Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

BCCI Announce Rs 125 Crore Prize Money For Team India After T20 World Cup Win
టీమిండియాకు రూ. 125 కోట్ల ప్రైజ్‌మనీ

టీ20 ప్రపంచకప్‌ 2024 గెలిచిన భారత క్రికెట్‌ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. పొట్టి ఫార్మాట్‌లో జగజ్జేతగా నిలిచిన టీమిండియాకు రూ. 125 కోట్ల ప్రైజ్‌మనీని ప్రకటిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. టోర్నీ ఆధ్యాంతం టీమిండియా అసాధారణ ప్రతిభ, దృడ సంకల్పం మరియు క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించిందని షా ట్వీట్‌ చేశాడు. అత్యుత్తమ విజయాన్ని సాధించిన ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి అభినందనలు తెలిపారు.కాగా, నిన్న (జూన్‌ 29) జరిగిన టీ20 ప్రపంచకప్‌ 2024 ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. విరాట్‌ కోహ్లి (59 బంతుల్లో 76; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్‌ పటేల్‌ (31 బంతుల్లో 47; ఫోర్‌, 4 సిక్సర్లు), శివమ్‌ దూబే (16 బంతుల్లో 27; 3 ఫోర్లు, సిక్స్‌) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్‌ మహారాజ్‌, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టగా.. జన్సెన్‌, రబాడ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.I am pleased to announce prize money of INR 125 Crores for Team India for winning the ICC Men’s T20 World Cup 2024. The team has showcased exceptional talent, determination, and sportsmanship throughout the tournament. Congratulations to all the players, coaches, and support… pic.twitter.com/KINRLSexsD— Jay Shah (@JayShah) June 30, 2024అనంతరం 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. హార్దిక్‌ పాండ్యా (3-0-20-3), అర్ష్‌దీప్‌ సింగ్‌ (4-0-20-2), బుమ్రా (4-0-18-2) సత్తా చాటడంతో లక్ష్యానికి 8 పరుగుల దూరంలో (169/8) నిలిచిపోయింది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆదిలో తడబడినప్పటికీ.. మధ్యలో క్లాసెన్‌ (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) టీమిండియాను భయపెట్టాడు. ఆఖర్లో బుమ్రా, హార్దిక్‌, అర్ష్‌దీప్‌ అద్బుతంగా బౌలింగ్‌ చేయడంతో టీమిండియా విజయతీరాలకు చేరింది.వరల్డ్‌కప్‌ గెలిచిన అనంతరం విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 కెరీర్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించారు. టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం ఈ టోర్నీతోనే ముగిసింది.

Jaggampeta Mla Jyothula Nehru Sensational Comments On Volunteers
వాలంటీర్లు వద్దట!.. జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు

సాక్షి, కాకినాడ జిల్లా: వాలంటీర్లపై తమ అసలు రంగును టీడీపీ నేతలు బయటపెడుతున్నారు. వాలంటీర్ల సేవలు అవసరం లేదని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తేల్చి చెప్పేశారు. వాలంటీర్లు వద్దని టీడీపీ లేజిస్లేటివ్‌ సమావేశంలో చెబుతా.. అసెంబ్లీ సమావేశాల్లో ఒత్తిడి చేస్తానంటూ ఆయన వ్యాఖ్యానించారు. వాలంటీర్ల కంటే పారిశుధ్య కార్మికులకు రూ.10 వేలు ఇచ్చి నియమించుకోవాలన్న జ్యోతుల నెహ్రూ.. సచివాలయ ఉద్యోగులకు కాపలా కుక్కల్లా ఏన్డీఏ కార్యకర్తలు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.కాగా, ఐదేళ్ల క్రితం ఏర్పాటైన విప్లవాత్మక వలంటీర్‌ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం త్రిశంకు స్వర్గంలో పెట్టేసింది. 2019 ఆగస్టులో గత ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టగా వీరు నిర్వహించే విధుల్లో ప్రతి నెలా టంఛన్‌గా పింఛన్ల పంపిణీ అత్యంత కీలకం. అయితే జూలైలో పింఛన్ల పంపిణీని వలంటీర్ల ద్వారా కాకుండా గ్రామ, వార్డు సచివా­ల­యాల ఉద్యోగుల ద్వారా నిర్వహించాలని మంత్రివర్గ తొలి సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో వలంటీర్ల వ్యవస్థపై అటు అధికార వర్గాలు ఇటు రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతో పాటు వారి గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికలకు ముందు చంద్రబాబు స్పష్టమైన హా­మీ ఇచ్చారు. టీడీపీ–జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోనూ దీ­న్ని పొందుపరిచారు. అయితే ఇప్పుడు వలంటీర్లు ప్రధా­నంగా నిర్వహించే విధుల నుంచి వారిని దూరంగా ఉంచడం, ప్రత్యా­మ్నాయ మార్గాల ద్వారా పింఛన్ల పంపిణీకి సన్నద్ధం కావడంతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చర్చనీయాంశంగా మారింది.

Bengal Governor vs Mamata Banerjee Government
‘మమత’ వర్సెస్‌ గవర్నర్‌: తారాస్థాయికి విభేదాలు..!

కోల్‌కతా: వెస్ట్‌బెంగాల్‌లో మమతాబెనర్జీ ప్రభుత్వం, గవర్నర్‌ ఆనంద బోస్‌ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కోల్‌కతా నగర పోలీసు కమిషనర్‌ వినీత్‌కుమార్‌ను ఆ పదవి నుంచి తప్పించాలని గవర్నర్‌ బోస్‌ సీఎం మమతకు లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే గవర్నర్‌ డిమాండ్‌ను మమత ప్రభుత్వం తిరస్కరించినట్లు సమాచారం. రాజ్‌భవన్‌ను ఆనుకోని పోలీసులు ఓ కంటట్రోల్‌ను నిర్మించి తన కదలికలపై నిఘా ఉంచినట్లు గవర్నర్‌ భావిస్తున్నరని తెలుస్తోంది. దీంతో ఆయన కోల్‌కతా నగర పోలీసు కమిషనర్‌ను తప్పించాలని కోరుతున్నట్లు చెబుతున్నారు. అయితే కంట్రోల్‌ రూమ్‌ కొత్తగా నిర్మించి కాదని, రాజ్‌భవన్‌ భద్రత కోసం గత ప్రభుత్వాల హయాం నుంచే అక్కడ ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, రాజ్‌భవన్‌లో మహిళలకు రక్షణ లేదని సీఎం మమత చేసిన ఆరోపణలపై గవర్నర్‌ ఇప్పటికే కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

Success Story About Vadilal Gandhis Vadilal Ice Cream Business
ఎవరీ వడిలాల్ గాంధీ?.. రోడ్డుపక్కన ప్రారంభమై వేల కోట్ల సామ్రాజ్యాన్ని..

ఇప్పుడు ప్రముఖ బ్రాండ్లుగా ప్రసిద్ధి చెందిన సంస్థలన్నీ ఒకప్పుడు చిన్న కంపెనీలుగా ప్రారంభమైనవే. ఈ కోవకు చెందిన వాటిలో ఒకటి 'వడిలాల్ ఐస్‌క్రీమ్‌' కంపెనీ. ఈ కంపెనీ ఫౌండర్ 'వడిలాల్ గాంధీ'. ఇంతకీ ఈయన కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ప్రస్తుతం ఈ కంపెనీ విలువ ఎంత? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.మధ్యతరగతి కుటుంబానికి చెందిన 'వడిలాల్ గాంధీ' 1907లో అహ్మదాబాద్‌లోని ఒక చిన్న ఫౌంటెన్ సోడా దుకాణం ప్రారంభించారు. ఆ తరువాత సోడా విక్రయించడం ప్రారంభించారు. క్రమక్రమంగా.. గుజరాత్‌లో ఈయన దుకాణానికి ఆదరణ పెరిగింది. ఆ తరువాత సోడాతో పాటు ఐస్‌క్రీమ్‌ విక్రయించడం ప్రారంభించారు.వడిలాల్ గాంధీ ప్రారంభించిన ఐస్‌క్రీమ్‌ షాప్ బాగా అభివృద్ధి చెందింది. 1926లో ఈయన దేశంలోనే మొట్టమొదటి ఐస్‌క్రీమ్‌ అవుట్‌లెట్‌ స్థాపించారు. ఐస్‌క్రీమ్‌ వ్యాపారాన్ని విస్తరించడానికి అప్పట్లో జర్మనీ నుంచి యంత్రాలను దిగుమతి చేసుకున్నారు. ఆ తరువాత వడిలాల్ గాంధీ కుమారుడు రాంచోడ్ లాల్ గాంధీ వ్యాపార బాధ్యతలు చేపట్టారు.1970 నాటికి అహ్మదాబాద్‌లో మొత్తం 10 వడిలాల్ అవుట్‌లెట్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని అప్పట్లో రాంచోడ్ లాల్ కుమారులు రామచంద్ర, లక్ష్మణ్ గాంధీలు నిర్వహించారు. నేడు ఈ కంపెనీ భారతదేశంలోని అతిపెద్ద ఐస్‌క్రీమ్‌ బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది. గతంలో ఈ కంపెనీ వండిన కూరలు, రొట్టెలు మొదలైన ప్రాసెస్ చేసిన ఆహారాన్ని విక్రయించింది.ప్రస్తుతం వడిలాల్ కుటుంబానికి చెందిన ఐదవ తరం వ్యక్తి 'కల్పిత్ గాంధీ' కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీ కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా అమెరికాలో కూడా ఐస్‌క్రీమ్‌ విక్రయిస్తూ ప్రజాదరణ పొందుతోంది.1907లో ఓ వీధి దుకాణంగా ప్రారంభమైన వడిలాల్ కంపెనీ నేడు ప్రముఖ ఐస్‌క్రీమ్‌ బ్రాండ్ అయిపోయింది. ప్రస్తుతం వడిలాల్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ. 30,00,00,00,000. దీన్నిబట్టి చూస్తే.. వీధి పక్కన ఓ చిన్న షాపుగా ప్రారంభమై నేడు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ.. వ్యాపార రంగంలో దూసుకెళ్తోంది.

Ex Minister Botsa Satyanarayana Comments On Tdp Leaders
టీడీపీ విష సంస్కృతి.. ఇదేం దౌర్జన్యం: బొత్స

సాక్షి, విజయనగరం: ఎన్నికల తర్వాత దాడులు పెరిగాయని.. ప్రజాస్వామ్యంలో ఇటువంటివి ఉండకూడదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 20 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధేస్తుందన్నారు.ప్రజాస్వామ్యంలో సామాన్య ప్రజలకు హక్కులున్నాయి. విజయనగరంలో మా పార్టీ ఆఫీసులోకి టీడీపీ నాయకులు చోరబడ్డారు. ఇటువంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. చట్టబద్ధంగా మా పార్టీ ఆఫీసులు నిర్మాణాలు జరుగుతున్నాయి. యూనివర్శిటీల వీసీలపై కూడా దౌర్జన్యానికి దిగుతున్నారు’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.‘విజయనగరం జిల్లా లో విష సంస్కృతి వచ్చింది. ప్రతిపక్ష వైస్సార్సీపీ పార్టీ కార్యాలయానికి వెళ్లి అధికార పార్టీ ఎమ్మెల్యే పరిశీలించడం ఏమిటి?. ఏదయిన పొరపాట్లు జరిగితే నోటీస్ ఇవ్వవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించవచ్చు. యూనివర్సిటీల్లో వీసీలను నామినేట్ చేయడం ఒక విధానం. ఆ వీసీ కార్యాచరణ నచ్చకపోతే నోటీస్ ఇవ్వవచ్చు. ⁠వీసీ ఆఫీస్‌లకు వెళ్లి బెదిరించడం, తొలగించడం తప్పు. అవినీతి పై ఎంక్వయిరీ కోరడం తప్పు కాదు. అధికారం వాళ్ల చేతుల్లో వుంది. విద్యాశాఖ లో నాపై వచ్చిన ఆరోపణలు పై నో కామెంట్. ఫైల్స్ వాళ్ళ దగ్గర వున్నాయి. పరిశీలించుకోవాలి. కొందరు రిటైర్ అయిన అధికార్లు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడరు. అధికారం పోయాక వచ్చి చెప్తారు. అది ఎంత వరకు సమంజసం.’’ అంటూ బొత్స మండిపడ్డారు‘‘⁠అనుభవం ఉన్న పార్టీ కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వాళ్లకు తెలుసు. పథకాలు ఇస్తారో ఇవ్వరో వాళ్లకే తెలియాలి. ⁠రేపు ఏప్రిల్ నెలలో రిటైర్మెంట్‌తో కలుపుకొని 6 వేలు టీచర్ ఖాళీలు ఉన్నాయని అంచనా. ⁠ఈ ప్రభుత్వం 50వేలు అంచనా వేసి 16వేలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ⁠కేంద్రం పార్లమెంట్ లో 30వేలు పోస్ట్‌లు ఖాళీ ఉన్నాయని అన్నారు. 117జీవోని రద్దు చేస్తే ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితిని బట్టి ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వవచ్చు’’ అని బొత్స పేర్కొన్నారు.

Woman Beaten Up In Bengal Town Draws Fire
బెంగాల్‌: యువతిని చితకబాదిన ఘటనపై దుమారం

కోల్‌కతా: వెస్ట్‌బెంగాల్‌లో ఓ వీడియో దుమారం రేపుతోంది. ఓ యువతిని రోడ్డుపై పడేసి కర్ర విరిగేలా చితకబాదుతున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.యువతిని కొడుతుండగా చుట్టూ నిలబడిన వారంతా చూస్తూ ఉండిపోయారు తప్ప ఆపడానికి ఎవరూ ప్రయత్నించలేదు. ఈ ఘటన బెంగాల్‌లో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితి తెలియజేస్తోందని మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఘటనపై బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవ్య ఎక్స్(ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు. ‘ఈ వీడియోలో యువతిని దారుణంగా కొడుతున్నది చోప్రా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న తృణమూల్‌ ఎమ్మెల్యే హమిదుర్‌ రెహ్మాన్‌ అనుచరుడు తేజ్‌ముల్‌ అనే వ్యక్తి. ఇతను తన ‘ఇన్‌సాఫ్‌’ సభల ద్వారా పంచాయితీలు చేసి అక్కడికక్కడే శిక్షలు విధిస్తుంటాడు. This is the ugly face of Mamata Banerjee’s rule in West Bengal.The guy in the video, who is beating up a woman mercilessly, is Tajemul (popular as JCB in the area). He is famous for giving quick justice through his ‘insaf’ sabha and is a close associate of Chopra MLA Hamidur… pic.twitter.com/fuQ8dVO5Mr— Amit Malviya (@amitmalviya) June 30, 2024తృణమూల్‌ కాంగ్రెస్‌ పాలనలో ఈ తరహా షరియా కోర్టులున్నాయని భారత ప్రజలు మొత్తం గుర్తించాలి. బెంగాల్‌లో ప్రతి గ్రామంలో ‘సందేశ్‌ఖాలీ’తరహా ఘటనలు జరుగుతున్నాయి. మమత పాలన వెస్ట్‌బెంగాల్‌కు ఒక శాపం’అని మాలవ్య ట్వీట్‌లో ఫైర్‌ అయ్యారు. మరోపక్క సీపీఎం నేతలు కూడా యువతిని కొడుతున్న వీడియోపై స్పందించారు. బెంగాల్‌లో బుల్డోజర్‌ జస్టిస్‌ రాజ్యమేలుతోందని సీపీఎం స్టేట్‌ సెక్రటరీ ఎండీ సలీమ్‌ ఎక్స్‌(ట్విటర్‌)లో విమర్శించారు. కాగా, యువతిని చితకబాదిన ఘటన ఈ వారాంతంలోనే జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఏ కారణంతో కొడుతున్నారనేది తెలియరాలేదు. Not even #KangarooCourt ! Summary trial and punishment handed out by d ⁦@AITCofficial⁩ goon nicknamed JCB.Literally bulldozer justice at Chopra under ⁦@MamataOfficial⁩ rule. pic.twitter.com/TwJEThOUhi— Md Salim (@salimdotcomrade) June 30, 2024

Elon Musk Third Wife Who is Shivon Zilis
మస్క్ మూడో భార్య.. ఎవరీ 'శివోన్ జిలిస్'?

ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్' (Elon Musk) ఇటీవల మరో బిడ్డకు తండ్రి అయ్యారు. న్యూరాలింక్‌ ఎగ్జిక్యూటివ్‌.. మస్క్ మూడో భార్య శివోన్ జిలిస్ (Shivon Zilis) ఇటీవల బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో మస్క్ ఇప్పుడు 12మంది పిల్లలకు తండ్రయ్యారు. ఇంతకీ జిలిస్ ఎవరు? ఈమెకు భారతదేశానికి సంబంధం ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.మస్క్, జిలిస్‌ బిడ్డకు జన్మనివ్వడం రహస్యంగా జరిగిందని కొన్ని వార్తలు తెరమీదకు వచ్చాయి. దీనికపైన మస్క్ స్పందిస్తూ.. ఇదేమీ రహస్యం కాదని నా సన్నిహితులకు అందరికి ఈ విషయం తెలుసనీ, పేపర్ ప్రకటన ఇవ్వకపోతే అదేమీ రహస్యం కాదని అన్నారు. నవంబర్ 2021లో మస్క్, జిలిస్ కవలలకు (స్ట్రైడర్, అజూర్‌) జన్మనిచ్చారు. కాగా ఇప్పుడు వీరు మరో బిడ్డకు జన్మనిచ్చారు.ఎవరీ శివోన్ జిలిస్?ఇటీవల మూడో బిడ్డకు జన్మనిచ్చిన శివోన్ జిలిస్ కెనడాలో జన్మించినప్పటికీ ఆమె తల్లి శారద భారతదేశానికి చెందిందని 2015లో యూఎస్ఏ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. జిలిస్ అమెరికాలోని యేల్ యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్, ఎకనామిక్స్ అండ్ ఫిలాసఫీలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. జిలిస్ మస్క్ బ్రెయిన్-చిప్ స్టార్టప్ న్యూరాలింక్‌లో టాప్ ఎగ్జిక్యూటివ్. అంతకు ముందు ఈమె సుదీర్ఘకాలం ఆపరేషన్స్ అండ్ స్పెషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ హోదాలో పనిచేసినట్లు తెలుస్తోంది.

A Transwoman Rituparna Neog Who Is Promoting Queer Awareness
ఆ ఫోబియాకు పుస్తకాల శక్తితో చెక్‌ పెట్టి..స్ఫూర్తిగా నిలిచిన ట్రాన్స్‌విమెన్‌!

ట్రాన్స్‌జెండర్‌లను మన సమాజం ఎలా చూస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లను ఆదరించి, అక్కున చేర్చుకోవడం అటుంచి కనీసం మనిషిగా కూడా చూడరు. శారీరకంగా వచ్చే మార్పులని సైన్స్‌ చెబుతున్నా..విద్యావంతులు సైతం వాళ్లను సాటి మనుషులుగా గుర్తించరు. ఎన్నో వేధింపులు, అవమానాలు దాటుకుని కొందరూ మాత్రమే పైకొచ్చి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కొద్దిమంది మాత్రమే తమలాంటి వాళ్లు వేధింపులకు గురికాకుండా తలెత్తుకుని బతకాలని పాటుపడుతున్నారు. అలాంటి కోవకు చెందిందే రితుపర్ణ నియోగ్‌. ఎవరీ నియోగ్‌? ఏం చేస్తోందంటే..అస్సాంకి చెందిన రితుపర్ణ నియోగ్‌ చిన్నతనంలో ఎన్నో బెరింపులు, వేధింపులకు గురయ్యింది. తన బాల్యంకి సంబంధించిన పాఠశాల జ్ఞాపకాలన్నీ చేదు అనుభవాలే. కొద్దిలో రితుపర్ణకు ఉన్న అదృష్టం ఏంటంటే..కుటుంబం మద్దతు. తన కుటుంబ సహాయ సహకారాల వల్ల ఇంట్లో ఎలాంటి వేధింపులు లేకపోయినా..బయట మాత్రం తన తోటి స్నేహితుల నుంచే విపరీతమైన వేధింపులు ఎదుర్కొంది రితుపర్ణ. కొన్నాళ్లు ఇంటికే పరిమితమై లింగ గుర్తింపు విషయమై క్వీర్‌ ఫోబియాను పేర్కొంది. ఇక్కడ క్వీర్‌ అంటే..క్వీర్ అనేది లైంగిక, లింగ గుర్తింపులను వివరించే పదం. లెస్బియన్, గే, బైసెక్సువల్, లింగమార్పిడి వ్యక్తులు అందరూ క్వీర్ అనే పదంతో గుర్తిస్తారు. వారు ఎదుర్కొనే సమస్యల కారణంగా భయాందోళనకు లోనై బయటకు తిరిగేందుకే జంకితే దాన్ని క్వీర్‌ ఫోబియా అంటారు. తనలా అలాంటి సమస్యతో మరెవ్వరూ ఇంటికే పరిమితం కాకుండా ఉండలే చేసేందుకు నడుంబిగించింది రితుపర్ణ. దానికి ఒక్కటి మార్గం పుస్తకాలను ప్రగాఢంగా నమ్మింది. వారు బాగా చదువుకుంటే తమ హక్కులు గురించి తెలుసుకోగలుగుతారు, ఇలా భయంతో బిక్కుబిక్కుమని కాలం గడపరనేది రితుపర్ణ నమ్మకం. తాను కూడా ఆ టైంలో ఎదురయ్యే అవమానాలను ఎలాఫేస్‌ చేయాలనేది తెలియక సతమతమయ్యి ఆ క్రమంలోనే నాలుగు గోడలకు పరిమితమైనట్లు చెప్పుకొచ్చింది రితుపర్ణ. చివరికి ఏదోలా బయటపడి..ఉన్నత చదువులు చదువుకున్నానని చెప్పుకొచ్చింది. 2015లో గౌహతిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో చదవు పూర్తి చేసుకుని గ్రామానికి తిరిగి వచ్చినట్లు తెలిపింది. అప్పుడే తన గ్రామం దేశంలోని ఇతర ప్రాంతాల కంటే ఎంత వెనుకబడి ఉందనేది తెలుసుకుంది. ట్రాన్స్‌ జెండర్‌గా తాను మాత్రం ఈ గ్రామం నుంచి బయటకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకున్నాని గ్రహించి..తనలాంటి వాళ్ల అభ్యన్నతికి పాటుపడాలని లక్ష్యం ఏర్పరుచుకుంది. ఆ నేఫథ్యంలో 2020లో తనలాంటి పిల్లల కోసం 'కితాపే కథా కోయి' అనే హైబ్రిడ్‌ స్టోరీ టెల్లింగ్‌ ప్రాజెక్ట్‌ని ప్రారంభించింది. ఉచిత కమ్యూనిటీ లైబ్రరీలతో గ్రామంలోని పిల్లలు టీ ఎస్టేట్‌లోకి వెళ్లకుండా ఉండేలా చేసింది. వాళ్లు ఆ లైబ్రరీలో హిందీ, అస్సామీ, ఆంగ్లం వంటి పుస్తకాలను చదివేందుకు సహకరిస్తుంది రితుపర్ణ. తన గ్రామంలోని ప్రజలతో తన ఆలోచనను పంచుకోవడమే గాక, ఆచరణలోకి తీసుకొచ్చింది. మొదటగా తన స్వంత పుస్తకాలతో ఉచిత లైబ్రరీ తెరిచింది. అలా వందలాది పుసక్తాలతో కూడిన పెద్ద లైబ్రరీగా రూపాంతరం చెందింది. ఆ లైబ్రరీలో.. లింగం, లైంగికత, మానసిక ఆరోగ్యం, వాతావరణ న్యాయం, సామర్థ్యం, ​​స్త్రీవాదం, మైనారిటీ హక్కులు వంటి వివిధ విషయాలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. రీతుపర్ణ ఇటీవల అస్సాం ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలోని ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం నేషనల్ కౌన్సిల్‌కు సభ్య ప్రతినిధిగా నామినేట్ అయ్యారు. View this post on Instagram A post shared by Rituparna (@the_story_mama) (చదవండి: అత్యంత లగ్జరియస్‌ వివాహం..ఒక్కో అతిథికి ఏకంగా..!)

Hanu Man To Kalki 2898 AD: Tollywood First 6 Months Report
హనుమాన్‌ టు కల్కి.. టాలీవుడ్‌ ఫస్టాప్‌ ఎలా ఉందంటే..

టాలీవుడ్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమాలకు కేరాఫ్‌గా మారింది. ఇక్కడి సినిమాలను ప్రపంచం మొత్తం ఆదరిస్తోంది. వందల కోట్ల కలెక్షన్స్‌ రాబడుతూ రికార్డులను సృష్టిస్తోంది. అయితే ఇక్కడ సక్సెస్‌ ఎంత శాతం ఉందో ఫెయిల్యూర్‌ అంతే ఉంది. కొన్ని సినిమాలు ఊహించని రీతిలో కలెక్షన్స్‌ రాబడితే.. మరికొన్ని దారుణమైన అపజయాన్ని మూటగట్టుకున్నాయి. ఈ ఆరు నెలల్లో టాలీవుడ్‌ రిపోర్ట్‌ ఎలా ఉందో చూసేద్దాం.ఓపెనింగ్‌ అదిరింది!టాలీవుడ్‌కి సంక్రాంతి పండగ చాలా పెద్దది. ప్రతి సంక్రాంతికి ఒకటి రెండు పెద్ద సినిమాలు వస్తుంటాయి. కానీ ఈ ఏడాది మాత్రం ఏకంగా నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ‘గుంటూరు కారం’, వెంకటేశ్‌ ‘సైంధవ్‌’, నాగార్జున ‘నా సామిరంగ’తో పాటు కుర్రహీరో తేజ సజ్జ ‘హనుమాన్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే వీటిల్లో హనుమాన్‌ భారీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. స్టార్‌ హీరోల సినిమాలు బరిలో ఉన్నప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులు ‘హనుమాన్‌’కే ఓటేశారు. ఫలితంగా బాక్సాఫీస్‌ వద్ద దాదాపు రూ. 300 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టింది. గుంటూరుకారం, నా సామిరంగ చిత్రాలకి మిశ్రమ టాక్‌ వచ్చినా.. మంచి వసూళ్లనే రాబట్టాయి. సైంధవ్‌ మాత్రం దారుణంగా బోల్తాపడింది. అంతకు ముందు జనవరి 1న వచ్చిన సర్కారు నౌకరి, రిపబ్లిక్‌ డే సందర్భంగా రిలీజైన ‘ర్యాపిడ్‌ యాక్షన్‌ మిషన్‌’, ‘బిఫోర్‌ మ్యారేజ్‌’ సినిమాలు ప్లాప్‌ టాక్‌నే మూటగట్టుకున్నాయి.బ్యాండ్‌ మోగింది..ఇక ఫిబ్రవరి తొలివారంలో సుహాస్‌ హీరోగా నటించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‌’ విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి విజయమే సాధించింది. అదేవారంలో వచ్చిన ‘కిస్మత్‌’, ‘హ్యాపీ ఎండింగ్‌’, ‘బూట్‌కట్‌ బాలరాజు’, ‘గేమ్‌ ఆన్‌’ చిత్రాలు మాత్రం సందడి చేయలేకపోయాయి. ఇక రెండో వారంలో వచ్చిన రవితేజ ఈగల్‌, మమ్ముట్టి, జీవా ల‘యాత్ర 2’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపంచాయి. మూడోవారంలో వచ్చిన ‘ఊరు పేరు భైరవకోన’ప్రేక్షకలను కొంతమేర భయపెట్టేసింది. అయితే బాక్సాఫీస్‌ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక చివరివారంలో వచ్చిన ‘మస్తు షేడ్స్‌ ఉన్నాయ్‌ రా’, ‘రాజధాని ఫైల్స్‌’, ‘సిద్ధార్థ్‌ రాయ్‌’, ‘సుందరం మాస్టర్‌’ చిత్రాలేవి ప్రేక్షకులను అలరించలేకపోయాయి. అయితే ఫిబ్రవరిలో ఈగల్‌, యాత్ర 2 తప్పితే మిగతావన్నీ అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిన్న చిత్రాలే రిలీజ్‌ కావడం గమనార్హం.అలరించని సమ్మర్‌సంక్రాంతి తర్వాత సమ్మర్‌ సీజన్‌ టాలీవుడ్‌కి చాలా ముఖ్యమైనది. దాదాపు మూడు నాలుగు పెద్ద సినిమాలైనా వేసవిలో విడుదలయ్యేవి. కానీ ఈ ఏడాది సమ్మర్‌లో ఒక్క స్టార్‌ హీరో సినిమా కూడా రిలీజ్‌ కాలేదు. మార్చి తొలివారం వరుణ్‌ తేజ్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అదేవారం భూతద్దం భాస్కర్‌ నారాయణ’, ‘చారి 111’, ‘ఇంటి నెంబర్‌ 13’లాంటి చిన్న సినిమాలు రిలీజ్‌ అయ్యాయి కానీ.. ఏ ఒక్కటి అలరించలేదు. (చదవండి: బాక్సాఫీస్ వద్ద కల్కి నయా రికార్డ్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లో తెలుసా?)రెండోవారం గోపిచంద్‌ ‘భీమా’తో విశ్వక్‌ సేన్‌ ‘గామి’తో వచ్చాడు. వీటిల్లో భీమాకి ప్లాప్‌ టాక్‌ రాగా.. ‘గామి’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ బాక్సాఫీస్‌ వద్ద రెండు సినిమాలో బోల్తా పడ్డాయి. ఇక మూడో వారంలో రజాకార్‌, లంబసింగి, షరతులు వర్తిసాయి’తో పాటు అరడజనుకు పైగా చిన్న సినిమాలు రిలీజ్‌ అయినా..ఒక్కటి కూడా హిట్‌ కాలేదు. మూడో వారంలో రిలీజైన శ్రీవిష్ణు ‘ఓం భీమ్‌ బుష్‌’ థియేటర్లలో నవ్వులు పూయించింది. ఇక చివరి వారంలో వచ్చిన ‘టిల్లు స్వ్కేర్‌’ సూపర్‌ హిట్‌ కొట్టేసింది. బాక్సాపీస్‌ వద్ద దాదాపు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ‘టిల్లుగాడు’ సత్తా చాటాడు.ఏప్రిల్‌లో భారీ అంచనాలతో వచ్చిన విజయదేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్‌’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అదేవారంలో రిలీజైన భరతనాట్యం’, ‘బహుముఖం’ చిత్రాలు ప్లాప్‌ టాక్‌ని సంపాదించుకున్నాయి. రెండోవారంలో రిజీలైన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రం యావరేజ్‌ టాక్‌ని సంపాదించుకుంది. ఇక చివరి రెండు వారాల్లో ‘శ్రీరంగనీతులు’ ‘పారిజాతపర్వం’, ‘మార్కెట్‌ మహాలక్ష్మీ, తెప్ప సముద్రం చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాగా..ఏ ఒక్కటి ఆకట్టుకోలేదు.(చదవండి: పాన్‌ ఇండియాపై ‘మెగా’ ఆశలు)మేలో తొలివారం ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ అల్లరి నరేశ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలా కాలం తర్వాత నరేశ్‌ నటించిన కామెడీ చిత్రమిది. మంచి అంచనాలతో రిలీజైన ఈ చిత్రం ఫ్లాప్‌ టాక్‌నే సంపాదించుకుంది. ఈ మూవీతో పాటు రిలీజైన సుహాస్‌ ‘ప్రసన్నవదనం’ చిత్రానికి మంచి టాక్‌ వచ్చినా.. వసూళ్లను మాత్రం రాబట్టలేకపోయింది. ఒక సెకండ్‌ వీక్‌లో సత్యదేవ్‌ ‘కృష్ణమ్మ’తో పాటు ‘ఆరంభం’ అనే చిన్న చిత్రం విడుదలైన..తొలిరోజే నెగెటివ్‌ టాక్‌ని సంపాదించుకున్నాయి. ఇక నారా రోహిత్‌ హీరోగా నటించిన ‘ప్రతినిధి 2’ థియేటర్స్‌కి వచ్చిన విషయమే తెలియదు. ఆ తర్వాత వారంలో ‘నట రత్నాలు’, ‘బిగ్‌ బ్రదర్‌’, ‘సీడీ’ ‘సిల్క్‌ శారీ’, ‘డర్టీ ఫెలో’, ‘బ్రహ్మచారి’తో పాటు మొత్తం అరడజను చిత్రాలు విడుదలైన ప్లాప్‌ టాక్‌ని మూటగట్టుకున్నాయి. గెటప్‌ శ్రీను తొలిసారి హీరోగా నటించిన ‘రాజు యాదవ్‌’ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక చివరివారం భజేవాయు వేగం, గం..గం..గణేశా, గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి చిత్రాలు రిలీజ్‌ కాగా.. వీటిల్లో ‘భజే వాయు వేగం’ హిట్‌ టాక్‌కి సంపాదించుకుంది. ఇక జూన్‌ తొలివారం ‘సత్యభామ’ అంటూ కాజల్‌.. ‘మనమే’ అంటూ శర్వానంద్‌ ప్రేక్షకుల ముందుకు రాగా.. రెండు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేపోయాయి. అదేవారంలో లవ్‌ మౌళితో పాటు మరో రెండు చిత్రాలు రిలీజ్‌ అయ్యాయి కానీ.. ఏది హిట్‌ కాలేదు. రెండో వారంలో సుధీర్‌ బాబు ‘హరోం హర’తో పాటు ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి, నీ దారే నీ కథ, యేవమ్‌ చిత్రాలు రిలీజ్‌ అయ్యాయి. వీటిల్లో మ్యూజిక్‌ షాప్‌ మూర్తి విమర్శకులు ప్రశంసలు అందుకుంది. మూడోవారంలో నింద, ‘ఓ మంచి ఘోస్ట్‌’, ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’, ‘అంతిమ తీర్పు’ లాంటి పలు చిన్న సినిమాలు విడుదలైనా..ఏ ఒక్కటి అలరించలేదు. ఇక చివరి వారం మాత్రం టాలీవుడ్‌కి గుర్తిండిపోయే విజయాన్ని అందించింది. ప్రభాస్‌ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ జూన్‌ 27న విడుదలై హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం మూడు రోజుల్లోనే 415 కోట్లను వసూళ్లు చేసి రికార్డ్‌ సృష్టిస్తోంది. మొత్తంగా ఈ ఆరు నెలల్లో హిట్ల కంటే ఎక్కువగా ఫ్లాపులే ఉన్నాయి. అయితే హనుమాన్‌, కల్కి 2898 చిత్రాలు మాత్రం చారిత్రాత్మక విజయాలను అందుకున్నాయి.

If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?

NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement