Konda Sarath
-
శరత్ను పరామర్శించిన కేసీఆర్
-
శరత్ను పరామర్శించిన కేసీఆర్
హైదరాబాద్: సెప్టల్ డిఫెక్ట్ అనే గుండె జబ్సుతో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శరత్ను తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం పరామర్శించారు. శరత్ ఆరోగ్య పరిస్థితి గురించి కేసీఆర్ అపోలో వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం శరత్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని... మరో రెండు మూడు సార్లు శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని వైద్యులు కేసీఆర్కు వివరించారు. శరత్ కుటుంబానికి పక్కా ఇల్లు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. వరంగల్ జిల్లా నర్మెట్టకు చెందిన కొండా శరత్ (11)కు పుట్టుకతో గుండె కవాటానికి సంబంధించిన వ్యాధి ఉంది. దాంతో అతని తల్లిదండ్రులు శరత్కు అపోలో ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్న పిల్లలను పరామర్శించడానికి ఏర్పాటైన ‘మేక్ ఏ విష్’ అనే అంతర్జాతీయ సంస్థ ప్రతినిధులు గుండె జబ్బుతో బాధపడుతున్న శరత్ను కలిసి... నీకు ఏమైనా ఆశలు ఉన్నాయా అని ప్రశ్నించారు. దాంతో తాను తెలంగాణ సీఎం కేసీఆర్తో మాట్లాడాలని తాను ఆశపడుతున్నట్లు శరత్ వెల్లడించారు. ఆ విషయాన్ని 'మేక్ ఏ విష్' ప్రతినిధులు సీఎం కేసీఆర్ కలసి వివరించారు. దాంతో ఈ రోజు మధ్యాహ్నం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరత్ను కేసీఆర్ పరామర్శించారు. దాంతో శరత్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. -
కేసీఆర్ను చూడాలని ఉంది
కేసీఆర్ను కలవాలని ఓ హృద్రోగ బాలుడి కోరిక సాక్షి, హైదరాబాద్: సెప్టల్ డిఫెక్ట్ అనే గుండె జబ్బుతో బాధపడుతున్న కొండా శరత్(11) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ను చూడాలని కోరుకుంటున్నాడు. వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్న పిల్లలను పరామర్శించడానికి ఏర్పాటైన ‘మేక్ ఏ విష్’ అనే అంతర్జాతీయ సంస్థ ప్రతినిధి ప్రియ తులూరి ఇటీవల ఆపోలో ఆసుపత్రిలో ఈ బాలుడిని కలిసినప్పుడు ఈ మేరకు వెల్లడించినట్లు సీఎం కార్యాలయం సీపీఆర్వో జ్వాల నర్సింహారావు తెలిపారు. వరంగల్ జిల్లా నర్మెట్ట గ్రామానికి చెందిన బాలయ్య, భాగ్య దంపతుల సంతానమైన శరత్కు పుట్టుకతోనే హృద్రోగ సమస్య ఏర్పడింది. దీంతో మూడేళ్ల వయసు లో ఉన్నప్పుడు (2005)లో ఆపరేషన్ చేయించారు. అయితే తిరిగి సమ స్య పునరావృతం కావడంతో ఇటీవల మరోసారి ఆపరేషన్ జరిగింది.