NCC gate
-
ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద భారీగా పోలీసుల
-
ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
-
ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీ ఎన్సీసీ గేట్ వద్ద సోమవారం ఉదయం పోలీసులు భారీగా మోహరించారు. ఓయూ నుంచి తార్నాక వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. కేసీఆర్ విధానాలను నిరసిస్తూ నేడు ఉస్మానియా నిరుద్యోగ జేఏసీ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడాన్ని నిరసిస్తూ వీరంతా గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. -
ఓయూలో పోలీసులపై విద్యార్థుల రాళ్లదాడి
-
ఓయూలో పోలీసులపై విద్యార్థుల రాళ్లదాడి
హైదరాబాద్ : తెలంగాణ విద్యార్థి సంఘాల రాజ్భవన్ ముట్టడి సోమవారం ఉద్రిక్తతలకు దారి తీసింది. హైదరాబాద్లో గవర్నర్ పాలనను అంగీకరించేది లేదంటూ వారు తమ నిరసనలు తెలిపారు. ఈ సందర్బంగా ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు ఓయూ విద్యార్థుల ఛలో రాజ్ భవన్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఎన్సీసీ గేట్ వద్ద విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ...రాళ్లతో దాడి చేయటంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. రాజ్ భవన్ ముట్టడిని విద్యార్థులు అసెంబ్లీ ముట్టడిగా మార్చారు. భారీ ర్యాలీగా బయల్దేరి వెళ్లాలనుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై విద్యార్థులు రాళ్లతో దాడి చేయగా, పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. -
రాయల తెలంగాణపై ఓయూలో ఉద్రిక్తత
కేంద్ర ప్రభుత్వం తలపెడుతున్న రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. దీంతో వర్సిటీలోని ఎన్సీసీ గేటు వద్ద బుధవారం మధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏరప్డింది. విద్యార్థులు భారీ సంఖ్యలో చేరుకోవడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే విద్యార్థులు జెండాలు పట్టుకుని నినాదాలు చేసుకుంటూ బారికేడ్ల మీద నుంచి దూకి బయటకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. అలాగే విద్యార్థులు ప్రారంభించిన బైకు ర్యాలీని కూడా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోట చేసుకుంది. దీంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఓయూ వద్ద భారీగా మోహరించారు. రాయల తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం సుముఖంగా ఉన్నట్లు వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విద్యార్థులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు గురువారం తెలంగాణ బంద్కు కూడా టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఇది ఇంకెంత ఉద్రిక్తంగా మారుతుందోనని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఓయూలో ఆందోళన సందర్భంగా విద్యార్థులు కొన్ని డ్రమ్ములకు నిప్పంటించి వాటిని కూడా విసిరేసిన ఘటనలు కనిపించాయి.