Kaveri Seeds
-
International Women's Day 2025 : స్వీయ ప్రేమ ముఖ్యం
విత్తనంలో మహావృక్షం దాగి ఉంటుందనేది అనుభవజ్ఞులు చెప్పిన మాట. ఆ మాటలను ఆచరణలో పెట్టి ఫలాలను పంచేవారు ఎప్పుడూ సమాజంలో స్ఫూర్తిమంతంగా నిలుస్తారు. మహిళగా ఏడుపదుల అనుభవాన్ని, తన ఆలోచనలను పంచుకున్నారు సికింద్రాబాద్ బోయినపల్లిలో ఉంటున్న కావేరీ సీడ్స్ డైరెక్టర్ జి.వి.వనజాదేవి. ‘కుటుంబం, సమాజం పట్ల బాధ్యతలు నిర్వర్తించాలంటే మహిళలు అన్నింటికన్నా ముందు స్వీయ ప్రేమ కలిగి ఉండటం అవసరం’ అంటున్నారామె. విమెన్స్ డే 2025 థీమ్మరింత వేగంగా... మరింత నిర్మాణాత్మకంగా ఈ సంవత్సరం విమెన్స్ డే క్యాంపెయిన్ థీమ్... యాక్సిలరేట్ యాక్షన్.లింగ సమానత్వాన్ని సాధించడానికి ఉత్తమమైన మార్గాలను ఎంచుకోవడంతో పాటు ఆ పనిని మరింత వేగంగా, నిర్మాణాత్మకంగా చేయాలి. ‘యాక్సిలరేట్ యాక్షన్’లో మహిళల పురోగతికి ఉపయోగపడే వ్యూహాలు, ఆలోచనలు ఉంటాయి. ‘లింగ సమానత్వానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి’ అని నిరాశపడిపోవడం కంటే ఆశావహ దృక్పథంతో తగిన కార్యాచరణతో ముందుకు వెళ్లడం అవసరం. ‘యాక్సిలరేట్ యాక్షన్’కు సంబంధించిన ఒక నినాదం... సపోర్ట్ ది సపోర్టర్స్. మనకు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వారికి మద్దతు ఇవ్వడం ద్వారా లింగ సమానత్వం కోసం వేసే అడుగులను వేగవంతం చేయవచ్చు. మహిళలకు సహాయపడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి. వాటికి సంఘీభావం తెలియజేయాలి.మనం ఏ రకంగా యాక్సిలరేట్ యాక్షన్లో భాగం కావచ్చు?వివక్షను సవాలు చేయడం, మహిళల విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం, మనకు తెలిసిన విషయాలను ఇతర మహిళలతో కలిసి పంచుకోవడం, మహిళల నాణ్యమైన విద్య, ఆరోగ్యం గురించి పనిచేయడం, మహిళల సృజనాత్మకతను ప్రోత్సహించడం లాంటివి ఎన్నో ఉన్నాయి. గత కాలం, ప్రస్తుతం కాలం అంటూ మహిళ విషయంలో ప్రత్యేకించి చెప్పలేం. ఏ రోజుల్లోనైనా మహిళ సంఘర్షణలతోనే దోస్తీ చేస్తుంది. ఆమె ఆలోచనలన్నీ కుటుంబం చుట్టూతానే కేంద్రీకృతమై ఉంటాయి. తల్లిదండ్రులు, తోబుట్టువులు, పెళ్లయ్యాక భర్త, అత్తింటివాళ్లు, పిల్లలు .. ఒత్తిడితో కూడిన జీవనంలోనే తనని తాను నిరూపించుకోవడానికి, నిలబడటానికిపోరాటం చేస్తూనే ఉంటుంది. అయితే, ఈ క్రమంలో తనని తాను మర్చిపోతుంది. పెళ్లి తర్వాత కుటుంబపోషణలో లీనమైపోతూ తన ఆరోగ్యం గురించి పట్టించుకోదు, చక్కగా ముస్తాబు అవడాన్ని పట్టించుకోదు. నిజానికి తనని తాను ప్రేమించుకోవడం మర్చిపోతుందనిపిస్తుంది. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!ఆత్మస్థైర్యమే బలంమాది కరీంనగర్ జిల్లాలోని గట్ల నరసింగాపూర్ గ్రామం. పెద్ద కుటుంబం. ఎప్పుడూ నలుగురికి పెట్టగలిగే స్థితిలోనే ఉన్నాం. ఉమ్మడి కుటుంబంలో అందరినీ కలుపుకుని ΄ోతూ, బాధ్యతలను నెరవేరుస్తూ, నా ఉనికిని కోల్పోకుండా కాపాడుకున్నాను. పెళ్లినాటికి డిగ్రీ చదువు పూర్తయ్యింది. మా వారు జి.వి.భాస్కరరావుకి వ్యవసాయ రంగం అంటే ప్రేమ. అగ్రికల్చర్ బీఎస్సీ చేశారు. పుట్టిన గడ్డపైన తనని తాను నిరూపించుకోవాలని తపన. అందుకు నేను మద్దతుగా నిలిచాను. కావేరీ సీడ్స్ మొదలుపెట్టినప్పుడు ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం. సమస్య వచ్చింది కదా అని అక్కడే వదిలేస్తే ఈ రోజు కావేరీ సీడ్స్ ఉండేది కాదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 50కి పైగా మా సీడ్ యూనిట్స్ ఉన్నాయి. ఈ ఏడాది వ్యవసాయ రంగంలో విద్యార్థులను తీర్చిదిద్దడానికి కావేరీ యూనివర్శిటీ కూడా ప్రారంభించాం.దిద్దుబాటుకుటుంబం, పిల్లల బాగోగులు, కంపెనీలో చేదోడుగా ఉండటం .. ఒక దశ తర్వాత బాధ్యతలు తీరి కాస్త తీరిక దొరకడంతో చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు చిన్నజీయర్ స్వామి వారి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆకర్షించాయి. అప్పుడే జైలుశిక్ష అనుభవిస్తున్న మహిళల గురించి తెలిసింది. ఖైదీలుగా ఉన్నవారి సమస్యలను అర్థం చేసుకోవడానికి చంచల్గూడ, చర్లపల్లి జైలుకు ‘వికాస తరంగిణి’సభ్యులతో కలిసి వెళ్లాను. క్రమం తప్పకుండా మహిళా ఖైదీలను కలవడం, కౌన్సెలింగ్ ఇవ్వడం, వారి పిల్లలను తిరిగి స్కూళ్లలో చేర్పించడం వంటి కార్యక్రమాలు చేశాం. మంచి ఫలితాలు రావడంతో కరీంనగర్, రాజమండ్రి, వరంగల్, విజయవాడ, వైజాగ్లలోని జైళ్లలోనూ కౌన్సెలింగ్ కార్యక్రమాలకు ఆహ్వానం అందింది. మహిళాఖైదీలు జైలు నుంచి విడుదలయ్యాక వారి జీవనం సానుకూలంగా గడిచే ఏర్పాట్లు చేయడం ఎంతో తృప్తిని కలిగించింది. క్యాన్సర్ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం, కాన్సర్ రోగులకు చికిత్స అందేలా చూడటం, మా ఊరితోపాటు చుట్టుపక్కల గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం, మహిళారైతుల సమస్యలను తీర్చడం, చదువుకునే విద్యార్థులకు క్యాంపులు, మహిళలకు శిక్షణాతరగతులు నిర్వహించడం.. ఇలా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు లభించాయి. వ్యవసాయ రంగంలో మహిళలు రావడం అంటే గత కాలం కూలీలుగానే చూసేవాళ్లం. కానీ, ఇప్పుడలా కాదు. ఉన్నతవిద్యతో వ్యవసాయం రంగంలో మార్పులు తీసుకురావడానికి యువతరం ముందుకు వస్తుంది. మా యూనివర్శిటీలో చేరిన విద్యార్థుల సంఖ్యే అందుకు నిదర్శనం. ముందుగా మహిళలు తమని తాము ప్రేమించుకోవాలి. ఆరోగ్యం, సంరక్షణ, చదువుతో తనకు తానుగా ఎదుగుతూనే కుటుంబ బాధ్యతలను నిర్వర్తించాలి. ఒక్కో విజయాన్ని అందుకుంటూ సమాజంలో వెనకబడినవారిని తనతో కలుపుకుంటూ ముందుకు వెళ్లాలి. దైనందిన జీవనం ప్రశాంతంగా, సంతోషంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటే ఒత్తిడులను కూడా సులువుగా అధిగమించవచ్చు.’’ తన అనుభవసారాన్ని కళ్లకు కట్టారు వనజాదేవి. -నిర్మలా రెడ్డి సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి -
కావేరీ సీడ్ షేర్ల బైబ్యాక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విత్తన తయారీ సంస్థ కావేరీ సీడ్ కంపెనీ షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. టెండర్ ఆఫర్ రూట్లో రూ.325 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేసేందుకు బోర్డు నిర్ణయం తీసుకుంది. 9% ప్రీమియంతో ఒక్కో షేరు ధరను రూ.725గా నిర్ణయించారు. గరిష్టంగా 44.82 లక్షల షేర్లను కంపెనీ కొనుగోలు చేయనుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్నకు 59.9% వాటా ఉంది. బైబ్యాక్ వార్తల నేపథ్యంలో కావేరీ సీడ్స్ షేరు ధర బీఎస్ఈలో శుక్రవారం 1.18% ఎగసి రూ.662.60 వద్ద స్థిరపడింది. -
అదానీ గ్రీన్ - కావేరీ సీడ్.. భల్లేభల్లే
కొద్ది రోజులుగా దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదులుతున్నప్పటికీ విభిన్న వార్తల నేపథ్యంలో రెండు కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా మరోసారి ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుదుత్పత్తి టెండర్ను గెలుచుకోవడంతో అదానీ గ్రీన్ ఎనర్జీ దూకుడు చూపుతోంది. మరోవైపు గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో అగ్రికల్చర్ కంపెనీ కావేరీ సీడ్ షేరు స్పీడందుకుంది. వివరాలు చూద్దాం.. అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రయివేట్ రంగ విద్యుదుత్పత్తి కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ వరుసగా 10వ రోజు 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికమై రూ. 382 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం! అదానీ గ్రూప్లోని పునరుత్పాదక ఇంధన కంపెనీ అదానీ గ్రీన్ గత మూడు నెలల్లో 210 శాతం ర్యాలీ చేసింది. ఇదే సమయంలో సెన్సెక్స్ 10 శాతమే లాభపడింది. ఈ నెల 9న 8 గిగావాట్ల ఫొటోవోల్టాయిక్ పవర్ ప్లాంటుతోపాటు.. 2 గిగావాట్ల సోలార్ సెల్ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి టెండర్ను పొందింది. ఇందుకు రూ. 45,000 కోట్లను ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. కంపెనీ ఇప్పటికే 2.5 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని అందుకోగా.. మరో 3.5 జీడబ్ల్యూ సామర్థ్యంగల ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. దీనికితోడు గతేడాది క్యూ4లో ఆకర్షణీయ పనితీరు చూపడం ఈ కౌంటర్కు జోష్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కావేరీ సీడ్ కంపెనీ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో అగ్రికల్చరల్ ప్రొడక్టుల కంపెనీ కావేరీ సీడ్ పటిష్ట ఫలితాలు సాధించింది. ఫలితంగా ఈ కౌంటర్ ఇటీవల ర్యాలీ బాటలో సాగుతోంది. ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 5 శాతం జంప్చేసి రూ. 630కు చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం కాస్త వెనకడుగు వేసి స్వల్ప లాభంతో రూ. 610 వద్ద ట్రేడవుతోంది. ఈ నెలలో ఇప్పటివరకూ కావేరీ సీడ్ షేరు 50 శాతం జంప్చేయడం విశేషం! గత 13 ట్రేడింగ్ సెషన్లలో 58 శాతం ఎగసింది. కాగా.. క్యూ4లో కంపెనీ టర్న్అరౌండ్ సాధించి రూ. 7.6 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 11 కోట్ల నికర నష్టం ప్రకటించింది. నికర అమ్మకాలు సైతం 18 శాతం పెరిగి రూ. 63 కోట్లను అధిగమించాయి. ఈ క్యూ4లో రూ. 18 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించగా.. అంతక్రితం క్యూ4లో రూ. 3 కోట్ల నష్టం నమోదైంది. -
కావేరీ సీడ్స్ లైసెన్స్ తాత్కాలిక రద్దు
అమరావతి: కావేరీ సీడ్స్ లైసెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. కావేరీ సీడ్స్కు చెందిన ‘జాదూ’ పత్తి విత్తనాల నాణ్యత సరిగ్గా లేదని గుంటూరు జిల్లా చిలకలూరిపేట, అచ్చంపేట మండలాల రైతులలు వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన వ్యవసాయశాఖ అధికారులు నివేదిక తయారుచేశారు. ఈ నివేదికను ఆధారంగా చేసుకొని కావేరీ సీడ్స్ లెసైన్స్ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేవరకు రద్దు ఆదేశాలు అమలులో ఉంటాయని తెలిపింది. -
కావేరి సీడ్స్లో ఎఫ్పీఐల వాటా పెంపునకు ఆర్బీఐ ఓకే
ముంబై: విత్తన తయారీ సంస్థ కావేరి సీడ్స్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐ) వాటాను 49 శాతానికి పెంచుకునేందుకు ఆర్బీఐ అనుమతినిచ్చింది. 2015 మార్చి చివరి నాటికి కంపెనీలో ఎఫ్ఐఐల వాటా 22.26 శాతం ఉంది. వాటా కొనుగోలుకు ఉన్న పరిమితులను తొలిగిస్తున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కింద ఎఫ్ఐఐలు లేదా ఆర్ఎఫ్పీఐలు 49 శాతం వరకు పెట్టుబడి పెట్టొచ్చని తెలిపింది. ఎఫ్ఐఐల పరిమితిని ప్రస్తుతమున్న 24 నుంచి 49 శాతానికి చేర్చేందుకు బోర్డుతోపాటు వాటాదారుల నుంచి కంపెనీ మే నెలలో సమ్మతి పొందింది. -
కాంట్రాక్ట్ వ్యవసాయానికి ధరలే అడ్డంక
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాంట్రాక్టింగ్ వ్యవసాయంలో అవకాశాలు చాలా ఉన్నప్పటికీ ఉత్పత్తి ధరను నిర్ణయించడం అనేది ప్రధాన అడ్డంకిగా ఉందని ఫిక్కి సీఈవో కాన్క్లేవ్ పేర్కొంది. కాంట్రాక్ట్ వ్యవసాయంలో పంటకు ధరను మార్కెట్ రేటును బట్టి నిర్ణయిస్తారా లేక జరిగిన వ్యయానికి లాభం కలిపి ఇస్తాయా అన్న విషయంలో స్పష్టత ఏర్పడితేనే ఈ విధానం విజయవంతం అవుతుందని రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐవిఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. వ్యవసాయంలో ‘నెక్స్ వేవ్ ఆఫ్ ఆపర్చునిటీస్’ అనే అంశంపై ఫిక్కి ఏర్పాటు చేసిన సీఈవో సదస్సులో పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. కావేరీ సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మితున్ చాంద్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశీయ వ్యవసాయ రంగం నీరు, విద్యుత్ అనే రెండు ప్రధాన సమస్యలను ఎదుర్కొంటోందని, వీటిని పరిష్కరించగలిగితే పప్పు దినుసులను దిగుమతి చేసుకునే అవసరం ఉండదన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన వారికి ‘ఫుడ్ 360’ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి అందచేశారు. జోరుగా పీఈ, వీసీ నిధుల ప్రవాహం... కాగా భారత వ్యవసాయ-వ్యాపార కంపెనీల్లో ప్రైవేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) నిధుల ప్రవాహం జోరుగా సాగనున్నది. ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి పీఈ, వీసీ ఫండ్స్ ఆసక్తిగా ఉన్నాయని కేపీఎంజీ-ఫిక్కి తాజా నివేదిక వెల్లడించింది. సదస్సు సందర్భంగా ఈ నివేదిక వెలువడింది.