kanyasulkam
-
కన్యాశుల్కం నాటకాన్ని గురజాడ ఎందుకు రాశారు!?
గురజాడ వారి ‘కన్యాశుల్కం’ ఒక అపూర్వ నాటక శిల్పం. లెక్కలేనన్ని పునర్ముద్రణలతో ఈ నాటకం ఎప్పటికప్పుడు పునరుజ్జీవనం పొందుతూనే ఉంది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలోని ‘మానవవికాస వేదిక’ కన్యాశుల్కం నాటకాన్ని తాజాగా మళ్లీ ముద్రించింది. విజయనగరంలోని గురజాడ గృహాన్ని సందర్శించే ప్రతి ఒక్కరికి కన్యాశుల్కం ప్రతిని ఉచితంగా ఇవ్వనున్నారు. ఆ ఇంటిని పర్యవేక్షిస్తున్న గురజాడ ముని మనుమడు గురజాడ వెంకటేశ్వర ప్రసాద్, వారి సతీమణి ఇందిరాదేవిలకు ఈనెల 29వ తేదీ గురువారం సాయంత్రం తిరుపతి ఆఫీసర్స్ క్లబ్ జరగనున్న సమావేశంలో ‘కన్యాశుల్కం’ ప్రతులను అందివ్వనున్నారు. ‘కన్యాశుల్కం’ నాటకాన్ని గురజాడ అసలు ఎందుకు రాశారు!? గర్భస్థ శిశువుకు కూడా బేరం పెట్టడం వంటి దారుణ స్థితిగతులు గురజాడను కలిచివేసి కన్యాశుల్కం నాటక రచనకు ప్రేరేపించాయి. ఈ దురాచారం పైన గురజాడ కత్తి దూయలేదు, దండెత్తలేదు, అవహేళన చేసి వదిలి పెట్టారు. లండన్లో మురికివాడల గురించి ప్రపంచ ప్రసిద్ధ నాటకకర్త జార్జ్ బెర్నార్డ్ షా ‘విడోవర్స్ హౌసెస్’ అన్న నాటకాన్ని రాసి 1892 డిసెంబర్ 9న ప్రదర్శించారు. దానికి నాలుగు నెలల ముందే 1892 ఆగస్టు 12వ తేదీన విజయనగరంలో ‘కన్యాశుల్కం’ నాటకాన్ని గుర జాడ ప్రదర్శించారు. (క్లిక్: కవిత్వమే ఆయుధమై.. చైతన్య తూటాలను పేల్చి..) సమకాలీన సమస్యలపైన వచ్చిన తొలి నాటకంగా ‘కన్యాశుల్కం’ ప్రపంచ నాటక రంగ చరిత్రలో నిలిచిపోయింది. గిడుగు రామమూర్తికి బి.ఏ. లో సహ విద్యార్థి అయిన గురజాడ వ్యవహారిక భాషా ఉద్యమం ఊపిరి పోసుకోక ముందే, తన పాతికేళ్ల వయసులో వ్యవహారిక భాషలో ‘కన్యాశుల్కం’ రాసి వ్యవహారిక భాషా ఉద్యమానికి బీజం వేశారు. బ్రిటిష్ ప్రభుత్వం కన్యాశుల్కాన్ని నిషేధించకపోయినా, 1929లో బాల్య వివా హాల నిషేధ చట్టం రావడానికి ‘కన్యాశుల్కం’ నాటకం దోహదం చేసింది. అందుకనే ఇదొక మహా దృశ్యకావ్యంగా, తెలుగు వారి సాహిత్య వారసత్వ సంపదగా నిలిచిపోయింది. (క్లిక్ చేయండి: దళిత సాహిత్య కృషికి దక్కిన గౌరవం) – రాఘవ శర్మ -
సీఎం జగన్ను కలిసిన తిరుపతి ఎమ్మెల్యే భూమన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని శాసనసభలోని సీఎం కార్యాలయంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి కలిశారు. మహాకవి గురజాడ అప్పారావు 160వ జయంతి సందర్భంగా ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం పుస్తకాన్ని భూమన కరుణాకర్రెడ్డి ఐదువేల కాపీలను ముద్రించారు. వీటిని సీఎం జగన్ బుధవారం ఆవిష్కరించారు. ఈ కాపీలను విజయనగరంలోని గురజాడ ఇంటికి బహూకరించి.. సందర్శకులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు భూమన తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. చదవండి: (కరవు, బాబు ఇద్దరూ కవలలు: సీఎం జగన్) -
కుమార్తె వివాహాన్ని అడ్డుకున్న తండ్రి
చెన్నై,టీ.నగర్: వధువుకు కన్యాశుల్కం కింద ఇల్లు ఇవ్వనందున వధువు కుటుంబీకులు వివాహాన్ని నిలిపినట్లు వరుడి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. ఈ వివరాలు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. తిరువారూరు జిల్లా మన్నార్గుడి సమీపంలోని మూవానల్లూరు గ్రామానికి చెందిన ధనుస్సు కుమారుడు అరుళ్మణికంఠన్ (32) సింగపూర్లో పనిచేస్తున్నాడు. ఇతనికి తిరుచ్చి పుత్తూరుకళత్తుమేడు ప్రాంతానికి చెందిన నటరాజన్ కుమార్తెకు జూలై 15న ఇరు కుటుంబాల సమ్మతంతో వివాహ నిశ్ఛితార్థం జరిగింది. ఈ నెల ఒకటో తేదీ మన్నార్గుడి రాజగోపాల స్వామి ఆలయం వివాహ మండపంలో వివాహానికి ఏర్పాట్లు చేశారు. ఇలావుండగా హఠాత్తుగా వివాహాన్ని వధువు ఇంటివారు నిలిపేసినట్లు సమాచారం. దీంతో ఒకటో తేదీ వివాహం జరగలేదు. వధువు తండ్రి నటరాజన్ తన కుమార్తె పేరుతో రూ.65 లక్షలతో తిరుచ్చిలో ఇల్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేస్తేనే వివాహం జరుగుతుందని ఖరాఖండిగా తెలిపారు. దీనిపై ఇరు కుటుంబాలు మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. సాధారణంగా వరుడి ఇంటివారు వధువు కుటుంబాన్ని వరకట్నం కోసం డిమాండ్ చేస్తారు. ఇది కాస్తా రివర్స్ అయింది. ఈ వినూత్న సంఘటన అక్కడ సంచలనం కలిగించింది. -
తాతాచార్ల కథలు
తాళపత్రాల్లో అగ్గిపురుగులకు ఆహుతౌతున్న తెలుగు సాహిత్యాన్ని పరిష్కరించి, పునరుద్ధరించిన మహనీయుడు సి.పి.బ్రౌన్. ఆయన వెలుగులోకి తెచ్చిన పుస్తకాల్లో ‘తాతాచార్ల కథలు’ ఒకటి.తాతాచార్యులు తెలుగు బ్రాహ్మణుడు, ‘50 ఏళ్ల’ వయసు కలవాడు, పొడగరి, దృఢకాయుడు, హాస్యప్రియుడు, సంస్కృతం బాగా చదువుకున్నవాడు. వైద్య గ్రంథాలు, జ్యోతిష గ్రంథాలు ఈయన వద్దనే బ్రౌన్ చదువుకున్నట్లు తెలుస్తోంది. ఈయనను నెల్లూరు వాసిగా బ్రౌన్ స్వయంగా తన పరిచయ వాక్యాల్లో రాశాడు. ఈయన చెప్పిన కథలు తాతాచార్ల కథలు. వీటికి వినోద కథలని పేరు. తాతాచారి చెప్పిన కథలను విన్న బ్రౌన్ 1855లో ఇండియా వదిలి లండన్కు వెళ్లేముందు ప్రచురించాడు. అదే సంవత్సరం వీటి ఆంగ్లానువాదం ‘పాపులర్ తెలుగు టేల్స్’ పేరుతో ప్రచురితమైంది. 1916లో వావిళ్ల వారు తాతాచారి కథలను ‘ఎడిటెడ్ బై గురజాడ అప్పారావు, ద ఆథర్ ఆఫ్ కన్యాశుల్కం’ అని అట్టపై వేసి పునర్ముద్రించారు. ఇవే 1926లో ఒకసారి, 1951లో మరోసారి పునర్ముద్రణ పొందాయి. ‘సి.పి.బ్రౌన్ సంతరించిన తాతాచార్ల కథలు’ పేరుతో 1974లో బంగోరె సంపాదకుడిగా చతుర్థ ముద్రణ వచ్చింది. ‘గుడిని మసీదుగా మార్చిన రాయీజీ’ కథలో రాయీజీ ఒక నవాబు దగ్గర దివానుగా పనిచేస్తూ విశ్వాసపాత్రుడిగా మెలుగుతూ ఒక పేటలో గుడిని నిర్మాణం చేస్తూవుంటాడు. ఆ విషయం నవాబుకు తెలియడంతో గుడి నిర్మాణం పూర్తయ్యేసరికి దాన్ని మసీదుగా రూపుదిద్దుకునేలా చేసి నవాబు మన్ననలు పొందుతాడు. ‘దుగ్గిశెట్టి కొడుకులు’ కథలో నెల్లూరులోని వెంకటగిరి కోటపైకి పిండారి దళం(ఊర్లు దోచుకుని జీవించేవారు) దండెత్తి రాకుండా కోట చుట్టూ వున్న మట్టిగోడలు బలంగా ఏర్పాటుచేసినట్లు ఉంది. ఆనాడు జరిగిన సంఘటననే చారిత్రక నేపథ్యంలో కథగా వివరించాడు. ఈ పిండారి దళం తరువాత గుంటూరు, మచిలీపట్నం, కడప జిల్లాల్లో దండెత్తి నష్టపరిచినట్లు తెలుస్తోంది. ‘నవాబు రూపాయిలు– రాణి ముద్రలు’ కథలో కుంఫిణీ ప్రభుత్వం పాత నాణేలను మాయం చేసి కొత్త నాణేలను ప్రవేశపెట్టిన ప్రస్తావన ఉంది. 1780–90 ప్రాంతాల్లో కుంఫిణీ వారు ‘అర్కాటు రూపాయిలు’ ముద్రించినట్లు తెలుస్తోంది. ఈ కథల ద్వారా రెండు శతాబ్దాల కాలం నాటి నవాబు పరిపాలన, సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులతోపాటు కులవృత్తులు, వ్యవసాయం లో రైతుల శిస్తుభారం వంటి చారిత్రకాంశాలెన్నో తెలుస్తాయి. బిల్మక్తా (= ఒక పనిని నిర్ణయించుకున్న కాంట్రాక్టు మొత్తం), ఇద్దుము (= రెండు తూములు; ధాన్యం కొలత), ముంగోరు (=పంటను ఆసామి రెండు భాగాలూ, సాగుచేసిన రైతు ఒక భాగమూ పంచుకొనే పద్ధతి) వంటి ఆనాడు వ్యవహారంలో ఉన్న మాండలిక పదాలెన్నో ఈ కథల్లో ఉన్నాయి. డాక్టర్ చింతకుంట శివారెడ్డి -
విరిగి పెరిగితి పెరిగి విరిగితి కష్ట సుఖముల పారమెరిగితి
తన 53వ ఏటే కన్నుమూశారు గురజాడ అప్పారావు(21 సెప్టెంబర్ 1862 – 30 నవంబర్ 1915). ఆ స్వల్ప జీవితకాలంలోనే తెలుగు సాహిత్యానికి దీపధారిగా నిలిచారు. కన్యాశుల్కం నాటకంలో వాడుక భాషకు పట్టం కట్టారు. దిద్దుబాటు ద్వారా ఆధునిక కథాప్రక్రియకు కీలకమలుపుగా నిలిచారు. ‘దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్’; ‘విరిగి పెరిగితి పెరిగి విరిగితి/ కష్ట సుఖముల పారమెరిగితి’ అంటూ తేలికమాటల్లో అనితరసాధ్య కవిత్వం వెల్లడించారు. ‘దేశభక్తి, ఆధునిక కవిత్వం, ప్రేమ, స్త్రీ చైతన్యం, సంఘ సంస్కరణ వంటి ఎన్నో ఉదాత్త వినూత్న భావాలను నిర్వచించి, నిర్వహించి వెళ్లిన కావ్యకర్త, కార్యకర్త’ గురజాడ అంటారు తెలకపల్లి రవి. గురజాడ జీవితాన్నీ సాహిత్యాన్నీ– యువకవిగా యుగకవి, గిరీశం పాత్ర–అపార్థాలు, ముత్యాల సరాలు! సత్యాల స్వరాలు, నైతిక విలువలపై వాస్తవిక దృక్పథం... ఇలా 17 అధ్యాయాలుగా విశ్లేషిస్తూ ఆయన ‘యుగస్వరం’ వెలువరించారు. ‘గురజాడ భావాలకూ, సంస్కరణలకూ ఇప్పుడు గతం కన్నా ప్రాధాన్యత పెరిగింది. అందుకు దేశంలో వచ్చిన రాజకీయ, సామాజిక దుష్పరిణామాలు కూడా ఒక కారణం. ప్రపంచీకరణలో భాగంగా మత, మార్కెట్ తత్వాలు విజృంభించిన నేపథ్యం ఇందుకు ప్రధాన భూమిక’ అంటూ అప్పటికి ఆధునికుడైన గురజాడ సాహిత్యానికి ఇప్పటి ఆధునిక కాలంలో ఉన్న ప్రాసంగికతను చర్చించారు. గురజాడ: యుగస్వరం; రచన: తెలకపల్లి రవి; పేజీలు: 208; వెల: 125; ప్రతులకు: ప్రజాశక్తి బుక్హౌస్, 27–1–64, కారల్ మార్క్స్ రోడ్, విజయవాడ–520002. ఫోన్: 0866–2577533 -
కన్యాశుల్కం @125
-
నూటపాతికేళ్ల కన్యాశుల్కం నాటకం
కన్యాశుల్కం నాటకంపై వందలకొద్దీ వ్యాసాలు, పరిశోధనాత్మక గ్రంథాలు, విశేష సంచికలు, తులనాత్మక పరిశీలనలు వచ్చాయి. అయినా ఆ నాటకం ఓ అక్షయ పాత్ర. చదివినకొద్దీ కొత్త విషయాలు బయటపడుతూ ఉంటాయి. కన్యాశుల్కం మొదటి ప్రదర్శనకు 125 ఏళ్లు అయిన సందర్భంగా కన్యాశుల్కం తాలూకు కొన్ని విశేషాలు: ఎన్నో గ్రంథాలకు, కావ్యాలకు మొదటి నుండి రూపాంతరాలు జరుగుతూనే ఉన్నాయి. ఆధునిక మహేతిహాసమైన ‘కన్యాశుల్కం’ కూడా వివిధ ప్రక్రియలుగా రూపాంతరం చెందింది. కన్యాశుల్కం మొదటి ముద్రణ 1897లో జరిగింది. ఆ తర్వాత సవరించి, పెంచి మళ్ళీ 1909లో ముద్రించారు గురజాడ. ఆ తర్వాత ఎన్నో పునర్ముద్రణలు పొందింది. కన్యాశుల్కం నాటకాన్ని మొదటిసారిగా విజయనగరంలో 1892 ఆగస్టు 13న జగన్నాథ విలాసినీ సభ వారు ప్రదర్శించారు. తర్వాత వందలకొద్దీ ప్రదర్శనలు జరిగాయి. ‘కన్యాశుల్కం’ పలు భాషల్లోకి అనువాదమైంది. 1927లో కన్నడలోకి కె.క్రిష్ణయ్యంగార్, తమిళంలోకి 1964లో ముదునూరు జగన్నాథరావు అనువాదం చేశారు. ఫ్రెంచ్ భాషలోకి 1960–61 ప్రాంతాల్లో అనువాదమైంది. 1962లో రష్యన్లోకి పెర్తూనిచెవోయ్, అగ్రానిన అనువదించారు. ఆంగ్లంలోకి మూడు నాలుగుసార్లు అనువాదమైంది. ఎస్.ఎన్.జయంతి చేసిన అనువాదాన్ని 1964లో గురజాడ మెమోరియల్ రీసెర్చ్ సెంటర్, హైదరాబాదు ముద్రించింది. తర్వాత ఎస్.జి.మూర్తి, కె.రమేష్ చేసిన అనువాదాన్ని 1976లో సాహిత్య అకాడమీ ప్రచురించింది. సి.విజయశ్రీ, టి.విజయ్ కుమార్ చేసిన అనువాదాన్ని బుక్ రెవ్యూ లిటెరరీ ట్రస్ట్, న్యూ దిల్లీ 2002లో ప్రచురించింది. ఆ తర్వాత వేల్చేరు నారాయణరావు ‘గల్స్ ఫర్ సేల్: కన్యాశుల్కం, ఎ ప్లే ఫ్రమ్ కలోనియల్ ఇండియా’ పేరుతో అనువదించారు. దీన్ని ఇండియానా యూనివర్సిటీ ప్రెస్ 2007లో ప్రచురించింది. కన్యాశుల్కం నవలా రూపంలో వచ్చింది. నవలీకరణ సెట్టి ఈశ్వరరావు. 156 పుటల్లో వివిధ శీర్షికలు పెట్టి, ప్రధాన కథకు ఏమాత్రం భంగం కలగకుండా నవలీకరించారు. 1993లో దీని ప్రచురణ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. 1960ల్లోనే ఆకాశవాణి విజయవాడ కేంద్రం అంత నిడివిగల నాటకాన్ని ఒక గంటకు కుదించి రేడియో నాటకంగా ప్రసారం చేసి ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఆ తర్వాత చాలాసార్లు పున:ప్రసారం అయ్యింది. పూర్వం రాసిన ఉద్గ్రంథాలకూ, కొరుకుడుపడని పద్యాలకూ టీకా టిప్పణులు వచ్చిన సందర్భాలున్నాయి. ఆధునిక వ్యవహార భాషలో రాసిన కన్యాశుల్కానికి కూడా వచ్చాయంటే ఆశ్చర్యపోనక్కరలేదు! 125 ఏళ్ల క్రితం రాసిన కన్యాశుల్కంలో ఈనాటి యువతరానికి అర్థంకాని భాష, పలుకుబడులు ఎన్నో ఉన్నాయి. వాటిని విడమర్చి చెప్పాలనే ఉద్దేశంతో కన్యాశుల్కం రెండవ కూర్పుకు ‘కన్యాశుల్కం టీకా టిప్పణీ’ తయారు చేశారు కె.వి.రమణారెడ్డి. దీన్ని వెలుగు రామినీడు 1991లో ప్రచురించారు. దీనికంటే ముందే 1980ల్లో కన్యాశుల్కం మొదటి కూర్పుకు వివరణాత్మక పుట్ నోట్స్ రాసి మనకందించారు బంగోరెగా ప్రసిద్ధులైన బండి గోపాలరెడ్డి. అబ్బూరి రామకృష్ణారావు 1924లో రామవిలాస సభను ఏర్పాటు చేసి, ఆ సంస్థ తరఫున శతాధిక ప్రదర్శనలు ఇచ్చారు. బక్షి శ్రీరామ్ త్రీడి వేదికను ఏర్పాటుచేసి, 300 స్పాట్ లైట్లు అమర్చి నాటకాన్ని రంగుల హరివిల్లులా ప్రదర్శించారు. రెండుసార్లు టీవీ సీరియల్గా ప్రసారమైంది. 1990లో దూరదర్శన్ తెలుగు డివిజన్లో పదమూడు వారాలపాటు ప్రసారమైంది. అందులో జె.వి.రమణమూర్తి ‘గిరీశం’గా, శ్రుతి ‘మధురవాణి’గా నటించారు. ఆ తర్వాత 2005లో ‘మాటీవీ’లో 26 వారాలపాటు ప్రసారమైంది. దీనికి రావి కొండలరావు దర్శకుడు. గిరీశంగా గొల్లపూడి మారుతిరావు, మధురవాణిగా జయలలిత నటించారు. రామారావు, సావిత్రి ప్రధాన పాత్రధారులుగా పి.పుల్లయ్య దర్శకత్వంలో డి.ఎల్.నారాయణ కన్యాశుల్కం సినిమాను నిర్మించారు. ఇది 1955 ఆగస్టు 26న విడుదలైంది. ఇందులో సామాన్య పాత్రగా ప్రవేశించి అసామాన్య పాత్రగా ఎదగడం మధురవాణి పాత్ర ప్రత్యేకత. అందులో గొప్పగా ఒదిగిపోయారు సావిత్రి. వేశ్య పాత్ర అయినప్పటికీ అశ్లీలం, ఎబ్బెట్టు లేకుండా సావిత్రి నటించిన తీరు అమోఘం. ఇక దగాకోరుగా, మాయలమారిగా గిరీశం పాత్రలో అద్భుతంగా జీవించారు ఎన్టీఆర్. అయితే నాటకం సినిమాకు అనుగుణంగా కొన్ని మార్పులకు లోనైంది. ‘నాటకమును యథాతథంగా చిత్రించుటకు వీలుపడనందున, కొన్ని సన్నివేశములలోను, సంభాషణలలోను యథోచితంగా మార్పులు చేయవలసి వచ్చింది. రసజ్ఞులు సహృదయంతో స్వీకరించవలెనని ప్రార్థన’ అని ప్రారంభంలోనే చెప్పారు. అయిదారు గంటల నిడివిగల నాటకాన్ని మూడు గంటల్లో కుదించి చెప్పడం కత్తి మీద సామే! నాటకంలోని ఆత్మ చెడుతుందని చిత్రీకరణకు ముందే విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ కన్యాశుల్కం నాటకంలాగా సినిమా కూడా క్లాసిక్గా నిలిచింది. జె.రాయమల్లు 9951428183 మీకు తెలుసా? గురజాడ ‘కన్యాశుల్కం’ నాటకాన్ని మొదటిసారిగా విజయనగరంలో 1892 ఆగస్టు 13న జగన్నాథ విలాసినీ సభ వారు ప్రదర్శించారు. కోట్ పూర్ రిచ్చర్డు చెప్పినట్టు... గురజాడ అప్పారావు తన కన్యాశుల్కం నాటకంలో గిరీశం చేత ఒకటి లేదా రెండు మూడు పాదాలుగా ఆంగ్ల సూక్తులనో, ఆంగ్ల పద్యాలనో కొన్నింటిని చెప్పించారు. అందులో ఒకటి: పూర్ రిచ్చర్డు చెప్పినట్టు, పేషన్సు ఉంటేనే కానీ లోకములో పని జరగదు. గిరీశం చేత గురజాడ పలికించిన ఆ ఉవాచ బెంజమిన్ ఫ్రాంక్లిన్ది. దాని మూలం: He that can have patience can have what he will. బెంజమిన్ ఫ్రాంక్లిన్(17 జనవరి 1706– 17 ఏప్రిల్ 1790) అమెరికాకు చెందిన పరిశోధకుడు, దౌత్యవేత్త, అమెరికా సంయుక్త రాష్ట్రాల నిర్మాతల్లో ఒకడు, రచయిత, ముద్రాపకుడు, రాజకీయ సిద్ధాంతకర్త, రాజకీయ నాయకుడు, ‘పోస్టు మాస్టర్’, శాస్త్రవేత్త, అన్వేషకుడు, ప్రజాసేవకుడు. పిడుగు నిరోధకాన్నీ, చత్వారపు కళ్లద్దాలనీ కనుగొన్నారు. ఆనాటి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని వలస ప్రాంతాల ఐక్యత కోసం ఎంతగానో పాటుపడినందువల్ల The First American బిరుదుతో గౌరవింపబడిన వ్యక్తి. ఆయన తనకు ‘పూర్రిచ్చెర్డు’ అని మారుపేరు పెట్టుకున్నారు. ఆయన సూక్తులు ఎంతగానో పేరు పొంది, ఎందరో ఉపయోగించుకున్నారు. అలా గురజాడ కూడా పేషన్స్ మీద ఆయన చెప్పిన సూక్తిని తన కన్యాశుల్కంలో వాడేరు. వేదప్రభాస్ 9490791568 -
‘కన్యాశుల్కం’ నాటకం