kickbacks
-
డిఫెన్స్ డీలర్పై సీబీఐ కేసు నమోదు
న్యూఢిల్లీ : డిఫెన్స్ డీలర్ సంజయ్ బండారిపై కేంద్రం దర్యాప్తు సంస్థ(సీబీఐ) కేసు నమోదు చేసింది. 2009లో స్విస్ సంస్థ 'పిలాటస్' ఎయిర్ క్రాఫ్ట్ లిమిటెడ్ 75 ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ల సేకరణ విషయంలో ముడుపులు తీసుకొని.. అవకతవకలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. సుమారు రూ.339 కోట్ల మేర లంచాలు తీసుకున్నాడన్న ఆరోపణలపై బండారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. శుక్రవారం ఢిల్లీలో సీబీఐ నిర్వహించిన సోదాల్లో ఆయన ఇంట్లో లభ్యమైన విలువైన ఆస్తులన్ని ముడుపుల రూపంలో వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దక్షిణ ఢిల్లీలోని పంచశీల పార్క్లో ఉన్న సంజయ్ బండారికి చెందిన ఆఫ్సెట్ ఇండియా సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇక రాబర్ట్ వ్యాపారవేత్త, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంజయ్ బినామీ అంటూ ఆరోపణలు వెల్లువెత్తిన విషయం విదితమే. లండన్లో ఉన్న వాద్రా ఇంటికి బండారి బినామిగా ఉన్నట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో తాజాగా సంజయ్ కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేయడంతో ఆయన మరింత చిక్కుల్లో పడ్డారు. సంజయ్తో పాటు కొంతమంది వైమానిక దళ, రక్షణ అధికారులకు కూడా ఈ ముడుపులతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా పిలాటస్' ఎయిర్ క్రాఫ్ట్లను ఉపయోగించి ఎయిర్ ఫోర్స్ పైలట్లకు శిక్షణనిస్తారు. స్వదేశి పరిజ్ఞానంతో తయారు చేసిన హెచ్టీపీ - 32 విమానాల్లో తరచుగా వైఫల్యాలు తలెత్తడంతో పిలాటస్ పీసీ- 7 ఎంకే - II ను భారత్ కొనుగోలు చేయనుంది. ఇందులో భాగంగా యూపీఏ-2 నేతృత్వంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2012లో 75 శిక్షణ విమానాల కోసం రూ. 2,896 కోట్లతో పిలాటస్తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. -
‘యెడ్డీ డైరీ’ కలకలం
సాక్షి బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప గతంలో సీఎం పదవి కోసం బీజేపీ అగ్రనాయకులకు ముడుపులు ఇచ్చారంటూ తాజాగా ఎన్నికల వేళ బయటపడిన డైరీ కాగితాలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మార్మోగుతున్నాయి. ఇదంతా కాంగ్రెస్ కుట్ర అని యడ్యూరప్ప ఆరోపిస్తుంటే, ఈ విషయంపై లోక్పాల్తో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ‘ద క్యారవాన్’ అనే మేగజీన్ ఈ సంచలన విషయాలను ‘యెడ్డీ డైరీస్’ శీర్షికన కథనంగా ప్రచురించింది. డైరీ అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీ నేతలంతా అవినీతిపరులేనని ఆరోపించారు. ‘బీజేపీలోని కాపలాదారులంతా దొంగలే’ అంటూ రాహులో ఓ ట్వీట్ చేశారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా మాట్లాడుతూ డైరీ అంశంపై లోక్పాల్ చేత విచారణ జరగాలని డిమాండ్ చేశారు. యడ్యూరప్ప బీజేపీ పెద్దలకు లంచాలు ఇవ్వడం నిజమో, అబద్ధమో ప్రధాని చెప్పాలని కోరారు. 2017లో డైరీ దొరికితే ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. సరైన దర్యాప్తుæ జరగాలని కర్ణాటక సీఎం కుమారస్వామి అన్నారు. శివకుమార్ ఇంట్లో దొరికాయి 2017లో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఇంట్లో సోదాల సందర్భంగా ఈ డైరీ కాగితాలు ఆదాయపు పన్ను (ఐటీ) విభాగానికి దొరికినట్లు క్యారవాన్ పేర్కొంది. 2009లో కర్ణాటక సీఎం అయ్యేందుకు యడ్యూరప్ప బీజేపీ అగ్రనేతల్లో ఎవరెవరికి లంచాలు ఇచ్చారో, అందుకోసం ఏయే ఎమ్మెల్యే దగ్గర ఆయనెంత తీసుకున్నారో ప్రస్తావిస్తూ యడ్యూరప్ప తన డైరీలో రాసుకున్నట్లుగా ఉందని కథనంలో క్యారవాన్ పేర్కొంది. కర్ణాటక బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజేను తాను కేరళలోని ఓ గుడిలో వివాహం చేసుకున్నట్లుగా కూడా ఆ డైరీలో యడ్యూరప్ప రాసినట్లు ఉందంది. నకిలీవి అయ్యుండొచ్చు: ఐటీ విభాగం ఈ కాగితాలపై ఐటీ విభాగం శుక్రవారం స్పందించింది. శివకుమార్ ఇంట్లో తమకు దొరికింది డైరీలోని కొన్ని పేపర్ల జిరాక్స్లు మాత్రమేనని స్పష్టం చేసింది. ఆ జిరాక్స్లు ఎక్కడి నుంచి వచ్చాయో, వాటి ఒరిజినల్ కాగితాలు ఎక్కడ ఉన్నాయో తెలియదనీ, జిరాక్స్ కాగితాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం హైదరాబాద్కు అప్పట్లోనే పంపినా ఒరిజినల్స్ లేనిదే జిరాక్స్లతో తామేమీ చెప్పలేమని ఫోరెన్సిక్ విభాగం చెప్పిందని ఐటీ విభాగం ఓ ప్రకటనలో వెల్లడించింది. తాము అప్పుడే యడ్యూరప్పను కూడా పిలిచి విచారించామనీ, ఆ డైరీ తాను రాసింది కాదనీ, అసలు తనకు డైరీ రాసే అలవాటే లేదని ఆయన చెప్పారంది. ఒరిజినల్ కాగితాలు ఎక్కడా లభించనందున ఆ జిరాక్స్లు నకిలీవి అయ్యుండొచ్చంది. ఆ డైరీ నిజం కాదు: యడ్యూరప్ప డైరీలో తాను రాసినట్లుగా చెబుతున్న విషయాలన్నీ అవాస్తవాలేనని యడ్యూరప్ప కొట్టిపారేశారు. బెంగళూరు డాలర్స్ కాలనీలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలవి దివాలాకోరు రాజకీయాలని మండిపడ్డారు. అసత్య ఆరోపణలు చేసి లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ నేతలు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. ఆ డైరీలోని అంశాలు ఫోర్జరీ చేసినవీ, నకిలీవని ఐటీ అధికారులు నిర్ధారించినట్లు యడ్యూరప్ప చెప్పారు. కాంగ్రెస్ ఆరోపణలకు బీజేపీ ఎదురుదాడి చేసింది. ఆ డైరీ నకిలీదని, డైరీ పేరిట కాంగ్రెస్ చేస్తున్నదంతా నాటకమని, అదంతా ఒక పథకం ప్రకారం సాగుతున్నదని ఆరోపించింది. డైరీలోని చేతిరాత, నకిలీ అని, అది యడ్యూరప్ప సంతకమే కాదని బీజేపీ స్పష్టం చేసింది. ఎవరెవరికి ఎంతెంత? క్యారవాన్ కథనం ప్రకారం ముఖ్యమంత్రి పదవి కోసం బీజేపీ కేంద్ర కమిటీకి రూ. 1000 కోట్లు, ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ, రవాణా మంత్రి నితిన్ గడ్కరీలకు చెరో రూ. 150 కోట్లు, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్కు రూ. 100 కోట్లు, బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీలకు చెరో రూ. 50 కోట్లు లంచంగా ఇచ్చినట్లు యడ్యూరప్ప డైరీలో రాసుకున్నారు. పలువురు జడ్జీలకు రూ. 250 కోట్లు, న్యాయవాదులకు రూ. 50 కోట్లు ఇచ్చినట్లు రాసుకొచ్చారు. న్యాయమూర్తులు, న్యాయవాదుల పేర్లను డైరీలో పేర్కొనలేదు. అలాగే గడ్కరీ కొడుకు వివాహ వేడుకలకు రూ. 10 కోట్లు ఖర్చు చేశానని డైరీలో యడ్యూరప్ప రాశారు. తాను ముఖ్యమంత్రి అవ్వడంలో రాష్ట్ర మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ప్రముఖ పాత్ర పోషించారని డైరీలో యడ్యూరప్ప రాశారు. ఆయన ఆర్థికంగా ఆదుకున్నారని పేర్కొన్నారు. ఆయనతో పాటు మరో ఎనిమిది మంది ఆర్థిక సాయం చేశారని వారి పేర్లను వివరాలతో సహా రాసుకొచ్చారు. బీజేపీ ఎమ్మెల్యేలు నరేంద్ర స్వామి రూ. 20 కోట్లు, గోళిహట్టి శేఖర్ రూ. 10 కోట్లు, బాలచంద్ర జారకిహోళి రూ. 20 కోట్లు, డి.సుధాకర్ రూ. 20 కోట్లు, శివనగౌడ నాయక్ రూ. 20 కోట్లు, వెంకటరమణప్ప రూ. 20 కోట్లు, నారాయణ స్వామి రూ. 20 కోట్లు, ఆనంద్ అస్నోటికర్ రూ. 20 కోట్లు ఆర్థిక సాయం చేసినట్లు డైరీలో రాసి ఉంది. అయితే వీరంతా తాము ఎలాంటి సాయం చేయలేదని ఒక్కొక్కరిగా చెప్పుకుంటూ వస్తున్నారు. -
పైసలిస్తేనే పోస్ట్మార్టం..
ఎంజీఎం (వరంగల్): మహాత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రిలోని మార్చురీలో ప్రతి రోజు సుమారు ఐదు నుంచి ఎనిమిది శవాలకు పోస్టుమార్టం జరుగుతుంది. మృతుల కటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం నిత్యం మార్మోగుతూ ఉంటుంది. ఆ హృదయ విదారకర దృశ్యాలు చూస్తే ఎవరికైనా కంట నీరు రాక మానదు. కానీ.. ఎంజీఎం మార్చురీలో కాసులకు కక్కుర్తి పడే పలువురు వైద్యులు, సిబ్బందికి వీరి కన్నీళ్లు కనపడవు.. వీరి ఆర్తనాదాలు వినపడవు. పైసలిస్తేనే పోస్ట్మార్టం చేస్తామని కరాఖండీగా చెబుతున్నారు. గతంలోనూ ఇలాం టి ఘటనలు చోటుచేసుకోగా విమర్శలు వెల్లువెత్తాయి. అయినా.. అవినీతికి అలవాటుపడిన కొంత మంది వైద్యు లు, సిబ్బందిలో మార్పు రాలేదనడానికి సోమవారం చోటు చేసుకున్న ఘటనే ఉదాహరణ. 3 గంటలపాటు నిలిచిన సేవలు.. మృతదేహాలకు పోలీసులు పంచనామా నిర్వహించిన తర్వాత ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంటుంది. సోమవారం ఎంజీఎం మార్చురీలో ఎనిమిది మృతదేహాలు ఉండగా.. ఉదయం కొన్నింటికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు మధ్యాహ్న భోజనానికి వెళ్లారు. సాయంత్రం ఐదు గంటల వరకు కూడా తిరిగి రాలేదు. అప్పటికే పోస్టుమార్టం కోసం పంచనామా పూర్తి చేసుకుని వేచి చూస్తున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మార్చురీ గేటు వద్ద మూకుమ్మడిగా ఆందో ళన చేపట్టారు. వైద్యుల పనితీరుపై మండిపడ్డారు. వైద్యు లు, సిబ్బంది అక్రమ వసూళ్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శాసన మండలిలో చర్చ జరిగినా.. ఎంజీఎం మార్చురీలో పైసలిస్తే పోస్టుమార్టం చేస్తున్నారని గతంలో సోషల్ మీడియాలో క్లిప్పింగ్స్ హల్చల్ చేశాయి. మార్చురీలో కింది స్థాయి సిబ్బంది బహిరంగంగా పైసలు డిమాండ్ చేస్తున్న క్రమంలో మృతుల కుటుంబ సభ్యులు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేశారు. విస్తృతం ప్రచారం కావడంతో ఇక్కడి వైద్యులు, సిబ్బంది తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై రాష్ట్ర స్థాయి అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు స్పందించారు. దీంతో ఆ వీడియోలో కనిపించినటువంటి నాలుగో తరగతి ఉద్యోగులపై కాకతీయ మెడికల్ కళాశాల అధికారులు చర్యలు తీసుకుని చేతులు దులుపుకున్నారు. వసూలు చేసిన డబ్బులను పంచుకున్న పలువురు వైద్యులను వదిలేశారని అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు.. ఎంజీఎం మార్చురీలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడానికి రూ. 5 వేలు ఖర్చవుతుందని అప్పటి కలెక్టర్ అమ్రపాలికి ఓ ఎంపీపీ ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా ఓ ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తి ఎంజీఎం మార్చురీ అవినీతిపై చర్చించారు. ఈ ఘటనల తర్వాత కొద్ది రోజుల పాటు మార్చురీలో పైసల వసూళ్లు ఆగినప్పటికీ.. దందా మళ్లీ మొదలైంది. రూ. 5 వేలు ఖర్చు చేయాల్సిందే.. ఎంజీఎం మార్చురీకి పోస్టుమార్టం కోసం వస్తే రూ.5 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. పైసలు ఎందుకని ప్రశ్నిస్తే ఈ రోజు పోస్టుమార్టం కాదు. రేపు అవుతుందని బెదిరిస్తున్నారు. గత్యంతరం లేక డబ్బులివ్వక తప్పడం లేదు. మృతదేహాన్ని కోసే వ్యక్తికి వెయ్యి, వైద్యునికి వెయ్యి, అంబులెన్స్కు రెండు వేలు చెల్లిస్తే గానీ.. ఇంటికి మృతదేహాం తీసుకెళ్లలేని దుస్థితి. – జమలాపురం నగేష్, ఓ మృతుడి బంధువు ఫోరెన్సిక్ సిబ్బంది కొరత ఉంది.. కాకతీయ మెడికల్ కళాశాలలో ఫోరెన్సిక్ వైద్యుల కొరత ఉంది. ప్రస్తుతం ఇద్దరు వైద్యులు మాత్రమే ఉన్నారు. విధుల్లో కొనసాగుతున్న అసోసియేట్ ప్రొఫెసర్ కోర్టు డ్యూటీపై వెళ్లగా.. మరో వైద్యుడు మధ్యాహ్నం వైద్యవిద్యార్థులకు తరగుతులు నిర్వహిస్తున్నారు. దీంతో మార్చురీకి నాలుగు గంటలకు వెళ్లాల్సి వచ్చింది. మార్చురీలో అవినీతి నా దృష్టికి రాలేదని, అవినీతి జరుగకుండా సీసీ కెమెరాలతో పాటు అన్ని రకల చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ సంధ్య, కేఎంసీ ప్రిన్సిపాల్ మార్చరీ వద్ద ఆందోళన చేస్తున్న మృతుల కుటుంబ సభ్యులు -
కేసీఆర్ కుటుంబానికి 6 శాతం ముడుపులు
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఆరోపణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం సహా నీటిపారుదల ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి జరుగుతోందని.. ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ కొన్ని కంపెనీలకు కాంట్రాక్టు పనులను కట్టబెట్టడానికి ప్రభుత్వం నిబంధనలు, మార్గదర్శకాలను మార్చడం వెనుక భారీగా ముడుపుల వ్యవహారం దాగుందన్నారు. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు సన్నిహిత సంబంధాలున్న కాంట్రాక్టు సంస్థలకు పనులను అప్పగించడం ద్వారా ముడుపులు తీసుకోవడానికి ఇలాంటి చర్యలకు ప్రభుత్వం దిగిందని.. సీఎం కుటుంబ సభ్యులకు ఈ పనుల మొత్తంలో 6 శాతం ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు. -
ఎన్నారై సీఈవోపై లంచాల కేసు
తన కంపెనీల షేర్లను కొనడానికి లంచాలు ఇచ్చిన కేసులో అమెరికాలోని రెండు కంపెనీలకు సీఈవోగా వ్యవహరిస్తున్న ఓ ఎన్నారైపై నేరం రుజువైంది. కాలిఫోర్నియాకు చెందిన శైలేష్ షా (48) తాను ఎలాంటి నేరం చేయలేదని అమెరికా జిల్లా జడ్జి రిచర్డ్ స్టీర్న్స్ ఎదుట వాదించారు. ఆయనను ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో శిక్ష విధిస్తారు. దాదాపు 20 ఏళ్ల పాటు జైలుశిక్ష, తర్వాత విడుదల చేసిన తర్వాత కూడా మూడేళ్ల పాటు పర్యవేక్షణ, 2.50 లక్షల డాలర్ల జరిమానా ఆయనకు విధించే అవకాశం ఉందని ఎఫ్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. తన కంపెనీలో షేర్లను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ప్రతినిధి ఒకరికి రహస్యంగా లంచాలు ఇచ్చేందుకు శైలేష్ షా అంగీకరించినట్లు నేరం రుజువైంది. అయితే, ఆ ప్రతినిధి అండర్కవర్లో ఉన్న ఎఫ్బీఐ ఏజెంటు అన్న విషయం షాకు తెలియదు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిగింది. స్టాక్ మార్కెట్లలో అక్రమాలను నిరోధించేందుకు మార్గాలు కూడా ఈ విచారణలోనే వెతికారు.