Top Stories
ప్రధాన వార్తలు
![Sakshi Guest Column On BRICS countries Parliament](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/18/RTSMUKBS.jpg.webp?itok=P-73UsQW)
‘బ్రిక్స్’ పార్లమెంట్ రానున్నదా?
ఈ నెల 11–12 తేదీలలో జరిగిన బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సమావేశాల్లో రష్యా అ«ధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ బ్రిక్స్ పార్లమెంట్ ఏర్పాటు ప్రస్తావన చేశారు. ఆ మాట విని ప్రపంచమంతా ఉలిక్కిపడింది. ఆ కొత్త సంస్థ యూరోపియన్ పార్లమెంటుకు, లేదా అసలు ఐక్యరాజ్య సమితికే పోటీ కాకున్నా సమాంతర సంస్థ కాగలదా అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యింది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్కు పోటీయా అన్నట్లు ఇప్పటికే బ్రిక్స్ బ్యాంక్ ఏర్పడింది. బ్రిక్స్ దేశాల మధ్య, దానితో పాటు తమ ద్రవ్య మారకాలను అంగీకరించే దేశాలతో అమెరికన్ డాలర్ బదులు తమ కరెన్సీలలోనే లావాదేవీలు జరపటం పెరిగిపోతున్నది. ఈ పరిణామాలన్నీ అమెరికా ఆధిపత్యాన గల ఏకధ్రువ ప్రపంచాన్ని బహుళ ధ్రువ ప్రపంచంగా తిరుగులేకుండా మార్చుతున్నాయి.ప్రస్తుతం ప్రపంచమంతటా చర్చ జరుగు తున్న సరికొత్త విషయం బ్రిక్స్ పార్లమెంట్ నిజంగా ఏర్పడవచ్చునా అన్నది! ‘బ్రిక్స్’ గురించి తెలిసిందే. ‘బ్రిక్స్’ పార్లమెంటరీ ఫోరం మాట విన్నదే. కానీ ‘బ్రిక్స్’ పార్లమెంట్ కొత్త మాట. పార్లమెంటరీ ఫోరం సమావేశాలు ఈ నెల 11–12 తేదీలలో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగినప్పుడు, మొదటి రోజున ప్రారంభోపన్యాసం చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, ఉరుములేని పిడుగువలె బ్రిక్స్ పార్లమెంట్ ఏర్పాటు ప్రస్తావన చేశారు. ఆ మాట విని ప్రపంచమంతా ఉలికి పడింది. ఆయన ఆలో చనలోని ఉద్దేశమేమిటి? ‘బ్రిక్స్’ దేశాలు అందుకు సమ్మతిస్తాయా? ఆ కొత్త సంస్థ లక్ష్యాలేమిటి? అది యూరోపియన్ పార్లమెంటుకు, లేదా అసలు ఐక్యరాజ్య సమితికే పోటీ కాకున్నా సమాంతర సంస్థ కాగలదా? అనే ప్రశ్నలు శరపరంపరగా తలెత్త్తటం మొదలైంది. ఇది ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకు కలవరపాటు కలిగిస్తున్నదనేది గమనించవలసిన విషయం.ఇందుకు సంబంధించి తెలుసుకోవలసిన సమాచారాలు కొన్నున్నాయి. అంతకన్నా ముఖ్యంగా అర్థం చేసుకోవలసిన అంత ర్జాతీయ విషయాలు చాలా ముఖ్యమైనవి కొన్నున్నాయి. ఇందులో మొదటగా సమాచారాలను చూద్దాం. ‘బ్రిక్స్’ అనే సంస్థ మొదట ‘బ్రిక్’ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) అనే పేరిట 2006లో ఏర్పడింది. తర్వాత 2011లో సౌత్ ఆఫ్రికా చేరికతో ‘బ్రిక్స్’ అయింది. ఈ సంవత్సరం ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరాయి. తమను కూడా చేర్చుకోవాలంటూ మరొక పాతిక దేశాల వరకు దరఖాస్తు చేసుకున్నాయి. ‘బ్రిక్స్’ సభ్యదేశాలు 2009లో పార్లమెంటరీ ఫోరంను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ ఫోరం 10వ సమావేశాలు ఈ నెలలో జరిగినపుడే పుతిన్ తన ప్రతిపాదన చేశారు. ఆ సమావేశంలో మన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు. నిజానికి బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం అన్నది సభ్య దేశాల పార్లమెంట్ స్పీకర్ల ఫోరం. అందుకు భిన్నంగా, పుతిన్ ప్రతిపాదన కొత్తగా ఒక ఉమ్మడి పార్లమెంటును ఏర్పాటు చేసుకోవటం. ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశాలు వచ్చే అక్టోబర్లో రష్యాలోని కజాన్ నగరంలో జరగ నున్నాయి. ఈ ప్రతిపాదన అపుడు అధికారికంగా చర్చకు వచ్చి,అందరూ ఆమోదించే పక్షంలో ఆచరణకు వస్తుంది. ఈలోగా ఈ విషయమై ప్రపంచమంతటా చర్చలు సాగుతాయి. మరొకవైపు సభ్య దేశాల మధ్య ముందస్తు సంప్రదింపులు జరగగలవని వేరే చెప్ప నక్కరలేదు. పోతే, బ్రిక్స్ లక్ష్యాలే బ్రిక్స్ పార్లమెంటు లక్ష్యాలు, విధులు కాగలవని భావించవచ్చు. బ్రిక్స్ 2006లో ఏర్పడింది. ఎందుకు? ఈ 18 సంవత్సరాలలో ఆ సంస్థ చేసిందేమిటి? అన్నవి మొదట ఉత్పన్న మయే ప్రశ్నలు. ఇది ప్రధానంగా ఆర్థిక, వాణిజ్యపరమైన సంబంధాల కోసం ఏర్పడినటువంటిది. పరస్పర సంబంధాలతో పాటు ఇతర దేశా లతో ఆర్థిక, వాణిజ్య సంబంధాల అభివృద్ధి కూడా ఈ పరిధిలోకి వస్తుంది. బ్రిక్స్కు రాజకీయపరమైన, సైనికమైన, వ్యూహాత్మకమైన లక్ష్యాలు ఏవీ లేవని, గత 18 సంవత్సరాలుగా అదే ప్రకారం పని చేస్తున్నదనేది గమనించవలసిన విషయం. అంతే గమనించవలసిందేమంటే తన ఆర్థిక లక్ష్యాల ప్రకారం బ్రిక్స్ చాలా సాధించింది. ఉదాహరణకు తాజా లెక్కల ప్రకారం, పాశ్చాత్య దేశాల కూటమి అయిన జీ–7 జీడీపీ ప్రపంచంలో 29 శాతం మాత్రమే కాగా, బ్రిక్స్ జీడీపీ 36.8 శాతానికి చేరింది. ఆర్థిక రంగంలో జరుగుతున్నదాని సూచనలను బట్టి చూడగా ఈ వ్యత్యాసం ఇంకా పెరుగుతూ పోగలదన్నది నిపుణుల అంచనా. అది చాల దన్నట్లు మునుముందు సౌదీ అరేబియా, ఇండోనేషియా, మెక్సికో తదితర దేశాలు చేరినపుడు పరిస్థితి ఏమిటో ఊహించవచ్చు. అమె రికా శిబిరానికి బ్రిక్స్ అంటే సరిపడకపోవటానికి ముఖ్యకారణం ఇదే. లోగడ ఆసియాలో ఏషియాన్, ఆఫ్రికాలో ఎకోవాస్, ఇఎసి, లాటిన్ అమెరికాలో సదరన్ కామన్ మార్కెట్ వంటివి ఏర్పడ్డాయి. ఏషియాన్ గొప్పగా విజయవంతం కాగా తక్కినవి అంతగా కాలేదు. పైగా వాటిలో అమెరికా జోక్యాలు బాగా సాగినందున తమకు పోటీగా మారలేదు. తమను అధిగమించటం అంతకన్నా జరగలేదు. బ్రిక్స్ రికార్డు వీటన్నిటికి భిన్నంగా మారింది. ఆ సంస్థ ఆమెరికా జోక్యానికి సమ్మతించలేదు. ఇండియాతో సహా ఎవరూ ఒత్తిళ్లకు లొంగలేదు. ఇది చాలదన్నట్లు అర్థికాభివృద్ధిలో తమను మించిపోతున్నారు. ఒత్తిళ్లను కాదని ఇదే సంవత్సరం ఈజిప్టు, యూఏఈ వంటివి చేరాయి. ఇరాన్ను చేర్చుకోరాదన్న ఒత్తిడికి బ్రిక్స్ సమ్మతించలేదు. అదే పద్ధతిలో సౌదీ, టర్కీ, ఇండోనేషియా, లిబియా, మెక్సికో వంటివి ముందుకు వస్తున్నాయి. ఇదంతా చాలదన్నట్లు, ప్రపంచంపై పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆధిపత్యాన్ని సవాలు చేసే పరిణామాలు మరికొన్ని జరుగుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్కు పోటీయా అన్నట్లు బ్రిక్స్ బ్యాంక్ ఒకటి 2014 లోనే ఏర్పడింది. అమెరికన్ డాలర్ ప్రాబల్యాన్ని అరికట్టేందుకు బ్రిక్స్ కరెన్సీ అయితే ఇంకా రూపొందలేదు గానీ, బ్రిక్స్ దేశాలకు చెల్లింపుల కోసం బ్రిక్స్ చెయిన్ పేరిట ఒక సాధనం చలామణీలోకి వచ్చింది. అట్లాగే ఈ దేశాల మధ్య, దానితో పాటు తమ ద్రవ్య మార కాలను అంగీకరించే దేశాలతో అమెరికన్ డాలర్ బదులు తమ కరెన్సీ లలోనే లావాదేవీలు జరపటం పెరిగిపోతున్నది. బ్రిక్స్ బ్రిడ్జ్ పేరిట మరొక చెల్లింపుల పద్ధతి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నింటి ప్రభావాలతో పాశ్చాత్య ప్రపంచపు ఆర్థిక ప్రాబల్యం, పారిశ్రామికాభివృద్ధి, వాణిజ్యం క్రమంగా బలహీనపడుతున్నాయి. ఉదాహరణకు ప్రస్తుత సంవత్సరంలో బ్రిక్స్ సగటు అర్థికాభివృద్ధి 3.6 శాతం మేర, జీ–7 దేశాలది కేవలం 1 శాతం మేర ఉండగలవని అంచనా. ప్రపంచంలో ఇప్పటికే రెండో అతిపెద్ద ఆర్థికశక్తిగా మారిన చైనా మరొక దశాబ్దం లోపలే అమెరికాను మించగలదన్నది అంతటా వినవస్తున్న మాట. ఈ పరిణామాలన్నీ అమెరికా ఆధిపత్యాన గల ఏకధ్రువ ప్రపంచాన్ని బహుళధ్రువ ప్రపంచంగా తిరుగులేకుండా మార్చుతున్నాయి. ఈ శతాబ్దం ఆసియా శతాబ్దం కాగలదనే జోస్యాలు ఆ విధంగా బలపడుతున్నాయి. చైనా ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో అమెరికా ఒత్తిళ్లను కాదని ఇప్పటికి 150 దేశాలు చేరటం, అందులో వారి శిబిరానికి చెందినవి కూడా ఉండటం ఈ ఆర్థిక ధోరణులకు దోహదం చేస్తున్నది.ఈ విధమైన ప్రభావాలను ముందుగానే అంచనా వేసి కావచ్చు అమెరికన్లు, యూరోపియన్లు మొదటినుంచే బ్రిక్స్ను, బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివును అడ్డుకునేందుకు, బ్రిక్స్లోని సభ్య దేశాలను ఒత్తిడి చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తూ వస్తున్నాయి. రకరకాల ఆంక్షలు ఏదో ఒక సాకుతో విధించటం (ఇండియాపై కూడా), వివిధ దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను భంగపరచజూడటం అందులో భాగమే. భారత, రష్యాల విషయంలోనూ అదే వైఖరి చూపటానికి తాజా ఉదాహరణ ఈ నెల ఎనిమిదిన ప్రధాని మోదీ, పుతిన్ను కలవటంపై ఆగ్రహించటం. అమెరికా శిబిరం ప్రజాస్వామ్యమనీ, ఆసియా దేశాల స్వేచ్ఛ అనీ, అంతర్జాతీయ నియమాలకూ, ఐక్య రాజ్యసమితి ఛార్టర్కూ కట్టుబడటమనీ నీతులు చాలానే చెప్తుంది. కానీ అందుకు విరుద్ధమైన తమ చర్యల గురించి ఎన్ని రోజుల పాటైనా చెప్పవచ్చు.వీటన్నింటికి విరుగుడుగా తక్కిన ప్రపంచ దేశాలు తీసుకుంటున్న వివిధ చర్యలలో, బ్రిక్స్ పార్లమెంట్ అనే కొత్త ప్రతిపాదన ఒక ముందడుగు కాగల అవకాశం ఉంది. ప్రపంచ దేశాల మధ్య సమా నత్వ ప్రాతిపదికగా పరస్పర సహకారానికి, ఇతోధికాభివృద్ధికి అవస రమైన చర్చలు బ్రిక్స్ పార్లమెంటులో జరగాలన్నది తన ఆలోచన అయినట్లు పుతిన్ చెప్తున్నారు. టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకులు
![Moaists Killed In Encounter At Gadchiroli](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/maoist-encounter2.jpg.webp?itok=hdnnhTKf)
గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి
గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. ఈ దాదాపు ఆరు గంటల పాటు జరిగిన ఎదురుకాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్ సరిహద్దులోని వండోలి గ్రామం సమీపంలో 12 నుంచి 15మంది మావోయిస్టులు ఉన్నారని సమాచారం అందడంతో డిప్యూటీ ఎస్పీ సారథ్యంలో పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. బుధవారం ఉదయం నుంచి పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో మధ్యాహ్నం నుంచి పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఆపరేషన్లో భాగంగా దాదాపు ఆరు గంటల పాటు జరగ్గా.. ఇప్పటివరకు 12మంది మృతదేహాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. అలాగే, మూడు ఏకే 47 తుపాకీలతో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.ఇక, కాల్పుల సందర్భంగా తిపాగడ్ దళం ఇంఛార్జి డీవీసీఎం లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ ఆత్రం మృతిచెందినట్టు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. మిగతా మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, ఈ కాల్పుల్లో ఒక జవాన్కు బుల్లెట్ గాయం కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
![Rohit Sharma Prefer Suryakumar Yadav For Team India T20I Captaincy Says Reports](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/zxa.jpg.webp?itok=OcKE1i3J)
Team India Captaincy: రోహిత్ ఓటు సూర్యకే..?
రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాక టీమిండియా కెప్టెన్ పదవి ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ పదవి రేసులో తొలుత హార్దిక్ పాండ్యా ఒక్కడి పేరే వినిపించినప్పటికీ.. నిన్న మొన్నటి నుంచి సూర్యకుమార్ యాదవ్ కూడా రేసులో ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. హార్దిక్ తరుచూ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటుంటాడన్న విషయాన్ని సాకుగా చూపుతూ బీసీసీఐలోకి కొందరు పెద్దలు సూర్య పేరును తెరపైకి తెచ్చినట్లు తెలుస్తుంది.తాజాగా ఈ అంశానికి సంబంధించి ఓ బిగ్ అప్డేట్ అందింది. సూర్యకుమార్కు బీసీసీఐలోని ఓ వర్గం అండదండలతో పాటు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే నిజమైతే 2026 టీ20 వరల్డ్కప్ వరకు భారత టీ20 జట్టు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగే అవకాశం ఉంది. మరి కొద్ది గంటల్లో ఈ అంశం అధికారిక ప్రకటన వెలువడవచ్చు.వాస్తవానికి శ్రీలంక పర్యటన కోసం భారత జట్టును ఇవాళే ప్రకటించాల్సి ఉండింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సెలెక్షన్ కమిటీ భేటి వాయిదా పడింది. లంకలో పర్యటించే భారత జట్టుతో పాటు కొత్త టీ20 కెప్టెన్ పేరును రేపు ప్రకటించే అవకాశం ఉంది. కాగా, టీ20 వరల్డ్కప్ విజయానంతరం రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, భారత్.. శ్రీలంక పర్యటన ఈ నెల 27 నుంచి మొదలుకానుంది. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్ జరుగనుంది. 27, 28, 30 తేదీల్లో మూడు మ్యాచ్లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. టీ20 సిరీస్ మొత్తం పల్లెకెలెలో.. వన్డే సిరీస్ కొలొంబోలో జరుగనుంది.
![MP Vijaya Sai Reddy Political Counter To TDP](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/vijayasaireddy2.jpg.webp?itok=Spav7tUU)
టీడీపీకి ఎంపీ విజయసాయిరెడ్డి ‘కుల’ కౌంటర్
సాక్షి, ఢిల్లీ: టీడీపీ పార్టీ ఫక్తుగా ఒకే కులం కోసం పనిచేస్తుందన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కుల వ్యాపారస్తుల నిధులతో, ఛానెల్స్లో తప్పుడు వార్తలతో గెలిచిన టీడీపీ ఇప్పుడు ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘టీడీపీ ఫక్తుగా ఒకే కులం కోసం పనిచేస్తుంది. ఇదే విషయాన్ని ఏపీలో ఐదేళ్ల చిన్నారిని అడిగినా టీడీపీ ఒకే కుల ఆధిపత్యం గురించి చెబుతారు. కుల వ్యాపారస్తుల నిధులతో, అదే కుల ఛానెల్స్లో తప్పుడు వార్తలతో గెలిచిన టీడీపీ ఇప్పుడు ప్రతిపక్షాల గొంతు నొక్కుతోంది. ఇది మీకు ఎంత చేదుగా ఉన్నా నేను సత్యం మాట్లాడుతూనే ఉంటాను’ అంటూ విమర్శించారు. Get down from your ivory tower and ask any 5-year-old child in AP who also knows that TDP is ‘Of’ One Particular Caste, It is ‘By’ the same caste and definitely ‘For’ the same caste. TDP won elections based on funding by persons from this caste Businesses and fake news peddled by… pic.twitter.com/HCl2PXgjnN— Vijayasai Reddy V (@VSReddy_MP) July 17, 2024 ఇదే సమయంలో..‘ఇండియా ప్రజాస్వామిక దేశం. ఇతర కులాలపైన ఒక కులాధిపత్యం చెల్లదు. దురదృష్టవశాత్తు కొందరు కులాధిపత్యంతో ఇతర కులాలను ఆత్మ న్యూనతకు గురి చేస్తున్నారు. కానీ, రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పిస్తోంది. ఒకరి కంటే మరొకరు తక్కువ కాదు’ అంటూ కామెంట్స్ చేశారు. India is a democratic country governed by its Constitution, which ensures that no caste is superior to another. Unfortunately, some individuals from this particular caste still perceive themselves as superior and others as inferior. In contemporary India, where the Constitution…— Vijayasai Reddy V (@VSReddy_MP) July 17, 2024
![BJP Keshav Maurya Political Counter To Akhilesh Yadav](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/UP-politics.jpg.webp?itok=U1yTogtl)
యూపీ బీజేపీలో రగడ.. అఖిలేష్ వ్యాఖ్యలకు కేశవ్ మౌర్య స్ట్రాంగ్ కౌంటర్
లక్నో: ఉత్తరప్రదేశ్లో రాజకీయంగా ఒక్కసారిగా వేడెక్కింది. అధికార బీజేపీలో కోల్డ్ వార్ కొనసాగుతున్న వేళ కాషాయ పార్టీ నేతలపై ఎస్పీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో అఖిలేష్కు డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కౌంటరిచ్చారు.కాగా, అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలపై కేశవ్ మౌర్య స్పందిస్తూ..‘కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం బలంగా ఉంది. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ గుండాయిజం తిరిగి రావడం అసాధ్యం. 2017 ఎన్నికల ఫలితాలే 2027లో కూడా రిపీట్ అవుతాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు.ఇక, అంతకుముందు యూపీ బీజేపీ రాజకీయాలపై అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ..‘యోగి ఆదిత్యానాథ్ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం అస్ధిరతతో సతమతమవుతోంది. బీజేపీ నేతలు సీఎం కుర్చీ కోసం కొట్టాడుకుంటున్నారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు చోటుచేసుకుంటున్నాయి. కాషాయ నేతల మధ్య ఆధిపత్య పోరుతో అభివృద్ధి అటకెక్కింది. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను వేధిస్తోంది. రాష్ట్ర రాజధాని లక్నోలో ఇళ్ల కూల్చివేత నిర్ణయాన్ని వాయిదా వేశారు. యూపీలో యోగి సర్కార్ బలహీనపడుతుంది అనేందుకు ఇదే ఉదాహరణ అని సెటైరికల్ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య విభేదాలు మరింతగా ముదిరినట్లు తెలుస్తున్నది. లోక్సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ పేలవ ప్రదర్శన తర్వాత వీరి మధ్య విభేదాలు మరింతగా పెరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన సమావేశం కావడం యూపీలో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. కాగా, యూపీలో పార్టీ వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ సమావేశాలు జరిగినట్లు సమాచారం.మరోవైపు.. 2024 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని 80 లోక్సభ స్థానాలకు గాను సమాజ్వాదీ పార్టీ, ఇండియా కూటమి 43 స్థానాలను గెలుచుకోగా.. బీజేపీ నేతృత్వంలోని ఏన్డీయే 36 స్థానాలను గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 64 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే.
![Rashmika Mandanna Post Goes Viral On Instagram Stories](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/rashmikaa.jpg.webp?itok=J2wrGkkQ)
'నిన్ను మిస్ అవుతున్నా'.. రష్మిక విషాదకర పోస్ట్!
గతేడాది యానిమల్తో సూపర్ కొట్టిన ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ సరసన మెప్పించింది. ప్రస్తుతం రష్మిక మోస్ట్ అవైటేడ్ చిత్రం పుష్ప-2. బన్నీ- సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప పార్ట్-1లో శ్రీవల్లిగా మెప్పించిన భామ.. సీక్వెల్తోనూ ఫ్యాన్స్ను అలరించనుంది. పుష్ప-2 ఈ ఏడాది డెసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇదిలా ఉంటే.. రష్మిక తాజాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాను ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న మ్యాక్సీ అనే కుక్క చనిపోయిందని ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. 'రెస్ట్ ఇన్ పీస్ మై లిటిల్ గుడెస్ట్ మ్యాక్సీ.. నిన్ను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది..' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. తాను ఎంతో అప్యాయంగా డాగ్ చనిపోవడంతో ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం రష్మిక చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.
![Joe Biden Says Kamala Harris Could Be President Of US](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/Biden_0.jpg.webp?itok=2pHSnfC5)
అమెరికా అధ్యక్ష బరిలో కమలా హారీస్.. హింట్ ఇచ్చిన బైడెన్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్ తప్పుకోవాలనే డిమాండ్ వస్తున్న వేళ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. యూఎస్ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్.. అధ్యక్ష పదవికి అర్హురాలు అంటూ బైడెన్ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. దీంతో, అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకుంటున్నారనే చర్చ మొదలైంది.కాగా, తాజాగా అధ్యక్షుడు జో బైడెన్ నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్స్(NAACP) అన్వాల్ కన్వేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. కమలా హారీస్ కేవలం గొప్ప ఉపాధ్యక్షురాలు మాత్రమే కాదు. ఆమె అమెరికా ప్రెసిడెంట్ కూడా కావచ్చు అని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు విన్న డెమోక్రాట్స్ ఆనందం వ్యక్తం చపట్లు కొట్టారు. ఇక, బైడెన్ వ్యాఖ్యలపై రాజకీయంగా చర్చ మొదలైంది. మరోవైపు.. అంతకుముందు కూడా కమలా హారీసే డెమోక్రటిక్ పార్టీకి భవిష్యత్ అని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఇక, కొన్ని సందర్భాల్లో మాత్రం బైడెన్.. తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకునే ఛాన్స్ లేదని చెప్పిన విషయం తెలిసిందే. పోటీలో తానే ఉంటానని చెప్పుకొచ్చారు. ట్రంప్ను ఓడిస్తానని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ట్రంప్తో భేటీ సందర్భంగా బైడెన్ తేలిపోయాలి. దీంతో, బైడెన్ అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డెమోక్రటిక్ పార్టీలోనే కొందురు నేతలు కామెంట్స్ చేశారు. బైడెన్ స్థానంలో కమలా హారీస్కు అవకాశం ఇవ్వాలని మరికొందరు వ్యాఖ్యలు చేశారు. ఇక, పలు సర్వేల్లో ట్రంప్కు పోటీగా కమలా హారీస్ బెటర్ అనే ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. సీఎన్ఎన్ సర్వేల్లో కమలా హారీస్కు 45 శాతం ఓట్లు రాగా ట్రంప్కు మాత్రం 47 శాతం ఓటింగ్ వచ్చింది.
![HYLENR world first cold fusion technology to generate clean energy](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/HYLENR.jpg.webp?itok=VUZ_QqD8)
ప్రపంచంలోనే తొలిసారి.. కొత్త టెక్నాలజీతో కరెంటు ఉత్పత్తి
కోతల్లేని కరెంటు అది కూడా కారు చౌకగా దొరికితే ఎలా ఉంటుంది? అద్భుతం అంటున్నారా? నిజమే కానీ.. ఇప్పటివరకూ ఇలా కాలుష్యం లేకుండా, అతి చౌకగా కరెంటు ఉత్పత్తి చేసే టెక్నాలజీ ఏదీ లేదు మరి! ఇకపై కాదంటోంది హైలెనర్!ప్రపంచంలోనే తొలిసారి తాము కోల్డ్ ఫ్యూజన్ టెక్నాలజీ సాయంతో అందించే వేడి కంటే ఎక్కువ వేడిని పొందగలిగామని.. దీనివల్ల భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిద్ధార్థ దొరై రాజన్! ఏమిటీ టెక్నాలజీ? చౌక కరెంటు ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా? చదివేయండి మరి..మనందరికీ వెలుగునిచ్చే సూర్యుడు కోట్ల సంవత్సరాలుగా భగభగ మండుతూనే ఉన్నాడు. విపరీతమైన వేడి, పీడనాల మధ్య హీలియం అణువులు ఒకదాంట్లో ఒకటి లయమై పోతూండటం వల్ల ఈ వెలుగులు సాధ్యమవుతున్నాయి. ఈ ప్రక్రియను కేంద్రక సంలీన ప్రక్రియ లేదా న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారన్నది కూడా మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాం. ఇదే ప్రక్రియను భూమ్మీద నకలు చేసి చౌక, కాలుష్య రహిత విద్యుత్తు ఉత్పత్తికి బోలెడన్ని ప్రయోగాలూ జరుగుతున్నాయి.అయితే.. ఇవి ఎంతవరకూ విజయవంతమవుతాయన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలోనే హైలెనర్ ప్రతిపాదిస్తున్న ‘లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్’ టెక్నాలజీ ఆసక్తికరంగా మారింది. న్యూక్లియర్ ఫ్యూజన్ పనిచేసేందుకు విపరీతమైన వేడి, పీడనాలు అవసరమని చెప్పుకున్నాం కదా.. పేరులో ఉన్నట్లే లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్స్లో వీటి అవసరం ఉండదు. ఎంచక్కా గది ఉష్ణోగ్రతలోనే అణుస్థాయిలో రియాక్షన్స్ జరిగేలా చూడవచ్చు. ఫలితంగా మనం అందించే వేడి కంటే ఎక్కువ వేడి అందుబాటులోకి వస్తుంది.హైలెనర్ బుధవారం హైదరాబాద్లోని టీ-హబ్లో ఈ టెక్నాలజీని ప్రదర్శించిన సందర్భంగా.. వంద వాట్ల విద్యుత్తును ఉపయోగించగా... 150 వాట్లకు సమానమైన శక్తి లభించింది. ఈ ప్రక్రియలో మిల్లీగ్రాముల హైడ్రోజన్ ఉపయోగించడం వల్ల అదనపు వేడి పుట్టిందని అంటున్నారు సిద్ధార్థ దొరై రాజన్! టి-హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాస రావు ఈ లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్ పరికరాన్ని ఆవిష్కరించారు.1989 నాటి ఆలోచన..హైలెనర్ చెబుతున్న టెక్నాలజీ నిజానికి కొత్తదేమీ కాదు. 1989లో మార్టిన్ ఫైష్మాన్, స్టాన్లీ పాన్స్ అనే ఇద్దరు ఎలక్ట్రో కెమిస్ట్లు తొలిసారి ఈ రకమైన టెక్నాలజీ సాధ్యతను గుర్తించారు. భారజలంతో పల్లాడియం ఎలక్ట్రోడ్ను వాడుతూ ఎలక్ట్రోలసిస్ జరుపుతున్నప్పుడు కొంత వేడి అదనంగా వస్తున్నట్లు వీరు తెలుసుకున్నారు. అణుస్థాయిలో జరిగే ప్రక్రియలతో మాత్రమే ఇలా అదనపు వేడి పుట్టే అవకాశముందని వీరు సూత్రీకరించారు. దీన్ని నిరూపించేందుకు ఇప్పటివరకూ చాలా విఫల ప్రయత్నాలు జరిగాయి. తాము విజయం సాధించామని హైలెనర్ అంటోంది. దేశ రక్షణకు అత్యంత కీలకమైన క్షిపణులను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించిన పద్మ శ్రీ ప్రహ్లాద రామారావు ఈ కంపెనీ చీఫ్ ఇన్నొవేటింగ్ ఆఫీసర్గా ఉండటం, ఈ టెక్నాలజీకి భారత పేటెంట్ ఇప్పటికే దక్కడం హైలెనర్పై ఆశలు పెంచుతున్నాయి.ఎలాంటి లాభాలు సాధ్యం?విద్యుత్తు, వేడి అవసరమైన ఎన్నో రంగాల్లో ఈ టెక్నాలజీ ద్వారా లాభం కలగనుంది. అంతరిక్షంలో తక్కువ విద్యుత్తును వాడుకుంటూ ఎక్కువ వేడిని పుట్టించవచ్చు. చల్లటి ప్రాంతాల్లో గదిని వెచ్చగా ఉంచేందుకు వాడుకోవచ్చు. ఇందుకోసం ఇప్పుడు కాలుష్య కారక డీజిల్ ఇంధనాలను వాడుతున్న విషయం తెలిసిందే. ఇండక్షన్ స్టౌలను మరింత సమర్థంగా పనిచేయించవచ్చ. తద్వారా విద్యుత్తు ఆదా చేయవచ్చు. విద్యుత్తు ఉత్పత్తికీ వాడుకోవచ్చు. హైలెనర్ టెక్నాలజీకి మరిన్ని మెరుగులు దిద్దడం ద్వారా అదనపు వేడి స్థాయిని రెండున్నర రెట్లకు పెంచవచ్చునని తద్వారా విద్యుదుత్పత్తి మరింత సమర్థంగా మారతుందని సిద్ధార్థ దొరైరాజన్ తెలిపారు. ఈ పరికరాలు ఎలాంటి రేడియోధార్మిక పదార్థాలను వాడదని స్పష్టం చేశారు!!
![AP Minister Satya Kumar Yadav On CBN Wealth creation](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/AP_Wealth_Creation.jpg.webp?itok=H8P_46Uy)
‘సంపద సృష్టించడానికి అల్లావుద్దీన్ అద్భుతదీపమేం లేదు’
న్యూఢిల్లీ, సాక్షి: నారా చంద్రబాబు నాయుడు గతంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పాలన చేశారు. ఆయన హయాంలో ఏ ఒక్కసారి కూడా రెవెన్యూ మిగులు లేదు. ప్రతి ఏడాదీ రెవెన్యూ లోటుతోనే పాలన సాగడం విశేషం. అలాంటిది మరోసారి సంపద సృష్టించి పేదలకు పంచుతానని చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అయితే ఆయన మంత్రివర్గంలోని ఒకరు చంద్రబాబు సంపద సృష్టిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారిప్పుడు. సంపద సృష్టించడానికి మా వద్ద అల్లావుద్దీన్ అద్భుతదీపం లేదు.. ఏపీ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పిన మాట ఇది. ఢిల్లీకి వెళ్లిన ఆయన ఏపీ రాజకీయ పరిస్థితులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంపద సృష్టి అనేది దీర్ఘకాలిక ప్రణాళిక అని, అందుకు సమయం పడుతుందని చెప్పారు. పైగా ఖజానా ఖాళీగా ఉందని, జీతాలు, భత్యాల కోసం అప్పులు తప్పట్లేదంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు తోడు.. కేవలం సంపద సృష్టి కోసమే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, మౌలిక వసతులు నిర్మిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించడం కొసమెరుపు. చంద్రబాబు ఎన్నికల హామీలపై ప్రచార సమయంలోనే.. వైఎస్ జగన్ జనాలను అప్రమత్తం చేసే యత్నం చేశారు. అవి మోసపూరిత ప్రకటనలన్నారు. సంపద సృష్టి అనేది చంద్రబాబు మోసాల్లో ఓ భాగమని చెప్పారు. అలాగే కూటమి హామీలు అమలు చేయాలంటే ఏడాదికి రూ.1,50,718 కోట్లు కావాలని లెక్కలతో సహా వివరించారు. అయితే.. అధికారంలోకి వచ్చాక ‘వీటన్నింటికీ డబ్బులెక్కడినుంచి తెస్తారు’? అని ప్రశ్నిస్తే మాత్రం అరిగిపోయిన రికార్డులాగా.. సంపద సృష్టిస్తామంటున్నారు చంద్రబాబు. ఆర్థిక క్రమశిక్షణ లేని సీఎంగా పేరున్న చంద్రబాబు గత మూడు టర్మ్లు ఎంత సంపద సృష్టించారు? ఎంతమందికి పంచిపెట్టారు..? అనే విశ్లేషణలు తరచూ జరుగుతుంటాయి. ఇక ఇప్పుడు స్వయానా ఆయన కేబినెట్లోని మంత్రి తాజా ప్రకటనతో.. ఆ సంపద సృష్టి కూడా మోసం అనేది తేటతెల్లమయ్యింది.
![If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/20/Untitled-2_9.jpg.webp?itok=Yu3M0cnh)
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?
NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి
నెల్లూరులో ఘోరం.. ముచ్చుమర్రి తరహా ఘటన
ప్రైవేటు ‘కోటా’ వివాదం.. కర్ణాటక ప్రభుత్వం వెనకడుగు
‘మర మేస్త్రీ’.. రెండు రోజుల్లోనే ఇల్లు కట్టేస్తుంది!!
ప్రాణదాతా.. నీకు సలాం! వీడియో వైరల్
గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి
Team India Captaincy: రోహిత్ ఓటు సూర్యకే..?
రామగుండం ఓపెన్కాస్ట్లో ప్రమాదం, ఇద్దరు మృతి
అంబానీ ఇంటిని తలదన్నే ఇల్లు!! బెంగళూరులో..
గ్యాంగ్స్ట్ర్ అతిక్ అహ్మద్ ఆస్తి యూపీ ప్రభుత్వానికి బదిలీ
‘వాట్సాప్ గ్రూప్లో సూటిపోటి మాటలు.. భరించలేకపోతున్నా!’
టీడీపీకి ఎంపీ విజయసాయిరెడ్డి ‘కుల’ కౌంటర్
పరిపాలన మరీ ఇంత అధ్వానమా?
‘అర్థం కాకపోతే మళ్ళీ వినండి’.. లోకేష్పై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్
ఆస్పత్రిలో ఆర్. నారాయణ మూర్తి.. ఏమైంది?
‘బురిడీ’బాబులు.. అంతా మాయ
‘సంపద సృష్టించడానికి అల్లావుద్దీన్ అద్భుతదీపమేం లేదు’
సర్దార్ 2 సెట్స్లో ప్రమాదం.. ఒకరి మృతి
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో అక్రమ కేసు
అజిత్ పవార్కు ఎదురు దెబ్బ.. శరద్ పవార్కు టచ్లోకి 15 మంది ఎమ్మెల్యేలు!
భారత్ నుంచి వెళ్లిపోయిన 'హార్దిక్ పాండ్యా' సతీమణి.. వీడియో వైరల్
నెల్లూరులో ఘోరం.. ముచ్చుమర్రి తరహా ఘటన
ప్రైవేటు ‘కోటా’ వివాదం.. కర్ణాటక ప్రభుత్వం వెనకడుగు
‘మర మేస్త్రీ’.. రెండు రోజుల్లోనే ఇల్లు కట్టేస్తుంది!!
ప్రాణదాతా.. నీకు సలాం! వీడియో వైరల్
గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి
Team India Captaincy: రోహిత్ ఓటు సూర్యకే..?
రామగుండం ఓపెన్కాస్ట్లో ప్రమాదం, ఇద్దరు మృతి
అంబానీ ఇంటిని తలదన్నే ఇల్లు!! బెంగళూరులో..
గ్యాంగ్స్ట్ర్ అతిక్ అహ్మద్ ఆస్తి యూపీ ప్రభుత్వానికి బదిలీ
‘వాట్సాప్ గ్రూప్లో సూటిపోటి మాటలు.. భరించలేకపోతున్నా!’
టీడీపీకి ఎంపీ విజయసాయిరెడ్డి ‘కుల’ కౌంటర్
పరిపాలన మరీ ఇంత అధ్వానమా?
‘అర్థం కాకపోతే మళ్ళీ వినండి’.. లోకేష్పై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్
ఆస్పత్రిలో ఆర్. నారాయణ మూర్తి.. ఏమైంది?
‘బురిడీ’బాబులు.. అంతా మాయ
‘సంపద సృష్టించడానికి అల్లావుద్దీన్ అద్భుతదీపమేం లేదు’
సర్దార్ 2 సెట్స్లో ప్రమాదం.. ఒకరి మృతి
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో అక్రమ కేసు
అజిత్ పవార్కు ఎదురు దెబ్బ.. శరద్ పవార్కు టచ్లోకి 15 మంది ఎమ్మెల్యేలు!
భారత్ నుంచి వెళ్లిపోయిన 'హార్దిక్ పాండ్యా' సతీమణి.. వీడియో వైరల్
సినిమా
![Kamal Haasan's Indian 2 Movie Runtime Trimmed In Minutes](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/Kamal-Haasan.jpg.webp?itok=p_KxHMDF)
ఇండియన్-2 పై నెగెటివ్ టాక్.. మేకర్స్ కీలక నిర్ణయం!
కమల్ హాసన్- శంకర్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ఇండియన్-2. దాదాపు 18 ఏళ్ల తర్వాత భారతీయుడు మూవీకి సీక్వెల్గా అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. జూలై 12న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. అయితే ఇండియన్-2 నిడివి ఎక్కువగా ఉండడం.. శంకర్ మార్క్ కనిపించలేదంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ వచ్చాయి.అయితే నిడివి ఎక్కువగా ఉండడం.. మూవీకి నెగెటివ్ టాక్ రావడంతో మేకర్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. 3.04 నిమిషాల రన్టైమ్తో థియేటర్లలోకి వచ్చిన ఇండియన్-2 నిడివి తగ్గించినట్లు లైకా ప్రొడక్షన్స్ తాజాగా ట్వీట్ చేసింది. దాదాపు 12 నిమిషాల సన్నివేశాలను తొలగించినట్లు వెల్లడించింది. మీకు దగ్గర్లోని థియేటర్కు రన్ టైన్ తగ్గించిన ఇండియన్-2 సినిమాను చూసి ఎంజాయ్ చేయండి అంటూ పోస్ట్ చేశారు. పడిపోయిన వసూళ్లుఇండియన్-2కు మొదటి రోజే నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. ఈ సినిమాకు ఐదు రోజుల్లో ఇండియావ్యాప్తంగా కేవలం రూ.65 కోట్లకు పైగా వసూళ్లు మాత్రమే రాబట్టింది. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో కమల్ అవినీతిపై పోరాడే సేనాపతి పాత్రలో కనిపించారు. ఇందులో సముద్రఖని, బాబీ సింహా, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషించారు. Witness the enhanced version of #Indian2 🇮🇳✂️ Now presenting a streamlined edition trimmed by 12 min. Catch it in cinemas near you for a crisper experience! 💥@IndianTheMovie 🇮🇳 Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh #Siddharth @actorsimha @anirudhofficial @dop_ravivarman… pic.twitter.com/0reMKOvMIe— Lyca Productions (@LycaProductions) July 17, 2024
![Prosenjit Chatterjee Recalls He Slapped Sharmila Tagore](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/Prosenjit-Chatterjee.jpg.webp?itok=lWPxhnm3)
కోపంతో ఆ హీరోయిన్ చెంప చెళ్లుమనిపించా..: హీరో
అలనాటి హీరోయిన్ షర్మిల ఠాగూర్పై గతంలో చేయి చేసుకున్నానని చెప్తున్నాడు బెంగాలీ హీరో ప్రోసెంజిత్ చటర్జీ. చిన్న వయసులో ఆమె చెంప చెళ్లుమనిపించానని తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు. 'అప్పుడు నాకు నాలుగైదు ఏళ్లు ఉంటాయనుకుంటాను. నాన్న(విశ్వజిత్ చటర్జీ)తో పాటు షూటింగ్కు వెళ్లాను. అప్పుడు హీరోయిన్ షర్మిల ఠాగూర్ ఓ ఎమోషనల్ సీన్లో నాన్నను కొట్టింది.ఆ కోపం నా మీద..లంచ్ బ్రేక్లో అంతా ఒకేచోట కూర్చున్నాం. ఆమె నన్ను తన దగ్గరికి తీసుకున్న వెంటనే చెంప మీద కొట్టాను. ఇప్పటికీ మేము కలిసిన ప్రతిసారి ఆ సంఘటనను గుర్తు చేస్తూ ఉంటుంది. మీ నాన్నను కొట్టానన్న కోపంతో నన్ను కొట్టావు కదా.. అంటుంది' అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు. కాగా విశ్వజిత్ చటర్జీ, షర్మిల ఠాగూర్.. ప్రభాతెర్ రంగ్, యె రాత్ ఫిర్ నా ఆయేగి అనే రెండు సినిమాల్లో జంటగా నటించారు. గోల్డెన్ కపుల్..ఇక ప్రోసెంజిత్ విషయానికి వస్తే.. హీరోయిన్ రితుపర్ణ సేన్గుప్తతో కలిసి దాదాపు 50 సినిమాలు చేశాడు. వీరిని అభిమానులు గోల్డెన్ కపుల్ అని పిలుచుకుంటారు. ఇటీవలే వీరు అజోగ్యో మూవీలో జంటగా నటించారు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలున్నాయి.చదవండి: శాండల్వుడ్ హీరో దర్శన్.. క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు!
![Amitabh Bachchan Comments On Prabhas Kalki Collects Rs 1000 Cr](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/3_7_0.jpg.webp?itok=Y1USFjYG)
ప్రభాస్కు అది రోటీన్.. కానీ నాకు మాత్రం.. అమితాబ్ ఆసక్తికర కామెంట్స్!
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత గతనెల థియేటర్లలోకి వచ్చింది. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం మొదటి రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వనీదత్ భారీ బడ్జెట్తో నిర్మించారు. ఈ చిత్రంంలో బాలీవుడ్ బిగ్బీ అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.తాజాగా ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్ కావడంపై అమితాబ్ బచ్చన్ స్పందించారు. కల్కి మూవీకి ప్రపంచవ్యాప్తంగా వస్తోన్న విశేష ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. ఈ విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అయితే వెయ్యి కోట్ల రావడమనేది ప్రభాస్ కెరీర్లో రోటీన్ విషయమేనని అన్నారు. నా విషయానికొస్తే ఇంత పెద్ద సినిమాలో నటించినందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. కల్కి చిత్రాన్ని ఇప్పటికే నాలుగు సార్లు చూశానని.. ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నానని అమితాబ్ బచ్చన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా.. కల్కి మూవీకి పార్ట్-2 కూడా ఉంటుందని నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రంలో భైరవగా సందడి చేసిన ప్రభాస్.. సీక్వెల్లో కర్ణుడిగా కనిపించనున్నారు. దీంతో పార్ట్-2పై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. కాగా.. కల్కి 2898 ఏడీలో మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో మెరిసిన సంగతి తెలిసిందే.
![R Narayana Murthy Joins Hospital Due To Illness](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/r-narayana-murthy.jpg.webp?itok=VO0lGkyX)
ఆస్పత్రిలో ఆర్. నారాయణ మూర్తి.. ఏమైంది?
ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత ఆర్ నారాయణమూర్తి స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆయనకు ఏమైందో? అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. అయితే.. ఆయనది స్వల్ప అస్వస్థతేనని వైద్యులు ప్రకటించారు. ప్రసాద్ ల్యాబ్లో ఉండగానే నీరసంగా ఉండడంతో ఆయన నేరుగా నిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో ఆయనకు వైద్య పరీక్షలు జరిగాయి. అయితే నారాయణమూర్తి స్వల్పంగానే అస్వస్థతకు లోనయ్యారని, చికిత్సతో క్రమంగా కోలుకుంటున్నారని, ఆయనకు నిర్వహించినవి కూడా సాధారణ టెస్టులేనని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. రెండు నెలల క్రితం నారాయణమూర్తి బైపాస్ చేయించుకున్నారు. (చదవండి: గాయం వల్ల షూటింగ్స్కు దూరం.. క్షమించండంటూ జాతిరత్నాలు హీరో పోస్ట్)ఒకప్పుడు వరుస విప్లవ సినిమాలను తెరకెక్కిస్తూ..‘పీపుల్ స్టార్’గా ఎదిగారు నారాయణ మూర్తి. అప్పట్లో ఆయన నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచాయి. కేవలం సినిమాల్లో నటించడమే కాదు..కథ- కథనం, దర్శకత్వం, సంగీతం, గానం.. ఇలా 24 శాఖల్లో పని చేస్తూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. (చదవండి: సర్దార్ 2 సెట్స్లో ప్రమాదం.. ఒకరి మృతి)అయితే గత కొంతకాలంగా నారాయణ మూర్తి తెరకెక్కించిన చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. చాలా గ్యాప్ తర్వాత ఆయన హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘యూనివర్సీటీ’ గతేడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ చిత్రం కూడా విజయం సాధించలేదు. ప్రస్తుతం ఆయన ‘ఉక్కు సత్యాగ్రహం’ అనే సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా పనుల్లో బిజీగా ఉండడంతో ఆరోగ్యం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు నిమ్స్లో డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఆర్. నారాయణ మూర్తి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిన ఆయన అభిమానులు ఆవేదన చెందుతున్నారు. త్వరగా కోలుకొని మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు.
క్రీడలు
![Eng Vs WI: James Anderson Returns To England Squad As Bowling Mentor](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/andeson2.jpg.webp?itok=nxFE-UUC)
ఇటీవలే రిటైర్మెంట్: తిరిగి ఇంగ్లండ్ జట్టుతో చేరిన ఆండర్సన్
ఇంగ్లండ్ మాజీ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ కొత్త అవతారం ఎత్తనున్నాడు. మళ్లీ ఇంగ్లిష్ జట్టుతో మమేకం కానున్నాడు. ఈ దిగ్గజ పేసర్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.సొంతగడ్డపై వెస్టిండీస్తో తొలి టెస్టు అనంతరం(శుక్రవారం) ఆండర్సర్ ఆటగాడిగా తన కెరీర్ ముగిస్తున్నట్లు ప్రకటించాడు. లార్డ్స్ వేదికగా సంప్రదాయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అతడు.. అదే మైదానంలో ఆఖరి మ్యాచ్ ఆడేశాడు.కొత్త పాత్రలో ఆండర్సన్ఇరవై ఒక్క సుదీర్ఘ టెస్టు కెరీర్లో ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ ఏకంగా 704 వికెట్లు పడగొట్టాడు. తద్వారా టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన మురళీధరన్ (800 వికెట్లు), షేన్ వార్న్ (708 వికెట్లు) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు ఆండర్సన్.ఇక అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరొందిన జేమ్స్ ఆండర్సన్ సేవలను వినియోగించుకోవాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు భావించింది. ఈ క్రమంలో అతడు ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ మెంటార్గా వ్యవహరించనున్నాడు.అప్పటి వరకేనా?వెస్టిండీస్తో మిగిలిన రెండు టెస్టులు ముగిసే వరకు అతడు ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు తెలుస్తోంది. కాగా నాటింగ్హాం వేదికగా జూలై 18- 22 వరకు రెండో టెస్టు, జూలై 26- 30 వరకు ఇరు జట్ల మధ్య మూడో టెస్టు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక తొలి టెస్టులో విండీస్ను ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో ఓడించిన ఇంగ్లండ్ 1-0తో సిరీస్లో ఆధిక్యంలో ఉంది. కాగా రెండో టెస్టు కోసం ఇంగ్లండ్ ఇప్పటికే తమ తుదిజట్టును ప్రకటించింది. ఆండర్సర్ స్థానంలో మార్క్వుడ్ జట్టులోకి వచ్చాడు.వెస్టిండీస్లో రెండో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టుజాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్.
![MLC 2024: Travis Head, Andries Gous, Jasdeep Singh Shines.. Washington Freedom Crush MI New York By 94 Runs](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/CAS.jpg.webp?itok=SnZwag3e)
హెడ్ మెరుపులు.. 88 పరుగులకే కుప్పకూలిన ముంబై ఇండియన్స్
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్లో వాషింగ్టన్ ఫ్రీడం జట్టు వరుసగా మూడో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ న్యూయార్క్తో ఇవాళ జరిగిన మ్యాచ్లో 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఫ్రీడం టీమ్ ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయిన తొలి జట్టుగా (ఈ సీజన్లో) నిలిచింది.హెడ్, గౌస్, రచిన్ మెరుపులు..ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్.. ట్రవిస్ హెడ్ (33 బంతుల్లో 54; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆండ్రియస్ గౌస్ (48 బంతుల్లో 59; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), రచిన్ రవీంద్ర (14 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడటంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. వాషింగ్టన్ ఇన్నింగ్స్లో స్టీవ్ స్మిత్ (8), మ్యాక్స్వెల్ (15) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్, కీరన్ పోలార్డ్ తలో 2 వికెట్లు.. రొమారియో షెపర్డ్ ఓ వికెట్ పడగొట్టారు.88 పరుగులకే కుప్పకూలిన ముంబై ఇండియన్స్183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. వాషింగ్టన్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 13.3 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. జస్దీప్ సింగ్ 3.. మార్కో జన్సెన్, లోకీ ఫెర్గూసన్, మ్యాక్స్వెల్ తలో 2.. రచిన్ రవీంద్ర ఓ వికెట్ పడగొట్టారు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్లో రొమారియో షెపర్డ్ (25), ట్రెంట్ బౌల్ట్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
![Gambhir Discussed Squad For Sri Lanka Series With Selectors](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/aa.jpg.webp?itok=7UZTCFSY)
హార్దిక్ టీ20లకు మాత్రమే.. రాహుల్, అయ్యర్ రీఎంట్రీ ఖరారు..!
బీసీసీఐ కార్యదర్శి జై షా, టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ నిన్న (జులై 16) సెలెక్షన్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా శ్రీలంక పర్యటన కోసం ఎంపిక చేయబోయే భారత జట్టుపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. లంకతో వన్డే సిరీస్కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడని సమాచారం. తొలుత ఈ సిరీస్లో రోహిత్ ఆడడని ప్రచారం జరిగింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 దృష్ట్యా రోహిత్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు లంకతో వన్డేలకు కోహ్లి, బుమ్రా అందుబాటులో ఉండడం లేదన్న విషయం కన్ఫర్మ్ అయ్యింది. వీరిద్దరికి బీసీసీఐ విశ్రాంతి కల్పించినట్లు సమాచారం. నిన్నటి సమావేశంలో ముఖ్య అంశాలు..రోహిత్ అందుబాటులోకి వస్తే అతనే టీమిండియా కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ఈ సిరీస్తో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వన్డేల్లో రీఎంట్రీ ఇవ్వడం ఖరారైంది. హార్దిక్ పాండ్యా కేవలం టీ20లకు మాత్రమే అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది. భారత టీ20 కెప్టెన్సీ రేసులో పాండ్యాతో పాటు సూర్యకుమార్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.కాగా, శ్రీలంక పర్యటనలో భారత్ తొలుత టీ20 సిరీస్ ఆడనుంది. ఈ నెల 27, 28, 30 తేదీల్లో మూడు మ్యాచ్లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్లో వన్డే సిరీస్ జరుగనుంది. ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. టీ20 సిరీస్ మొత్తం పల్లెకెలెలో.. వన్డే సిరీస్ కొలొంబోలో జరుగనుంది. ఈ రెండు సిరీస్ల కోసం భారత జట్టును ఇవాళో, రేపో ప్రకటించే అవకాశం ఉంది.
![Rohit Could Cut Short Vacation To Play ODIs vs Sri Lanka, But Kohli: Report](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/roko.jpg.webp?itok=GuRpU4UY)
Ind vs SL: నిర్ణయం మార్చుకున్న రోహిత్!.. మరి కోహ్లి?
చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి ముందు టీమిండియా కేవలం రెండు వన్డే సిరీస్లు ఆడనుంది. ఈ ఐసీసీ ఈవెంట్ సన్నాహకాల్లో భాగంగా తొలుత శ్రీలంక.. తర్వాత ఇంగ్లండ్తో ద్వైపాక్షిక సిరీస్లలో పాల్గొననుంది.ఈ నేపథ్యంలో టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్కు ఈ రెండు సిరీస్లు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో ఈ వన్డే టోర్నీలో ఆడాలనుకునే సీనియర్లు తప్పకుండా లంక, ఇంగ్లండ్లతో సిరీస్లో పాల్గొనాలని అతడు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.అందుబాటులో ఉండాలిఈ విషయం గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో చర్చించిన గంభీర్.. కెప్టెన్ రోహిత్ శర్మ, కీలక బ్యాటర్ విరాట్ కోహ్లి, ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కచ్చితంగా ఈ రెండు సిరీస్లకు అందుబాటులో ఉండాలని కోరినట్లు తెలుస్తోంది.అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ ఇందుకు సానుకూలంగా స్పందించినట్లు క్రిక్బజ్ పేర్కొంది. కోహ్లి, బుమ్రా మాత్రం శ్రీలంకతో వన్డే సిరీస్ దూరంగానే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ ముగిసిన అనంతరం రోహిత్, కోహ్లి అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు.లండన్లో కోహ్లి.. అమెరికాలో రోహిత్స్వదేశానికి తిరిగి వచ్చిన విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం కోహ్లి లండన్కు వెళ్లగా.. రోహిత్ శర్మ అమెరికాకు పయనమయ్యాడు. మరోవైపు.. బుమ్రా కూడా సెలవు తీసుకున్నాడు.ఈ నేపథ్యంలో విశ్రాంతి పేరిట ఈ ముగ్గురు శ్రీలంక సిరీస్కు అందుబాటులో ఉండటం లేదనే వార్తలు వచ్చాయి. అయితే, గంభీర్ మాత్రం లంకతో వన్డే సిరీస్ ఆడాల్సిందేనని పట్టుబట్టడంతో రోహిత్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తాజాగా కథనాలు వస్తున్నాయి.లేదంటే కెప్టెన్ అతడే!ఫలితంగా శ్రీలంకతో వన్డే సిరీస్కు రోహిత్కు కెప్టెన్గా కొనసాగనున్నాడు. ఒకవేళ అతడు గనుక సమయానికి అందుబాటులోకి రాకపోతే కేఎల్ రాహుల్ భారత జట్టును ముందుకు నడిపించే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే.. వరల్డ్కప్ తర్వాత టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లగా శుబ్మన్ గిల్ సారథిగా వ్యవహరించాడు. అతడి కెప్టెన్సీలో యువ భారత జట్టు 4-1తో టీ20 సిరీస్ గెలిచింది. తదుపరి టీమిండియా జూలై 27 నుంచి శ్రీలంకలో పర్యటించనుంది.చదవండి: NZ vs Pak: షెడ్యూల్ విడుదల.. ఐపీఎల్-2025కి కివీస్ స్టార్స్ దూరం?
బిజినెస్
![Reddit user from Bengalore shared a scary situation of Uber driver in a viral post](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/uber01.jpg.webp?itok=izzRQ0Rk)
ఏసీ ఆన్ చేయమంటే క్యాబ్ డ్రైవర్ ఏం చేశాడో తెలుసా..?
ఉబర్ క్యాబ్ బుక్ చేసి ఎక్కాక ఏసీ ఆన్ చేయమన్న పాపానికి ఓ వినియోగదారుడికి డ్రైవర్ నుంచి వింత అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించిన వివరాలను రెడ్డిట్లో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్గా మారింది. ఇంతకీ తాను ఏం పోస్ట్ చేశాడు.. అసలేం జరిగిందో తెలుసుకుందాం.రెడ్డిట్లోని ‘నెర్డి-ఒజెడ్-బెంగళూరు’ అనే ఐడీలో వినియోగదారుడు తెలిపిన వివరాల ప్రకారం..‘ఉబర్ క్యాబ్ బుక్ చేశాను. కారులో ఎక్కిన కాసేపటికి ఏసీ ఆన్ చేయమని డ్రైవర్ను అభ్యర్థించాను. అతడు కన్నడలో ‘ఎందుకు ఏసీ, మీరు రైడ్ను రద్దు చేసుకోండి’ అన్నాడు. మరింత మర్యాదగా..దయచేసి పక్కన ఆపండి. నాకు మీ కారులో రావడం ఇష్టం లేదు అన్నాను. దాంతో డ్రైవర్ కోపంగా వెంటనే ఏసీ ఆన్ చేశాడు. కానీ పిచ్చివాడిలా కారు నడపడం ప్రారంభించాడు. సడన్ బ్రేక్లు వేయడం, సడన్ యాక్సిలరేషన్తో ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. నాకు ‘వెర్టిగో’ సమస్య ఉంది. ఇలాంటి సడన్ జర్క్లకు మైకం కమ్ముతుందని చెప్పాను. కానీ నా మాటలు పట్టించుకోకుండా డ్రైవర్ అలాగే వ్యవహరించాడు. దాంతో వెంటనే ఉబర్ సేఫ్టీకి కాల్ చేశాను. కాల్ సెంటర్ వ్యక్తి నన్ను సురక్షితమైన ప్రదేశంలో దిగమని సలహా ఇచ్చాడు. కానీ డ్రైవర్ ఎక్కడా ఆపలేదు. తనపై నేను ఫిర్యాదు చేశానని డ్రైవర్కు అర్థమైంది. అతను నా పేరు, చిరునామా వివరాలను కాగితంపై రాసి, పికప్ లొకేషన్ తనకు తెలుసని తర్వాత తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించాడు’ అని తెలిపారు.ఈ పోస్ట్ వైరల్గా మారడంతో ఇంటర్నెట్ వినియోగదారులు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘నేను కూడా ఇలాంటి ఒక డ్రైవర్ చేతిలో మోసపోయాను. ప్రజలను వేధించడానికి వారికి సాకు కావాలి’ అని ఒకరు రిప్లై ఇచ్చారు. ‘డ్రైవర్ మిమ్మల్ని బెదిరించాడని ఉబెర్కు ట్వీట్ చేయండి. ఈ వ్యవహారంపై ధ్రువీకరణ కోరుతూ వారికి ఈమెయిల్ పెట్టండి. దాన్ని ఎలా ఎదుర్కోవాలో వారికి తెలుస్తుంది. డ్రైవర్కు మీ వివరాలు తెలుసని రాశారు కదా.. జాగ్రత్తగా ఉండండి. ఏదైనా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి’ అంటూ మరో యూజర్ రాసుకొచ్చారు.ఇదీ చదవండి: ఫిన్టెక్ కంపెనీలకు ఆర్బీఐ ఆదేశాలుఇదిలాఉండగా, ఏ కంపెనీ అయినా తన కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందిస్తే దాన్ని ఎవరైనా ఆదరిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఉబర్ వంటి ఆన్లైన్ క్యాబ్ సర్వీసులు అందిస్తున్న కంపెనీలు గ్రౌండ్ లెవల్లో వినియోగదారులకు నేరుగా సేవలందిస్తున్నవారికి కచ్చితమైన మార్గదర్శకాలు విడుదల చేసి వాటిని పాటించేలా చూడాలని సూచిస్తున్నారు. దాంతో కంపెనీకి మేలు జరుగుతుందని చెబుతున్నారు.
![Paytm gets SEBI warning over related party transactions with payment](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/665.jpg.webp?itok=mtWczI0A)
పేటీఎమ్కు సెబీ ఝలక్
న్యూఢిల్లీ: పాలనా సంబంధ నిబంధనలు ఉల్లంఘించినట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి వన్97 కమ్యూనికేషన్స్ తాజాగా హెచ్చరికల లేఖను అందుకుంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఆడిట్ కమిటీ లేదా వాటాదారుల అనుమతి లేకుండానే సహచర సంస్థ పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్స్(పీపీబీఎల్)తో సంబంధిత పార్టీ లావాదేవీ(ఆర్పీటీ)లను నిర్వహించినట్లు లేఖలో సెబీ పేర్కొంది. అయితే సెబీ నిబంధనలను స్థిరంగా అమలు చేస్తున్నట్లు బీఎస్ఈకి దాఖలు వివరాలలో పేటీఎమ్ తెలియజేసింది. నిబంధనల అమలులో కంపెనీ అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా సెబీకి వివరణను సైతం సమర్పించనున్నట్లు పేటీఎమ్ బ్రాండ్ డిజిటల్ చెల్లింపుల కంపెనీ వెల్లడించింది. కాగా, సెబీ లేఖ ప్రకారం పీపీబీఎల్, వన్97 కమ్యూనికేషన్స్ సంబంధ ఫైనాన్షియల్ తదితర సమాచారంపై సెబీ పరిశీలన చేపట్టింది. దీనిలో నిబంధనలు పాటించని అంశం గుర్తించింది. ఆడిట్ కమిటీ లేదా వాటాదారుల అనుమతి లేకుండానే ఆర్పీటీలలో పేటీఎమ్ లేదా అనుబంధ సంస్థలు పీపీబీఎల్తో అధిక లావాదేవీలు చేపట్టినట్లు సెబీ పేర్కొన్నట్లు వన్97 బీఎస్ఈకి తెలియజేసింది.
![GVK Power and Infrastructure Faces Insolvency Proceedings, Stock Hits 5% Lower Circuit](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/123_2.jpg.webp?itok=HDFBAbw5)
జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాపై దివాలా చర్యలు
ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ ఆదేశం మొత్తం బకాయిలు రూ.15,576 కోట్లుహైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణ చెల్లింపుల్లో విఫలమైనందున జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (జీవీకేపీఐఎల్)పై దివాలా చర్యలకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), హైదరాబాద్ బెంచ్ ఆదేశాలు ఇచి్చంది. ఐసీఐసీఐ బ్యాంక్ నేతృత్వంలోని రుణదాతల గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్పై బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసిందని జీవీకేపీఐఎల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ ఫైలింగ్లో తెలిపింది. ఫైలింగ్ ప్రకారం సతీష్ కుమార్ గుప్తాను మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్గా (ఐఆర్పీ) ఎన్సీఎల్టీ నియమించింది. గ్యారెంటర్గా ఉన్నందుకే.. వాస్తవానికి ఈ రుణాన్ని దశాబ్దం క్రితం జీవీకే కోల్ డెవలపర్స్ (సింగపూర్) ప్రైవేట్ లిమిటెడ్ పొందింది,. దీనికి జీవీకేపీఐఎల్ గ్యారెంటర్గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ 2022లో పిటిషన్ ఫైల్ చేసింది. దీనిపై దివాలా చర్యలకు ఆదేశిస్తూ జూలై 12న ఎన్సీఎల్టీ బెంచ్ ఆదేశాలు జారీచేస్తే, ఆలస్యంగా ఈ వార్త వెలుగులోకి వచి్చంది. 1.84 బిలియన్ డాలర్ల రుణ బకాయిలు ‘‘కార్పొరేట్ రుణగ్రహీత తన రుణ బాధ్యతలను అంగీకరించారు. 2018–19, 2019–20, 2020 –21 ఆర్థిక సంవత్సరాల వార్షిక నివేదికలలో ఈ విషయాన్ని అంగీకరించారు. జూన్ 13, 2022 నాటికి రుణగ్రహీత 1.84 బిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉంది. చెల్లించాల్సిన మొత్తంలో 1.13 బిలియన్ డాలర్లు అసలు, 731.57 మిలియన్ డాలర్లు వడ్డీ, 1,44,000 డాలర్ల ఏజెన్సీ ఫీజు ఉన్నాయి’’(ఉత్తర్వు ప్రకారం రూ. 9,463 కోట్లు అసలు, రూ. 6,113 కోట్లు వడ్డీ, రూ. 1.23 కోట్ల ఏజెన్సీ ఫీజులు) అని ఎన్సీఎల్టీ ఉత్తర్వు పేర్కొన్నట్లు జీవీకేపీఐఎల్ తెలిపింది. మొదటి డిఫాల్ట్ 2017 ఫిబ్రవరి.. ఐసీఐసీఐ బ్యాంక్ తరఫున సీనియర్ న్యాయవాది కే. వివేక్ రెడ్డి వాదనల ప్రకారం, మొదటి డిఫాల్ట్ ఫిబ్రవరి 2017లో సంభవించింది. అప్పటి నుంచి రుణ చెల్లింపులు జరగలేదు. జీవీకే కోల్ తీసుకున్న రుణానికి జీవీకేపీఎల్ బాధ్యత వహిస్తుంది. తొలుత ఈ కేసులో విచారణ జరిపిన లండన్ కోర్టు కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. జీవీకే చెల్లింపుల్లో విఫలమైతే దివాలా చర్యలు తీసుకోవడం తప్పనిసరి చర్య అవుతుంది. ఆ్రస్టేలియాలో బొగ్గు గనులు కొనుగోలుకు రుణం ఆ్రస్టేలియాలో బొగ్గు గనులు కొనుగోలుకుగాను జీవీకే కోల్కు సెప్టెంబరు 2011లో ఐసీఐసీఐ బ్యాంక్ (దుబాయ్, బహ్రెయిన్, సింగపూర్ శాఖ లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రస్ అల్ ఖైమా), బ్యాంక్ ఆఫ్ ఇండియా (లండన్, సింగపూర్), కెనరా బ్యాంక్ (లండన్) రూ.8,356 కోట్ల టర్మ్ లోన్, అలాగే రూ.292 కోట్ల లెటర్ ఆఫ్ క్రెడిట్ను మంజూరు చేశాయి. ఇతర బ్యాంకులు 367 కోట్ల రూపాయల అదనపు టర్మ్ లోన్లను మార్చి 2014లో మంజూరు చేశాయి. ఆ తర్వాత ఈ మొత్తాన్ని 2,089 కోట్ల రూపాయలకు పెంచాయి.విచారణాంశాలు.. రుణ మంజూరు సమయంలో చేసుకున్న అవగాహనలను ఉల్లంఘిస్తూ, రుణదాత అనుమతి లేకుండానే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్లో జీవీకే గ్రూప్ తన వాటాను విక్రయించాలని భావిస్తున్నట్లు మార్చి 2016లో ఐసీఐసీఐ బ్యాంక్ గుర్తించింది. దీనితో బెంగళూరు విమానాశ్రయంలో జీవీకే తన వాటాను విక్రయించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఏప్రిల్ 2016లో లండన్ కోర్టులో బ్యాంకులు ఇంజక్షన్ దావా వేశాయి. రుణం చెల్లించని కారణంగా, ఫెసిలిటీ అగ్రిమెంట్–1 కింద రూ. 5,915 కోట్లు, ఫెసిలిటీ అగ్రిమెంట్–2 కింద రూ. 1,236 కోట్ల కోసం బ్యాంకులు లండన్ కోర్టులో క్లెయిమ్ పిటిషన్లు వేశాయి. అసలు, వడ్డీకి సంబంధించి రూ. 5,000 కోట్లను డిమాండ్ చేస్తూ 2020 నవంబర్లో ఐసీఐసీఐ బ్యాంక్ తన కార్పొరేట్ గ్యారెంటీ అమలుకు చర్యలు తీసుకుంది. రుణ చెల్లింపుల్లో తన వైఫల్యాన్ని అంగీకరించిన జీవీకేపీఐఎల్, రుణ చెల్లింపులకు కట్టుబడి ఉన్నానని అప్పటి వరకూ చర్యను నిలుపుచేయాలని బ్యాంకర్లను కోరింది. ముంబై జీవీకే ఎయిర్పోర్ట్ కొనుగోలు విషయంలో అదానీ గ్రూప్తో ఒక పరిష్కారానికి వచి్చన తరువాత రుణ చెల్లింపులు జరుపుతామని హామీ ఇచి్చంది. అయితే రుణ చెల్లింపులకు చర్యలు కనిపించకపోవడంతో బకాయిల కోసం 2022లో ఐసీఐసీఐ బ్యాంక్ ఎన్సీఎల్టీ, హైదరాబాద్ బెంచ్ని ఆశ్రయించింది.
![2,200 Jobs, 25,000 Aspirants: Air India Spot Sparks Stampede Scare In Mumbai](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/Air%20India.jpg.webp?itok=H5w0Kutk)
20వేల జీతం.. జాబ్ కోసం పోటెత్తిన 25వేల మంది నిరుద్యోగులు.. తొక్కిసలాట
ముంబై : ముంబై ఎయిర్ పోర్ట్కు నిరుద్యోగులు పోటెత్తారు. 600 ఉద్యోగాలకు అప్లయ్ చేసుకునేందుకు 25 వేల మంది నిరుద్యోగులు తరలివచ్చారు. దీంతో ముంబై ఎయిర్పోర్ట్ నిరుద్యోగులతో కిక్కిరిసిపోయింది. ప్రముఖ ఏవియేషన్ దిగ్గజం ఎయిరిండియా మంగళవారం నిర్వహించిన రిక్రూట్మెంట్ డ్రైవ్ తొక్కిసలాటకు దారితీసింది. ఎయిరిండియాకు మొత్తం 2,200 మంది ఎయిర్ లోడర్లు అవసరం. ప్రస్తుతం 600 మంది ఎయిర్పోర్ట్ లోడర్ల (హ్యాండీమ్యాన్) కోసం ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలకు సుమారు 25వేలమందికి కంటే ఎక్కువ మంది హాజరయ్యారు. అయితే అభ్యర్ధుల్ని ఎంపిక, ఫారమ్ల ధరఖాస్తు స్వీకరణలో తీవ్ర ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. జాబ్ అప్లికేషన్ కోసం అభ్యర్ధులు ఎగబడడంతో వారిని కంట్రోల్ చేయలేకపోయినట్లు సమాచారం. దరఖాస్తుదారులు ఆహారం, నీరు లేకుండా గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని, ఫలితంగా వారిలో చాలా మంది అస్వస్థతకు గురైనట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. జీతం రూ.25వేలుఎయిర్పోర్ట్ లోడర్ల జీతం నెలకు రూ.20,000 నుండి రూ.25,000 వరకు ఉంటుంది.అయితే చాలా మంది ఓవర్టైమ్ అలవెన్సుల తర్వాత రూ. 30,000 కంటే ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది. ఇక ఈ ఉద్యోగం పొందాలంటే కనీస అర్హతలు తప్పని సరి. శారీరకంగా బలంగా ఉంటే సరిపోతుంది.500 కిలోమీటర్ల దూరం నుంచి ఇక 25వేల మంది అభ్యర్ధుల్లో ఒకరైన బీబీఏ రెండో సంవత్సరం చదువుతున్న ప్రథమేశ్వర్ ఈ ఇంటర్వ్యూ కోసం 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుల్దానా జిల్లాకు నుంచి ముంబై ఎయిర్పోర్ట్కు వచ్చారు. ఈ సందర్భంగా ప్రథమేశ్వర్ మాట్లాడుతూ.. నేను ఎయిర్పోర్ట్ లోడర్ జాబ్కు అప్లయ్ చేయడానికి వచ్చాను. ఈ ఉద్యోగానికి రూ.22,500 మాత్రమే ఇస్తారంట అని నిట్టూర్చాడు.ఈ ఉద్యోగం వస్తే చదువు మానేస్తారా అని ప్రశ్నించగా.. ‘ఏం చేస్తాం.. ఇంత నిరుద్యోగం ఉంది.. మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను’ అని బదులిచ్చారు. ప్రస్తుతం నిరుద్యోగులతో కిక్కిరిసిపోయిన ముంబై ఎయిర్ పోర్ట్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఫ్యామిలీ
![Deepika Padukone Reveals She Eats Well, Hates Fad Diet; Check Details](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/deepika%20padukone_dieplan.jpg.webp?itok=m7I_kmF6)
డైట్ అంటే ఏంటి? నిండు గర్భిణి దీపికా పదుకొణే డైట్ సీక్రెట్స్
తన తొలి బిడ్డకు త్వరలోనే జన్మనివ్వబోతున్న స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే తన డైట్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాను బాగా తింటానని, ఫ్యాడ్ డైట్పై తనకస్సలు నమ్మకం లేదంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దీపికా పదుకొణె తన ప్రెగ్నెన్సీ డైట్లో భాగమైన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఫ్యాడ్ డైట్ని ఫాలో అయ్యే కంటే బాగా తినడానికేతాను ఇష్టపడతానని వెల్లడించింది. (ఫాడ్ డైట్: తొందరగా,సులువుగా, అనూహ్యంగా బరువు తగ్గే ఆహార ప్రణాళిక).నిండు గర్భిణి దీపికా పదుకొణె మాతృత్వ అనుభవం కోసం రోజులు లెక్కిస్తోంది. తన ప్రెగ్నెన్సీ జర్నీ, అనుభవాలు, ఫిట్నెస్ సీక్రెట్స్పై తన ఫ్యాన్స్తో అప్డేట్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన డైట్కు సంబంధించి పిక్స్ షేర్ చేసింది. తన బాలెన్స్డ్ డైట్ వెనుక రహస్యాన్ని దీపిక బుధవారం వెల్లడించింది. రుచికరమైన ఆహార పదార్థాలతో కూడిన మూడు చిత్రాలను షేర్ చేసింది. దీంతో పాటు ఒక సుదీర్ఘ నోట్ కూడా పెట్టింది. ఇందులో డైట్ అంటే ఏంటో ఇలా వివరించింది."నా ఫీడ్లో దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారా? నేను బాగా తింటాను! నాకు తెలిసిన ఎవరినైనా అడగండి. బాగా తింటా. కాబట్టి మీరు విన్న లేదా చదివిన దాన్ని నమ్మవద్దు. 'డైట్' అనే పదం చుట్టూ చాలా అపార్థాలున్నట్లు అనిపిస్తుంది, 'డైట్' అంటే ఆకలితో అలమటించడం, తక్కువ తినడం లేదా మనకు నచ్చని వస్తువులన్నింటినీ తినడం అని అనుకుంటాం. బాలెన్స్, క్రమం తప్పకుండా తింటూ, మన బాడీ మాట వినడమే ఇదే అసలైన ట్రిక్.’’ View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) డైట్ నిజమైన అర్థం ఒక వ్యక్తి పూర్తిగా తినే ఆహారం, లేదా పానీయం అని దీపిక పేర్కొంది.. 'డైట్' అనే పదం గ్రీకు పదం 'డైటా' నుండి వచ్చింది. అంటే జీవిన విధానం అని అర్థంని, తానెపుడు విపరీతమైన ఆహారపు అలవాట్లకు బదులు సమతుల్యమైన ఆహారాన్ని పాటిస్తానని వెల్లడించింది.కాగా రిలయన్స్ వారసుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లిలో దీపికా తన బేబీ బంప్తో అందంగా కనిపించింది. సందర్భానికి తగ్గట్టుగా చక్కటి అనార్కలీ, దుప్పట్టాతో స్టయిలిష్గా కనిపించింది. సెప్టెంబర్లో బిడ్డకు జన్మ నివ్వబోతున్నా మని దీపికా, ఆమె భర్త నటుడు రణవీర్ సింగ్ గతంలో ప్రకటించారు.
![Queen Of Box Office Deepika Padukone Pregnancy Glow Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/17/Deepika-Padukone.jpg.webp?itok=d8LOGe36)
ప్రెగ్నెన్సీ గ్లో : పుట్టబోయే బిడ్డకోసం రోజులు లెక్కపెడుతున్న దీపికా (ఫొటోలు)
![Happy World Emoji Day check Some Amazing Facts About Emojis](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/World%20Emojiday_2024.jpg.webp?itok=NW24Rcxv)
అలిగినా, బుంగమూతి పెట్టినా ‘ఎమోజీ’ ఉంటే చాలదూ : ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
భాషతో సంబంధం లేదు. మన మనసులోని భావాల్ని, భావోద్వేగాల్ని ఇట్టే చెప్పేస్తాయి. చిన్న చిన్న బొమ్మలే విశ్వవ్యాప్త భాషగా అవతరించి డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థను విప్లవాత్మకం చేశాయి. అలిగినా, సిగ్గుపడినా, బుంగమూతి పెట్టినా, నవ్వొచ్చినా, వెక్కిరించినా కోపం వచ్చినా, మనం ఎక్కడ, ఎలా ఉన్నా అవతలివాళ్లకి చెప్పాలంటే పిల్లల్ని నుంచి పెద్దల దాకా ఒకే ఒక్క సింగిల్ క్లిక్ ఎమోజీ. రోజుకు కొన్ని వందల కోట్ లఎమోజీలు షేర్ అవుతాయి. అంత పాపులర్ ఎమోజీ. ఈ రోజు ప్రపంచ ఎమోజి దినోత్సవం సందర్బంగా కొన్ని ఆసక్తికర విషయాలు.ప్రస్తుత టెక్ యుగంలో మెసేజ్లు, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ , ఫేస్బుక్ , ముఖ్యంగా వాట్సాప్ దాకా సోషల్ మీడియాలో ఎమోజీ లేనిదే రోజు గడవదు. సంతోషం, ప్రేమ, అసూయ, బాధ, కోపం, ఆఖరికి జలుబు, జ్వరం ఇలా ఏదైనా సరే ఒక్క ఎమోజీతో చెప్పేయొచ్చు.ప్రతి ఏడాది జూలై 17న ప్రపంచ ఎమోజీడేని జరుపుకొంటాము. ప్రపంచ ఎమోజి దినోత్సవాన్ని 2014లో ఎమోజిపీడియా వ్యవస్థాపకుడు జెరెమీ బర్గ్ రూపొందించారు. 2002లో Apple Mac కోసం iCalను ప్రవేశపెట్టిన రోజును సూచిస్తూ iOSలోని క్యాలెండర్ ఎమోజి ఈ తేదీని ప్రదర్శిస్తున్నందున జూలై 17ని ఎంచుకున్నారట. అలాగే జపాన్ మొబైల్ ఆపరేటింగ్ సంస్థ ‘ఎన్టీటీ డొకామో’లో పనిచేసిన షిగెటకా కురిటా అనే ఇంజినీర్ వీటిని రూపొందించాడని చెబుతుంటారు.షిగెటకా కురిటా 1990లలో "ఎమోజి" అనే పదాన్ని ఉపయోగించారట. "ఎమోజి" అనేది జపనీస్ ఇడియమ్. మరోవైపు ఎమోజీని అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ప్రసంగంతో వెలుగులోకి వచ్చిందనే మరో కథనం కూడా. 1862లో లింకన్ తన ప్రసంగంలో పెట్టిన వివిధ రకాల హావ భావాలు బాగా ఆకట్టు కున్నాయి. ముఖ్యంగా కన్నుగీటేది బాగా పాపులర్ అయ్యింది. అలా ఈ ఎమోజీలు వెలుగులోకి వచ్చాయని చరిత్రకారులు చెబుతున్న మాట.
![Lalita Dsilva Once Cared For Anant Ambani Shares Pics From His Childhood](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/anath.jpg.webp?itok=NolkJtLv)
అనంత్ రాధికల పెళ్లిలో లలితా డిసిల్వా..!ఇన్నేళ్ల తర్వాత కూడా..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ నీతాల చిన్న కుమారుడు అనంత్-రాధికల వివాహ వేడుకులు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఎందరో ప్రుముఖులు, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినీ తారలు, సెలబ్రెటీలు పెద్ద ఎత్తున ఈ వేడుకకు విచ్చేశారు. ఈ వేడుకలో కేవలం సెలబ్రెటీలు, సినీ ప్రముఖులకు మాత్రమే గాదు తమ కుటుంబానికి సేవ చేసిన వారిని గుర్తుపెట్టుకుని మరీ పిలచింది అంబానీ కుటుంబం. అనంత్ రాధికల వివాహంలో బాగా హైలెట్గా నిలిచింది లలితా డిసిల్వా. అనంత్ పెళ్లికి వచ్చిన వారంలా ఈ లలితా డిసిల్వా గురించి మాట్లాడుకున్నారు. చెప్పాలంటే ఆ వివాహంలో ఆమెనే హాట్టాపిక్గా మారింది. ఇంతకీ ఆమె ఎవరంటే.. View this post on Instagram A post shared by Lalita Dsilva (@lalitadsilva2965)లలితా డిసిల్వా కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ల కుమారులు తైమూర్, జెహ్ల సంరక్షణ చూచుకునే నానీ. ఆమె అనంత్ పెళ్లిలో సందడి చేయడం ఏంటని అనుకోకండి. ఎందుకంటే..? ఆమె ఒకప్పుడూ అనంత్ బాల్యంలో అతడి సంరక్షణ బాధ్యతలు చూసుకున్న నానీనే లలితా డిసిల్వా. ఇన్నేళ్లు గడిచిపోయినా..అంబానీ కుటుంబం తనను గుర్తించుకుని మరీ ఇలా అనంత్ రాధికల పెళ్లికి పిలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ నాడు అనంత్ బాధ్యతలను చూసుకున్న ఫోటోలను కూడా షేర్ చేశారు. View this post on Instagram A post shared by Lalita Dsilva (@lalitadsilva2965) అనంత్ బాబు, అంబానీ కుటుంబం తన జీవితంలోకి తెచ్చిన ఆనందం, ప్రేమలను ఎన్నటికీ మర్చిపోలేను. అతను చాలామంచి అబ్బాయి అని అన్నారు. అతను ఈ గొప్ప వేడుకతో సంతోషకరమైన వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న అనంత్కి శుభాకాంక్షలు అని పోస్ట్లో పేర్కొన్నారు. దేవుడు ఈ జంటను తప్పక ఆశీర్వదిస్తారు అని అన్నారు. ఆమె ఇప్పుడూ టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఉపాసనల కుమార్తె క్లిన్ కారాకు నానీ కూడా. ఆమె ఈ నేపథ్యంలో తాను పనిచేసిన సెలబ్రెటీ కుటుంబాలతో కలిసి దిగిన ఫోటోలను సైతం షేర్ చేసింది.(చదవండి: 'లావెండర్ వివాహం' అంటే..? చాలామంది దీన్నే ఎంచుకోవడానికి రీజన్..?)
ఫొటోలు
![Ashada Masam Devotees Huge Crowd To Durga Temple In Vijayawada Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/17/Ashada%20Masam%20Devotees%20Huge%20Crowd%20To%20Durga%20Temple%20In%20Vijayawada%20Photos%20%2810%29.jpg.webp?itok=nrWrfGMx)
![Default image](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/17/Ashada%20Masam%20Devotees%20Huge%20Crowd%20To%20Durga%20Temple%20In%20Vijayawada%20Photos%20%2810%29.jpg.webp?itok=nrWrfGMx)
ఆషాఢంలో దుర్గ గుడికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
![TV Actress Anjali daughter Chandamama birthday celebrations Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/17/TV%20Actress%20Anjali%20daughter%20Chandamama%20birthday%20celebrations%20Photos%20%2817%29.jpg.webp?itok=OGWG8Jmg)
![Default image](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/17/TV%20Actress%20Anjali%20daughter%20Chandamama%20birthday%20celebrations%20Photos%20%2817%29.jpg.webp?itok=OGWG8Jmg)
బుల్లితెర నటి అంజలి కూతురు చందమామ బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
![Genelia Deshmukh New Latest Stunning Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/17/Genelia%20Deshmukh%20New%20Latest%20Stunning%20Photos%20%2815%29.jpg.webp?itok=8WtSwuUD)
![Default image](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/17/Genelia%20Deshmukh%20New%20Latest%20Stunning%20Photos%20%2815%29.jpg.webp?itok=8WtSwuUD)
Genelia Deshmukh: కొత్త ట్రెండ్స్ వద్దు క్లాసిక్ లుక్కే ముద్దు అంటున్న బ్యూటీ (ఫోటోలు)
![Royal Enfield Guerrilla 450 launched Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/17/Royal%20Enfield%20Guerrilla%20450%20launched%20Photos%20%281%29.jpg.webp?itok=WXNfjT3Y)
![Default image](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/17/Royal%20Enfield%20Guerrilla%20450%20launched%20Photos%20%281%29.jpg.webp?itok=WXNfjT3Y)
రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450.. కొత్త బండి గురూ!! (ఫోటోలు)
![Actress Rambha meets Thalapathy Vijay along with her family: Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/17/Actress%20Rambha%20meets%20Thalapathy%20Vijay%20along%20with%20her%20family%20Phots%20%281%29.jpg.webp?itok=REj4kh12)
![Default image](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/17/Actress%20Rambha%20meets%20Thalapathy%20Vijay%20along%20with%20her%20family%20Phots%20%281%29.jpg.webp?itok=REj4kh12)
హీరో విజయ్ను కలిసిన రంభ.. ఎన్నాళ్లకెన్నాళ్లకు! (ఫోటోలు)
National View all
![title](/sites/default/files/article_images/2024/07/17/cm_0.jpg)
ప్రైవేటు ‘కోటా’ వివాదం.. కర్ణాటక ప్రభుత్వం వెనకడుగు
బెంగళూరు: కర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో గ్రూప్ సీ, డీ గ్రేడ
![title](/sites/default/files/article_images/2024/07/17/heartattack2.jpg)
ప్రాణదాతా.. నీకు సలాం! వీడియో వైరల్
ఢిల్లీ: ఢిల్లీ ఎయిర్ పోర్టులో జరిగిన ఘటన సోషల్మీడియాలో వైర
![title](/sites/default/files/article_images/2024/07/17/maoist-encounter2.jpg)
గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి
గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్ జరిగి
![title](/sites/default/files/article_images/2024/07/17/up.jpg)
గ్యాంగ్స్ట్ర్ అతిక్ అహ్మద్ ఆస్తి యూపీ ప్రభుత్వానికి బదిలీ
లక్నో: గ్యాంగ్స్ట్ర్, పొలిటికల్ లీడర్ అతిక్ అహ్మద్ గత
![title](/sites/default/files/article_images/2024/07/17/Shivani_Case_Noida.jpg)
‘వాట్సాప్ గ్రూప్లో సూటిపోటి మాటలు.. భరించలేకపోతున్నా!’
ఢిల్లీ: ఆమె ఓ ప్రముఖ బ్యాంకులో ఉద్యోగిణి.
International View all
![title](/sites/default/files/article_images/2024/07/17/Biden_0.jpg)
అమెరికా అధ్యక్ష బరిలో కమలా హారీస్.. హింట్ ఇచ్చిన బైడెన్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్ తప్పుక
![title](/sites/default/files/article_images/2024/07/17/Dubai_Princess_Triple_Talaq.jpg)
ఇన్స్టాగ్రామ్లో విడాకులిచ్చిన దుబాయ్ యువరాణి
అబుదాబీ: దుబాయ్ యువరాణి షేఖా మహ్రా బింట్(30) సంచలన ప్రకటన చేశారు.
![title](/sites/default/files/article_images/2024/07/17/Bangla_protests.jpg)
రిజర్వేషన్ కోటా నిరసన హింసాత్మకం.. ఆరుగురి మృతి
ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను వ్యతిరేకిస్తూ
![title](/sites/default/files/article_images/2024/07/17/World%20Emojiday_2024.jpg)
అలిగినా, బుంగమూతి పెట్టినా ‘ఎమోజీ’ ఉంటే చాలదూ : ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
భాషతో సంబంధం లేదు.
![title](/sites/default/files/article_images/2024/07/17/afghanistan.jpg)
అఫ్గానిస్తాన్లో వర్ష బీభత్సం.. 35 మంది మృతి
అఫ్గానిస్తాన్లో ప్రకృతి బీభత్సం సృష్టించింది.
NRI View all
![title](/sites/default/files/article_images/2024/07/16/YSR_75_Jayanthi.jpg)
న్యూజెర్సీలో వైఎస్సార్ జయంతి వేడుకలు
ట్రెంటన్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలు అమెరికాలోని
![title](/sites/default/files/article_images/2024/07/15/intel01.jpg)
విదేశీ వర్కర్ల భద్రతకు మరిన్ని కఠిన నిర్ణయాలు
కెనడా ప్రభుత్వం తమ దేశంలో పనిచేసే విదేశీ వర్కర్ల రక్షణకు చర్యలు తీసుకుంటుంది.
![title](/sites/default/files/article_images/2024/07/13/labour.jpg)
ఇటలీలో బానిసత్వం!.. 33 మంది భారతీయ కార్మికుల విముక్తి
రోమ్: భారతీయ వ్యవసాయ కార్మికులను బానిస వ్యవస్థ నుంచి కాపాడి
![title](/sites/default/files/article_images/2024/07/13/Bonalu_London_News.jpg)
టాక్ ఆధ్వర్యంలో లండన్లో ఘనంగా బోనాల వేడుకలు
లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర
![title](/sites/default/files/article_images/2024/07/11/ukkk.jpg)
Video: భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీగా శివాని ప్రమాణం
భారత సంతతికి చెందిన 29 ఏళ్ల శివాని రాజా యూకే పార్లమెంటులో హిందువుల పవిత్రగ్రంథం భగవద్గీత సాక్షిగా ఎంపీగా ప్రమాణ స్
క్రైమ్
![18 people remanded in drug case](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/1455.jpg.webp?itok=ptKYpLh_)
డ్రగ్స్ కేసులో 18 మందికి రిమాండ్
మణికొండ: నైజీరియా నుంచి గోవా, ముంబై, ఢిల్లీల మీదుగా డ్రగ్స్ తరలించి హైదరాబాద్లో విక్రయిస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న 18 మంది సభ్యుల ముఠాను నార్సింగి, రాజేంద్రనగర్ డివిజన్ ఎస్ఓటీ, మాదకద్రవ్యాల నిరోధక శాఖల పోలీసులు మంగళవారం రిమాండ్కు తరలించారు. సోమవారం వారిని నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్, విశాల్నగర్ కాలనీలోని జెనాబ్ ఫోర్ట్ వ్యూ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 202లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిందితుల నుంచి రూ.2 కోట్ల విలువ చేసే 199.10 గ్రాముల కొకైన్ను పోలీసులు స్వాధీనం చేసుకోగా, మంగళవారం గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. డ్రగ్స్ కొనుగోలు చేసిన 13 మందిలో ఆరుగురికి పాజిటివ్ అని వచి్చంది. అనంతరం నిందితులను రాజేంద్రనగర్లోని కోర్టులో హాజరుపరిచారు. డ్రగ్స్ సరఫరా దారులు వీరే... డ్రగ్స్ కేసులో ఏ1గా అనౌహ బ్లెస్సింగ్ అనే మహిళ, ఏ2గా నిజాం కళాశాలలో బీకాం ఫైనలియర్ చదువుతున్న అజీజ్ నోహీమ్ అడేషోలా, ఏ3గా బెంగుళూరుకు చెందిన అల్లం సత్యవెంకట గౌతమ్, ఏ4గా బోరబండకు చెందిన సానబోయిన వరుణ్కుమార్, ఏ5గా ఈవెంట్ కొరియోగ్రాఫర్ మహ్మద్ మహబూబ్ షరీఫ్ ఉన్నారని, వీరంతా డ్రగ్స్ను సరఫరా చేస్తున్నారని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కాగా, సినీహీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్సింగ్, ఫిల్మ్నగర్కు చెందిన కిషన్ రాఠీ, బంజారాహిల్స్కు చెందిన అని, గచి్చబౌలికి చెందిన యశ్వంత్ గాడె, జూబ్లీహిల్స్కు చెందిన ఆలుగడ్డల రోహిత్, గండిపేటకు చెందిన శ్రీచరణ్, బంజారాహిల్స్కు చెందిన ప్రసాద్, ఫిల్మ్నగర్కు చెందిన హృతిక్కుమార్, పంజగుట్టకు చెందిన నిఖిల్ ధావన్, గచి్చ»ౌలికి చెందిన మధురాజు, రఘు, కనుమూరి కృష్ణంరాజు, వెంకట సత్యనారాయణ డ్రగ్స్ వినియోగిస్తున్నవారిలో ఉన్నారని తెలిపారు. వీరి పేర్లను ఏ6 నుంచి ఏ18 వరకు కేసులో పొందుపరిచారు. వీరి నుంచి 10 సెల్ ఫోన్లు, రెండు ద్విచక్రవాహనాలు, ఓ పాస్పోర్టును సీజ్ చేసినట్టు పేర్కొన్నారు.
![Atrocities against girls are increasing day by day](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/crime_2.jpg.webp?itok=bYCs3mMG)
ఆడబిడ్డలపై ఆగని అఘాయిత్యాలు
ప్రత్తిపాడు/ఫిరంగిపురం/టి.నరసాపురం: బాలికలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గుంటూరు జిల్లాలో ఒకేరోజు రెండు కేసులు.. ఏలూరు జిల్లాలో ఓ కేసు నమోదైంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడు గ్రామానికి చెందిన దళిత బాలిక (13) నడింపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతుంది. ఈ నెల 12న అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గండికోట వెంకటేశ్వరరావు ఉరఫ్ వెంకట్ పాఠశాలకు సమీపంలోని పంట పొలాల్లోకి బాలికను తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మంగళవారం బాలిక విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు ప్రత్తిపాడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ చేసిన ఎస్ఐ రవీంద్ర వెంకట్పై పోక్సో యాక్ట్తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంకట్ను అదుపులోకి తీసుకున్నారు.వేధింపులతో బాలిక ఆత్మహత్య ఫిరంగిపురం మండలంలో యువకుడి వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. సీఐ వీరేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (17) ఇంటి వద్ద ఉంటుంది. ఈమెకు కొన్నాళ్ల కిందట బంధువుల అబ్బాయితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో బాలిక తన బంధువులతో ఫిరంగిపురం తిరునాళ్లకు వచ్చింది.ఆ సమయంలో ఆ యువకుడు తన మిత్రులతో వెళ్లి బాలిక గురించి అసభ్యంగా మాట్లాడటంతో బాలిక తండ్రి యువకుడిని మందలించాడు. ఆ యువకుడు మరికొంతమందితో ఆ గ్రామానికి వెళ్లి బాలిక తండ్రిపై దాడి చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక పురుగుమందు తాగింది. ఆమెను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు బంధువులు తరలించగా..చికిత్సపొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు యువకుడితో పాటు మరికొంతమందిపై మంగళవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కాగా, బాలికను వేధిస్తున్న యువకుడు ఆదివారం అర్థరాత్రి ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు.హోటల్ గదిలో బంధించి లైంగిక దాడిబాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురు యువకులపై టి.నరసాపురం పోలీసులు పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఈ కేసు వివరాలను ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు మంగళవారం మీడియాకు తెలిపారు. ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలంలోని బొర్రంపాలేనికి చెందిన బాలిక (16) జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఈ నెల 6న బాలిక అదృశ్యం కావడంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదృశ్యం కేసు దర్యాప్తు దర్యాప్తు జరుగుతుండగానే బాలిక ఈ నెల 15న టి.నరసాపురం పోలీస్స్టేషన్కు వచ్చి తనపై లైంగిక దాడి జరిగిందని, దీనికి నలుగురు యువకులు బాధ్యులని చెప్పి ఫిర్యాదు చేసింది. దీంతో అదృశ్యం కేసును పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద మార్పు చేశారు. ఆమె ఫిర్యాదు వివరాలను పోలీసులు వెల్లడిస్తూ.. బాలిక హైసూ్కల్లో చదువుతున్న సమయంలోనే గ్రామానికి చెందిన యువకుడు (20) ప్రేమిస్తున్నానని వెంటపడుతూ ఆమెను వేధించేవాడని తెలిపారు. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆమెను జంగారెడ్డిగూడెంలోని ఓ హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. ఆ హాస్టల్ నుంచే బాలిక ప్రైవేట్ కళాశాలలో విద్యను అభ్యసిస్తోంది. ఈ క్రమంలో ఇంటికి వచ్చిన బాలిక ఈ నెల 6 నుంచి కనిపించలేదు. ప్రేమిస్తున్నానన్న యువకుడికి మరో ముగ్గురు యువకులు సహకరించడంతో..వారంతా కలిసి బాలికను కిడ్నాప్ చేసి విశాఖకు తీసుకువెళ్లారు. అక్కడ ఓ హోటల్ గదిలో బాలికను బంధించిన యువకుడు ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది.
![Wildlife hunt for likes on insta](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/arrest.jpg.webp?itok=EAWFw9tl)
ఇన్స్టాలో లైక్ల కోసం వన్యప్రాణుల వేట
వేంపల్లె: ఇన్స్ట్రాగామ్లో లైక్ల కోసం ఓ యువకుడు పెంపుడు కుక్కలతో వేటకు వెళ్లి అడవిలో జంతువులను చంపి, ఆ వీడియోలను అప్లోడ్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. దీన్ని గమనించిన తెలంగాణ జంతు ప్రేమికులు ఆ యువకుడికి అదిరిపోయే షాక్ ఇచ్చారు. కట్చేస్తే వేంపల్లి ఫారెస్ట్ అధికారులు అతడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ ఘటన ఉమ్మడి కడప జిల్లా గాలివీడు మండలం వడ్డేపల్లెలో చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి కడప జిల్లాలోని గాలివీడు మండలం, వడ్డేపల్లికి చెందిన బత్తల చిరంజీవి పెంపుడు కుక్కలతో సమీపంలోని కొండల్లోకి వెళ్లి, అడవి జంతువులను వేటాడి, వాటిని చంపి, లైకుల కోసం ఇన్స్ట్రాగామ్లో పోస్టులు పెట్టడం అలవాటుగా మార్చుకున్నాడు. అతను చేసే వీడియోలు వైరల్గా మారాయి. వీటిని తెలంగాణ జంతు ప్రేమికులు గమనించి, వెంటనే కడప జిల్లా డీఎఫ్వో సందీప్రెడ్డికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన వేంపల్లె ఫారెస్టు అధికారులకు సమాచారమిచ్చి అతడిని అరెస్టు చేయాలని ఆదేశించారు. వేంపల్లె ఫారెస్టు అధికారి బాలసుబ్రమణ్యం తన సిబ్బందితో వెళ్లి బత్తల చిరంజీవిని అరెస్టు చేసినట్లు మీడియాకు తెలిపారు.
![Encounter: Clashes in Jammu and Kashmir Four soldiers were martyred](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/jawan.jpg.webp?itok=UGp07rhM)
కశ్మీర్లో ఉగ్రకాల్పులు... నలుగురు సైనికుల వీరమరణం
జమ్మూ: జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాలపై ముష్కర మూకల దాడులు పెరిగిపోతున్నాయి. సోమవారం రాత్రి దోడా జిల్లాలో బలగాలపై భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. వారిని కెప్టెన్ బ్రిజేశ్ థాపా, నాయక్ డొక్కరి రాజేశ్, సిపాయిలు బిజేంద్రసింగ్, అజయ్కుమార్ సింగ్ నరుకాగా గుర్తించారు. గాయపడ్డ మరో సైనికున్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.కథువా జిల్లా మారుమూల మఛేడీ అటవీప్రాంతంలో సైన్యంపై ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగి ఐదుగురు జవాన్లను పొట్టన పెట్టుకున్న వారం రోజులకే తాజా ఘటన చోటుచేసుకుంది. దోడాలో బలగాలు, ఉగ్రవాదుల మధ్య గత మూడు వారాల్లో ఇది మూడో ఎన్కౌంటర్. ఇది తమ పనేనని పాక్ దన్నుతో చెలరేగిపోతున్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్కు చెందిన ‘కశ్మీర్ టైగర్స్’ ప్రకటించుకుంది.ఉగ్రవాదులు నక్కారన్న నిఘా సమాచారంతో రాష్టీయ రైఫిల్స్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దేసా అటవీ ప్రాంత పరిధిలోని ధారీ గోటే ఉరర్బాగీ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. 20 నిమిషాల ఎదురుకాల్పుల అనంతరం ఉగ్రవాదులు వెన్నుచూపారు. ప్రతికూల అటవీ ప్రాంతంలోనూ కెపె్టన్ సారథ్యంలో బలగాలు వారిని వెంటాడాయి. దాంతో సోమవారం రాత్రి 9 గంటల అనంతరం మరోసారి చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కెపె్టన్తో పాటు మరో ముగ్గురు అసువులు బాశారని అధికారులు తెలిపారు. ఈ ముష్కరులు అక్రమంగా సరిహద్దు దాటి చొచ్చుకొచ్చి రెండు నెలలుగా అటవీ ప్రాంతంలో నక్కినట్టు భావిస్తున్నారు. వారికోసం అదనపు బలగాలతో సైన్యం, పోలీసులు భారీగా గాలిస్తున్నారు. ఎలైట్ పారా కమెండోలను కూడా రంగంలోకి దించారు. బాధగా ఉంది: రాజ్నాథ్ ముష్కరులను ఏరేసే క్రమంలో నలుగురు వీర జవాన్లు అమరులు కావడం చాలా బాధగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు. ఆయనతో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, సైనిక ఉన్నతాధికారులు వారికి ఘనంగా నివాళులరి్పంచారు. కుటుంబాలకు సానుభూతి తెలిపారు.నా కొడుకు త్యాగానికి గర్విస్తున్నా..దేశ రక్షణలో అమరుడైన కొడుకును చూస్తే గర్వంగా ఉందని కెప్టెన్ బ్రిజేశ్ థాపా తల్లిదండ్రులు కల్నల్ (రిటైర్డ్) భువనేశ్ కె.థాపా, నీలిమ అన్నారు. ‘‘నా కుమారుడు చిన్నతనం నుంచీ నన్నే స్ఫూర్తిగా తీసుకున్నాడు. సైన్యంలో చేరాలని ఉవి్వళ్లూరేవాడు. 27 ఏళ్ల వయసులో కల నెరవేర్చుకున్నాడు. రెండు రోజుల క్రితమే నాతో ఫోన్లో మాట్లాడాడు. నిత్యం ప్రాణాపాయం పొంచి ఉండే ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో నా కుమారుడు అమరుడైనందుకు గర్విస్తున్నా’’ అని భువనేశ్ చెప్పారు. ఆర్మీ డే రోజు పుట్టాడు కెపె్టన్ థాపా ఆర్మీ డే అయిన జనవరి 15న జని్మంచారని తల్లి తెలిపారు. తనకింకా పెళ్లి కూడా కాలేదని సుళ్లు తిరుగుతున్న బాధను అణచుకుంటూ చెప్పారామె. కుటుంబంలో ఆయన వరుసగా మూడో తరం సైనికుడు! థాపా తండ్రితో పాటు తాత కూడా సైన్యంలో సేవ చేశారు. ఆయన ఇంజనీరింగ్ చేసి కూడా పట్టుబట్టి ఆరీ్మలోనే చేరారు. 145, ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్కు చెందిన థాపా రాష్రీ్టయ రైఫిల్స్కు డిప్యూటేషన్పై వెళ్లారు.బీజేపీ తప్పుడు విధానాల వల్లే... జవాన్ల మృతిపై రాహుల్ నిప్పులుసాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో 78 రోజుల్లో 11 ఉగ్రదాడులు జరిగినా కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. బీజేపీ తప్పుడు విధానాల ఫలితాన్ని వీర సైనికులు, వారి కుటుంబాలు అనుభవించాల్సి వస్తోందని లోక్సభలో విపక్ష నేత రాహుల్గాంధీ ఆరోపించారు. ఈ మేరకు మోదీ ప్రభుత్వానికి లేఖ రాశారు. 11 ఉగ్రదాడుల్లో 13 మంది ఆర్మీ, పోలీసు సిబ్బంది అమరులయ్యారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఈ దాడులను, సైనికుల బలిదానాలను ఆపడానికి ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఆరి్టకల్ 370 రద్దుతో ఉగ్రవాదాన్ని నాశనం చేశామనే బూటకపు వాదనకు సైనికులు తమ ప్రాణాలతో మూల్యం చెల్లించుకుంటున్నారన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై సమష్టిగా పోరాడాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు.ఆ అమర సైనికునిది ఏపీసంతబోమ్మాళి: దోడాలో ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన డొక్కరి రాజేశ్ (25)ది ఆంధ్రప్రదేశ్. ఆయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా సంతబోమ్మాళి మండలం చెట్లతాండ్ర. రాజేశ్ ఐదేళ్ల కింద ఆర్మీలో చేరారు. వారిది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు చిట్టివాడు, పార్వతి కేవలం ఎకరం పొలం సాగు చేస్తూ రాజేశ్ను, ఆయన సోదరున్ని చదివించారు. సోదరుడు మధుసూదనరావు డిగ్రీ పూర్తి చేశాడు. రాజేశ్ మృతితో తల్లిదండ్రులు కంటికో ధారగా విలపిస్తున్నారు. గ్రామంలో కూడా విషాద ఛాయలు అలముకున్నాయి.ఈ ఏడాదే 12 మంది సైనికుల మృతి2024లో జమ్మూలో ఉగ్ర దాడులు... ఏప్రిల్ 22: రాజౌరీ జిల్లాలో ప్రభుత్వోద్యోగిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఏప్రిల్ 28: ఉధంపూర్ జిల్లాలో ఉగ్రవాదులతోఎదురు కాల్పుల్లో విలేజీ రక్షక దళ సభ్యుని మృతి. మే 4: పూంచ్ జిల్లాలో ఉగ్ర దాడిలో ఐఏఎఫ్ సిబ్బంది మరణించగా ఐదుగురు గాయపడ్డారు. జూన్ 9: రీసీ జిల్లాలో ఉగ్ర దాడిలో 9 మంది భక్తులు మరణించగా 42 మంది గాయపడ్డారు. జూన్ 11, 12: కథువా జిల్లాలో ఎన్కౌంటర్లో ఇద్దరు విదేశీ ముష్కరులు హతమవగా ఒక సీఆరీ్పఎఫ్ జవాను అమరుడయ్యాడు. జూన్ 12: దోడా జిల్లాలో ఉగ్ర దాడిలో ఓ పోలీసుకు గాయాలు. జూన్ 26: దోడా జిల్లాలో ముగ్గురు విదేశీ ముష్కరుల కాలి్చవేత. జూలై 7: రాజౌరీ జిల్లాలో ఉగ్ర దాడిలో సైనిక సిబ్బంది గాయపడ్డారు. జూలై 8: కథువా జిల్లాలో ఉగ్రవాదుల ఉచ్చులో చిక్కి ఐదుగురు సైనికులు బలయ్యారు. జూలై 15: దోడా ఎన్కౌంటర్లో కెప్టెన్తో పాటు మరో ముగ్గురు సైనికుల వీరమరణం.
వీడియోలు
![Red Soil Dunes Illegal Mining In Bheemili](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/do_0.jpg.webp?itok=pk3-OyMV)
![Red Soil Dunes Illegal Mining In Bheemili](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/do_0.jpg.webp?itok=pk3-OyMV)
యథేచ్ఛగా ఎర్రమట్టి తవ్వకాలు.
![Janasena Activists Raise Questions Over SERP](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/pw.jpg.webp?itok=ZtYtX7-b)
![Janasena Activists Raise Questions Over SERP](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/pw.jpg.webp?itok=ZtYtX7-b)
పవన్ శాఖలో చీలిక.. !
![Peerla Panduga Celebrations 2024](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/tan.jpg.webp?itok=l-SlLAKm)
![Peerla Panduga Celebrations 2024](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/tan.jpg.webp?itok=l-SlLAKm)
త్యాగానికి ప్రతీక
![CM Revanth Reddy To Hold Key Meeting With TPCC Leaders At Praja Bhavan](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/hg.jpg.webp?itok=AwwZkAkr)
![CM Revanth Reddy To Hold Key Meeting With TPCC Leaders At Praja Bhavan](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/hg.jpg.webp?itok=AwwZkAkr)
కాసేపట్లో ప్రజా భవన్ లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం
![Nandyal SP Adhiraj Singh Rana Face to Face Over Muchumarri Girl Incident](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/po_3.jpg.webp?itok=xv0oBee4)
![Nandyal SP Adhiraj Singh Rana Face to Face Over Muchumarri Girl Incident](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/po_3.jpg.webp?itok=xv0oBee4)
ఆ దారుణంలో ముగ్గురి పిల్లల తల్లిదండ్రుల హస్తం..
![Public Reaction On Street Dogs Attack On Child Incident In Jawahar Nagar](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/st.jpg.webp?itok=OcONOGA7)
![Public Reaction On Street Dogs Attack On Child Incident In Jawahar Nagar](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/st.jpg.webp?itok=OcONOGA7)
చిన్న పిల్లోడు...20 కుక్కలు ఒకేసారి..!
![Tomato Price Reached 100 Per Kilo](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/ta_0.jpg.webp?itok=sJsxy0xk)
![Tomato Price Reached 100 Per Kilo](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/ta_0.jpg.webp?itok=sJsxy0xk)
సెంచరీ కొట్టిన టమాటా..
![Minister Ponnam Prabhakar about Rythu Runa Mafi](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/ru.jpg.webp?itok=2H3pXxEt)
![Minister Ponnam Prabhakar about Rythu Runa Mafi](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/ru.jpg.webp?itok=2H3pXxEt)
రేపటి నుంచి రైతు రుణ మాఫీ -మంత్రి పొన్నం
![Maharashtra Politics Four Top Leaders Resigned](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/mla.jpg.webp?itok=P5AP8eSN)
![Maharashtra Politics Four Top Leaders Resigned](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/mla.jpg.webp?itok=P5AP8eSN)
అజిత్ పవార్ NCPకి షాక్
![Harish Rao Fires on MLA Gudem Mahipal Reddy](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/ha_0.jpg.webp?itok=YFes7fMC)
![Harish Rao Fires on MLA Gudem Mahipal Reddy](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/ha_0.jpg.webp?itok=YFes7fMC)
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్ అయ్యారు
న్యూస్ పాడ్కాస్ట్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
విద్యుత్తు కమిషన్కు మరో న్యాయమూర్తిని నియమించండి. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
నాలుగోసారి యూరోకప్ విజేతగా నిలిచిన స్పెయిన్ ఫుట్బాల్ జట్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న పూరీ జగన్నాథ ఆలయ వజ్రాభరణాల నిధి గది. మొదటిరోజు గది పరిశీలన. త్వరలో వజ్రాభరణాల లెక్కింపు మొదలు.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాయ... పేరుకు మాత్రమే ఉచితం.. యథేచ్ఛగా దోపిడీ చేస్తున్న అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
అమెరికాలో మానవ అక్రమ రవాణా కేసులో నలుగురు తెలుగు యువతీ యువకుల అరెస్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
మాస్కోలో మోదీ. నేడు పుతిన్తో ప్రధాని మోదీ విస్తృతస్థాయి చర్చలు.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
వైఎస్ రాజశేఖరరెడ్డి మహోన్నత నాయకుడు... ఆయన లేరని ప్రతిరోజూ విచారిస్తూనే ఉన్నాం... సందేశం విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీశ.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు వెంటనే ఆపండి.. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్.. టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన వేంపల్లె అజయ్కుమార్రెడ్డికి పరామర్శ.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
బ్రిటన్ ప్రధానమంత్రిగా కియర్ స్టార్మర్... పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘనవిజయం... రిషి సునాక్ రాజీనామా.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
టీ20 క్రికెట్ ప్రపంచ కప్ సాధించి స్వదేశానికి చేరుకున్న భారత జట్టు.. ముంబైలో అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు.. ఇంకా ఇతర అప్డేట్స్