Mock drills
-
OP shield: పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్
న్యూఢిల్లీ, సాక్షి: పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో ఇవాళ ఆపరేషన్ షీల్డ్(Operation Shield) నిర్వహించారు. జమ్ము, పంజాబ్, రాజస్థాన్, హర్యానాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఎయిర్రైడ్ సైరన్ డ్రిల్ నిర్వహించారు. మొత్తం 244 జిల్లాల్లో సాయంత్రం 5గం. నుంచి 9గం. దాకా మాక్ డ్రిల్స్ నిర్వహించింది.యుద్ధంలాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలోని భద్రతా బలగాలు ఎలా వ్యవహరించాలి, మరీ ముఖ్యంగా పౌర రక్షణ నేపథ్యంతో ఈ మాక్ డ్రిల్స్ జరిపారు. ఈ నెలలో.. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) కంటే కొన్ని గంటల ముందు(మే 7వ తేదీన) తొలిసారి పౌర రక్షణ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఇవాళ మరోసారి చేపట్టారు.పహల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరి యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో సంక్షోభ సమయంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అనే అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగానే కేంద్ర హోం శాఖ మాక్ డ్రిల్స్(Mock Drills) నిర్వహించింది. సైరన్ వినగానే ప్రజలు అప్రమత్తమైన చెవులు మూసుకుని కింద పడుకోవడం, సురక్షిత ప్రాంతాలకు తరలిపోవడం లేదంటే భద్రతా బలగాలే వాళ్లను తరలించడం.. దాడుల్లో గాయపడిన వాళ్లను రెస్క్యూ చేయడం తరహా చర్యలు ఈ డ్రిల్స్లో ఉన్నాయి.అప్పుడు.. మళ్లీ ఇప్పుడుఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో.. దాదాపు 50 సంవత్సరాల తర్వాత దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ చేపట్టడం గమనార్హం. 1971లో తూర్పు పాకిస్థాన్(ప్రస్తుత బంగ్లాదేశ్), పశ్చిమ పాకిస్థాన్లో పోరాడాల్సి రావడంతో దేశ వ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేశారు. అంతకు ముందు 1962, 65 యుద్ధాల సమయంలో కూడా నిర్వహించారు. అయితే.. కార్గిల్ యుద్ధం అప్పుడు జరిగినా.. అది పరిమిత ప్రాంతాల్లోనే జరిగింది.ఇదీ చదవండి: ప్రముఖ యూట్యూబర్పై కోర్టు ధిక్కార చర్యలు! -
సెక్యూరిటీ డ్రిల్స్ రేపటికి వాయిదా
న్యూఢిల్లీ: అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం ఉండే సరిహద్దు రాష్ట్రాల్లో సన్నద్ధతను పెంచేందుకు ఈ శనివారం సెక్యూరిటీ డ్రిల్స్ చేపట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. గుజరాత్, పంజాబ్, రాజస్తాన్, హరియాణా, జమ్మూకశ్మీర్లలో ముందుగా ప్రకటించినట్లు వాస్తవానికి గురవారమే ఈ డ్రిల్స్ చేపట్టాల్సి ఉంది. అయితే, పరిపాలనా సంబంధ కారణాలతో శనివారం సాయంత్రానికి వాయిదా వేసినట్లు వివరించింది. ఇందులో భాగంగా కంట్రోల్ రూంల పనితీరు, వైమానిక దాడుల హెచ్చరికలు, ఫైర్సేఫ్టీ వంటి పౌర రక్షణ సేవల సన్నద్ధతను పరీక్షించనున్నారు. వైమానిక దాడుల నుంచి ఎలా రక్షించుకోవాలో పౌరులకు చూపుతారు. పాకిస్తాన్తో సరిహద్దులున్న రాష్ట్రాల్లో ఇకపై ప్రతినెలా ఈ డ్రిల్స్ను చేపడతామని తెలిపింది. ఈ సమయంలో పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అధికారులిచ్చే సూచనలను పాటించాలని కోరింది. గుజరాత్లోని అన్ని జిల్లాల్లోని డ్రిల్ ఉంటాయని, సివిల్ డిఫెన్స్ వలంటీర్లుగా పౌరులు నమోదు చేయించుకోవచ్చని కేంద్రం పేర్కొంది. ఇటీవలి ఆపరేషన్ సిందూర్ సమయంలో పంజాబ్లోని అన్ని జిల్లాల పరిధిలో, రాజస్తాన్లోని సరిహద్దు జిల్లాల్లో హై అలెర్ట్ అమల్లో ఉంది. ఈ సమయంలో అన్ని విద్యా సంస్థలను మూసి వేస్తారు. ఇతర బహిరంగ కార్యక్రమాలు సైతం రద్దవుతాయి. -
సన్నద్ధతకు సంసిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: మాక్డ్రిల్స్కు సర్వం సిద్ధమైంది. అనూహ్య పరిస్థితులను దీటుగా ఎదుర్కొనేందుకు, యుద్ధ సన్నద్ధతను పూర్తిస్థాయిలో చాటేందుకు దేశమంతా ఒక్కటవుతోంది. దాదాపు 54 ఏళ్ల అనంతరం దేశవ్యాప్తంగా పౌర రక్షణ, సన్నద్ధత విన్యాసాలు జరగనున్నాయి. పట్టణాల నుంచి గ్రామస్థాయి దాకా వాటిలో ప్రజలంతా చురుగ్గా భాగస్వాములు కానున్నారు. 6.5 లక్షల మందికి పైగా వలెంటీర్లు ఈ క్రతువులో వారికి సాయపడనున్నారు. 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ (సీడీడీ) పరిధిలో బుధవారం సాయంత్రం నాలుగింటి నుంచి రాత్రి దాకా ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరిట ఈ డ్రిల్స్ జరుగుతాయి. దేశవ్యాప్తంగా అణు విద్యుత్కేంద్రాలు, రిఫైనరీలు, కీలక కేంద్ర ప్రభుత్వ సంస్థలున్న, రక్షణపరంగా సున్నితమైన ప్రాంతాలను సీడీడీలుగా 2010లో కేంద్రం నోటిఫై చేసింది. వీటిలో చాలావరకు రాజస్తాన్, పంజాబ్, జమ్మూ కశీ్మర్, పశి్చమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో నెలకొని ఉన్నాయి. సున్నితత్వాన్ని బట్టి వాటిని మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. ఢిల్లీ, చెన్నై వంటి నగరాలు అత్యంత సున్నితమైన కేటగిరీ 1లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం డ్రిల్స్కు వేదిక కానున్నాయి. వాటిని సున్నితమైనవిగా పేర్కొంటూ కేటగిరీ 2లో చేర్చారు.కేంద్రం సమీక్ష పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ దేశవ్యాప్త డ్రిల్స్ సన్నద్ధతను కేంద్ర హోం శాఖ మంగళవారం సమీక్షించింది. డ్రిల్స్ విధివిధానాలు తదితరాలపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సారథ్యంలో ఉన్నతస్థాయి సమావేశంలో లోతుగా చర్చించారు. రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు రక్షణ, పోలీసు విభాగాల అత్యున్నత స్థాయి అధికారులు భేటీలో పాల్గొన్నారు. డ్రిల్స్లో విద్యార్థులు, ఎన్సీసీ కాడెట్లు, యువతతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు, ఆస్పత్రుల సిబ్బంది, రైల్వే, మెట్రో ఉద్యోగులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.ఎక్కడికక్కడ పోలీసు, సైనిక సిబ్బంది వారితో సమన్వయం చేసుకోనున్నారు. 1971 తర్వాత రక్షణపరంగా దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ జరుగుతుండటం ఇదే తొలిసారి. అప్పుడు కూడా పాక్తో యుద్ధ నేపథ్యంలోనే ఈ కసరత్తు నిర్వహించారు. అంతకుముందు 1962, 1965ల్లో కూడా చైనా, పాక్తో పూర్తిస్థాయి యుద్ధం సందర్భంగా మాక్ డ్రిల్స్ జరిపారు. మంగళవారం అన్ని రాష్ట్రాల్లోనూ మాక్ డ్రిల్స్ సన్నాహక కసరత్తులు పోలీసు తదితర బృందాల పర్యవేక్షణలో ముమ్మరంగా జరిగాయి. విద్యార్థులు, యువత మొదలుకుని ప్రజలంతా పెద్ద సంఖ్యలో వాటిలో పాల్గొన్నారు.డ్రిల్స్ ఇలా...⇒ మాక్ డ్రిల్స్లో భాగంగా వైమానిక దాడుల హెచ్చరికలతో సైరన్లు విని్పస్తాయి. ⇒ వెంటనే పరిసర ప్రాంతాల పౌరులంతా క్షణాల్లో అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు తరలాలి. వీలైన చోట్ల బంకర్లు, సబ్వేలు, అండర్గ్రౌండ్ మెట్రో తదితర చోట్ల తలదాచుకోవాలి. ⇒ ఈ కసరత్తులో యువత, విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కాడెట్లు మొదలుకుని హోం గార్డుల దాకా అందరినీ భాగస్వాములను చేస్తారు. ⇒ కీలక సంస్థలు, మౌలిక సదుపాయ వ్యవస్థలను దాడుల నుంచి కాపాడుకోవడం, అవి శత్రువు కంటపడకుండా జాగ్రత్త పడటం తదితరాల్లో జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగి్నమాపక తదితర బృందాలు వారికి శిక్షణ ఇస్తాయి. ⇒ బ్లాకౌట్ వంటివి చోటుచేసుకుంటే ఎలా స్పందించాలో, స్వీయరక్షణతో పాటు పౌరులను కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తాయి. ⇒ రాత్రి 7.30 నుంచి 10 నిమిషాల పాటు క్రాష్ బ్లాకౌట్ ‘లైట్లను ఆపేయడం) కసరత్తు జరుగుతుంది. ⇒ డ్రిల్స్ కోసం హాట్లైన్, రేడియో కమ్యూనికేషన్ వంటివాటిని వైమానిక దళ లింకులతో అనుసంధానిస్తారు. ⇒ కంట్రోల్ రూమ్స్, షాడో కంట్రోల్ రూమ్స్ విపత్తులకు ఎలా స్పందిస్తాయో పరీక్షిస్తారు. ⇒ డ్రిల్స్ నిమిత్తం స్పందన బృందాలన్నింటికీ ఇప్పటికే కోడ్ వర్డ్స్ కేటాయించారు. ⇒ ఎప్పుడేం చేయాలో పేర్కొంటూ టైమ్లైన్ను కూడా స్పష్టంగా నిర్దేశించారు. ⇒ వైమానిక దాడుల హెచ్చరిక వ్యవస్థల సమర్థతను డ్రిల్స్ ద్వారా పరిశీలించనున్నారు. ⇒ కేంద్ర హోం శాఖ పౌర రక్షణ నిబంధనలు (1968) సెక్షన్ 19 ప్రకారం మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ఇవి అందుబాటులో ఉంచుకోవాలి⇒ మాక్ డ్రిల్స్కు పౌరులు పూరిస్థాయిలో సన్నద్ధం కావాలి. ⇒అత్యవసర చికిత్స నిమిత్తం మెడికల్ కిట్లు, కరెంటు కోత తదితరాల కోసం టార్చిలు, క్యాండిళ్లు వెంట ఉంచుకోవాలి. అలాగే వీలైనంత నగదు కూడా దగ్గరుంచుకోవాలి. ⇒ వీటిపై పౌరులను అప్రమత్తం చేయాల్సిందిగా అధికారులను కేంద్ర హోం శాఖ ఆదేశించింది. ⇒ ఢిల్లీ, పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో పౌర రక్షణ బృందాలు ఇప్పటికే చురుగ్గా పని చేస్తున్నాయి. ⇒ అయితే ఇవన్నీ స్వచ్ఛంద స్వభావంతో కూడిన బృందాలే.ఎక్కడెక్కడ?దేశవ్యాప్తంగా మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ (సీడీడీ) పరిధిలో ఎంపిక చేసిన 259 చోట్ల మాక్డ్రిల్స్ జరుగుతాయి.⇒ వీటిలో ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై వంటి మెట్రోలు కూడా ఉన్నాయి.⇒ 100కు పైగా సీడీడీలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించి ‘ఎ’ కేటగిరీలో చేర్చారు. వాటి పరిధిలో సూరత్, వడోదర, కాక్రపార్ (గుజరాత్), కోట (రాజస్తాన్), బులంద్షహర్ (యూపీ), చెన్నై, కల్పకం (తమిళనాడు), తాల్చెర్ (ఒడిశా), ముంబై, ఉరన్, తారాపూర్ (మహారాష్ట్ర), ఢిల్లీ వంటివి ఉన్నాయి.ఈసారి తగ్గేదే లే! ⇒ ఉరి, బాలాకోట్ మాదిరిగా కాదు ⇒ త్వరలో బాహాటంగా భారీ ‘ఆపరేషన్’ ⇒ ఆ రాజకీయ సందేశమే డ్రిల్స్ లక్ష్యం2016లో సర్జికల్ స్ట్రైక్స్. 2019లో బాలాకోట్ వైమానిక దాడులు. ఉగ్రవాద దుశ్చర్యలకు గతంలో మోదీ సర్కారు ప్రతిస్పందనలు. రెండూ సైలెంట్గా నిర్వహించిన అండర్ కవర్ ఆపరేషన్లే. ఉరి, పుల్వామా ఉగ్ర చర్యలతో పోలిస్తే ‘పహల్గాం’ దాడి పరిస్థితి పూర్తి భిన్నం. 26 మంది అమాయక పర్యాటకులను ముష్కరులు అతి కిరాతకంగా పొట్టన పెట్టుకున్నారు. ఒక్కొక్కరినీ మతం అడిగి పిట్టల్లా కాల్చేసి పైశాచికత్వం ప్రదర్శించారు. అంతేగాక ‘పోయి మోదీకి చెప్పుకోండి’ అంటూ కేంద్రానికి సూటిగా సవాలు విసిరారు. దాడిని తలచుకుని భారతీయులంతా ఆగ్రహంతో రగిలిపోతున్నారు.ఈసారి కొట్టబోయే దెబ్బ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండాలని కోరుతున్నారు. అందుకే ఈసారి భారత ప్రతి చర్య పూర్తి భిన్నంగా ఉండటం ఖాయమంటున్నారు. బాహాటంగా, అత్యంత భారీ స్థాయిలో సైనిక చర్య ఉండనుందని స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధ సన్నద్ధత, పౌర అవగాహన కోసం దేశవ్యాప్త మాక్ డ్రిల్స్ నిర్ణయం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాదికి గట్టి రాజకీయ సందేశమివ్వడమే దీని లక్ష్యమని చెబుతున్నారు. ఉగ్రవాదానికి, దానికి తల్లివేరు వంటి పొరుగు దేశానికి బుద్ధి చెప్పే విషయంలో దేశమంతా ఒక్కతాటిపై ఉందని ప్రపంచానికి చాటేందుకే మోదీ సర్కారు ఈ చర్య చేపట్టినట్టు తెలుస్తోంది. భారత ‘ఆపరేషన్’కు పాక్ స్పందనను బట్టి ఒకవేళ యుద్ధం వంటి పరిస్థితులు తలెత్తినా అందుకు దేశమంతా సంసిద్ధంగా ఉందని చాటడం కూడా ఈ డ్రిల్స్ ఉద్దేశమని రక్షణ రంగ పరిశీలకులు భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యుద్ధ సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ కీలక సమీక్ష
-
పాక్ పీచమణచేందుకు ముహూర్తం ఖరారు!
న్యూఢిల్లీ/జమ్మూ/ఇస్లామాబాద్: సర్వం సిద్ధమవుతోంది. ముహూర్తం దాదాపుగా ఖరారైంది. సరిహద్దులకు ఆవలివైపు నుంచి ఉగ్ర దాడులను పనిగట్టుకుని ఎగదోస్తున్న దాయాదికి బుద్ధి చెప్పేందుకు రంగం సిద్ధమైంది. ఈ వారాంతంలోపు ఎప్పుడైనా పాక్పై భారీ స్థాయి ‘ఆపరేషన్’ జరగవచ్చని కేంద్ర ప్రభుత్వ అత్యున్నత వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ సన్నద్ధతను సరిచూసుకునేందుకు బుధవారం పలురకాల మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది. 1971 తర్వాత ఇలాంటి డ్రిల్స్ జరగనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం! అప్పుడు కూడా పాక్తో యుద్ధం నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నారు. డ్రిల్స్లో భాగంగా వాయుదాడుల సైరన్లు మోగించి అప్రమత్తం చేస్తారు. ప్రజలను ఉన్నపళంగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు చేపడతారు. ఈ విషయమై ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రణాళికలను తక్షణం అప్డేట్ చేసుకోవాలని కేంద్ర హోం శాఖ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది. డ్రిల్స్లో భాగంగా సమర్థమైన పౌర రక్షణ చర్యలు చేపట్టడంలో ప్రజలకు, ముఖ్యంగా యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. పహల్గాం ఉగ్ర దాడుల వంటివి జరిగితే దీటుగా ఎదుర్కోవడం ఎలాగో నేర్పిస్తారు. స్వీయరక్షణ చర్యలతో పాటు విద్యుత్ సరఫరా బ్లాకౌట్ వంటివి జరిగితే తక్షణం ఎలా స్పందించాలో, కీలక మౌలిక వనరుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తారు.12వ రోజూ కాల్పులుమరోవైపు పాక్ కవ్వింపు చర్యలు ఆగడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు వరుసగా 12వ రోజూ కొనసాగాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జమ్మూ కశ్మీర్లో 8 సెక్టా్టర్లలో పాక్ సైన్యం సోమవారం విచ్చలవిడి కాల్పులకు దిగింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరీ, మెంధార్, నౌషేరా, సుందర్బని, అఖ్నూర్ సెక్టార్లలో పాక్ కవ్వింపుల చర్యలకు దీటుగా బదులిచ్చినట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి. పహల్గాం ఉగ్ర దాడులకు ప్రతి చర్యల్లో భాగంగా సింధూ జల ఒప్పందాన్ని పక్కన పెడుతూ ఏప్రిల్ 24న కేంద్రం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఆ వెంటనే నియంత్రణ రేఖ వద్ద పాక్ సైన్యం ఆగడాలు మొదలయ్యాయి.భేటీలతో బిజీబిజీగా మోదీదేశ రక్షణకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం కీలక సమీక్షలు నిర్వహించారు. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతి చర్య ఎలా ఉండాలన్నదే వాటి ఏకైక ఎజెండా అని తెలుస్తోంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్కుమార్సింగ్తో ఆయన భేటీ అయ్యారు. సైనిక సన్నద్ధతకు సంబంధించిన పలు అంశాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. కొద్ది రోజులుగా త్రివిధ దళాధిపతులతో ప్రధాని ఒక్కొక్కరుగా సమావేశం కావడం తెలిసిందే. పహల్గాంకు బదులు తీర్చుకునే పూర్తి బాధ్యతలను మోదీ వారికే అప్పగించారు.యుద్ధం వద్దు: ఐరాసజనాక్రోశాన్ని అర్థం చేసుకోగలనుదాడులు పరిష్కారం కాదు: గుటెరస్ఐరాస: భారత్, పాక్ నడుమ ఉద్రిక్తతలు కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వెలిబుచ్చింది. వాటి కట్టడికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఇరు దేశాలకూ సూచించారు. అందుకు దన్నుగా నిలిచేందుకు ఐరాస సిద్ధమని తెలిపారు. సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదని హితవు పలికారు. సాయుధ ఘర్షణ మొదలైతే పరిస్థితి అదుపు తప్పుతుందని ఆందోళన వెలిబుచ్చారు. ‘‘పహల్గాం ఉగ్ర దాడి అనంతరం భారత్లో పెల్లుబుకుతున్న జనాగ్రహాన్ని, ఆక్రోశాన్ని అర్థం చేసుకోగలను. ఆ పాశవిక దాడిని మరోసారి ఖండిస్తున్నా. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇలా పౌరులను లక్ష్యం చేసుకోవడం దారుణం. దీనికి పాల్పడ్డవారికి చట్టపరంగా కఠిన శిక్షపడాల్సిందే’’ అన్నారు.అణుయుద్ధం దిశగా పరిస్థితులు: పాక్కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి తమపై భారత్ ఏ క్షణమైనా సైనిక దాడి చేయవచ్చని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆందోళన వెలిబుచ్చారు. ఈ మేరకు తమకు నివేదికలున్నట్టు చెప్పుకొచ్చారు. అదే జరిగితే దీటుగా బదులిస్తామన్నారు. మరోసారి ‘అణు’ పల్లవి వినిపించారు. మోదీ తన రాజకీయ ప్రయోజనాల కోసం దక్షిణాసియాను అణుయుద్ధం వైపు నెడుతున్నారని ఆక్షేపించారు. పాక్లోని ఖైబర్ ఫక్తూన్ఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో భారత్ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. దీనికి, తమపై భారత్ పాల్పడుతున్న ఆర్థిక ఉగ్రవాదానికి 2016, 2017ల్లోనే ఐరాసకు అన్ని ఆధారాలూ సమర్పించామని ఆసిఫ్ చెప్పుకొచ్చారు. ‘‘పహల్గాం ఉగ్ర దాడి కూడా భారత్ పనే. మా ప్రధాని షహబాజ్ షరీఫ్ సూచించినట్టు అంతర్జాతీయ దర్యాప్తు జరిగితే ఆ దాడి మోదీ సర్కారు పనా, లేక భారత్లోని ఏదైనా సంస్థ పనా అన్నది తేలిపోయేది’’ అంటూ అతి తెలివి ప్రదర్శించారు.పాక్ పార్లమెంటు భేటీపాక్ పార్లమెంటు సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. పహల్గాం దాడికి తమను నిందించడాన్ని తీవ్రంగా ఖండించింది. సింధూ జల ఒప్పందం నిలిపివేతను యుద్ధ చర్యగా పేర్కొంది. భారత ప్రతీకార చర్యలను నిరసించింది. కశ్మీరీల స్వయంప్రతిపత్తి పోరుకు మద్దతిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు తీర్మానాలు చేసింది. -
బ్యాంక్ల్లో పోలీసుల మాక్డ్రిల్
బరంపురం ఒరిస్సా : నగరంలో ఏటీఎం కేంద్రాలు, బ్యాం క్ల చోరీ యత్నం వంటి నేరాల సంఘటనలతో బరంపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నగరంలోని 29 బ్యాంక్ల్లో బుధవారం మాక్డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు బ్యాంక్లకు వెళ్లి బ్యాంక్ మేనేజర్లతో మాట్లాడారు. అదేవిధంగా బ్యాంక్లకు వచ్చిన వినియోగదారులతో మాట్లాడారు. అనంతరం బ్యాంక్లో ఉన్న సీసీ కెమెరాలు సరిగ్గా పని చేస్తున్నాయో లేదో పరిశీలించి భద్రతపై ఆరా తీశారు. ఈ మాక్డ్రిల్లో అన్ని పోలీసు స్టేషన్లకు చెందిన ఐఐసీ అధికారులు పాల్గొన్నారని ఏఎస్పీ సంతున్ కుమార్ దాస్ తెలిపారు. -
రేపటి ఇంటర్వ్యూ ఈరోజే...!
మాక్ ఇంటర్వ్యు సేవలు అందిస్తున్న టెస్ట్ మై ఇంటర్వ్యు ♦ ఉద్యోగాలకు దారి చూపిస్తున్న హైదరాబాదీ స్టార్టప్ ♦ 6 నెలల్లోనే ఆఫ్లైన్లో 8 వేలు.. ♦ ఆన్లైన్లో 3 వేల మందికి సేవలు ♦ ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో సంస్థ కో-ఫౌండర్ శ్రీధర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘మాక్ డ్రిల్స్’!! అదేనండీ..! ప్రమాదం జరిగితే దాన్నుంచెలా తప్పించుకోవాలి? ఎలాంటి సురక్షిత చర్యలు తీసుకోవాలనే విషయంపై అవగాహన కల్పించేవి. దీనికోసం నిజంగా ప్రమాదాన్ని సృష్టించి.. డెమో రూపంలో మెళకువలు నేర్పిస్తారిక్కడ. అచ్చం ఇలాంటి మాక్ డ్రిల్స్నే.. ఇంటర్వ్యూలకు అన్వయిస్తే!! అంటే రేపు మనం ఎదుర్కోబోయే కంపెనీ ఇంటర్వ్యూను.. ఈ రోజే ఓ డెమో ఇస్తే! రేపు మనల్ని ఇంటర్వ్యూ చేసే నిపుణుల్లాంటివారేఈ మాక్ ఇంటర్వ్యూలో ఉంటే!! ఇదెలా కుదురుతుందనుకుంటున్నారా? ‘టెస్ట్ మై ఇంటర్వ్యూ’ అందిస్తున్నది ఈ సేవల్నే. ఉద్యోగానికి, ఇంటర్వ్యూకు మధ్యనున్న ఖాళీని భర్తీ చేయడమే దీని పని. విద్యార్థి-హెచ్ఆర్ పరస్పరం ఆధారపడిన ఈ రోజుల్లో... రెండింటినీ అనుసంధానిస్తూ ఒకే వేదిక మీదికి తీసుకొచ్చింది థింక్ డిజిటల్ సర్వీసెస్థ్. ఈ సంస్థ ఫ్లాగ్ షిప్ ప్రొడక్టే ‘టెస్ట్ మై ఇంటర్వ్యూ.కామ్’. అమెరికా, ఇండియాలో మైక్రోసాఫ్ట్లో పదేళ్లకు పైగా పనిచేసిన కె.శ్రీధర్... మునుపటి సత్యం కంప్యూటర్స్లో పదేళ్ల పైగా అనుభవమున్న మరో మిత్రుడితో కలిసి హైదరాబాద్ కేంద్రంగా థింక్ డిజిటల్ను ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు శ్రీధర్ మాటల్లోనే... ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించడం అంత తేలికైన విషయమేమీ కాదు. దేశంలో 90 శాతం మంది ఉద్యోగార్థులు ఫెయిలవుతున్నదెక్కడో తెలుసా..? ఇంటర్వ్యూలోనే! సబ్జెక్ట్ పరిజ్ఞానం, జనరల్ నాలెడ్జ్ ఉండి కూడా ఇంటర్వ్యూలో సక్సెస్ కాలేకపోతున్నారు. కారణమేంటంటే... పెద్ద కంపెనీల్లో ఇంటర్వ్యూ విధానం తెలియకపోవడం! ఇక నిపుణుల ముందు కూర్చునే సరికి లోలోపల తెలియని భయం ఏర్పడటం మరో కారణం. దీనికి పరిష్కారం చూపించడమే టెస్ట్ మై ఇంటర్వ్యూ ప్రత్యేకత. అంటే ఉద్యోగం కోసం ప్రయత్నించే యువతకు... నేరుగా పేరొందిన ఐటీ కంపెనీల ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు, ఆ స్థాయికి సమానమైన వారి చేత మాక్ ఇంటర్వ్యూలు చేయిస్తాం. వీటిలో అభ్యర్థులు ఎలాంటి తప్పొప్పులు చేస్తున్నారో అక్కడికక్కడే చెప్పేస్తారు కూడా. దీంతో అసలు ఇంటర్వ్యూలకు వంద శాతం కాన్ఫిడెన్స్తో వెళ్ళొచ్చు. అందుకే ‘మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ముందే.. మీరే ఇంటర్వ్యూ చేయించుకోండి’ అనే నినాదంతో మార్కెటల్లోకి వచ్చాం. 100 కంపెనీలు.. 800 మంది నిపుణులు: ప్రస్తుతం టెస్ట్ మై ఇంటర్వ్యూ సంస్థ విప్రో, మైక్రోసాఫ్ట్, సత్యం, కాగ్నిజెంట్, టీసీఎస్.. ఇలా అమెరికా, ఇండియాలోని సుమారు 100కు పైగా కంపెనీల్లో పనిచేస్తున్న 800 మంది సీనియర్ ఉద్యోగులు, ఇంటర్వ్యూ బోర్డ్ నిపుణులతో ఒప్పందం చేసుకుంది. జావా, డాట్ నెట్, ఏఎస్పీ, శాప్, ఒరాకిల్ డేటాబేస్.. ఇలా అన్ని టెక్నాలజీల పైనా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. అభ్యర్థుల్లో బాగా తెలివైన వారెవరు? అప్పటికప్పుడు ఇంటర్వ్యూలు నిర్వహించినా సెలక్ట్ కాగలిగే సామర్థ్యం ఎవరెవరికి ఉంది? కాస్త కష్టపడి ప్రిపేరైతే ఇంటర్వ్యూలను సులువుగా ఎదుర్కొనే సామర్థ్యం ఎందరికుంది? ఇలా అన్ని రకాలుగా విశ్లేషించి నివేదికలు రూపొందిస్తున్నాం. ఆన్లైన్, ఆఫ్లైన్ సేవలూ లభిస్తాయ్... 1. ఆన్లైన్, స్కైప్లో సేవలు పొందాలంటే.. ముందుగా అభ్యర్థులు టెస్ట్ మై ఇంటర్వ్యూ.కామ్లో రిజిస్టర్ చేసుకోవాలి. రూ.500 ఫీజుతో అసలు ఇంటర్వ్యూ కంటే కనీసం రోజుల ముందు రిజిస్టర్ చేసుకోవాలి. అసలు ఇంటర్వ్యూ నిర్వహించే బోర్డ్ మెంబర్లు లేదా ఆ స్థాయి వ్యక్తులు ఒక రోజు ముందు ఆన్లైన్లో 45 నిమిషాల పాటు మాక్ ఇంటర్వ్యూ చేస్తారు. 15 నిమిషాల ఫీడ్ బ్యాక్ కూడా ఇస్తారు. ఇప్పటివరకు ఆన్లైన్లో 3 వేల మందికి పైగా ఈ సేవలు పొందారు. 2. ఆఫ్లైన్కు వచ్చేసరికి... మమ్మల్ని సంప్రదించిన కాలేజీకి 20 మంది ఇంటర్వ్యూ సభ్యుల బృందాన్ని పంపిస్తాం. ఈ బృందం 6, 7వ సెమిస్టర్ విద్యార్థులకు ‘రియల్ టైమ్ ఇంటర్వ్యూ’లు నిర్వహిస్తాం. అభ్యర్థులపై వివరంగా నివేదికలిస్తాం. దీంతో సదరు మేనేజ్మెంట్కు విద్యార్థులపై దృష్టి పెట్టడంతో పాటు వారిని క్యాంపస్ ఇంటర్వ్యూలకు పంపే వీలుంటుంది. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ, ఒడిస్సాలోని సీవీర్, సీఎంఆర్, వర్ధమాన్ సహా పలు కాలేజీల్లో 8 వేల మందికిపైగా విద్యార్థులకు రియల్ టైమ్ ఇంటర్వ్యూలు నిర్వహించాం. ఇప్పటివరకు 5 కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. చార్జీల విషయానికొస్తే.. ఇం టర్యూలు, నివేదికలు.. ఇలా ఒక్కో విభాగానికి ఒక్కో చార్జీ ఉంటుంది. 3 . నెలల్లో మార్కెట్లోకి పోల్... మా సంస్థ నుంచి మరో 3-4 నెలల్లో ‘పోల్’ పేరిట కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి తెస్తున్నాం. ఇది సామాన్య ప్రజల కోసం. స్మార్ట్ఫోన్లో మాత్రమే పనిచేస్తుంది. ఇదేంటంటే.. మనకు నచ్చిన సినిమా, ఫుడ్ ఇలా దేనిపై అయినా పోల్ చేయవచ్చు.. డిస్కషన్ కూడా చేయవచ్చు. అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...