Kidnapped boy
-
Niloufer Hospital: నీలోఫర్లో శిశువు కిడ్నాప్ కేసు సుఖాంతం
నాంపల్లి: నిలోఫర్ ఆస్పత్రిలో కిడ్నాప్నకు గురైన శిశువు ఆచూకీ లభించింది. శిశువును అపహరించి ఏపీలోని అనంతపురం జిల్లాకు తరలిస్తుండగా జాతీయ రహదారి 44పై గద్వాల జిల్లా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జహీరాబాద్కు చెందిన హసీనా బేగం, గఫార్ బాష దంపతులకు నెల రోజుల క్రితం జహీరాబాదు ఏరియా ఆసుపత్రిలో మగ శిశువు జని్మంచాడు. చిన్నారి అనారోగ్యంతో బాధపడుతుండటంతో స్థానిక వైద్యుల సలహా మేరకు తల్లిదండ్రులు గత నెల 20న శిశువును నగరంలోని నిలోఫర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. నెల రోజుల పాటు నిలోఫర్లో చికిత్స పొందిన శిశువును శనివారం సాయంత్రం డిశ్చార్జి చేశారు. డిశ్చార్జి చేసే ముందు శిశువు తల్లి, అమ్మమ్మ ఆరోగ్య శ్రీ వార్డుకు వెళ్లారు. అదే సమయంలో అక్కడికి వచి్చన బుర్ఖా ధరించిన గుర్తు తెలియని మహిళ వృద్ధురాలితో మాటలు కలిపి తాను ఇక్కడే పనిచేస్తానంటూ చెప్పింది. చిన్నారి ముద్దుగా ఉన్నాడంటూ చేతిలో తీసుకుని వృద్ధురాలి దృష్టి మరల్చి శిశువును తీసుకుని అక్కడి నుంచి పారిపోయింది. దీంతో శిశువు తల్లి నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఐదు బృందాలుగా రంగంలో దిగారు. సీసీ కెమెరాల ఆధారంగా కిడ్నాపర్ ఆచూకీని గుర్తించి వెంటాడారు. వారసుడి కోసమే... అనంతపురం జిల్లా, ముదిగుబ్బ కు చెందిన షాహీన్ బేగం, మేకల చెరువు ప్రాంతానికి చెందిన అబ్దుల్లా అలియాస్ వెంకటే‹Ù, అతడి భార్య రేష్మ అలియాస్ రేణుక ఉపాధి కోసం నగరానికి వలస వచ్చి ఫస్ట్లాన్సర్లో ఉంటున్నారు. అబ్దుల్లా, రేష్మలకు 2009లో వివాహం అయ్యింది. వీరికి ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం రేష్మ ఎనిమిది నెలల గర్భవతిగా ఉంది. మళ్లీ ఆడపిల్లే పుడుతుందని భావించిన వారు మగశిశువును తెచ్చుకుని పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు గాను నిలోఫర్ ఆస్పత్రిని ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో తమకు సాయంగా ఉండేందుకు రేష్మ తన సోదరి షాహీన్ బేగంను హైదరాబాదుకు రప్పించింది. పథకం ప్రకారం గర్భంతో ఉన్న రేష్మ చికిత్స కోసం నిలోఫర్కు వచి్చనట్లుగా నటించారు. ఆమెకు సహయకురాలిగా షాహీన్ బేగం ఉంది. అబ్దుల్లా అలియాస్ వెంకటేష్ ఆసుపత్రి వద్ద వేచి ఉంది. షాహీన్ బేగం ఆసుపత్రిలో నుంచి మగ శిశువుతో బయటికి వస్తున్న వృద్ధురాలు( శిశువు అమ్మమ్మ) దగ్గరకు వెళ్లి ఆమె దృష్టి మరల్చి వృద్ధురాలి చేతిలో ఉన్న శిశువును తీసుకుని ఆటోలో అక్కడి నుంచి పారిపోయింది. సీసీ కెమెరాలే పట్టించాయి... నిందితులను పట్టుకునేందుకు డీసీపీ నేతృత్వంలో ఐదు బృందాలు రంగంలోకి దిగాయి. నిలోఫర్ నుంచి మాసాబ్ ట్యాంక్ వరకు ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. సీసీ పుటేజీల్లో లభించిన ఆధారాల ప్రకారం.. ఆటోలో నుంచి నిందితులు బైక్పైకి మారారు. మాసాబ్ ట్యాంక్ నుంచి ఎన్హెచ్–44 హైవేపైకి చేరుకున్న తర్వాత వారు మారుతీ ఓమ్నీ వాహనంలోనికి షిప్టు అయ్యారు. మెహిదీపట్నం మీదుగా బైక్ కర్నూల్ హైవే రోడ్డు వైపు వెళ్తుండగా గమనించిన మధ్య మండలం డీసీపీ గద్వాల్ ఎస్పీకి సమాచారం అందించారు. ఆయన మానవపాడు, ఉండవల్లి పీఎస్లను అప్రమత్తం చేశారు. పుల్లూరు టోల్ ప్లాజా వద్ద ఎస్సైలు పుట్టా మహేష్ గౌడ్, ఎస్సై చంద్రకాంత్ వాహనాన్ని అడ్డుకున్నారు. కారులో ఉన్న మగ శిశువు, నిలోఫర్లో కిడ్నాప్నకు గురైన శిశువు ఒక్కటేనని ధృవీకరించుకున్న తర్వాత శిశువును విచారణాధికారిగా ఉన్న నాంపల్లి ఎస్సై సాయి కుమార్కు అప్పగించారు. నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీíÙయల్ కస్టడీకి తరలించారు. కిడ్నాప్ కేసును చేధించిన నాంపల్లి ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, డీఐ ఎం.సైదేశ్వర్, సైఫాబాద్ ఇన్స్పెక్టర్ పి.రాఘవేందర్, ఎస్సైలు సాయి కుమార్, డి.శాంతికుమార్, పి.ప్రదీప్, కానిస్టేబుల్స్ నాగరాజు, సాగర్, రవి వర్మ, దీపక్లను ఉన్నతాధికారులు అభినందించారు. సం‘జాయ్’కుమార్! సాక్షి, సిటీబ్యూరో: ఈ ఫొటోల్లో కనిపిస్తున్న పోలీసు అధికారి పేరు ఆర్.సంజయ్కుమార్. మొదటి ఫొటో ఆయన నాంపల్లి ఠాణా ఇన్స్పెక్టర్గా పని చేసిన 2017 అక్టోబర్ నాటిదైతే.. రెండోది సైఫాబాద్ ఏసీపీగా (నాంపల్లి ఠాణా కూడా ఈ డివిజన్లోనిదే) ఉండగా ఆదివారం (24 నవంబర్ 2024) తీసింది. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారుల కిడ్నాప్ ఉదంతాలు ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. నిలోఫర్ ఆస్పత్రి, పబ్లిక్గార్డెన్స్, నాంపల్లి రైల్వేస్టేషన్ తదితరాలు దీని పరిధిలో ఉండటమే దీనికి కారణం. అప్పట్లో నాంపల్లి ఇన్స్పెక్టర్గా ఉన్న సంజయ్కుమార్ ఆ ప్రాంతంలోని ఫుట్పాత్పై పడుకున్న తల్లి ఒడి నుంచి కిడ్నాపైన ఫయాజ్ ఖాన్ను (4 నెలలు) 15 గంటల్లో కాపాడారు. శనివారం నిలోఫర్ ఆస్పత్రి నుంచి అపహరణకు గురైన నెల రోజుల వయసున్న బాబును ఆదివారం తల్లి ఒడికి చేర్చారు. రెండు సందర్భాల్లోనూ తల్లి చేతికి చిన్నారులను అందిస్తుండగా కెమెరా కళ్లకు చిక్కిన అరుదైన దృశ్యాలివీ. 2017 నాటి ఫొటో అప్పట్లో వైరల్గా మారి జాతీయ స్థాయిలో మీడియాను ఆకర్షించింది. నిలోఫర్లో పసికందు కిడ్నాప్ -
జసిత్ కిడ్నాప్; వాట్సాప్ కాల్ కలకలం
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా మండపేటలో అపహరణకు గురైన నాలుగేళ్ల చిన్నారి జసిత్ ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సీసీ కెమెరాలో అనుమానితులను గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు పలు బృందాలను రంగంలోకి దింపారు. చుట్టుపక్కల 15 గ్రామాలను జల్లెడ పడుతున్నారు. తమ కొడుకు ఆచూకీ కోసం జసిత్ తల్లిదండ్రులు తల్లిడిల్లుతున్నారు. తమ బాబు క్షేమంగా రావాలని కోరుకుంటున్నారు. మరోవైపు జసిత్ను ఢిల్లీలో చూశానని జసిత్ తండ్రి వెంకటరమణకు అజ్ఞాత వ్యక్తి ఒకరు వాట్సాప్ కాల్ చేశాడు. ఫేస్బుక్లో జసిత్ ఫొటో చూసి గుర్తుపట్టినట్టు వెల్లడించాడు. తన బ్యాంకు ఖాతాలో 5 వేల రూపాయలు వేస్తే సమాచారం చెబుతానని తెలిపాడు. వీడియో కాల్ చేసి జసిత్ను చూపించమని వెంకటరమణ అడిగితే, తన ఫోన్కు ఆ సదుపాయం లేదన్నాడు. కనీసం బాబుతో మాట్లాడించమని కోరినా పట్టించుకోలేదు. అజ్ఞాత వ్యక్తి ఫోన్ కాల్ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. నిజంగా జసిత్ ఢిల్లీలో ఉన్నాడా, డబ్బులు గుంజడానికే ఎవరైనా నకిలీ కాల్ చేశారా అనే కోణంలో విచారిస్తున్నారు. జసిత్ కిడ్నాప్ కేసు ఛేదించేందుకు 16 పోలీసు బృందాలు పని చేస్తున్నాయని ఎస్పీ అద్నాన్ నయిం అస్మి తెలిపారు. ఆరుగురు డిఎస్పీలు.. పది మంది సిఐలతో చిన్నారి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. పరిశోధనలో అనుభవం ఉన్న రిటైర్డ్ పోలీసు అధికారులు కూడా ఈ కేసు దర్యాప్తులో ఉన్నారని వెల్లడించారు. ఈనెల 3న తేదిన జసిత్ ఆడుకునే అపార్ట్మెంట్కు అద్దె కోసం వచ్చిన వారే, ఈనెల 5న అదే ప్రాంతంలో తిరిగారని.. వారు ఎవరు అనే దానిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. వారి సెల్ ఫోన్ సిగ్నల్స్ను ట్రేస్ చేసేపనిలో ఉన్నామని వివరించారు. జసిత్ తల్లిదండ్రులకు కుటుంబ పరంగా ఎవరితోనా విభేధాలున్నాయా, బ్యాంక్ వ్యవహరాల్లో ఖాతాదారులతో ఏమైన గొడవలు ఉన్నాయా అన్న కోణంలో కూడా విచారిస్తున్నట్టు తెలిపారు. కచ్చితంగా జసిత్ను క్షేమంగా తీసుకువస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. (చదవండి: కన్నా.. ఎక్కడున్నావ్?) -
చాక్లెట్లు ఆశ చూపి బాలుడి కిడ్నాప్
అత్తాపూర్: చాక్లెట్లు ఆశ చూపి ఇద్దరు చిన్నారులను అగంతకురాలు ఆటోలో తీసుకెళ్లింది. మార్గం మధ్యలో అక్కను విడిచిపెట్టి.. తమ్ముడ్ని ఎత్తుకెళ్లింది. పోలీసులు, బాలిక తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ చింతల్మెట్ ప్రాంతానికి చెందిన మహ్మద్ సిలాల్, సాజీదాబేగం దంపతులకు రేష్మా(7), ఖలీల్(4) సంతానం. సోమవారం ఉదయం 10 గంటలకు రేష్మా, ఖలీల్లు ఇంటి బయట ఆడుకుంటుండగా బురఖా ధరించిన ఓ మహిళ వారి వద్దకు వచ్చింది. తనతో వస్తే చాక్లెట్ ఇప్పిస్తానని వారిని ఆటోలో ఎక్కించుకుంది. చింతల్మెట్ చౌరస్తా వద్ద రేష్మాకు రూ.10 ఇచ్చి చాక్లెట్లు తెమ్మని పంపింది. రేష్మా ఆటో దిగగానే.. బాలుడితో అక్కడి నుంచి పరారైంది. వెంటనే రేష్మా ఇంటికి వెళ్లి విషయం తల్లిదండ్రులకు తెలిపింది. స్థానికంగా గాలించినా ఖలీల్ ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి రేష్మా తెలిపిన ఆధారాలతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు... బాలుడ్ని కిడ్నాప్ చేసిన అగంతకురాలిని గుర్తించేందుకు సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. -
బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం
విశాఖపట్టణం: విశాఖ జిల్లా అనకాపల్లిలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి అపహరణకు గురైన ఉదయ్ను కిడ్నాపర్లు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆదివారం ఉదయం కొప్పాడ బ్రిడ్జి కింద బాలుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని గరవపాలెంకు చెందిన ఉదయ్(8)గా పోలీసులు గుర్తించారు. శుక్రవారం రాత్రి దుండగులు ఉదయ్ తండ్రి శ్రీనివాస్కు ఫోన్ చేసి రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాలుడి ఇంటి సమీపంలో ఉండే నలుగురు నిందితులు ఉదయ్ను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆకతాయిలు హేమంత్, మనోజ్, రాజుతో పాటు మరో వ్యక్తి బాలుడిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు పోలీసులు ఓ నిర్థారణకు వచ్చారు. అందులో భాగంగా శనివారం రాత్రి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు హేమంత్, మనోజ్ లను అదుపులోకి తీసుకున్నారు. వారి దర్యాప్తులో ఉదయ్ క్షేమంగానే ఉన్నట్టు తెలిపినట్లు సమాచారం. మిగతా ఇద్దరు నిందితులు బాలుడిని తీసుకువస్తున్నట్టు చెప్పడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైనట్టేనని పోలీసులు భావిస్తున్న తరుణంలో... అనూహ్యంగా కొప్పాక రైల్వే బ్రిడ్జి కింద బాలుడు శవమై కనిపించాడు. దీంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రాజుతో పాటు మరో నిందితుడు శనివారం రాత్రి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. వారి కోసం గాలింపు చర్యలను చేపట్టారు. -
అలియాబాద్లో అదృశ్యం.. బాపట్లలో ప్రత్యక్షం
బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం చాంద్రాయణగుట్ట: శాలిబండ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగిన బాలుడి కిడ్నాప్ కథ ఎట్టకేలకు సుఖాంతమయ్యింది. అలియాబాద్ మేకలబండలో ఆదివారం సాయంత్రం అదృశ్యమైన బాలుడు సోమవారం గుంటూరు జిల్లా బాపట్లలో పోలీసులకు చిక్కడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... శబరీష్ తమ ఆధీనంలో ఉన్నట్లు బాపట్ల పోలీసులు తమకు సమాచారం అందించారని, పోలీసులను అక్కడికి పంపుతున్నట్లు తెలిపారు. బాపట్లలో రైలులో ఏడుస్తున్న శబరీష్ను గుర్తించిన ప్రయాణికులు రైల్వే పోలీసులకు అందించగా, వారు అతడిని అదుపులోకి తీసుకొని తమకు సమాచారం అందించారన్నారు. వివరాల్లోకి వెళితే... మేకబండకు చెందిన బీజేవైఎం రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు పొన్న వెంకటరమణ కుమారుడు పొన్న శబరీష్(15) శంషీర్గంజ్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం ఆడుకునేందుకు వెళ్లిన శబరీష్ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు శాలిబండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా అదే ప్రాంతానికి చెందిన శారద అనే మహిళ ఆదివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో శబరీష్ను సికింద్రాబాద్ 1వ నంబర్ ప్లాట్ ఫారంపై చూసినట్లు సోమవారం అతని తండ్రికి తెలిపింది. దీంతో పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలించగా ఎలాంటి ఫలితం కనిపించలేదని ఇన్స్పెక్టర్ తెలిపారు. ఆరు బృందాలతో గాలింపు బాలుడి అదృశ్యాన్ని సీరియస్గా తీసుకున్న శాలిబండ పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా అతను చదువుతున్న స్కూల్కు వెళ్లి విద్యార్థులను ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం వారి ఇంటి వద్దే శబరీష్ను చివరి సారిగా చూసిన ముగ్గురి సాక్షులను కూడా పోలీసులు విచారించారు. ఆ సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బాలుడితో మాట్లాతుండగా చూసినట్లు పొన్న ప్రకాష్ అనే బాలుడు తెలిపాడు. ఎనిమిది మంది కలిసి కిడ్నాప్ చేశారు: శబరీష్ అలియాబాద్లో ఆదివారం సాయంత్రం ఎనిమిది మంది కలిసి తన మూతికి బట్ట కట్టి కిడ్నాప్ చేశారని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వారి దృష్టి మరల్చి తాను గరీబ్థ్ ్రవిశాఖపట్నం రెలైక్కానని... విశాఖపట్నం నుంచి తిరిగి ‘బొకారో’ ఎక్స్ప్రెస్లో ఇంటికి వస్తూ..బాపట్లలో రైలులో ఏడుస్తుండగా తోటి ప్రయాణికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించినట్లు బాలుడు శబరీష్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. -
బాలుడి కిడ్నాప్ కలకలం
మోత్కూరు : ఓ బాలుడి కిడ్నాప్ వదంతం కలకలం రేపింది. కిడ్నాపైన బాలుడు మోత్కూరులో తప్పించుకున్నాడని ప్రచారం కావడంతో టీవీచానల్స్లో బ్రేకింగ్న్యూస్లు మార్మోగాయి. స్పందించిన జిల్లా ఎస్పీ అన్ని పోలీస్స్టేషన్లకు సమాచారం అందించి బాలుడి కిడ్నాప్ సంఘటనపై పోలీసులను అప్రమత్తం చేశారు. చివరికి కిడ్నాపైన బాలుడే అసత్య ప్రచారం చేశాడని తేలడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలిలా.. నార్కట్పెల్లి మండలం గోపాలయపెల్లి గ్రామానికి చెందిన అంకిరెడ్డి సువర్ణ-సైదులు దంపతుల కుమారుడు అజయ్ నార్కట్పెల్లిలోని శాంతినికేతన్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు పండ్లతోటలను కౌలుకు తీసుకొని ఆయా గ్రామాల్లో నివాసం ఏర్పాటుచేసుకొని జీవిస్తున్నారు. ప్రస్తుతం అమ్మనబోలులో నివాసముంటున్నారు. నిత్యం అమ్మనబోల్ నుంచి నార్కట్పెల్లి పాఠశాలకు స్కూల్బస్లో వచ్చివెళ్తుండే వాడు. రోజులాగే బుధవారం స్కూల్వ్యాన్లో ఉదయాన్నే పాఠశాలకు వె ళ్లాడు. అయితే హోంవర్క్ చేయలేదెందుకని టీచర్లు అడగడంతో కడుపునొస్తుందని, ఆరోగ్యం బాలేదని చెప్పడంతో మందులు ఇచ్చారు. కాసేపటి తర్వాత నోడ్స్ కొనుక్కుంటానని చెప్పి పాఠశాల నుంచి దుకాణానికి వచ్చినట్టు నటించి అక్కడి నుంచి మోత్కూరులో ఉన్న బాలుడి బంధువుల దగ్గరికి వెళ్లాడు. తనను కిడ్నాప్ చేశారని, వారినుంచి తప్పించుకొని మీ దగ్గరికి వచ్చానని చెప్పడంతో వెంటనే వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాలుడిని ఎస్ఐ పురేందర్భట్ తన సిబ్బందితో వచ్చి స్టేషన్కు తీసుకెళ్లి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. తనను కొంతమంది వ్యక్తులు తుఫాన్ వాహనంలో నార్కట్పెల్లిలో కిడ్నాప్చేశారని, మోత్కూరు వద్ద వాహనం నిలిపిఉండగా అక్కడ తప్పించుకొని బంధువుల వద్దకు చేరానని చెప్పాడు. అప్పటి కే జిల్లా వ్యాప్తంగా బాలుడి కిడ్నాప్ వార్త నిజమేనని ఎలక్ట్రానిక్ చానల్స్లో స్క్రోలింగ్ రావడంతో పోలీసులు అప్రమత్తమై కిడ్నాప్గ్యాంక్ పై మొదట ఆరాదీశారు. బాలుడి చెప్పే విషయాలు ఒకదానికికొకటి పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చి తల్లిదండ్రులకు, పాఠశాల యాజమాన్యానికి ఫోన్చేసి అసలు విషయం రాబట్టారు. పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని హోంవర్క్పై ప్రశ్నించడంతో చదవలేక భయపడి అక్కడ నుంచి మోత్కూరుకు వెళ్లాడని తెలుసుకున్నారు. ఇంకేముంది కాస్త భయపెట్టి గట్టిగా అడగడంతో చెప్పింది తప్పుడుమాటలని, నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఊరికే చెప్పానని చెప్పాడు. అనంతరం తల్లిదండ్రులను స్టేషన్కు పిలిపించి సీఐ బాలగంగిరెడ్డి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. విద్యార్థికి ఇష్టమైన స్కూల్లో చేర్పించి చక్కగా చదివించాలని సూచిం చారు. అనంతరం విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. -
బాలుడు షోయబ్ను రక్షించిన పోలీసులు