనూ గంటా పనితీరుగురించి మాట్లాడుకోడానికి ఏమీ లేకపోయింది. 2019 ఎన్నికలు వచ్చాయి. అప్పుడు పార్టీ మారుద్దామనుకున్నారు కానీ ఆయనకు అక్కడ ఎంట్రీ లేకపోవడంతో టిడిపిలోనే కొనసాగారు. కాకపోతే మరోసారి నియోజక వర్గం మార్చారు. భీమిలి నుండి విశాఖ నార్త్ కు ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఈవీఎంలు మార్చాయన్న ఆరోపణల నేపథ్యంలో వివాదస్సద విజయాన్ని మూటకట్టుకున్నారు. అయదేళ్లు కాలిమీద కాలేసుకుని కాలక్షేపం చేశారేతప్ప నియోజక వర్గాన్ని పట్టించుకోలేదు. దాంతో విశాఖ^నార్త్ ప్రజలు గంటా పేరు చెబితేనే నిప్పులు చెరుగుతున్నారు. ఈ సారి అక్కడి నుండి పోటీ చేస్తే నోటాకి వచ్చే ఓట్లు కూడా రావని గంటా భయపడుతున్నారు. అందుకే మళ్లీ ట్రాన్స్ ఫర్ కావాలని చూస్తున్నారు. 2014లో పోటీ చేసిన భీమిలికే మారాలని అనుకుంటున్నారు. అయితే అది అంత వీజీగా కనపడ్డం లేదు. భీమిలిలో టిడిపి నేత రాజబాబు, జనసేన నేత పంచకర్ల సందీప్ లు ఇద్దరూ కూడా గంటాకు భీమిలి నుండి టికెట్ ఇవ్వద్దని నారా లోకేష్ చెవులు రెండూ కొరికేస్తున్నారట. ఒక వేళ గంటాకే టికెట్ ఇస్తే తామే దగ్గరుండి ఓడిస్తామని వారు ఆఫర్ కూడా ఇచ్చారని అంటున్నారు. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావుకు పోటీ చేద్దామంటే అనువైన నియోజక వర్గమే కనపడ్డం లేదని పార్టీలో గుస గుసలు వినపడుతున్నాయి. భీమిలి నియోజక వర్గాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే అవకాశాలున్నాయి. మరి నియోజక వర్గంతో పాటు పార్టీకూడా మార్చే అలవాటున్న గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో జనసేనలోకి ట్రాన్స్ పర్ అయ్యి భీమిలి టికెట్ కొనుక్కుంటారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే చాలా కాలంగా భీమిలిలో జనసేన కోసం పనిచేస్తోన్న పంచకర్ల సందీప్ మాత్రం తనకు టికెట్ ఇవ్వకపోతే జనసేనకు గుడ్ బై చెప్పి గంటాను ఓడించడమే జీవిత లక్ష్యంగా పెట్టుకునే అవకాశాలున్నాయంటున్నారు. మరి గంటా ఏం చేస్తారనేది చూడాలి. చదవండి: ఏపీ బీజేపీకి కొత్త టెన్షన్.. డ్యామేజ్ తప్పదా? -
'జనసేన పార్టీని రద్దు చేయాలి'
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా, సంక్షేమ పథకాలు అందక ప్రజలు ఆందోళన చెందుతుంటే జనసేన వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నాడని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్కిరణ్ ప్రశ్నించారు. ప్రజలకు, అభిమానులకు న్యాయం జరగని పక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానంటూ పార్టీ ఆవిర్భావ సమయంలో గొప్పలు చెప్పిన పవన్ కల్యాణ్ అధికారపక్షంపై పల్లెత్తుమాటైనా వ్యాఖ్యానించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా ఉన్నందున జనసేన పార్టీని ఎన్నికల సంఘం రద్దు చేయాలని డిమాండ్ చే శారు. పవన్ ఎక్కడున్నాడంటూ ప్రజలంతా ప్రశ్నిస్తున్నారని చెప్పారు. కట్టుకున్న భార్యకు, పుట్టిన బిడ్డకు న్యాయం చేయని పవన్ ప్రజలకు ఏమి చేస్తాడని ఎద్దేవా చేశారు. -
కాంగ్రెస్ తప్ప ఏ పార్టీతోనైనా కలసి పనిచేస్తా