Top Stories
ప్రధాన వార్తలు
![BCCI Announce Rs 125 Crore Prize Money For Team India After T20 World Cup Win](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/aww.jpg.webp?itok=ja9rztfQ)
టీమిండియాకు రూ. 125 కోట్ల ప్రైజ్మనీ
టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. పొట్టి ఫార్మాట్లో జగజ్జేతగా నిలిచిన టీమిండియాకు రూ. 125 కోట్ల ప్రైజ్మనీని ప్రకటిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. టోర్నీ ఆధ్యాంతం టీమిండియా అసాధారణ ప్రతిభ, దృడ సంకల్పం మరియు క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించిందని షా ట్వీట్ చేశాడు. అత్యుత్తమ విజయాన్ని సాధించిన ఆటగాళ్లు, కోచ్లు, సహాయక సిబ్బందికి అభినందనలు తెలిపారు.కాగా, నిన్న (జూన్ 29) జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో టీ20 ప్రపంచకప్ టైటిల్ సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. విరాట్ కోహ్లి (59 బంతుల్లో 76; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (31 బంతుల్లో 47; ఫోర్, 4 సిక్సర్లు), శివమ్ దూబే (16 బంతుల్లో 27; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టగా.. జన్సెన్, రబాడ చెరో వికెట్ దక్కించుకున్నారు.I am pleased to announce prize money of INR 125 Crores for Team India for winning the ICC Men’s T20 World Cup 2024. The team has showcased exceptional talent, determination, and sportsmanship throughout the tournament. Congratulations to all the players, coaches, and support… pic.twitter.com/KINRLSexsD— Jay Shah (@JayShah) June 30, 2024అనంతరం 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. హార్దిక్ పాండ్యా (3-0-20-3), అర్ష్దీప్ సింగ్ (4-0-20-2), బుమ్రా (4-0-18-2) సత్తా చాటడంతో లక్ష్యానికి 8 పరుగుల దూరంలో (169/8) నిలిచిపోయింది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆదిలో తడబడినప్పటికీ.. మధ్యలో క్లాసెన్ (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) టీమిండియాను భయపెట్టాడు. ఆఖర్లో బుమ్రా, హార్దిక్, అర్ష్దీప్ అద్బుతంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా విజయతీరాలకు చేరింది.వరల్డ్కప్ గెలిచిన అనంతరం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 కెరీర్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ఈ టోర్నీతోనే ముగిసింది.
![Jaggampeta Mla Jyothula Nehru Sensational Comments On Volunteers](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/JyothulaNehru_0.jpg.webp?itok=fTCmiV56)
వాలంటీర్లు వద్దట!.. జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కాకినాడ జిల్లా: వాలంటీర్లపై తమ అసలు రంగును టీడీపీ నేతలు బయటపెడుతున్నారు. వాలంటీర్ల సేవలు అవసరం లేదని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తేల్చి చెప్పేశారు. వాలంటీర్లు వద్దని టీడీపీ లేజిస్లేటివ్ సమావేశంలో చెబుతా.. అసెంబ్లీ సమావేశాల్లో ఒత్తిడి చేస్తానంటూ ఆయన వ్యాఖ్యానించారు. వాలంటీర్ల కంటే పారిశుధ్య కార్మికులకు రూ.10 వేలు ఇచ్చి నియమించుకోవాలన్న జ్యోతుల నెహ్రూ.. సచివాలయ ఉద్యోగులకు కాపలా కుక్కల్లా ఏన్డీఏ కార్యకర్తలు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.కాగా, ఐదేళ్ల క్రితం ఏర్పాటైన విప్లవాత్మక వలంటీర్ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం త్రిశంకు స్వర్గంలో పెట్టేసింది. 2019 ఆగస్టులో గత ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టగా వీరు నిర్వహించే విధుల్లో ప్రతి నెలా టంఛన్గా పింఛన్ల పంపిణీ అత్యంత కీలకం. అయితే జూలైలో పింఛన్ల పంపిణీని వలంటీర్ల ద్వారా కాకుండా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా నిర్వహించాలని మంత్రివర్గ తొలి సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో వలంటీర్ల వ్యవస్థపై అటు అధికార వర్గాలు ఇటు రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతో పాటు వారి గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికలకు ముందు చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. టీడీపీ–జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోనూ దీన్ని పొందుపరిచారు. అయితే ఇప్పుడు వలంటీర్లు ప్రధానంగా నిర్వహించే విధుల నుంచి వారిని దూరంగా ఉంచడం, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పింఛన్ల పంపిణీకి సన్నద్ధం కావడంతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చర్చనీయాంశంగా మారింది.
![Bengal Governor vs Mamata Banerjee Government](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/mamata_0.jpg.webp?itok=RBZI23So)
‘మమత’ వర్సెస్ గవర్నర్: తారాస్థాయికి విభేదాలు..!
కోల్కతా: వెస్ట్బెంగాల్లో మమతాబెనర్జీ ప్రభుత్వం, గవర్నర్ ఆనంద బోస్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కోల్కతా నగర పోలీసు కమిషనర్ వినీత్కుమార్ను ఆ పదవి నుంచి తప్పించాలని గవర్నర్ బోస్ సీఎం మమతకు లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే గవర్నర్ డిమాండ్ను మమత ప్రభుత్వం తిరస్కరించినట్లు సమాచారం. రాజ్భవన్ను ఆనుకోని పోలీసులు ఓ కంటట్రోల్ను నిర్మించి తన కదలికలపై నిఘా ఉంచినట్లు గవర్నర్ భావిస్తున్నరని తెలుస్తోంది. దీంతో ఆయన కోల్కతా నగర పోలీసు కమిషనర్ను తప్పించాలని కోరుతున్నట్లు చెబుతున్నారు. అయితే కంట్రోల్ రూమ్ కొత్తగా నిర్మించి కాదని, రాజ్భవన్ భద్రత కోసం గత ప్రభుత్వాల హయాం నుంచే అక్కడ ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, రాజ్భవన్లో మహిళలకు రక్షణ లేదని సీఎం మమత చేసిన ఆరోపణలపై గవర్నర్ ఇప్పటికే కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
![Success Story About Vadilal Gandhis Vadilal Ice Cream Business](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/vadilal-gandhi.jpg.webp?itok=OqxD0fPe)
ఎవరీ వడిలాల్ గాంధీ?.. రోడ్డుపక్కన ప్రారంభమై వేల కోట్ల సామ్రాజ్యాన్ని..
ఇప్పుడు ప్రముఖ బ్రాండ్లుగా ప్రసిద్ధి చెందిన సంస్థలన్నీ ఒకప్పుడు చిన్న కంపెనీలుగా ప్రారంభమైనవే. ఈ కోవకు చెందిన వాటిలో ఒకటి 'వడిలాల్ ఐస్క్రీమ్' కంపెనీ. ఈ కంపెనీ ఫౌండర్ 'వడిలాల్ గాంధీ'. ఇంతకీ ఈయన కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ప్రస్తుతం ఈ కంపెనీ విలువ ఎంత? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.మధ్యతరగతి కుటుంబానికి చెందిన 'వడిలాల్ గాంధీ' 1907లో అహ్మదాబాద్లోని ఒక చిన్న ఫౌంటెన్ సోడా దుకాణం ప్రారంభించారు. ఆ తరువాత సోడా విక్రయించడం ప్రారంభించారు. క్రమక్రమంగా.. గుజరాత్లో ఈయన దుకాణానికి ఆదరణ పెరిగింది. ఆ తరువాత సోడాతో పాటు ఐస్క్రీమ్ విక్రయించడం ప్రారంభించారు.వడిలాల్ గాంధీ ప్రారంభించిన ఐస్క్రీమ్ షాప్ బాగా అభివృద్ధి చెందింది. 1926లో ఈయన దేశంలోనే మొట్టమొదటి ఐస్క్రీమ్ అవుట్లెట్ స్థాపించారు. ఐస్క్రీమ్ వ్యాపారాన్ని విస్తరించడానికి అప్పట్లో జర్మనీ నుంచి యంత్రాలను దిగుమతి చేసుకున్నారు. ఆ తరువాత వడిలాల్ గాంధీ కుమారుడు రాంచోడ్ లాల్ గాంధీ వ్యాపార బాధ్యతలు చేపట్టారు.1970 నాటికి అహ్మదాబాద్లో మొత్తం 10 వడిలాల్ అవుట్లెట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని అప్పట్లో రాంచోడ్ లాల్ కుమారులు రామచంద్ర, లక్ష్మణ్ గాంధీలు నిర్వహించారు. నేడు ఈ కంపెనీ భారతదేశంలోని అతిపెద్ద ఐస్క్రీమ్ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. గతంలో ఈ కంపెనీ వండిన కూరలు, రొట్టెలు మొదలైన ప్రాసెస్ చేసిన ఆహారాన్ని విక్రయించింది.ప్రస్తుతం వడిలాల్ కుటుంబానికి చెందిన ఐదవ తరం వ్యక్తి 'కల్పిత్ గాంధీ' కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీ కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా అమెరికాలో కూడా ఐస్క్రీమ్ విక్రయిస్తూ ప్రజాదరణ పొందుతోంది.1907లో ఓ వీధి దుకాణంగా ప్రారంభమైన వడిలాల్ కంపెనీ నేడు ప్రముఖ ఐస్క్రీమ్ బ్రాండ్ అయిపోయింది. ప్రస్తుతం వడిలాల్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ. 30,00,00,00,000. దీన్నిబట్టి చూస్తే.. వీధి పక్కన ఓ చిన్న షాపుగా ప్రారంభమై నేడు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ.. వ్యాపార రంగంలో దూసుకెళ్తోంది.
![Ex Minister Botsa Satyanarayana Comments On Tdp Leaders](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/BotsaSatyaNarayana.jpg.webp?itok=y715VQeO)
టీడీపీ విష సంస్కృతి.. ఇదేం దౌర్జన్యం: బొత్స
సాక్షి, విజయనగరం: ఎన్నికల తర్వాత దాడులు పెరిగాయని.. ప్రజాస్వామ్యంలో ఇటువంటివి ఉండకూడదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 20 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధేస్తుందన్నారు.ప్రజాస్వామ్యంలో సామాన్య ప్రజలకు హక్కులున్నాయి. విజయనగరంలో మా పార్టీ ఆఫీసులోకి టీడీపీ నాయకులు చోరబడ్డారు. ఇటువంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. చట్టబద్ధంగా మా పార్టీ ఆఫీసులు నిర్మాణాలు జరుగుతున్నాయి. యూనివర్శిటీల వీసీలపై కూడా దౌర్జన్యానికి దిగుతున్నారు’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.‘విజయనగరం జిల్లా లో విష సంస్కృతి వచ్చింది. ప్రతిపక్ష వైస్సార్సీపీ పార్టీ కార్యాలయానికి వెళ్లి అధికార పార్టీ ఎమ్మెల్యే పరిశీలించడం ఏమిటి?. ఏదయిన పొరపాట్లు జరిగితే నోటీస్ ఇవ్వవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించవచ్చు. యూనివర్సిటీల్లో వీసీలను నామినేట్ చేయడం ఒక విధానం. ఆ వీసీ కార్యాచరణ నచ్చకపోతే నోటీస్ ఇవ్వవచ్చు. వీసీ ఆఫీస్లకు వెళ్లి బెదిరించడం, తొలగించడం తప్పు. అవినీతి పై ఎంక్వయిరీ కోరడం తప్పు కాదు. అధికారం వాళ్ల చేతుల్లో వుంది. విద్యాశాఖ లో నాపై వచ్చిన ఆరోపణలు పై నో కామెంట్. ఫైల్స్ వాళ్ళ దగ్గర వున్నాయి. పరిశీలించుకోవాలి. కొందరు రిటైర్ అయిన అధికార్లు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడరు. అధికారం పోయాక వచ్చి చెప్తారు. అది ఎంత వరకు సమంజసం.’’ అంటూ బొత్స మండిపడ్డారు‘‘అనుభవం ఉన్న పార్టీ కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వాళ్లకు తెలుసు. పథకాలు ఇస్తారో ఇవ్వరో వాళ్లకే తెలియాలి. రేపు ఏప్రిల్ నెలలో రిటైర్మెంట్తో కలుపుకొని 6 వేలు టీచర్ ఖాళీలు ఉన్నాయని అంచనా. ఈ ప్రభుత్వం 50వేలు అంచనా వేసి 16వేలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. కేంద్రం పార్లమెంట్ లో 30వేలు పోస్ట్లు ఖాళీ ఉన్నాయని అన్నారు. 117జీవోని రద్దు చేస్తే ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితిని బట్టి ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వవచ్చు’’ అని బొత్స పేర్కొన్నారు.
![Woman Beaten Up In Bengal Town Draws Fire](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/WestBengal-01.jpg.webp?itok=AIC7gO9a)
బెంగాల్: యువతిని చితకబాదిన ఘటనపై దుమారం
కోల్కతా: వెస్ట్బెంగాల్లో ఓ వీడియో దుమారం రేపుతోంది. ఓ యువతిని రోడ్డుపై పడేసి కర్ర విరిగేలా చితకబాదుతున్న వీడియో ఒకటి సోషల్మీడియాలో వైరల్గా మారింది.యువతిని కొడుతుండగా చుట్టూ నిలబడిన వారంతా చూస్తూ ఉండిపోయారు తప్ప ఆపడానికి ఎవరూ ప్రయత్నించలేదు. ఈ ఘటన బెంగాల్లో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితి తెలియజేస్తోందని మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఘటనపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్య ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేశారు. ‘ఈ వీడియోలో యువతిని దారుణంగా కొడుతున్నది చోప్రా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న తృణమూల్ ఎమ్మెల్యే హమిదుర్ రెహ్మాన్ అనుచరుడు తేజ్ముల్ అనే వ్యక్తి. ఇతను తన ‘ఇన్సాఫ్’ సభల ద్వారా పంచాయితీలు చేసి అక్కడికక్కడే శిక్షలు విధిస్తుంటాడు. This is the ugly face of Mamata Banerjee’s rule in West Bengal.The guy in the video, who is beating up a woman mercilessly, is Tajemul (popular as JCB in the area). He is famous for giving quick justice through his ‘insaf’ sabha and is a close associate of Chopra MLA Hamidur… pic.twitter.com/fuQ8dVO5Mr— Amit Malviya (@amitmalviya) June 30, 2024తృణమూల్ కాంగ్రెస్ పాలనలో ఈ తరహా షరియా కోర్టులున్నాయని భారత ప్రజలు మొత్తం గుర్తించాలి. బెంగాల్లో ప్రతి గ్రామంలో ‘సందేశ్ఖాలీ’తరహా ఘటనలు జరుగుతున్నాయి. మమత పాలన వెస్ట్బెంగాల్కు ఒక శాపం’అని మాలవ్య ట్వీట్లో ఫైర్ అయ్యారు. మరోపక్క సీపీఎం నేతలు కూడా యువతిని కొడుతున్న వీడియోపై స్పందించారు. బెంగాల్లో బుల్డోజర్ జస్టిస్ రాజ్యమేలుతోందని సీపీఎం స్టేట్ సెక్రటరీ ఎండీ సలీమ్ ఎక్స్(ట్విటర్)లో విమర్శించారు. కాగా, యువతిని చితకబాదిన ఘటన ఈ వారాంతంలోనే జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఏ కారణంతో కొడుతున్నారనేది తెలియరాలేదు. Not even #KangarooCourt ! Summary trial and punishment handed out by d @AITCofficial goon nicknamed JCB.Literally bulldozer justice at Chopra under @MamataOfficial rule. pic.twitter.com/TwJEThOUhi— Md Salim (@salimdotcomrade) June 30, 2024
![Elon Musk Third Wife Who is Shivon Zilis](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/elon-musk_1.jpg.webp?itok=J25y1RXa)
మస్క్ మూడో భార్య.. ఎవరీ 'శివోన్ జిలిస్'?
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్' (Elon Musk) ఇటీవల మరో బిడ్డకు తండ్రి అయ్యారు. న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్.. మస్క్ మూడో భార్య శివోన్ జిలిస్ (Shivon Zilis) ఇటీవల బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో మస్క్ ఇప్పుడు 12మంది పిల్లలకు తండ్రయ్యారు. ఇంతకీ జిలిస్ ఎవరు? ఈమెకు భారతదేశానికి సంబంధం ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.మస్క్, జిలిస్ బిడ్డకు జన్మనివ్వడం రహస్యంగా జరిగిందని కొన్ని వార్తలు తెరమీదకు వచ్చాయి. దీనికపైన మస్క్ స్పందిస్తూ.. ఇదేమీ రహస్యం కాదని నా సన్నిహితులకు అందరికి ఈ విషయం తెలుసనీ, పేపర్ ప్రకటన ఇవ్వకపోతే అదేమీ రహస్యం కాదని అన్నారు. నవంబర్ 2021లో మస్క్, జిలిస్ కవలలకు (స్ట్రైడర్, అజూర్) జన్మనిచ్చారు. కాగా ఇప్పుడు వీరు మరో బిడ్డకు జన్మనిచ్చారు.ఎవరీ శివోన్ జిలిస్?ఇటీవల మూడో బిడ్డకు జన్మనిచ్చిన శివోన్ జిలిస్ కెనడాలో జన్మించినప్పటికీ ఆమె తల్లి శారద భారతదేశానికి చెందిందని 2015లో యూఎస్ఏ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. జిలిస్ అమెరికాలోని యేల్ యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్, ఎకనామిక్స్ అండ్ ఫిలాసఫీలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. జిలిస్ మస్క్ బ్రెయిన్-చిప్ స్టార్టప్ న్యూరాలింక్లో టాప్ ఎగ్జిక్యూటివ్. అంతకు ముందు ఈమె సుదీర్ఘకాలం ఆపరేషన్స్ అండ్ స్పెషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ హోదాలో పనిచేసినట్లు తెలుస్తోంది.
![A Transwoman Rituparna Neog Who Is Promoting Queer Awareness](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/rethu.jpg.webp?itok=iAgCbv4l)
ఆ ఫోబియాకు పుస్తకాల శక్తితో చెక్ పెట్టి..స్ఫూర్తిగా నిలిచిన ట్రాన్స్విమెన్!
ట్రాన్స్జెండర్లను మన సమాజం ఎలా చూస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లను ఆదరించి, అక్కున చేర్చుకోవడం అటుంచి కనీసం మనిషిగా కూడా చూడరు. శారీరకంగా వచ్చే మార్పులని సైన్స్ చెబుతున్నా..విద్యావంతులు సైతం వాళ్లను సాటి మనుషులుగా గుర్తించరు. ఎన్నో వేధింపులు, అవమానాలు దాటుకుని కొందరూ మాత్రమే పైకొచ్చి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కొద్దిమంది మాత్రమే తమలాంటి వాళ్లు వేధింపులకు గురికాకుండా తలెత్తుకుని బతకాలని పాటుపడుతున్నారు. అలాంటి కోవకు చెందిందే రితుపర్ణ నియోగ్. ఎవరీ నియోగ్? ఏం చేస్తోందంటే..అస్సాంకి చెందిన రితుపర్ణ నియోగ్ చిన్నతనంలో ఎన్నో బెరింపులు, వేధింపులకు గురయ్యింది. తన బాల్యంకి సంబంధించిన పాఠశాల జ్ఞాపకాలన్నీ చేదు అనుభవాలే. కొద్దిలో రితుపర్ణకు ఉన్న అదృష్టం ఏంటంటే..కుటుంబం మద్దతు. తన కుటుంబ సహాయ సహకారాల వల్ల ఇంట్లో ఎలాంటి వేధింపులు లేకపోయినా..బయట మాత్రం తన తోటి స్నేహితుల నుంచే విపరీతమైన వేధింపులు ఎదుర్కొంది రితుపర్ణ. కొన్నాళ్లు ఇంటికే పరిమితమై లింగ గుర్తింపు విషయమై క్వీర్ ఫోబియాను పేర్కొంది. ఇక్కడ క్వీర్ అంటే..క్వీర్ అనేది లైంగిక, లింగ గుర్తింపులను వివరించే పదం. లెస్బియన్, గే, బైసెక్సువల్, లింగమార్పిడి వ్యక్తులు అందరూ క్వీర్ అనే పదంతో గుర్తిస్తారు. వారు ఎదుర్కొనే సమస్యల కారణంగా భయాందోళనకు లోనై బయటకు తిరిగేందుకే జంకితే దాన్ని క్వీర్ ఫోబియా అంటారు. తనలా అలాంటి సమస్యతో మరెవ్వరూ ఇంటికే పరిమితం కాకుండా ఉండలే చేసేందుకు నడుంబిగించింది రితుపర్ణ. దానికి ఒక్కటి మార్గం పుస్తకాలను ప్రగాఢంగా నమ్మింది. వారు బాగా చదువుకుంటే తమ హక్కులు గురించి తెలుసుకోగలుగుతారు, ఇలా భయంతో బిక్కుబిక్కుమని కాలం గడపరనేది రితుపర్ణ నమ్మకం. తాను కూడా ఆ టైంలో ఎదురయ్యే అవమానాలను ఎలాఫేస్ చేయాలనేది తెలియక సతమతమయ్యి ఆ క్రమంలోనే నాలుగు గోడలకు పరిమితమైనట్లు చెప్పుకొచ్చింది రితుపర్ణ. చివరికి ఏదోలా బయటపడి..ఉన్నత చదువులు చదువుకున్నానని చెప్పుకొచ్చింది. 2015లో గౌహతిలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో చదవు పూర్తి చేసుకుని గ్రామానికి తిరిగి వచ్చినట్లు తెలిపింది. అప్పుడే తన గ్రామం దేశంలోని ఇతర ప్రాంతాల కంటే ఎంత వెనుకబడి ఉందనేది తెలుసుకుంది. ట్రాన్స్ జెండర్గా తాను మాత్రం ఈ గ్రామం నుంచి బయటకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకున్నాని గ్రహించి..తనలాంటి వాళ్ల అభ్యన్నతికి పాటుపడాలని లక్ష్యం ఏర్పరుచుకుంది. ఆ నేఫథ్యంలో 2020లో తనలాంటి పిల్లల కోసం 'కితాపే కథా కోయి' అనే హైబ్రిడ్ స్టోరీ టెల్లింగ్ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. ఉచిత కమ్యూనిటీ లైబ్రరీలతో గ్రామంలోని పిల్లలు టీ ఎస్టేట్లోకి వెళ్లకుండా ఉండేలా చేసింది. వాళ్లు ఆ లైబ్రరీలో హిందీ, అస్సామీ, ఆంగ్లం వంటి పుస్తకాలను చదివేందుకు సహకరిస్తుంది రితుపర్ణ. తన గ్రామంలోని ప్రజలతో తన ఆలోచనను పంచుకోవడమే గాక, ఆచరణలోకి తీసుకొచ్చింది. మొదటగా తన స్వంత పుస్తకాలతో ఉచిత లైబ్రరీ తెరిచింది. అలా వందలాది పుసక్తాలతో కూడిన పెద్ద లైబ్రరీగా రూపాంతరం చెందింది. ఆ లైబ్రరీలో.. లింగం, లైంగికత, మానసిక ఆరోగ్యం, వాతావరణ న్యాయం, సామర్థ్యం, స్త్రీవాదం, మైనారిటీ హక్కులు వంటి వివిధ విషయాలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. రీతుపర్ణ ఇటీవల అస్సాం ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలోని ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం నేషనల్ కౌన్సిల్కు సభ్య ప్రతినిధిగా నామినేట్ అయ్యారు. View this post on Instagram A post shared by Rituparna (@the_story_mama) (చదవండి: అత్యంత లగ్జరియస్ వివాహం..ఒక్కో అతిథికి ఏకంగా..!)
![Hanu Man To Kalki 2898 AD: Tollywood First 6 Months Report](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/Movie-Story-01_0.jpg.webp?itok=5RsUV6Nq)
హనుమాన్ టు కల్కి.. టాలీవుడ్ ఫస్టాప్ ఎలా ఉందంటే..
టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్గా మారింది. ఇక్కడి సినిమాలను ప్రపంచం మొత్తం ఆదరిస్తోంది. వందల కోట్ల కలెక్షన్స్ రాబడుతూ రికార్డులను సృష్టిస్తోంది. అయితే ఇక్కడ సక్సెస్ ఎంత శాతం ఉందో ఫెయిల్యూర్ అంతే ఉంది. కొన్ని సినిమాలు ఊహించని రీతిలో కలెక్షన్స్ రాబడితే.. మరికొన్ని దారుణమైన అపజయాన్ని మూటగట్టుకున్నాయి. ఈ ఆరు నెలల్లో టాలీవుడ్ రిపోర్ట్ ఎలా ఉందో చూసేద్దాం.ఓపెనింగ్ అదిరింది!టాలీవుడ్కి సంక్రాంతి పండగ చాలా పెద్దది. ప్రతి సంక్రాంతికి ఒకటి రెండు పెద్ద సినిమాలు వస్తుంటాయి. కానీ ఈ ఏడాది మాత్రం ఏకంగా నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘గుంటూరు కారం’, వెంకటేశ్ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామిరంగ’తో పాటు కుర్రహీరో తేజ సజ్జ ‘హనుమాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే వీటిల్లో హనుమాన్ భారీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. స్టార్ హీరోల సినిమాలు బరిలో ఉన్నప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులు ‘హనుమాన్’కే ఓటేశారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 300 కోట్ల కలెక్షన్స్ని రాబట్టింది. గుంటూరుకారం, నా సామిరంగ చిత్రాలకి మిశ్రమ టాక్ వచ్చినా.. మంచి వసూళ్లనే రాబట్టాయి. సైంధవ్ మాత్రం దారుణంగా బోల్తాపడింది. అంతకు ముందు జనవరి 1న వచ్చిన సర్కారు నౌకరి, రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజైన ‘ర్యాపిడ్ యాక్షన్ మిషన్’, ‘బిఫోర్ మ్యారేజ్’ సినిమాలు ప్లాప్ టాక్నే మూటగట్టుకున్నాయి.బ్యాండ్ మోగింది..ఇక ఫిబ్రవరి తొలివారంలో సుహాస్ హీరోగా నటించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’ విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి విజయమే సాధించింది. అదేవారంలో వచ్చిన ‘కిస్మత్’, ‘హ్యాపీ ఎండింగ్’, ‘బూట్కట్ బాలరాజు’, ‘గేమ్ ఆన్’ చిత్రాలు మాత్రం సందడి చేయలేకపోయాయి. ఇక రెండో వారంలో వచ్చిన రవితేజ ఈగల్, మమ్ముట్టి, జీవా ల‘యాత్ర 2’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపంచాయి. మూడోవారంలో వచ్చిన ‘ఊరు పేరు భైరవకోన’ప్రేక్షకలను కొంతమేర భయపెట్టేసింది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక చివరివారంలో వచ్చిన ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’, ‘రాజధాని ఫైల్స్’, ‘సిద్ధార్థ్ రాయ్’, ‘సుందరం మాస్టర్’ చిత్రాలేవి ప్రేక్షకులను అలరించలేకపోయాయి. అయితే ఫిబ్రవరిలో ఈగల్, యాత్ర 2 తప్పితే మిగతావన్నీ అతి తక్కువ బడ్జెట్తో తెరకెక్కించిన చిన్న చిత్రాలే రిలీజ్ కావడం గమనార్హం.అలరించని సమ్మర్సంక్రాంతి తర్వాత సమ్మర్ సీజన్ టాలీవుడ్కి చాలా ముఖ్యమైనది. దాదాపు మూడు నాలుగు పెద్ద సినిమాలైనా వేసవిలో విడుదలయ్యేవి. కానీ ఈ ఏడాది సమ్మర్లో ఒక్క స్టార్ హీరో సినిమా కూడా రిలీజ్ కాలేదు. మార్చి తొలివారం వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అదేవారం భూతద్దం భాస్కర్ నారాయణ’, ‘చారి 111’, ‘ఇంటి నెంబర్ 13’లాంటి చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ.. ఏ ఒక్కటి అలరించలేదు. (చదవండి: బాక్సాఫీస్ వద్ద కల్కి నయా రికార్డ్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లో తెలుసా?)రెండోవారం గోపిచంద్ ‘భీమా’తో విశ్వక్ సేన్ ‘గామి’తో వచ్చాడు. వీటిల్లో భీమాకి ప్లాప్ టాక్ రాగా.. ‘గామి’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాలో బోల్తా పడ్డాయి. ఇక మూడో వారంలో రజాకార్, లంబసింగి, షరతులు వర్తిసాయి’తో పాటు అరడజనుకు పైగా చిన్న సినిమాలు రిలీజ్ అయినా..ఒక్కటి కూడా హిట్ కాలేదు. మూడో వారంలో రిలీజైన శ్రీవిష్ణు ‘ఓం భీమ్ బుష్’ థియేటర్లలో నవ్వులు పూయించింది. ఇక చివరి వారంలో వచ్చిన ‘టిల్లు స్వ్కేర్’ సూపర్ హిట్ కొట్టేసింది. బాక్సాపీస్ వద్ద దాదాపు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ‘టిల్లుగాడు’ సత్తా చాటాడు.ఏప్రిల్లో భారీ అంచనాలతో వచ్చిన విజయదేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అదేవారంలో రిలీజైన భరతనాట్యం’, ‘బహుముఖం’ చిత్రాలు ప్లాప్ టాక్ని సంపాదించుకున్నాయి. రెండోవారంలో రిజీలైన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రం యావరేజ్ టాక్ని సంపాదించుకుంది. ఇక చివరి రెండు వారాల్లో ‘శ్రీరంగనీతులు’ ‘పారిజాతపర్వం’, ‘మార్కెట్ మహాలక్ష్మీ, తెప్ప సముద్రం చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాగా..ఏ ఒక్కటి ఆకట్టుకోలేదు.(చదవండి: పాన్ ఇండియాపై ‘మెగా’ ఆశలు)మేలో తొలివారం ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ అల్లరి నరేశ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలా కాలం తర్వాత నరేశ్ నటించిన కామెడీ చిత్రమిది. మంచి అంచనాలతో రిలీజైన ఈ చిత్రం ఫ్లాప్ టాక్నే సంపాదించుకుంది. ఈ మూవీతో పాటు రిలీజైన సుహాస్ ‘ప్రసన్నవదనం’ చిత్రానికి మంచి టాక్ వచ్చినా.. వసూళ్లను మాత్రం రాబట్టలేకపోయింది. ఒక సెకండ్ వీక్లో సత్యదేవ్ ‘కృష్ణమ్మ’తో పాటు ‘ఆరంభం’ అనే చిన్న చిత్రం విడుదలైన..తొలిరోజే నెగెటివ్ టాక్ని సంపాదించుకున్నాయి. ఇక నారా రోహిత్ హీరోగా నటించిన ‘ప్రతినిధి 2’ థియేటర్స్కి వచ్చిన విషయమే తెలియదు. ఆ తర్వాత వారంలో ‘నట రత్నాలు’, ‘బిగ్ బ్రదర్’, ‘సీడీ’ ‘సిల్క్ శారీ’, ‘డర్టీ ఫెలో’, ‘బ్రహ్మచారి’తో పాటు మొత్తం అరడజను చిత్రాలు విడుదలైన ప్లాప్ టాక్ని మూటగట్టుకున్నాయి. గెటప్ శ్రీను తొలిసారి హీరోగా నటించిన ‘రాజు యాదవ్’ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక చివరివారం భజేవాయు వేగం, గం..గం..గణేశా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలు రిలీజ్ కాగా.. వీటిల్లో ‘భజే వాయు వేగం’ హిట్ టాక్కి సంపాదించుకుంది. ఇక జూన్ తొలివారం ‘సత్యభామ’ అంటూ కాజల్.. ‘మనమే’ అంటూ శర్వానంద్ ప్రేక్షకుల ముందుకు రాగా.. రెండు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేపోయాయి. అదేవారంలో లవ్ మౌళితో పాటు మరో రెండు చిత్రాలు రిలీజ్ అయ్యాయి కానీ.. ఏది హిట్ కాలేదు. రెండో వారంలో సుధీర్ బాబు ‘హరోం హర’తో పాటు ‘మ్యూజిక్ షాప్ మూర్తి, నీ దారే నీ కథ, యేవమ్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. వీటిల్లో మ్యూజిక్ షాప్ మూర్తి విమర్శకులు ప్రశంసలు అందుకుంది. మూడోవారంలో నింద, ‘ఓ మంచి ఘోస్ట్’, ‘హనీమూన్ ఎక్స్ప్రెస్’, ‘అంతిమ తీర్పు’ లాంటి పలు చిన్న సినిమాలు విడుదలైనా..ఏ ఒక్కటి అలరించలేదు. ఇక చివరి వారం మాత్రం టాలీవుడ్కి గుర్తిండిపోయే విజయాన్ని అందించింది. ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ జూన్ 27న విడుదలై హిట్ టాక్తో దూసుకెళ్తోంది. కేవలం మూడు రోజుల్లోనే 415 కోట్లను వసూళ్లు చేసి రికార్డ్ సృష్టిస్తోంది. మొత్తంగా ఈ ఆరు నెలల్లో హిట్ల కంటే ఎక్కువగా ఫ్లాపులే ఉన్నాయి. అయితే హనుమాన్, కల్కి 2898 చిత్రాలు మాత్రం చారిత్రాత్మక విజయాలను అందుకున్నాయి.
![If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/20/Untitled-2_9.jpg.webp?itok=Yu3M0cnh)
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?
NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి
ఏడు నెలలు దాటిపోయింది.. కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ ట్వీట్
డిప్యూటీ స్పీకర్ ‘ఎస్పీ’కి ఇవ్వండి: తృణమూల్
చాట్జీపీటీని రిక్వెస్ట్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఎందుకంటే?
T20 World Cup 2024: కప్ మనోళ్లదే, కానీ..!
వాళ్ల కోసమే 'కల్కి' చేశాను.. నాదేం లేదు: విజయ్ దేవరకొండ
నేరేడ్మెట్లో బాలికపై గ్యాంగ్ రేప్.. 10 మంది అరెస్ట్
టెస్లా కీలక నిర్ణయం.. సైబర్ట్రక్లకు రీకాల్ - ఎందుకో తెలుసా?
టీమిండియాకు రూ. 125 కోట్ల ప్రైజ్మనీ
హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం
వెంకయ్య నాయుడుపై మూడు పుస్తకాలు.. ప్రధాని మోదీ ఆవిష్కరణ
ఏడు నెలలు దాటిపోయింది.. కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ ట్వీట్
డిప్యూటీ స్పీకర్ ‘ఎస్పీ’కి ఇవ్వండి: తృణమూల్
చాట్జీపీటీని రిక్వెస్ట్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఎందుకంటే?
T20 World Cup 2024: కప్ మనోళ్లదే, కానీ..!
వాళ్ల కోసమే 'కల్కి' చేశాను.. నాదేం లేదు: విజయ్ దేవరకొండ
నేరేడ్మెట్లో బాలికపై గ్యాంగ్ రేప్.. 10 మంది అరెస్ట్
టెస్లా కీలక నిర్ణయం.. సైబర్ట్రక్లకు రీకాల్ - ఎందుకో తెలుసా?
టీమిండియాకు రూ. 125 కోట్ల ప్రైజ్మనీ
హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం
వెంకయ్య నాయుడుపై మూడు పుస్తకాలు.. ప్రధాని మోదీ ఆవిష్కరణ
సినిమా
![Sobhita Dhulipala In Kalki 2898 Movie Find It Where](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/kalki-Sobhita.jpg.webp?itok=f7SBK70a)
'కల్కి'లో ఈ తెలుగు హీరోయిన్ కూడా! మీరు గమనించారా?
'కల్కి 2898' మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. మూడు రోజుల్లో రూ.415 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు నమోదు చేసింది. సినిమాలో లీడ్ రోల్స్ చేసిన వాళ్లు నలుగురైతే.. అతిథి పాత్రల్లో మాత్రం లెక్కలేనంత మంది కనిపించారు. వీళ్లందరితో పాటు మరో తెలుగు హీరోయిన్ శోభిత కూడా ఇందులో భాగమైందనే విషయం మీకు తెలుసా? మరి మీరు ఏమైనా గమనించారా? ఇంతకీ ఎక్కడ ఉందో తెలుసా?(ఇదీ చదవండి: Kalki 2898 AD: అర్జునుడుగా విజయ్ దేవరకొండ.. రెమ్యునరేషన్ ఎంతంటే?)'కల్కి'లో ప్రభాస్, అమితాబ్, దీపిక, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషిస్తే.. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్, ఆర్జీవీ, రాజమౌళి, అనుదీప్, ఫరియా అబ్దుల్లా ఇలా బోలెడు మంది స్టార్స్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయే పాత్రల్లో కనిపించారు. వీళ్లతో పాటే నాగచైతన్య రూమర్ గర్ల్ ఫ్రెండ్, హీరోయిన్ శోభిత కూడా ఈ మూవీలో భాగమేనట. దీపికా పదుకొణె పాత్రకు తెలుగులో ఈమెనే డబ్బింగ్ చెప్పిందట.తొలుత తన పాత్ర కోసం దీపికనే డబ్బింగ్ చెప్పుకొంది. ట్రైలర్లోనూ ఆమె గొంతు వినిపించింది. కాకపోతే ఆ డబ్బింగ్ చూసి విమర్శలు వచ్చాయి. దీంతో మూవీలో దీపిక పాత్రకు శోభితతో డబ్బింగ్ చెప్పించారట. అలా 'కల్కి'లో కూడా శోభిత కూడా భాగమైందని అంటున్నారు. ఇదిలా ఉండగా శోభిత-నాగచైతన్య రిలేషన్ గురించి గత కొన్నాళ్ల నుంచి రూమర్స్ వస్తున్నాయి. దీనిపై ఓ క్లారిటీ వస్తే గానీ నెటిజన్లు ఊరుకునేలా లేరు!(ఇదీ చదవండి: ప్రభాస్ కల్కి.. వర్షంలో బుజ్జి కోసం బారులు తీరిన ఫ్యాన్స్!)
![Amitabh Bachchan Did Not Watch T20 World Cup Final Match](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/amitab.jpg.webp?itok=HUDbK-QQ)
ఫైనల్ చూడలేదు.. తెలియకుండానే కన్నీళ్లు: బిగ్బీ
దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. విశ్వవేదికపై భారత జెండా రెపరెపలాడింది. టీ 20 వరల్డ్కప్ (2024) ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. ఈ అపురూప క్షణాలను అభిమానులు, సినీ తారలు టీవీలో చూసి మురిసిపోయారు. ఎన్నాళ్లకెన్నాళ్లకు ఈ విజయం వరించిందని తన్మయత్వానికి లోనవుతున్నారు.టీవీ చూడలేదుబాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ సైతం సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. వరల్డ్ ఛాంపియన్స్గా ఇండియా.. టీ 20 వరల్డ్ కప్ 2024 గెలిచాం.. ఈ ఆనందం, ఎమోషన్స్ మాటల్లో చెప్పలేం. నేను మ్యాచ్ చూస్తే ఎక్కడ ఓడిపోతామోనని టీవీ చూడలేదు. మనందరి మనసులు భావోద్వేగంతో నిండిపోయాయి అని తన బ్లాగ్లో రాసుకొచ్చాడు.ఎమోషనల్ ట్వీట్'తెలియకుండానే కన్నీళ్లు వస్తున్నాయి. వరల్డ్ ఛాంపియన్స్ ఇండియా.. భారత్ మాతాకీ జై.. జై హింద్! జై హింద్!!' అని ఎక్స్లో ట్వీట్ చేశాడు. కాగా నిన్న (జూన్ 29న) జరిగిన టీ 20 వరల్డ్ కప్ ఫినాలేలో సౌతాఫ్రికాను వెనక్కునెట్టి భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే!సినిమాల సంగతి..అమితాబ్ సినిమాల విషయానికి వస్తే.. ఈయన కీలక పాత్రలో నటించిన కల్కి 2898 ఏడీ జూన్ 27న విడుదలైంది. ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్య ముఖ్య పాత్రల్లో మెరిశారు. ఈ చిత్రం మూడు రోజుల్లోనే ఏకంగా రూ.415 కోట్లు రాబట్టింది. T 5057 - Tears flowing down .. in unison with those that TEAM INDIA sheds ..WORLD CHAMPIONS INDIA 🇮🇳भारत माता की जय 🇮🇳जय हिन्द जय हिन्द जय हिन्द 🇮🇳— Amitabh Bachchan (@SrBachchan) June 29, 2024 చదవండి: బాక్సాఫీస్ వద్ద కల్కి నయా రికార్డ్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లో తెలుసా?
![Hanu Man To Kalki 2898 AD: Tollywood First 6 Months Report](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/Movie-Story-01_0.jpg.webp?itok=5RsUV6Nq)
హనుమాన్ టు కల్కి.. టాలీవుడ్ ఫస్టాప్ ఎలా ఉందంటే..
టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్గా మారింది. ఇక్కడి సినిమాలను ప్రపంచం మొత్తం ఆదరిస్తోంది. వందల కోట్ల కలెక్షన్స్ రాబడుతూ రికార్డులను సృష్టిస్తోంది. అయితే ఇక్కడ సక్సెస్ ఎంత శాతం ఉందో ఫెయిల్యూర్ అంతే ఉంది. కొన్ని సినిమాలు ఊహించని రీతిలో కలెక్షన్స్ రాబడితే.. మరికొన్ని దారుణమైన అపజయాన్ని మూటగట్టుకున్నాయి. ఈ ఆరు నెలల్లో టాలీవుడ్ రిపోర్ట్ ఎలా ఉందో చూసేద్దాం.ఓపెనింగ్ అదిరింది!టాలీవుడ్కి సంక్రాంతి పండగ చాలా పెద్దది. ప్రతి సంక్రాంతికి ఒకటి రెండు పెద్ద సినిమాలు వస్తుంటాయి. కానీ ఈ ఏడాది మాత్రం ఏకంగా నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘గుంటూరు కారం’, వెంకటేశ్ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామిరంగ’తో పాటు కుర్రహీరో తేజ సజ్జ ‘హనుమాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే వీటిల్లో హనుమాన్ భారీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. స్టార్ హీరోల సినిమాలు బరిలో ఉన్నప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులు ‘హనుమాన్’కే ఓటేశారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 300 కోట్ల కలెక్షన్స్ని రాబట్టింది. గుంటూరుకారం, నా సామిరంగ చిత్రాలకి మిశ్రమ టాక్ వచ్చినా.. మంచి వసూళ్లనే రాబట్టాయి. సైంధవ్ మాత్రం దారుణంగా బోల్తాపడింది. అంతకు ముందు జనవరి 1న వచ్చిన సర్కారు నౌకరి, రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజైన ‘ర్యాపిడ్ యాక్షన్ మిషన్’, ‘బిఫోర్ మ్యారేజ్’ సినిమాలు ప్లాప్ టాక్నే మూటగట్టుకున్నాయి.బ్యాండ్ మోగింది..ఇక ఫిబ్రవరి తొలివారంలో సుహాస్ హీరోగా నటించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’ విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి విజయమే సాధించింది. అదేవారంలో వచ్చిన ‘కిస్మత్’, ‘హ్యాపీ ఎండింగ్’, ‘బూట్కట్ బాలరాజు’, ‘గేమ్ ఆన్’ చిత్రాలు మాత్రం సందడి చేయలేకపోయాయి. ఇక రెండో వారంలో వచ్చిన రవితేజ ఈగల్, మమ్ముట్టి, జీవా ల‘యాత్ర 2’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపంచాయి. మూడోవారంలో వచ్చిన ‘ఊరు పేరు భైరవకోన’ప్రేక్షకలను కొంతమేర భయపెట్టేసింది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక చివరివారంలో వచ్చిన ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’, ‘రాజధాని ఫైల్స్’, ‘సిద్ధార్థ్ రాయ్’, ‘సుందరం మాస్టర్’ చిత్రాలేవి ప్రేక్షకులను అలరించలేకపోయాయి. అయితే ఫిబ్రవరిలో ఈగల్, యాత్ర 2 తప్పితే మిగతావన్నీ అతి తక్కువ బడ్జెట్తో తెరకెక్కించిన చిన్న చిత్రాలే రిలీజ్ కావడం గమనార్హం.అలరించని సమ్మర్సంక్రాంతి తర్వాత సమ్మర్ సీజన్ టాలీవుడ్కి చాలా ముఖ్యమైనది. దాదాపు మూడు నాలుగు పెద్ద సినిమాలైనా వేసవిలో విడుదలయ్యేవి. కానీ ఈ ఏడాది సమ్మర్లో ఒక్క స్టార్ హీరో సినిమా కూడా రిలీజ్ కాలేదు. మార్చి తొలివారం వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అదేవారం భూతద్దం భాస్కర్ నారాయణ’, ‘చారి 111’, ‘ఇంటి నెంబర్ 13’లాంటి చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ.. ఏ ఒక్కటి అలరించలేదు. (చదవండి: బాక్సాఫీస్ వద్ద కల్కి నయా రికార్డ్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లో తెలుసా?)రెండోవారం గోపిచంద్ ‘భీమా’తో విశ్వక్ సేన్ ‘గామి’తో వచ్చాడు. వీటిల్లో భీమాకి ప్లాప్ టాక్ రాగా.. ‘గామి’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాలో బోల్తా పడ్డాయి. ఇక మూడో వారంలో రజాకార్, లంబసింగి, షరతులు వర్తిసాయి’తో పాటు అరడజనుకు పైగా చిన్న సినిమాలు రిలీజ్ అయినా..ఒక్కటి కూడా హిట్ కాలేదు. మూడో వారంలో రిలీజైన శ్రీవిష్ణు ‘ఓం భీమ్ బుష్’ థియేటర్లలో నవ్వులు పూయించింది. ఇక చివరి వారంలో వచ్చిన ‘టిల్లు స్వ్కేర్’ సూపర్ హిట్ కొట్టేసింది. బాక్సాపీస్ వద్ద దాదాపు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ‘టిల్లుగాడు’ సత్తా చాటాడు.ఏప్రిల్లో భారీ అంచనాలతో వచ్చిన విజయదేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అదేవారంలో రిలీజైన భరతనాట్యం’, ‘బహుముఖం’ చిత్రాలు ప్లాప్ టాక్ని సంపాదించుకున్నాయి. రెండోవారంలో రిజీలైన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రం యావరేజ్ టాక్ని సంపాదించుకుంది. ఇక చివరి రెండు వారాల్లో ‘శ్రీరంగనీతులు’ ‘పారిజాతపర్వం’, ‘మార్కెట్ మహాలక్ష్మీ, తెప్ప సముద్రం చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాగా..ఏ ఒక్కటి ఆకట్టుకోలేదు.(చదవండి: పాన్ ఇండియాపై ‘మెగా’ ఆశలు)మేలో తొలివారం ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ అల్లరి నరేశ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలా కాలం తర్వాత నరేశ్ నటించిన కామెడీ చిత్రమిది. మంచి అంచనాలతో రిలీజైన ఈ చిత్రం ఫ్లాప్ టాక్నే సంపాదించుకుంది. ఈ మూవీతో పాటు రిలీజైన సుహాస్ ‘ప్రసన్నవదనం’ చిత్రానికి మంచి టాక్ వచ్చినా.. వసూళ్లను మాత్రం రాబట్టలేకపోయింది. ఒక సెకండ్ వీక్లో సత్యదేవ్ ‘కృష్ణమ్మ’తో పాటు ‘ఆరంభం’ అనే చిన్న చిత్రం విడుదలైన..తొలిరోజే నెగెటివ్ టాక్ని సంపాదించుకున్నాయి. ఇక నారా రోహిత్ హీరోగా నటించిన ‘ప్రతినిధి 2’ థియేటర్స్కి వచ్చిన విషయమే తెలియదు. ఆ తర్వాత వారంలో ‘నట రత్నాలు’, ‘బిగ్ బ్రదర్’, ‘సీడీ’ ‘సిల్క్ శారీ’, ‘డర్టీ ఫెలో’, ‘బ్రహ్మచారి’తో పాటు మొత్తం అరడజను చిత్రాలు విడుదలైన ప్లాప్ టాక్ని మూటగట్టుకున్నాయి. గెటప్ శ్రీను తొలిసారి హీరోగా నటించిన ‘రాజు యాదవ్’ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక చివరివారం భజేవాయు వేగం, గం..గం..గణేశా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలు రిలీజ్ కాగా.. వీటిల్లో ‘భజే వాయు వేగం’ హిట్ టాక్కి సంపాదించుకుంది. ఇక జూన్ తొలివారం ‘సత్యభామ’ అంటూ కాజల్.. ‘మనమే’ అంటూ శర్వానంద్ ప్రేక్షకుల ముందుకు రాగా.. రెండు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేపోయాయి. అదేవారంలో లవ్ మౌళితో పాటు మరో రెండు చిత్రాలు రిలీజ్ అయ్యాయి కానీ.. ఏది హిట్ కాలేదు. రెండో వారంలో సుధీర్ బాబు ‘హరోం హర’తో పాటు ‘మ్యూజిక్ షాప్ మూర్తి, నీ దారే నీ కథ, యేవమ్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. వీటిల్లో మ్యూజిక్ షాప్ మూర్తి విమర్శకులు ప్రశంసలు అందుకుంది. మూడోవారంలో నింద, ‘ఓ మంచి ఘోస్ట్’, ‘హనీమూన్ ఎక్స్ప్రెస్’, ‘అంతిమ తీర్పు’ లాంటి పలు చిన్న సినిమాలు విడుదలైనా..ఏ ఒక్కటి అలరించలేదు. ఇక చివరి వారం మాత్రం టాలీవుడ్కి గుర్తిండిపోయే విజయాన్ని అందించింది. ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ జూన్ 27న విడుదలై హిట్ టాక్తో దూసుకెళ్తోంది. కేవలం మూడు రోజుల్లోనే 415 కోట్లను వసూళ్లు చేసి రికార్డ్ సృష్టిస్తోంది. మొత్తంగా ఈ ఆరు నెలల్లో హిట్ల కంటే ఎక్కువగా ఫ్లాపులే ఉన్నాయి. అయితే హనుమాన్, కల్కి 2898 చిత్రాలు మాత్రం చారిత్రాత్మక విజయాలను అందుకున్నాయి.
![Thalapathy Vijay To Remove His Arm From Around Her Shoulder Video Goes Viral](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/vijay_1.jpg.webp?itok=A3PtFSN2)
హీరో విజయ్పై తప్పుడు ప్రచారం.. మండిపడుతున్న ఫ్యాన్స్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గతేడాది లియో సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది. అయితే దళపతి ప్రస్తుతం ఆయన గోట్(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోగా, విలన్గా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.ఇదిలా ఉండగా ఇటీవల ఆయన తన పార్టీ తరఫున 10,12వ తరగతి విద్యార్థులను సన్మానించారు. వరుసగా రెండో ఏడాది టాప్ స్టూడెంట్స్ను విజయ్ సత్కరించారు. అయితే ఈ వేడుకలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విజయ్పై నెటిజన్స్ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ విద్యార్థిని భుజంపై వేయగా.. ఆమె అతని చేతిని పక్కకు తీస్తూ కనిపించింది. అయితే ఇది చూసిన కొందరు నెటిజన్స్ హీరోకు తగిన బుద్ధి చెప్పిందంటూ పోస్టులు పెట్టారు.అయితే దీనిపై విజయ్ అభిమానులు మండిపడుతున్నారు. పూర్తి వీడియో చూపకుండా.. ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దయచేసి ఇలాంటి వీడియోలతో విజయ్ ప్రతిష్టను దెబ్బతీయవద్దని సూచిస్తున్నారు. సోషల్ మీడియా రీచ్ కోసం ఇలాంటి చెత్త వీడియోలు పోస్ట్ చేయవద్దని హితలు పలుకుతున్నారు. Oooo CHOLE BHATORE WAALI, "Fan Moment" mein bhi tatti karne ki aadat nahi jayegi tum jaise "Z" Class logo ke.... (For those who might think wrong)Here is the rest of the Video that She Cut to be a Cindi Chor..... @actorvijay pic.twitter.com/czoqbg347F— NETAJI🙏 (@__NETAJI__) June 29, 2024 hats off to this girl for showing this idli his place pic.twitter.com/PN1YW3lKru— Moana (@ladynationalist) June 29, 2024
ఫొటోలు
![Child Actor Anushka Sen Photos Goes Viral In Social Media](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/30/Anushka-Sen-01_0.jpg.webp?itok=QIjcCGmA)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/30/Anushka-Sen-01_0.jpg.webp?itok=QIjcCGmA)
ఈ చిన్నారి ఇప్పుడు గ్లోబల్ స్టార్.. ఎవరో తెలుసా? (ఫోటోలు)
![Patang heroine Preethi Pagadalas Cute Phots Goes Viral](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/30/Preethi-Pagadala.jpg.webp?itok=sryeuyNm)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/30/Preethi-Pagadala.jpg.webp?itok=sryeuyNm)
Preethi Pagadala: పతంగ్ హీరోయిన్ ఎంత క్యూట్గా ఉందో! (ఫోటోలు)
![Devara Beauty Janhvi Kapoor Stunning Looks In Floral Gown](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/30/Janhvi-Kapoor.jpg.webp?itok=kUUeYM6e)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/30/Janhvi-Kapoor.jpg.webp?itok=kUUeYM6e)
Janhvi Kapoor: పూలగౌనులో దేవర బ్యూటీ సోయగాలు (ఫోటోలు)
![Child Artist Avika Gor Birthday Special Gallery](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/30/Avika-Gor_0.jpg.webp?itok=_NRtMNx4)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/30/Avika-Gor_0.jpg.webp?itok=_NRtMNx4)
మురిపిస్తున్న చిన్నారి పెళ్లికూతురు ఫేం అవికా గోర్ (ఫోటోలు)
![Versatile Actor Allari Naresh Birthday Special Gallery](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/30/Allari-Naresh-1.jpg.webp?itok=aXkqEgvl)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/30/Allari-Naresh-1.jpg.webp?itok=aXkqEgvl)
వర్సటైల్ యాక్టర్ అల్లరి నరేశ్ను ఇలా ఎప్పుడైనా చూశారా? (ఫోటోలు)
క్రీడలు
![Ravindra Jadeja Announces Retirement For T20I, Day After Virat Kohli And Rohit Sharma Announced](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/saqw.jpg.webp?itok=0CrxjjgB)
పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన మరో టీమిండియా స్టార్
టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే మరో టీమిండియా స్టార్ ఆటగాడు పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టీ20 క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ఇన్స్టా వేదికగా ప్రకటించాడు. జడ్డూ మిగతా ఫార్మాట్లలో (వన్డే, టెస్ట్) కొనసాగుతానని స్పష్టం చేశాడు. పొట్టి ప్రపంచకప్ గెలవడంతో తన కల నిజమైందని అన్నాడు. టీ20 కెరీర్లో వరల్డ్కప్ గెలవడం అత్యుత్తమమని తెలిపాడు. కెరీర్లో తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలని పేర్కొన్నాడు. చివరిగా జై హింద్ అని రాసుకొచ్చాడు. 35 ఏళ్ల రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20ల్లో 74 మ్యాచ్లు ఆడి 127.2 స్టయిక్రేట్తో 515 పరుగులు చేసి 54 వికెట్లు పడగొట్టాడు.కాగా, సౌతాఫ్రికాతో నిన్న జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్లో భారత్కు ఇది రెండో ప్రపంచకప్. 2007లో (అరంగేట్రం ఎడిషన్) ధోని సారథ్యంలో పొట్టి ప్రపంచకప్ గెలిచిన భారత్... తాజాగా రోహిత్ శర్మ నేతృత్వంలో రెండోసారి జగజ్జేతగా నిలిచింది. నిన్న జరిగిన ఫైనల్లో విరాట్ కోహ్లి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. టీమిండియా వరల్డ్కప్ గెలిచిన అనంతరం కోహ్లి, రోహిత్ అంతర్జాతీయ టీ20 కెరీర్కు గుడ్ బై చెప్పారు.
![Virat Kohli And Arshdeep Singh Celebrate T20 World Cup Win With Bhangra Dance](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/zxcasc.jpg.webp?itok=8-3INHI8)
T20 World Cup 2024: "భల్లే భల్లే" డ్యాన్స్తో ఇరగదీసిన విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి.. టీ20 వరల్డ్కప్ 2024 గెలుపును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన విరాట్.. వరల్డ్కప్ విజయానంతరం భల్లే.. భల్లే స్టెప్పులేసి ఇరగదీశాడు. ప్రముఖ సింగర్ దలేర్ మెహందికి చెందిన పాపులర్ సాంగ్ "తునుక్ తనుక్"కు కోహ్లి.. సహచరుడు అర్ష్దీప్ సింగ్తో కలిసి చిందేశాడు. టీమిండియా సెలబ్రేషన్స్లో భాగంగా మైదానంలోని స్పీకర్స్లో ఈ సాంగ్ ప్లే అవుతుండగా.. విరాట్, అర్ష్దీప్లతో సిరాజ్, అక్షర్ పటేల్, రింకూ సింగ్, బుమ్రా జత కలిశారు. వీరందరూ డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరలవుతుంది.Virat Kohli, Arshdeep Singh and Rinku Singh dancing. 😭 pic.twitter.com/mhThl8IC7o— Selfless⁴⁵ (@SelflessRohit) June 29, 2024కాగా, ఫైనల్ మ్యాచ్ గెలిచాక కాసేపు భావోద్వేగాలకు లోనైన టీమిండియా క్రికెటర్లు.. ఆతర్వాత తేరుకుని ఎంజాయ్మెంట్ మూడ్లోకి వచ్చారు. జట్టు సభ్యులంతా ఎవరి స్టయిల్లో వారు విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఆటగాళ్లంతా స్టేడియం మొత్తం కలియతిరిగి అభిమానులకు అభివాదం చేశారు. కొందరు ఫోన్లలో.. కొందరు నేరుగా తమ వారితో సంతోషాన్ని పంచుకున్నారు. భారత ఆటగాళ్లందరిలో కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లి ఎక్కువగా ఎమోషనల్ అయ్యారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఆనందబాష్పాలు కార్చడం ప్రతి భారతీయుడి మనస్సుని హత్తుకుంది. వీరితో పాటు కోచ్ ద్రవిడ్ కూడా కంటతడి పెట్టుకున్నాడు. మొత్తంగా తొలుత భావోద్వేగాలు, ఆతర్వాత సంబురాలతో బార్బడోస్ మైదానం పులకించిపోయింది.ఇదిలా ఉంటే, సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. విరాట్ కోహ్లి (59 బంతుల్లో 76; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (31 బంతుల్లో 47; ఫోర్, 4 సిక్సర్లు), శివమ్ దూబే (16 బంతుల్లో 27; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టగా.. జన్సెన్, రబాడ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. హార్దిక్ పాండ్యా (3-0-20-3), అర్ష్దీప్ సింగ్ (4-0-20-2), బుమ్రా (4-0-18-2) సత్తా చాటడంతో లక్ష్యానికి 8 పరుగుల దూరంలో (169/8) నిలిచిపోయింది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆదిలో తడబడినప్పటికీ.. మధ్యలో క్లాసెన్ (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) టీమిండియాను భయపెట్టాడు. ఆఖర్లో బుమ్రా, హార్దిక్, అర్ష్దీప్ అద్బుతంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా విజయతీరాలకు చేరింది.
![T20 World Cup 2024 Final: India Is The First Team To Win T20 World Cup Unbeaten](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/sas.jpg.webp?itok=xwty_Yy8)
17 ఏళ్ల పొట్టి ప్రపంచకప్ చరిత్రలో తొలి జట్టుగా టీమిండియా
నిన్న (జూన్ 29) జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో సారి పొట్టి ప్రపంచకప్ను సాధించింది. 17 ఏళ్ల పొట్టి ప్రపంచకప్ చరిత్రలో భారత్తో (2007, 2024) పాటు వెస్టిండీస్ (2012, 2016), ఇంగ్లండ్ (2010, 2022) మాత్రమే రెండేసి సార్లు టైటిల్స్ సాధించాయి. ఈ వరల్డ్కప్ విజయంతో భారత్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. ఈ ప్రపంచకప్లో అజేయ జట్టుగా నిలిచిన టీమిండియా.. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా (సింగిల్ ఎడిషన్) టైటిల్ సాధించిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. గతంలో ఏ జట్టు అజేయంగా టీ20 ప్రపంచకప్ గెలవలేదు.కాగా, టీ20 వరల్డ్కప్ 2024 విజయానంతరం భారత ఆటగాళ్ల సంబురాలు అంబరాన్నంటాయి. తొలుత భావోద్వేగాలను అదుపు చేసుకోలేక ఆనంద బాష్పాలు కార్చిన టీమిండియా క్రికెటర్లు.. ఆతర్వాత తేరుకుని సంబురాలు చేసుకున్నారు.11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ, 13 ఏళ్ల తర్వాత ప్రపంచకప్, 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ గెలవడంతో యావత్ భారతావణి పులకించిపొయింది. ఊరు వాడా విజయోత్సవ సంబురాలు జరిగాయి. టీమిండియా కృష్ణార్జునులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పొట్టి ప్రపంచకప్ టైటిల్ గెలిచి టీ20 ఫార్మాట్కు ఘనంగా వీడ్కోలు పలకగా.. భారత హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం వరల్డ్కప్ విక్టరీతో ముగిసింది. భారత క్రికెట్ అభిమానులు ఓ పక్క టీమిండియా విజయాన్ని ఆస్వాధిస్తూనే.. మరోపక్క దిగ్గజాల రిటైర్మెంట్ ప్రకటనను తలచుకుంటూ కుమిలిపోయారు. మొత్తంగా నిన్నటి ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ భారత క్రికెట్ అభిమానులకు చిరస్మరణీయంగా గుర్తుండిపోతుంది.
![T20 World Cup 2024 Final: Rohit Sharma Novak Djokovic Like Celebration After India Win Breaks Internet](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/asa.jpg.webp?itok=4-ROXdPE)
జకోవిచ్ స్టయిల్లో సెలబ్రేట్ చేసుకున్న రోహిత్ శర్మ
టీ20 వరల్డ్కప్ 2024ను కైవసం చేసుకున్న అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ...టెన్నిస్ లెజెండ్ నొవాక్ జకోవిచ్ స్టయిల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ అనంతరం హిట్మ్యాన్ పిచ్పై ఉన్న గడ్డిపరకలను నోట్లో పెట్టుకుని విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. టెన్నిస్ దిగ్గజం జకోవిచ్ సైతం గ్రాండ్స్లామ్ విజయానంతరం ఇలాగే చేస్తాడు. View this post on Instagram A post shared by ICC (@icc)జకో.. ఫైనల్ మ్యాచ్లో గెలిచాక కోర్టులోని గడ్డిపరకలను లేదా మట్టిని నోట్లో పెట్టుకుని గెలుపు సంబురాలు చేసుకుంటాడు. వరల్డ్కప్ విజయానంతరం రోహిత్ చేసుకున్న జకో స్టయిల్ సెలబ్రేషన్స్ నెట్టింట వైరలవుతున్నాయి. వింబుల్డన్ తమ అధికారిక ఫేస్బుక్ ఖాతాలో జకోవిచ్, రోహిత్ శర్మ గడ్డి తింటున్న ఫోటోలు పోస్ట్ చేసి.. GOATs eating grass అని కామెంట్ పెట్టింది. ఈ పోస్ట్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంది.Wimbledon's Facebook post - GOATs eating grass. Rohit Sharma 🤝 Novak Djokovic. pic.twitter.com/jrkCPBi7PX— Mufaddal Vohra (@mufaddal_vohra) June 30, 2024కాగా, నిన్న జరిగిన వరల్డ్కప్ 2024 ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి రెండో సారి టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. భారత్కు 11 ఏళ్ల తర్వాత లభించిన తొలి ఐసీసీ ట్రోఫీ ఇది. 2013లో టీమిండియా ధోని నేతృత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. వరల్డ్కప్ విషయానికొస్తే.. టీమిండియాకు 13 ఏళ్ల తర్వాత లభించిన తొలి వరల్డ్కప్ ఇది. 2011లో భారత్..ధోని నేతృత్వంలో వన్డే వరల్డ్కప్ సాధించింది. టీ20 వరల్డ్కప్ విషయానికొస్తే.. ధోని సారథ్యంలో మొట్టమొదటి టీ20 వరల్డ్కప్ టైటిల్ సాధించిన టీమిండియా.. 17 ఏళ్ల తర్వాత తిరిగి పొట్టి ప్రపంచకప్ను దక్కించుకుంది. ఈసారి రోహిత్ శర్మ టీమిండియాకు పొట్టి ప్రపంచకప్కు అందించాడు.ఫైనల్ మ్యాచ్ స్కోర్ వివరాలు..భారత్ 176/7సౌతాఫ్రికా 169/87 పరుగుల తేడాతో భారత్ విజయంప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్- విరాట్ కోహ్లి (59 బంతుల్లో 76; 6 ఫోర్లు, 2 సిక్సర్లు)ప్లేయర్ ఆఫ్ ద సిరీస్- జస్ప్రీత్ బుమ్రా (8 మ్యాచ్ల్లో 15 వికెట్లు)
బిజినెస్
![facts about aircel](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/30/aircel.jpg.webp?itok=zOtnFMhm)
దివాళా తీసిన ఈ కంపెనీ గుర్తుందా..? 3Gలో దీనిదే హవా!!
![VS Reddy most expensive car owner now owns Mercedes Maybach S680](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/VS-Reddy.jpg.webp?itok=V5vhXQKQ)
దేశంలో ఖరీదైన కారు ఈయన దగ్గరే.. ఇప్పుడు మరో కారు..
దేశంలో అత్యంత ఖరీదైన కార్లు ఉన్న వ్యాపారవేత్తల గురించి మాట్లాడేటప్పుడు ముఖేష్ అంబానీ, గౌతమ్ సింఘానియా, రతన్ టాటా వంటి పేర్లు మాత్రమే వినిపిస్తాయి. అయితే భారత్లో అత్యంత ఖరీదైన కారు వీఎస్ రెడ్డి అనే వ్యాపారవేత్త దగ్గర ఉంది.బెంట్లీ ముల్సానే ఈడబ్ల్యూబీ సెంటినరీ ఎడిషన్ దేశంలో అత్యంత ఖరీదైన కారు. దీని ధర రూ .14 కోట్లు. ముఖేష్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ సింఘానియా వంటివారి వద్ద ఉన్న రోల్స్ రాయిస్, ఫెరారీ కార్ల కంటే దీని ధర ఎక్కువ. దీని ఓనర్ వీఎస్ రెడ్డి ఇప్పుడు రూ .3.34 కోట్లు పెట్టి కొత్త మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 680 కారు కొన్నారు.మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 680.. మేబాచ్ ఎస్-క్లాస్ ప్రీమియం వెర్షన్. ఇందులో 6.0-లీటర్ టర్బోఛార్జ్డ్ వి12 ఇంజన్ ఉంది. ఇది 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్తో ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 610బీహెచ్పీ పవర్, 900ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.ఎవరీ వీస్ రెడ్డి అంటే..ప్రముఖ న్యూట్రాస్యూటికల్ కంపెనీల్లో ఒకటైన బ్రిటిష్ బయోలాజికల్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టరే వీఎస్ రెడ్డి. 'ది ప్రోటీన్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా పేరొందిన కర్ణాటకకు చెందిన వీఎస్ రెడ్డి పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. తాను ఆటోమోటివ్ ఔత్సాహికుడినని, దేశంలోని అన్ని బ్రాండ్ల కార్లు తన వద్ద ఉండాలనుకుంటానని ఈవీవో ఇండియా మ్యాగజైన్తో మాట్లాడుతున్న సందర్భంగా వీఎస్ రెడ్డి చెప్పారు.
![Gold and Silver Price Today 30 June 2024](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/gold-price_4.jpg.webp?itok=MoJzSSp4)
నేడు తులం బంగారం కొనాలంటే ఎంత కావాలంటే..
పెరుగుదల బాట పట్టిన బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగి కొనుగోలుదారులకు ఊరట కల్పించాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు రెండురోజులుగా పెరుగుతుండగా ఈరోజు (జూన్ 30) ధరల్లో ఎలాంటి మార్పులేదు.ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు, జువెలరీ మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ అంశాలతోపాటు అంతర్జాతీయ బంగారం రేట్లపైనా దేశంలో బంగారం ధరలు ఆధారపడి ఉంటాయి.ఇరు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు ) ధర రూ.66,250, అదే విధంగా 24 క్యారెట్ల పసిడి రూ. 72,280 వద్ద కొనసాగుతన్నాయి.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.66,400, 24 క్యారెట్ల బంగారం రూ.72,420 లుగా ఉన్నాయి. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.66,250, 24 క్యారెట్ల పసిడి రూ. 72,280 వద్ద ఉన్నాయి.చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.66,850, 24 క్యారెట్ల బంగారం రూ.72,930 లుగా కొనసాగుతున్నాయి. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.66,250 లుగా, 24 క్యారెట్ల పసిడి రూ. 72,280 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.94,500 లుగా కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
![insurance fraud Eyeing Rs 1 1 crore insurance money woman dies twice](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/insurance-fraud.jpg.webp?itok=vKmdtjn6)
రెండు సార్లు ‘మరణం’!! రూ.1.1 కోట్ల కోసం మహిళ మోసం
ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు తమ కుటుంబానికి ఆదరవుగా ఉంటుందని బీమా చేయిస్తుంటారు. కానీ బీమా సొమ్ము కోసమే చనిపోయినట్లు అదికూడా రెండు సార్లు మరణించినట్లు మోసగించిన ఉదంతం ముంబైలో బయటపడింది.ముంబై ప్రాంతంలోని భయాందర్కు చెందిన 45 ఏళ్ల మహిళ కంచన్ పాయ్ అలియాస్ పవిత్ర రూ.1.1 కోట్ల ఇన్సూరెన్స్ రెండేళ్లలో రెండుసార్లు తన మరణాన్ని ఫేక్ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే రూ.70 లక్షలను నిందితురాలి కుటుంబం అందుకుంది.కంచన్ పాయ్ భర్త, కుమారుడు 2021-2023 మధ్య ఐదు ప్రైవేట్ రంగ బీమా కంపెనీల నుంచి రూ .1.1 కోట్లు క్లెయిమ్ చేశారు. వారికి ఇప్పటికే డెత్ క్లెయిమ్ రూపంలో దాదాపు రూ.70 లక్షలు వచ్చాయి. మిగిలిన మొత్తం కోసం ఎదురు చూస్తుండగా మోసం బయటపడింది. ముగ్గురూ పరారీలో ఉన్నారు.అశుతోష్ యాదవ్ అనే వైద్యుడి సాయంతో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు, దహన సంస్కారాల రశీదులు పొంది ఈ మోసానికి పాల్పడ్డారు. ఈ డాక్టర్ కూడా పరారీలో ఉన్నాడు. కంచన్ అలియాస్ పవిత్ర రెండు వేర్వేరు ఆధార్ కార్డు, పాన్ కార్డులను ఉపయోగించి మొత్తం ఐదు ప్రైవేటు సంస్థల నుంచి బీమా పాలసీలు తీసుకున్నట్లు విచారణలో తేలింది.
వీడియోలు
![CM Revanth Reddy Pays Tribute To Congress Leader D Srinivas](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/30.png.webp?itok=01z7Y-un)
![CM Revanth Reddy Pays Tribute To Congress Leader D Srinivas](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/30.png.webp?itok=01z7Y-un)
డీఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి నివాళి
![Chandrababu And TDP Government Debts](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/29.png.webp?itok=KjQH4rWv)
![Chandrababu And TDP Government Debts](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/29.png.webp?itok=KjQH4rWv)
బాబు అప్పులు.. ఎల్లో మీడియా తప్పులు
![Kishan Reddy Fires On CM Revanth Reddy](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/28.png.webp?itok=GDxFKUQH)
![Kishan Reddy Fires On CM Revanth Reddy](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/28.png.webp?itok=GDxFKUQH)
కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసపూరిత పార్టీలు: కిషన్ రెడ్డి
![CCTV Camera Caught Thieves Movement](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/27.png.webp?itok=Q33dFgOG)
![CCTV Camera Caught Thieves Movement](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/27.png.webp?itok=Q33dFgOG)
పరిగి మున్సిపాలిటీ పరిధిలో దొంగల బీభత్సం
![Leopard Hulchul In Mahanandi Temple](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/25.png.webp?itok=BQ0Op60t)
![Leopard Hulchul In Mahanandi Temple](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/25.png.webp?itok=BQ0Op60t)
మహానంది క్షేత్రంలో మళ్లీ చిరుత కలకలం..
![Kalki 2898 AD Box Office Collection Day 3](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/22.png.webp?itok=WpGDN71F)
![Kalki 2898 AD Box Office Collection Day 3](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/22.png.webp?itok=WpGDN71F)
500 కోట్ల వైపు కల్కి పరుగులు.. హాలీవుడ్ మూవీని మించి కలెక్షన్స్
![Cricket Betting Gang Arrest In Hyderabad](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/21.png.webp?itok=sim9HQ4e)
![Cricket Betting Gang Arrest In Hyderabad](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/21.png.webp?itok=sim9HQ4e)
హైదరాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
![YSRCP Leaders Fires On TDP Faction Politics In Punganur](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/20.png.webp?itok=D9_YwiH9)
![YSRCP Leaders Fires On TDP Faction Politics In Punganur](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/20.png.webp?itok=D9_YwiH9)
పుంగనూరులో ఫ్యాక్షన్ రాజకీయాలు.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు
![Bomb Blast In Nigeria City](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/19_0.png.webp?itok=MQ0SvzsV)
![Bomb Blast In Nigeria City](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/19_0.png.webp?itok=MQ0SvzsV)
నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు
![CRDA Officials Vs Undavalli Farmers](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/19.png.webp?itok=fshGGfAf)
![CRDA Officials Vs Undavalli Farmers](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/19.png.webp?itok=fshGGfAf)
సీఆర్ డీఏ అధికారులపై రైతుల ఆగ్రహం
ఫ్యామిలీ
![Have You Ever Heard About A Robot That Works Like A Loom!?](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/maggam.jpg.webp?itok=iz5kWbu5)
మగ్గంలా పనిచేసే రోబో గురించి.. ఎప్పుడైనా విన్నారా!?
ఈ రోబో మగ్గంలా పనిచేస్తుంది. అయితే నూలు దుస్తులు, పట్టు వస్త్రాలు కాదు, ఊలు దుస్తులు నేస్తుంది. ఇది ఊలు దుస్తులను చకచకా నేసి, కోరుకున్న డిజైన్లలో అల్లేస్తుంది. ఈ రోబో మగ్గాన్ని డచ్ డిజైనర్ క్రిస్టీన్ మీండెర్స్మా రూపొందించారు..త్రీడీ ప్రింటర్లు పొరలు పొరలుగా వస్తువులను ముద్రించిన పద్ధతిలోనే ఈ రోబో మగ్గం పొరలు పొరలుగా ఊలు దుస్తులను నేస్తుంది. ఈ రోబో మగ్గానికి ‘ఫ్లాక్స్ వోబో’ అని పేరు పెట్టారు. ఊలు పరిశ్రమలో నేసే ముందు ఊలును నీటితో తడుపుతారు. అయితే, ఈ రోబో మగ్గానికి నేరుగా ఊలు అందిస్తే చాలు, ఏమాత్రం తడపాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి దీనిని నమూనాగా రూపొందించారు. త్వరలోనే పారిశ్రామిక స్థాయిలో దీని ఉత్పత్తిని ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.హైడ్రోజన్ బైక్..పెట్రోల్తో నడిచే బైక్లకు పోటీగా ఇటీవలి కాలంలో లిథియం అయాన్ బ్యాటరీలతో పనిచేసే ఎలక్ట్రిక్ బైక్ల వాడకం పెరిగింది. లిథియం అయాన్ బ్యాటరీలను మించిన సామర్థ్యం కలిగిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్తో నడిచే బైక్లు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. స్విట్జర్లాండ్కు చెందిన ‘హైడ్రోరైడ్ యూరోప్ ఏజీ’ కంపెనీ రకరకాల మోడల్స్లో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బైక్లను మార్కెట్లోకి విడుదల చేసింది.వీటికి 180 హైడ్రోజన్ సెల్తో పాటు, 25 సెంటీమీటర్ల పొడవైన హైడ్రోజన్ కంటెయినర్ ఉంటుంది. కంటెయినర్లోని హైడ్రోజన్ 1 మెగాపాస్కల్ పీడనంతో ఉంటుంది. ఈ హైడ్రోజన్ నుంచి ఇందులోని ఫ్యూయల్ సెల్ విద్యుత్తును తయారుచేసుకుంటుంది. ఒక కంటెయినర్ను పూర్తిగా నింపి అమర్చుకుంటే, ఈ బైక్పై ఏకధాటిగా 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ బైక్కు అమర్చుకునే విధంగా హైడ్రో జనరేటర్ కూడా ఉంటుంది.ఒకవేళ మార్గమధ్యంలో కంటెయినర్లోని హైడ్రోజన్ ఖాళీ అయిపోతే, ఈ జనరేటర్లో 200 మిల్లీలీటర్ల డిస్టిల్డ్ వాటర్ను నింపుకుంటే చాలు. దీని నుంచి ఉత్పత్తయ్యే హైడ్రోజన్ దాదాపు ఐదారు గంటల ప్రయాణానికి తగినంత ఇంధనంగా సరిపోతుంది. అయితే, హైడ్రోరైడ్ యూరోప్ ఏజీ’ కంపెనీ నేరుగా విక్రయానికి పెట్టకుండా.. యూరోప్లోని ఎంపిక చేసిన నగరాల్లో కస్టమర్లకు అద్దెకు ఇస్తోంది.ఉభయచర డ్రోన్..ఇప్పటి వరకు గాల్లోకి ఎగిరే డ్రోన్లు మాత్రమే తెలుసు. అయితే, కెనడియన్ కంపెనీ ‘ఏరోమావో’ ఉభయచర డ్రోన్ను రూపొందించింది. ఇది గాలిలో ఎగరడమే కాదు, నీటిలోనూ ప్రయాణించగలదు. ఈ డ్రోన్ను ‘వీటీ నాట్–వీటీఓఎస్ఎల్’ బ్రాండ్ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. ఈ బ్రాండ్ పేరుకు అర్థమేమిటంటే, ‘వెర్టికల్ టేకాఫ్ అండ్ షార్ట్ ల్యాండింగ్’. మ్యాపుల చిత్రణ, మనుషులు చొరబడలేని ప్రదేశాల్లో కూడా సర్వే జరపడం, వ్యవసాయ అవసరాలకు, నిఘా పనులకు ఉపయోగపడేలా దీనిని రూపొందించారు.గాల్లోకి ఎగిరేటప్పుడు దీని గరిష్ఠ వేగం గంటకు 85 కిలోమీటర్లు అయితే, నీటిలో ప్రయాణించేటప్పుడు గంటకు 55 కిలోమీటర్లు. రీచార్జబుల్ బ్యాటరీతో ఇది పనిచేస్తుంది. బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసినట్లయితే, గంటన్నర సేపు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది. దీని ధర 11,170 డాలర్లు (రూ.9.31 లక్షలు).
![Sourav Joshi: At The Age Of Seventeen A Great YouTuber](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/Sourav.jpg.webp?itok=v1oRcdc2)
Sourav Joshi: పదిహేడేళ్ల వయసులోనే.. గొప్ప యూట్యూబర్గా
ఆర్టిస్ట్. పదిహేడేళ్ల వయసులో Sourav Joshi Arts అట్టటపేరుతో యూట్యూబ్ చానెల్ని స్టార్ట్ చేశాడు. స్కెచెస్ ఎలా వేయాలో నేర్పుతూ తీసిన వీడియోలను అందులో పోస్ట్ చేసేవాడు. దానికి తక్కువ కాలంలోనే ఎక్కువ వ్యూస్, సబ్స్క్రైబర్స్ రావడంతో ఆ కుర్రాడికి సిల్వర్ ప్లే బటన్ను ప్రెజెంట్ చేసింది యూట్యూబ్.నెక్స్ట్ ఇయరే అంటే 2019లో 'Sourav Joshi Vlogs'తో మరో యూట్యూబ్ చానెల్ని స్టార్ట్ చేశాడు. ఇందులో స్కెచింగ్స్తోపాటు తన స్వస్థలమైన అల్మోరా (ఉత్తరాఖండ్) గురించి, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, అందమైన ప్రకృతికి సంబంధించిన వీడియోలు తీసి పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు.కరోనా లాక్డౌన్ టైమ్లో 365 రోజులు.. 365 వీడియోలు అనే టార్గెట్ పెట్టుకుని రీచ్ అయిన ఘనుడు. ‘ఫటీ జీన్స్’, ‘ఝూటా లగ్దా’, ‘తేరా హో రాహా హూ’, ‘భాయ్ మేరా భాయ్’, ‘మంజూరే నజర్’ వంటి మ్యూజిక్ వీడియోల్లోనూ నటించాడు సౌరవ్.
![A Wild Cat Like A Cheetah Funday Vintalu Visheshalu](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/cat.jpg.webp?itok=yD7PC0PW)
నిజమే... ఇది చిరుతలాంటి అడవిపిల్లి!!
చూడటానికి ఇది అచ్చంగా చిరుతపులిలా ఉంటుంది గాని, నిజానికి ఇది అడవిపిల్లి. సహారా ఎడారి చుట్టుపక్కల ఉండే ఆఫ్రికా దేశాల్లోని అడవుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని ‘సెర్వల్’ అంటారు.ఇది దాదాపు రెండు అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. దీని బరువు తొమ్మిది నుంచి పద్దెనిమిది కిలోల వరకు ఉంటుంది. అంటే, చిరుతపులితో పోల్చుకుంటే సగం పరిమాణంలో ఉంటుంది. శరీర పరిమాణంతో పోల్చుకుంటే, దీని కాళ్లు పొడవుగా ఉంటాయి. చిరుత కంటే దీని తల పరిమాణం చిన్నగా ఉంటుంది. ఇది చాలా వేగంగా వేటాడుతుంది.పగలు, రాత్రి కూడా చురుగ్గానే ఉంటుంది. ఎక్కువగా ఎలుకలు, కప్పలు, చిన్న చిన్న పక్షులను వేటాడి తింటుంది. ఆఫ్రికాలో వలస రాజ్యాలు ఏర్పరచుకున్న కాలంలో ఫ్రెంచ్ శాస్త్రవేత్త జార్జస్ లూయీ లెక్లెర్క్ కామ్టే డి బఫన్ 1765లో తొలిసారిగా ఈ జంతువును గుర్తించి, దీని గురించిన విశేషాలను ప్రపంచానికి వెల్లడించాడు.ఇవి చదవండి: ఆ దీవిలో మూడు రోజులు బస ఉచితం! ఎందుకంటే?
![Have You Ever Tried These Three Recipes?](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/30/vanta.jpg.webp?itok=1RiyGtGN)
ఈ మూడు వంటకాలను ఎప్పుడైనా ట్రై చేశారా?
ఇంట్లోనే సింపుల్గా ఇలాంటి వంటలను కమ్మగా, అద్భుతంగా చేయాలనుకుంటున్నారా! అయితే ఇలాట్రైం చేయండి..స్వీట్ పొటాటో ఆమ్లెట్..కావలసినవి:చిలగడదుంప – 2 (మీడియం సైజ్, ఉడికించి పేస్ట్లా చేసుకోవచ్చు),కొబ్బరి కోరు – 2 టేబుల్ స్పూన్లు,టొమాటో సాస్ – 1 టేబుల్ స్పూన్,చిల్లీ సాస్ – అర టేబుల్ స్పూన్,చాట్ మసాలా – 1 టీ స్పూన్,గుడ్లు – 6 ,చీజ్ తురుము – 3 టేబుల్ స్పూన్లు,ఉప్పు – తగినంత,ఉల్లిపాయ ముక్కలు – 1 టేబుల్ స్పూన్ (చిన్నగా తరగాలి),టొమాటో ముక్కలు – పావు టేబుల్ స్పూన్ (చిన్నగా తరగాలి),పాలు – 1 టీ స్పూన్,కారం – కొద్దిగా, నూనె – సరిపడాతయారీ:– ముందుగా ఒక బౌల్లో గుడ్లను పగలగొట్టి.. చీజ్ తురుము, పాలు, కారం, కొద్దిగా ఉప్పు వేసుకుని క్రీమీగా అయ్యేంతవరకు హ్యాండ్బ్లెండర్తో బాగా బీట్ చేసి పెట్టుకోవాలి.– ఈలోపు మరో స్టవ్ వెలిగించి.. కళాయిలో కొద్దిగా నూనె వేసి వేడికాగానే.. ఉల్లిపాయ ముక్కలనూ వేసి దొరగా వేయించాలి.– తర్వాత టొమోటో ముక్కలను వేయాలి.– అవీ వేగాక.. చిలగడదుంప గుజ్జు, టొమాటో సాస్, చిల్లీ సాస్, చాట్ మసాలా, చిటికెడు ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని గరిటెతో బాగా కలిపి.. 1 నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.– అనంతరం గుడ్ల మిశ్రమంతో ఒక్కో ఆమ్లెట్ వేసుకుని.. అది ఉడికే క్రమంలో కొద్దికొద్దిగా చిలగడదుంప మిశ్రమాన్ని వేసుకుని.. గరిటెతో మొత్తం స్ప్రెడ్ చేసి.. ఆమ్లెట్ను ఇరువైపులా వేయించుకోవాలి. వాటిని ఫోల్డ్ చేసి సర్వ్ చేసుకోవాలి.– నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని తింటే భలే రుచిగా ఉంటాయి ఈ ఆమ్లెట్స్.అలోవీరా హల్వా..కావలసినవి:అలోవీరా (కలబంద) ముక్కలు – అర కప్పు (పైనున్న గ్రీన్ కలర్ తొక్క తొలగించి.. జెల్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి),నెయ్యి, గోధుమ పిండి – 1 కప్పు చొప్పున,పంచదార – అర కప్పు (పెంచుకోవచ్చు), చిక్కటి పాలు – 1 కప్పు,జాజికాయ పొడి,ఏలకుల పొడి – కొద్దికొద్దిగాబాదం ముక్కలు – అర టేబుల్ స్పూన్ చొప్పున (నేతిలో వేయించి పక్కనపెట్టుకోవాలి,అభిరుచిని బట్టి కిస్మిస్,జీడిపప్పు ముక్కలు కూడా తీసుకోవచ్చు),కుంకుమపువ్వు – కొద్దిగాతయారీ:– ముందుగా కళాయిలో అరకప్పు నెయ్యి వేసుకుని.. అందులో గోధుమ పిండి, కలబంద జ్యూస్ వేసి తిప్పుతూ ఉండాలి.– దగ్గరపడుతున్న సమయంలో పంచదార, కొద్దిగా నెయ్యి వేసుకుని కలపాలి.– అనంతరం పాలు పోసుకుని మధ్యమధ్యలో గరిటెతో తిప్పుతూండాలి.– కాస్త దగ్గరపడిన తర్వాత జాజికాయ పొడి, ఏలకుల పొడి, మిగిలిన నెయ్యి వేసుకుని మళ్లీ తిప్పుతూ ఉండాలి.– పూర్తిగా దగ్గరపడిన తర్వాత సర్వ్ చేసుకునే ముందు.. బాదం ముక్కలు, లేదా కిస్మిస్, జీడిపప్పు ముక్కల్ని వేసుకుని తింటే భలే రుచిగా ఉంటుంది ఈ హల్వా.ఓట్స్ యాపిల్ షేక్..కావలసినవి:పాలు – 2 కప్పులు (కాచినవి, ఫ్రిజ్లో పెట్టుకోవాలి)ఓట్స్ – అర కప్పు (దోరగా వేయించి పెట్టుకోవాలి)యాపిల్స్ – 3 (రెండింటిని తొక్క,గింజలు తొలగించి.. ముక్కలుగా కట్ చేసుకుని.. పప్పుగుత్తి సాయంతో కచ్చాబిచ్చాగా గుజ్జులా చేసుకోవాలి. మిగిలిన యాపిల్ని నచ్చినవిధంగా కట్చేసి గార్నిష్కి పక్కన పెట్టుకోవాలి),వేరుశనగలు – పావు కప్పు (దోరగావేయించి, తొక్క తీసి.. కొన్నింటిని పక్కనే ఉంచుకుని.. మిగిలినవి కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి), పంచదార – కొద్దిగా (అభిరుచిని బట్టి బెల్లం కూడా కలుపుకోవచ్చు),హార్లిక్స్ పౌడర్,దాల్చినచెక్క పొడి – కొద్దికొద్దిగాజీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు (దోరగా వేయించుకోవాలి)తయారీ:– ముందుగా ఒక బౌల్లో పాలు, యాపిల్ గుజ్జు, మిక్సీ పట్టిన వేరుశనగ మిశ్రమం, పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి.– అనంతరం ఓట్స్ పౌడర్ వేసుకుని.. మరోసారి కలిపి సర్వ్ చేసుకోవాలి.– పైన హార్లిక్స్ పౌడర్, దాల్చినచెక్క పొడి, జీడిపప్పులు, యాపిల్ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది.
న్యూస్ పాడ్కాస్ట్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
టీ20 క్రికెట్ ప్రపంచ కప్ మనదే... ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
నీట్-యూజీ పరీక్షలో అక్రమాలపై పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళన... వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్... ఉభయ సభలు పలుమార్లు వాయిదాట.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయాల కూల్చివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు. నిర్ణయం వాయిదా వేసిన కోర్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేసిన సీబీఐ.. మూడు రోజులపాటు సీబీఐ కస్టడీకి కేజ్రీవాల్.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి... స్పీకర్ అయ్యన్నపాత్రుడికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
దేశ ప్రజాస్వామ్యానికి ‘ఎమర్జెన్సీ’ మాయని మచ్చ.. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపాటుర్.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ముఖ్యమంత్రి అంటే ‘కటింగ్ మాస్టరా’?.. తెలంగాణ సీఎంను ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
నీట్పై సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశం... మరోవైపు ఎన్టీఏ డీజీపై సుబోధ్ సింగ్పై వేటు... నేడు జరగాల్సిన నీట్- పీజీ పరీక్ష వాయిదా.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
తెలంగాణలో ఒకే దఫా రైతుల పంట రుణాల మాఫీ... రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం... 47 లక్షల మంది రైతులకు చేకూరనున్న లబ్ధి.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
![Telangana: Five killed in lorry collision on NH 44](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/29/aa.jpg.webp?itok=bXMG7L63)
ప్రాణం తీసిన అతివేగం..
చేగుంట (తూప్రాన్)/సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నాగ్పూర్ జాతీయ రహదారి రక్తసిక్తమైంది. నాగ్పూర్ వైపు నుంచి మేకల లోడుతో హైదరాబాద్కు వస్తున్న లారీ.. రోడ్డుపై ఆగి ఉన్న దాణా లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. శుక్రవారం తెల్లవారుజామున మెదక్ జిల్లా చేగుంట శివార్లలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా మధ్యప్రదేశ్ వాసులేనని గుర్తించారు. గాయపడ్డవారికి హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్కు మేకలు తీసుకొస్తూ.. 44వ నంబర్ జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు వెళుతున్న ఓ దాణా లారీ శుక్రవారం తెల్లవారుజామున టైర్ పంక్చరై, రోడ్డుపై ఆగిపోయింది. అదే దారిలో నాగ్పూర్ వైపు నుంచి మేకల లోడ్ లారీ వస్తోంది. హైదరాబాద్లోని చర్లపల్లిలో ఉన్న మేకల మండీకి ఉదయమే మేకలను డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఆ ఆత్రుతతోనే డ్రైవర్ వేగంగా లారీని నడిపినట్టు తెలిసింది. ఈ క్రమంలో రోడ్డుపై ఆగి ఉన్న దాణా లారీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ ధాటికి మేకల లోడ్ లారీ క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. అందులో కూర్చుని ఉన్న ఇద్దరు, వెనుకాల ట్రాలీలో మేకలతోపాటు ఉన్న మరో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదం విషయం తెలిసిన పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీశారు. తీవ్రంగా గాయపడ్డవారిని హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగం.. నిద్రమత్తుతో! ప్రమాదం జరిగినప్పుడు మేకల లారీ గంటకు వంద కిలోమీటర్లకుపైగా వేగంతో ప్రయాణిస్తున్నట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రమా దం జరిగిన ప్రదేశంలో మూల మలుపు ఉంది. దానికితోడు తెల్లవారుజామున నిద్రమత్తులో ఉన్న డ్రైవర్.. రోడ్డుపై ఆగిఉన్న దాణా లారీని సరిగా గమనించకపోవడం వల్లే ప్రమాదానికి దారితీసి ఉంటుందని చెప్తున్నారు. ప్రమాదంలో లారీలోని 80 వరకు మేకలు కూడా మృతి చెందాయి. మృతులంతా మధ్యప్రదేశ్ వాసులు ఈ ప్రమాదంలో మృత్యువాత పడిన వారంతా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారని గుర్తించారు. క్యాబిన్లో ప్రయాణిస్తున్న మేకల వ్యాపారులు చిక్వారాజు(57), చిక్వా మనీశ్కుమార్ (30), వెనకాల ట్రాలీలో మేకలతోపాటు కూర్చున్న కారి్మకులు ఎండీ ఇబ్రహీం (21), ఎండీ షబ్బీర్ (48), ఎండీ జిసాన్ (21) అక్కడికక్కడే చనిపోయారు. డ్రైవర్ బుట్టాసింగ్, మేకల వ్యాపారి లాల్మణి, రమేశ్లాల్, మహేశ్లాల్, శుక్లాల్ తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు తూప్రాన్ డీఎస్పీ వెంకట్రెడ్డి తెలిపారు.
![TDP attacks on ysrcp ranks](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/29/attcks.jpg.webp?itok=_sIA647Z)
ఊరొదలకపోతే చంపేస్తాం
సాక్షి ప్రతినిధి, బాపట్ల/సాక్షి, టాస్్కఫోర్స్ : బాపట్ల, తిరుపతి జిల్లాల్లో అధికార టీడీపీ నేతల అరాచక పర్వానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. కూటమి అధికారంలోకి రాగానే టీడీపీ నేతలు దౌర్జన్యాలకు దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై దాడులకు తెగబడుతున్నారు. దొరికిన వారిని దొరికినట్లు చితక బాదుతున్నారు. ఇళ్లు, ఇతర ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. బలహీన వర్గాలపై, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయి. ఊరు విడిచి వెళ్లాలని, లేకపోతే చంపేస్తామని నేతలు, కార్యకర్తలను మైకు అనౌన్స్మెంట్ల ద్వారా హెచ్చరిస్తుండటం విస్తుగొలుపుతోంది. దీంతో పలువురు నేతలు, కార్యకర్తలు ఊర్లు వదిలి అజ్ఞాతంలోకి వెళ్లారు. మరి కొందరు గ్రామాల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లికి చెందిన వైఎస్సార్సీపీ మండల స్థాయి నాయకుడు చెన్ను కోటేశ్వరరావు కుటుంబం 20 రోజులుగా అజ్ఞాతంలో గడుపుతోంది. కోటేశ్వరరావు 1995 నుంచి వరుసగా మూడు దఫాలుగా గుళ్లపల్లి సర్పంచ్గా, మండల పరిషత్ అధ్యక్షుడిగా పని చేశారు. 2021 నుంచి ఆయన సతీమణి సర్పంచ్గా ఉన్నారు. గ్రామ పంచాయతీలోనే కాక మండల స్థాయిలో పేరున్న నేత. కూటమి అధికారంలోకి రాగానే టీడీపీ కార్యకర్తలు చెన్ను కోటేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్ చేశారు. వీరి హయాంలో అభివృద్ధి పనులకు సంబంధించిన శిలా ఫలకాలన్నింటినీ ధ్వంసం చేశారు. కోటేశ్వరరావును గ్రామస్తుల సమక్షంలో దుర్భాషలాడారు. చంపేస్తామంటూ ఏకంగా మైకులో గ్రామం మొత్తం తిరిగి అనౌన్స్మెంట్ చేయడం గమనార్హం. అంతటితో ఆగకుండా మారణాయుధాలతో ఇంటి వద్దకు వెళ్లి గ్రామం వదలి వెళ్లకపోతే చంపేస్తామని నేరుగా హెచ్చరించారు.దీంతో కోటేశ్వరరావు కుటుంబంతో కలిసి సొంత గ్రామం గుళ్లపల్లి వదిలి వెళ్లిపోయారు. తర్వాత ఆయన వాటర్ ప్లాంట్ను స్వాదీనం చేసుకున్నారు. ఆయన అనుచరుడి ఇంటిపై దాడి చేసి, విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో కోటేశ్వరరావు నాలుగు రోజుల క్రితం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ను కలిసి గ్రామానికి చెందిన 8 మంది టీడీపీ కార్యకర్తలతో తనకు, కుటుంబానికి ప్రాణహాని ఉందని.. వారి నుంచి రక్షణ కల్పించాలని వేడుకున్నారు. అయినా పోలీసుల నుంచి స్పందన లేదు. దాడులను ప్రోత్సహిస్తున్న మంత్రి అనగాని చెరుకుపల్లి మండలం కస్తూరివారిపేటకు చెందిన ఆంధ్రప్రభ విలేకరి ఎనుముల వెంకటేశ్వరరావు ఇంటిని బుధవారం టీడీపీ నేతలు జేసీబీతో ధ్వంసం చేశారు. కొత్త ఇల్లు ని ర్మించుకొని మూడు నెలల క్రితమే ఆయన గృహ ప్రవేశం చేశారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడన్న కక్షతో ఈ దురాగతానికి పాల్పడ్డారు. పోలీసులు కనీసం ఫిర్యాదు పత్రం కూడా తీసుకోలేదు. ఇదే మండలం రాం»ొట్లవారిపాలెంకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు రాజేష్కుమార్ ఇంటిపై 30 మంది టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడి దారుణంగా కొట్టారు. ఇదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత, సర్పంచ్ ప్రసాదరెడ్డిని చంపేస్తామని బెదిరించారు. గ్రామం వదిలి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో ఆయన ఊరు వదిలి వెళ్లారు. ఇలా పలువురు నేతలు అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. నగరం, నిజాపట్నం తదితర మండలాల్లో సైతం ఈ తరహా దాడులు పెరిగాయి. రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక్క రేపల్లె నియోజకవర్గంలోనే వందల మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు గ్రామాలు వదలిపెట్టి వెళ్లారు. మంత్రి కనుసైగ మేరకే దాడులు కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నా, మంత్రి స్పందించక పోవడమే ఇందుకు నిదర్శనం. కాగా, జిల్లాలో బాధితుల నుంచి పోలీసు అధికారులు ఫిర్యాదులు కూడా స్వీకరించక పోవడం గమనార్హం.ఊరొదిలిన గిరిజన, దళిత కుటుంబాలు శ్రీకాళహస్తి రూరల్ మండల పరిధిలో టీడీపీ శ్రేణుల దాడులతో ఈశ్వరయ్య కాలనీకి చెందిన 55 కుటుంబాలు, వాగివేడులో 17 కుటుంబాలు, నారాయణపురంలో 3 కుటుంబాలు.. మొత్తం 75 కుటుంబాలు ఊరొదిలి వెళ్లిపోయాయి. ఇందులో ఎంపేడు సర్పంచ్ కొండయ్య కుటుంబం కూడా ఉంది. సర్పంచ్ కుటుంబం ఎక్కడకు వెళ్లిందో తెలియట్లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఊరొదిలి వెళ్లిన వారిలో సూళ్లకు వెళ్లే పిల్లలు కూడా ఉన్నారని చెబుతున్నారు. వారి కోసం స్కూల్ టీచర్లు తోటి విద్యార్థులను నివాసాలకు పంపించారని స్థానికులు తెలిపారు.ఆస్తులు ధ్వంసం చేస్తున్న కూటమిపుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలం పెద్దగొట్టికల్లుకు చెందిన మాధవరెడ్డి, జనార్థన్రెడ్డి ఆస్తులను కూటమి నేతలు ధ్వంసం చేశారు. పీలేరు–తిరుపతి జాతీయ రహదారిలోని రొంపిచర్ల క్రాస్ వద్ద ఉన్న వీఎంఆర్ కన్వెన్షన్ హాలు ముఖ ద్వారం ఆర్చిని గురువారం అర్ధరాత్రి కూలదోశారు. జనార్ధన్రెడ్డికి చెందిన సెరికల్చర్ షెడ్డును పడగొట్టారు. కొంత కాలంగా చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో పోలీసుల సమక్షంలోనే దాడులు చేస్తున్నా.. పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈశ్వరయ్య కాలనీలో జరిగిన ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో షికారీలపై మరోసారి దాడులు చేశారని స్థానికులు చెబుతున్నారు. ‘వాళ్లు అధికారంలో ఉన్నారు.. వారితో జాగ్రత్తగా ఉండాలి’ అని పోలీసులు సలహా ఇచ్చినట్లు సమాచారం. చంద్రగిరి నియోజక వర్గం పాకాల మండల యూత్ అధ్యక్షుడు చంటిపై గురువారం రాత్రి దాడి జరిగినా, పోలీసులు పట్టించుకోలేదు.ఫ్యాన్కు ఓటేసినందుకు ఊళ్లో ఉండొద్దు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో ఫ్యాను గుర్తుకు ఓటేసిన షికారీలు, దళితులను ఊర్ల నుంచి వెళ్లగొడుతున్నారు. ఊరు విడిచి వెళ్లని వారి నివాసాల్లోకి దూరి తరిమి తరిమి కొట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మరి కొన్ని చోట్ల వైఎస్సార్సీపీకి ఓటేసిన, పార్టీ శ్రేణుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఇంకొందరికి ఫోన్లు చేసి బెదిరింపులకు దిగుతున్నారు. అప్పులిచ్చిన వాళ్లను నివాసాలకు పంపి ఒత్తిళ్లు చేయిస్తూ రాక్షసానందం పొందుతున్నారు.శ్రీకాళహస్తి పరిధిలో ఇప్పటికే రూ.12 కోట్లు విలువ చేసే నివాసాలను కూల్చి వేశారు. శ్రీకాళహస్తి రూరల్ మండల పరిధిలోని ఈశ్వరయ్యకాలనీలో టీడీపీ శ్రేణులు శుక్రవారం షికారీల (గిరిజనులు) ఇళ్లలోకి చొరబడి కర్రలు, రాళ్లతో తరిమి కొట్టారు. ఊరు వదిలి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. దీంతో పలువురు కాలనీ విడిచి వెళ్లిపోయారు. ఈ నెల 12న ఎంపేడు పంచాయతీ ఈశ్వరయ్యకాలనీ, వాగివేడు, నారాయణపురంలో జరిగిన దాడులకు సంబంధించిన వీడియోలు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. నివాసాల్లోకి చొరబడి చిన్నా , పెద్దా తేడా చూడకుండా విచక్షణా రహితంగా దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయపడ్డ వారిలో చిన్న పిల్లలు, మహేశ్వరి (బాలింత), రవీన (గర్భిణి), ఎంజీఆర్ (వృద్దుడు)తో పాటు మరి కొందరు ఉన్నారు.
![Drug Peddler Dj Akhil Arrested In Banjara Hills](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/28/drugs.jpg.webp?itok=wJVVkNkU)
హైదరాబాద్లో డ్రగ్స్ సరఫరా.. డీజే అఖిల్ అరెస్ట్
సాక్షి,హైదరాబాద్ : బంజారాహిల్స్ కేంద్రంగా పలు పబ్బుల్లో డీజేగా పనిచేస్తున్న అఖిల్ డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డాడు. మాదక ద్రవ్యాల సరఫరాపై సమాచారం అందుకున్న పోలీసులు రెక్కీ నిర్వహించారు. అయితే ఓ ప్రాంతంలో డ్రగ్స్ అమ్ముతుండగా అఖిల్ను హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి పెద్ద ఎత్తున ఎండీఎఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్తో పాటు నిందితుడు వద్ద గంజాయిని బెంగళూరు నుంచి హైదరాబాద్కు తెచ్చి సరఫరా చేస్తున్నాడని పోలీసులు తెలిపాడు. ఇక డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ అఖిల్ను పోలీసులు విచారిస్తున్నారు. నగరంలో డ్రగ్స్ ఎవరికి అమ్మాడు, వారిలో సెలబ్రిటీలు ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
![సినీఫక్కీలో చోరీ](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/28/27bod28-340099_mr-1719520265-0.jpg.webp?itok=Er-Fsu-c)
సినీఫక్కీలో చోరీ..
ఆదిలాబాద్: మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ బంగారం దుకాణంలో గురువారం సినీఫక్కీలో చోరీ జరిగినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి దుకాణం ఎదుట ఆపారు. అందులోంచి ఒకరు దుకాణంలోకి వెళ్లి మెడలో వేసుకునే బంగారు లాకెట్ చూపమని దుకాణం యజమాని వనితను అడిగాడు.రూ.3వేల విలువగల లాకెట్కు రూ.వెయ్యి అడ్వాన్సుగా ఇచ్చాడు. మళ్లీ వచ్చి మిగతా రూ.2వేలు ఇచ్చి లాకెట్ తీసుకెళ్తానని నమ్మబలికాడు. ఇలా యజమానితో మాట్లాడుతునే కౌంటర్లో ప్లాస్టిక్ ప్యాకెట్ కవర్లో ఉన్న రెండు తులాల బంగారు ఆభరణాలు చేతి వేళ్ల మధ్యలో పెట్టుకుని బైక్పై పరారయ్యారు.యజమాని ఫిర్యాదుతో పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా దుండగులు శివాజీ చౌక్ నుంచి నంబర్ప్లేట్లేని బైక్పై వచ్చి ఆదిలాబాద్వైపు వెళ్లినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.