meerpet police
-
Meerpet Case: రోలును తిరగేసి.., పొత్రంతో పొడిచేసి!
సాక్షి, హైదరాబాద్: ‘భార్యను చంపి, ఉడకబెట్టిన’ కేసులో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు గురుమూర్తి భార్య మృతదేహాన్ని ముక్కలు చేశాక..ఉడకబెట్టడానికి కాస్టిక్ సోడాను, ఎముకలను పొడి చేయడానికి రోలు, పొత్రం వినియోగించాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలిసింది. భార్యను చంపిన తర్వాత మృతదేహాన్ని మాయం చేయడానికి ఓ సినిమాతోపాటు ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం ద్వారా లభించిన వీడియోలను చూసి ఈ ప్లాన్ అమలు చేశాడని గుర్తించినట్టు సమాచారం. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఇదే పనిలో ఉన్నాడని తేల్చినట్టు తెలిసింది. రాచకొండ పోలీసు కమిషనరేట్లోని మీర్పేట పరిధి జిల్లెలగూడలో జరిగిన వెంకట మాధవి హత్య కేసులో పోలీసులు ఒక్కో చిక్కుముడి విప్పుతున్నారు. ఆధారాలు సేకరించడానికి ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న ఫోరెన్సిక్ నిపుణులను సంప్రదిస్తూ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. బయటికెళ్లి సామగ్రి కొనుక్కొచ్చి.. ఈ నెల 14న రాత్రి గొడవ జరగడంతో గురుమూర్తి మాధవి తలను బలంగా గోడకేసి కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి, కాసేపటికే మరణించింది. గురుమూర్తి మరుసటి రోజున ఐదుసార్లు ఇంట్లోంచి బయటికి వెళ్లి వచి్చనట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. అలా వెళ్లి వస్తూ మాంసం కొట్టే మొద్దు, కత్తి, కాస్టిక్ సోడా, కొత్త వాటర్ హీటర్ కొనుక్కువచి్చనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని బాత్రూమ్లోకి లాక్కుపోయిన గురుమూర్తి..అక్కడే మాంసం కొట్టే మొద్దుపై కత్తితో ముక్కలు చేశాడు. పెద్ద బకెట్లో హీటర్ పెట్టి నీళ్లు మరిగిన తర్వాత ముక్కల్ని అందులో వేశాడు. మాంసం పూర్తిగా ఉడికిపోయి విడిపోవడానికి అందులో కాస్టిక్ సోడా కలిపి ఉంటాడని.. ఉడికిపోయాక కమోడ్లో వేసి ఫ్లష్ చేసి ఉంటాడని ఫోరెన్సిక్ నిపుణులు చెప్తున్నారు. ఇక ఎముకలను స్టవ్ మీద పెట్టి కాల్చి..తర్వాత రోలుపై పెట్టి పొత్రంతో కొట్టి పొడిగా మార్చాడని పోలీసులు నిర్ధారించినట్టు తెలిసింది. తర్వాత ఎముకల పొడి, కత్తిని జిల్లెలగూడ చెరువులో పారేసినట్టు సమాచారం.మృతదేహాన్ని మాయం చేయడం పూర్తయ్యాక ఆధారాలేవీ చిక్కకుండా రోలు, పొత్రం, మొద్దును, బాత్రూమ్ను పలుమార్లు కడిగేశాడని...పదే పదే నీటిని ఫ్లష్ చేస్తూ డ్రైనేజీలోనూ ఎలాంటి ఆనవాళ్లు మిగలకుండా చేశాడని పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. అయితే ఫోరెన్సిక్ నిపుణులు స్టవ్పై చిన్న మాంసం ముక్క, వెంట్రుకలతోపాటు మాధవి తలను గోడకు కొట్టిన చోట రక్తపు మరకల్ని గుర్తించారని..డీఎన్ఏ పరీక్షలు చేయించాలని నిర్ణయించారని సమాచారం. -
మీర్పేట్ మర్డర్ మిస్టరీ కొత్త టెక్నాలజీతో కేసు విచారణ
-
మీర్పేట్ మాధవి హత్య కేసు.. పిల్లల విచారణలో కీలక విషయాలు
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా మీర్పేట్ చిల్లెలగూడలో జరిగిన దారుణ హత్యపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. మరో మహిళతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారి తీసినట్లు విచారణలో భాగంగా గురుమూర్తి నుంచి పోలీసులు వివరాలు రాబట్టారు. పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసిన గురుమూర్తి, ఓ వెబ్ సిరీస్ తరహాలో మృతదేహాన్ని మాయం చేసి తప్పించుకోవాలని చూసినట్టు పోలీసులు నిర్ధారించారు.మీర్పేట్కు చెందిన మాధవి హత్య కేసులో ఆమె భర్త, నిందితుడు గురుమూర్తిని పోలీసులు నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక, ఇప్పటికే రెండుసార్లు సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత మరోసారి సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేయనున్నారు. ఈ కేసులో కీలకమైన ఆధారాలను దర్యాప్తు అధికారులు సేకరించారు. సుమారు మూడు గంటల పాటు గురుమూర్తి ఇంట్లో క్లూస్ టీమ్ సోదాలు నిర్వహించింది. అలాగే, సీసీ ఫుటేజ్, ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మరోవైపు, మాధవి హత్య కేసులో ఇద్దరు పిల్లల స్టేట్మెంట్ను కూడా పోలీసులు రికార్డు చేశారు. పిల్లల స్టేట్మెంట్ సందర్భంగా కూడా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తమ తల్లి కనిపించకపోయిన తర్వాత ఇంట్లో చెడు వాసన వచ్చినట్టు పిల్లలు తెలిపారు. అలాగే, కుటుంబ సభ్యలను కూడా పోలీసులు విచారిస్తున్నారు.ఇదిలా ఉండగా.. నిందితుడు విషయాలపై ఆధారపడకుండా పోలీసులు వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిందితుడి ఫోన్ పరిశీలించినప్పుడు మరో మహిళ ఫొటోలు కొన్ని ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 18వ తేదీన నమోదు చేసిన వెంకట మాధవి అదృశ్యం కేసును హత్య కేసు సెక్షన్ల కింద మారుస్తున్నారు. కేసు విషయంలో నేడు కొంత స్పష్టత వచ్చే అవకాశముంది.జరిగింది ఇదీ.. ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన పుట్ట గురుమూర్తి, అదే గ్రామానికి వెంకట మాధవికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. గురుమూర్తి ఆర్మీలో జవాన్గా చేరి నాయక్ సుబేదార్గా పదవీ విరమణ పొందాడు. ప్రస్తుతం కంచన్బాగ్ డీఆర్డీఏలో కాంట్రాక్టు భద్రతా సిబ్బందిగా పని చేస్తున్నారు. గురుమూర్తి కొన్నాళ్లుగా తన సమీప బంధువైన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం భార్యకు తెలిసి పలుమార్లు గొడవలు జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలోనే భార్య అడ్డు తొలగించుకోవాలనే క్రమంలోనే ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు.సంక్రాంతి పండుగ సందర్భంగా గురుమూర్తి తన ఇద్దరు పిల్లల్ని నగరంలోనే ఉండే తన సోదరి ఇంటి దగ్గర దింపాడు. 13, 14 తేదీల్లో మాధవితో కలిసి ఉదయం సోదరి ఇంటికెళ్లి సాయంత్రానికి తిరిగొచ్చేవారు. 15వ తేదీన ఉదయం గురుమూర్తికి భార్యకు గొడవ మొదలైంది. మరో మహిళతో సంబంధం, ఇందుకు సంబంధించి కొన్ని ఫొటోలు భార్య చూసింది. అప్పటికే భార్యను హతమార్చాలని కసితో ఉన్న గురుమూర్తి అనుకున్నంత పని చేశాడు. భార్యను తలమీద కొట్టడంతో ఆమె కిందపడిపోయింది. ఆరు నెలల క్రితం ఓటీటీలో చూసిన వెబ్సిరీస్లోని పాత్రల తరహాలోనే మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగా మృతదేహాన్ని టాయిలెట్లోకి తీసుకెళ్లి ముక్కలుగా నరికాడు.శరీరాన్ని ముక్కలుగా చేసి..ఆ తర్వాత బకెట్ నీళ్లను హీటర్తో వేడి చేసి ముక్కల్ని వేశాడు. ముక్కలు మొత్తగా మారాక మాంసాన్ని ఎముకల నుంచి విడదీసి మరో బకెట్లో వేసి రోకలితో దంచి ముద్దగా చేశాడు. ఎముకల్ని ముక్కలుగా చేసి అంతా సంచుల్లో నింపి సమీపంలోని చెరువులో వేశాడు. హత్య తర్వాత దాదాపు రెండ్రోజులు నిద్రలేకుండా ఇదంతా చేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని మాయం చేసిన తర్వాత గదిని నీళ్లతో శుభ్రం చేశాడు. 17వ తేదీ సాయంత్రం భార్య కనిపించడం లేదని వెంకట మాధవి తల్లిదండ్రులకు ఫోన్లో చెప్పాడు. చిన్న గొడవతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదు చేయించాడు.ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే పోలీసులకు గురుమూర్తి మీద అనుమానమొచ్చింది. మాధవి ఇంటి లోపలికి వెళ్లడం తప్ప బయటకు వచ్చే దృశ్యాలు రికార్డవలేదు. దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినప్పుడు అసలు విషయం బయటపడింది. బుధ, గురువారాల్లో నిందితుడి నివాసాన్ని పరిశీలించిన క్లూస్టీం, ఫోరెన్సిక్ బృందాలు నీళ్ల బకెట్, వాటర్ హీటర్తో పాటు ఇంట్లో కొన్ని కీలక ఆనవాళ్లు సేకరించాయి. వీటిని పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. బకెట్లో వేసి శరీరం ముక్కలు ఉడికించినట్లు కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి.పోలీసులకే ట్విస్ట్.. నిందితుడు చెప్పిన విషయాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మృతదేహాన్ని చెరువులో విసిరేసినట్లు చెబుతున్నా, అక్కడ ఇంకా ఆధారాలు లభించలేదు. శరీరం ఆనవాళ్లు లభ్యమైనా వెంకట మాధవి పిల్లల డీఎన్ఏతో పోల్చే అవకాశముంది. ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. క్లూస్టీం, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కీలకం కానుంది. వెంకట మాధవి అదృశ్యంపై కేసు నమోదు చేశామని, ఆమె ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు మాత్రమే లభ్యమైనట్లు ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ తెలిపారు. -
గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఇద్దరిపై పీడీయాక్ట్
సాక్షి, రంగారెడ్డి: గుట్టుచప్పుడు కాకుండా ఓ గృహంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిపై రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు మీర్పేట పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఎల్లంపేటకు చెందిన గంధ భవానీ(25) తన స్నేహితుడైన తూర్పుగోదావరి జిల్లా అన్నవరంకు చెందిన కసిరెడ్డి దొరబాబు (23)తో కలిసి మీర్పేట టీకేఆర్ కళాశాల సమీపంలో ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తోంది. సులువుగా డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితం గడిపేందుకు ఇతర ప్రాంతాల నుంచి మహిళలను రవాణా చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న మీర్పేట పోలీసులు అక్టోబరు 13వ తేదీన ఇంటిపై దాడి చేసి నిర్వాహకులు గంధ భవానీ, కసిరెడ్డి దొరబాబును అరెస్ట్ చేసి.. నగరానికి చెందిన ఇద్దరు మహిళలను రక్షించారు. భవిష్యత్లో ఇలాంటి చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడకుండా సీపీ ఆదేశాల మేరకు పోలీసులు భవానీ, దొరబాబుపై బుధవారం పీడీయాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు. చదవండి: మహిళా యూట్యూబర్పై ముంబై ఆకతాయిల వేధింపులు.. వీడియో వైరల్.. -
పుట్టినరోజు వేడుకలకొచ్చిన మామ ఇంట్లో అల్లుడు చోరీ
సాక్షి, సిటీబ్యూరో: పుట్టినరోజు వేడుకల కోసమని వచ్చిన మామ ఇంట్లో చోరీకి స్కెచ్ వేశాడో వ్యక్తి. స్నేహితులను ఉసిగొల్పి.. వారితో దోపిడీ చేయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మీర్పేట పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. డీసీపీ క్రైమ్స్ యాదగిరితో కలిసి ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్ శనివారం వివరాలు వెల్లడించారు. సైదాబాద్, కుర్మగూడకు చెందిన యాసిర్ ఉల్లిఖాన్ గత నెల 31న పుట్టిన రోజు వేడుకలను నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి అతడి మామ హాజరయ్యాడు. అతను ధరించిన ఖరీదైన గడియారాలు, ఆభరణాలను చూసిన యాసిర్కు దుర్బుద్ధి పుట్టింది. మామ ఇంట్లో దొంగతనం చేయాలని ప్లాన్ వేశాడు. ఇదే విషయాన్ని అతని స్నేహితులైన మహ్మద్ అయ్యాజ్ ఖాన్, హమ్దాన్ అశ్వాక్లకు సూచించాడు. ముగ్గురు కలిసి పథకం పన్నారు. గత నెల 31న అశ్వాక్ బురఖా ధరించి అయాజ్ ఖాన్ బైక్పై మీర్పేటలోని షరీఫ్నగర్లోని ఉల్లిఖాన్ మామ ఇంటి పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. ఇంటి బయట అయాజ్ కాపు కాస్తుండగా.. అశ్వాక్ ఇంటి అద్దాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. వెంట తెచ్చుకున్న స్క్రూడ్రైవర్తో మొదటి, రెండో అంతస్తులోని అల్వారాలను తెరిచి, అందులోని సొత్తును చోరీ చేసి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మీర్పేట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మీర్పేట ఠాణా పరిధిలో శనివారం తెల్లవారుజామున అనుమానాస్పదంగా సంచరిస్తున్న అశ్వాక్, అయాజ్, ఉల్లిఖాన్లను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.33.02 లక్షల విలువ చేసే 36 తులాల బంగారం ఆభరణాలు, 9 ఖరీదైన చేతి గడియారాలు, 405 అమెరికన్ డాలర్లు, బైక్, సెల్ఫోన్, డిజిటల్ కెమెరాలను స్వా«దీనం చేసుకున్నారు. చదవండి: తెలుగు రాష్ట్రాల్లో వరుస చోరీలు.. ఘరానా దొంగ రమేష్ అరెస్టు -
దొంగలు అరెస్ట్: భారీగా బంగారు, వెండి స్వాధీనం
హైదరాబాద్: తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అమర్రాజ్ అనే పాత నేరస్తుడిని, కుమార్ రెడ్డి, కరమోత్ సంతోష్ అనే ఇద్దరు నిందితులను మీర్పేట్ పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి 28 తులాల బంగారు ఆభరణాలు,13 తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే మూడు బైక్లు, ఒక ఐపోడ్, రెండు మొబైల్ ఫోన్లు, రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు. -
చోరీ చేస్తూ అడ్డంగా దొరికిన ఎస్ఐ
హైదరాబాద్: సామాన్య ప్రజలను దొంగల భయం నుంచి రక్షించాల్సిన ఓ పోలీస్ చోరీలకు పాల్పడుతున్నాడు. కథ అడ్డం తిరగడంతో చోరీ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన నగరంలోని మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. మహేందర్ రెడ్డి నగరంలో సీసీఎస్ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే నేటి(శుక్రవారం) ఉదయం మహేందర్ రెడ్డి మీర్ పేట ఏరియాలో దొంగతనానికి యత్నించాడు. సరిగా అదే సమయంలో మీర్ పేట పోలీసులకు మహేందర్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. మహేందర్ రెడ్డిని మీర్ పేట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
దారి దోపిడీ ముఠా అరెస్ట్
హైదరాబాద్ : దారి దోపిడీకి పాల్పడిన ఓ ముఠాను మీర్పేట పోలీసులు అరెస్టు చేసి కారు, బైక్తోపాటు రూ. 6.5 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం వనస్థలిపురం ఏసీపీ భాస్కర్గౌడ్, మీర్పేట ఇన్స్పెక్టర్ భిక్షంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఈనెల 13న తెలుగు రాములు అనే వ్యక్తి బాలాపూర్ చౌరస్తా మీదుగా కారు నడుపుకుంటూ వెళ్తున్నాడు. సాయినగర్ కాలనీలో లెనిన్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ కేతావత్ రఘు (25), మన్సురాబాద్కు చెందిన కేంసారం హరీశ్ (22), ప్రశాంతినగర్కు చెందిన పెయింటర్ ఎర్లపల్లి జగదీప్ (19) లిఫ్ట్ ఇవ్వాలని కారు ఎక్కారు. కొద్ది దూరం వెళ్లాక డ్రైవర్ రాములును కత్తులతో బెదిరించి దాడి చేశారు. అనంతరం రాములు వద్దనున్న రూ.6 లక్షల 50 వేలు లాక్కొని, అతని కారుతోపాటు ఉడాయించారు. బాధితుడి మీర్పేట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి.. స్పెషల్ టీమ్కు ఈ కేసును అప్పగించటంతో గాలింపు తీవ్రం చేశారు. ఈ నెల 21న విరాట్నగర్ చౌరస్తాలో వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులకు దుండగులు ఎత్తుకెళ్లిన రాములు కారు (టీఎస్ 08 వైడీ టీఆర్ నెం.4833) కనిపించింది. పోలీసులు ఆ కారును ఆపి అందులో ప్రయాణిస్తున్న ముగ్గురినీ అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టారు. నిందితుల నుంచి కారుతో పాటు బైక్, నగదు స్వాధీనం చేసుకుని ముగ్గురినీ రిమాండ్కు తరలించారు. ఇదిలావుండగా కేతావత్ రఘు గతంలో తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గుప్త నిధుల తవ్వకాల కేసులో జైలు శిక్ష అనుభవించినట్లు ఏసీపీ తెలిపారు. మరో నిందితుడు కేంసారం హరీశ్ సీతాఫల్మండి, ఎల్బీనగర్, ఉప్పల్ తదితర పోలీస్ స్టేషన్ పరిధుల్లో చోరీలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించాడని పోలీసులు తెలిపారు. -
దేవరకొండ టీడీపీ అభ్యర్థి కుమార్తె ఆచూకీ లభ్యం
మూడు రోజుల క్రితం అదృశ్యమైన దేవరకొండ టీడీపీ అభ్యర్థి బిల్యానాయక్ కుమార్తె హారికా క్షేమంగా ఉన్నట్లు నగరంలోని మీర్పేట్ పోలీసులు శనివారం వెల్లడించారు. అదృశ్యానికి గల కారణాలపై ఆమెను విచారిస్తున్నట్లు తెలిపారు. అనంతరం హారికను ఆమె తల్లితండ్రులకు అప్పగిస్తామన్నారు. ఇప్పటికే హారిక క్షేమంగా ఉన్నట్లు ఆమె తండ్రి బిల్యానాయక్కు సమాచారం అందించారమన్నారు. నల్గొండ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే అభ్యర్థి కేతావత్ బిల్యానాయక్ కుమార్తె మూడు రోజుల క్రితం అదృశ్యమైంది. దాంతో ఆయన తన కుమార్తె ఆచూకీ తెలపాలంటూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... హారిక ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.