new terminal
-
రూ.266 కోట్లతో కడప విమానాశ్రయం అభివృద్ధి
కడప కోటిరెడ్డిసర్కిల్/కడప కార్పొరేషన్: వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని విమానాశ్రయంలో రూ.266 కోట్లతో నిర్మించనున్న నూతన టెర్మినల్ భవనానికి ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ విమానాశ్రయం 25 లక్షల మంది ప్రయాణికుల వార్షిక సామర్థ్యం మేరకు ఆధునిక సొబగులద్దుకుంటోంది. ఇక్కడి రన్వేని 45 మీటర్ల వెడల్పున 2,515 మీటర్ల పొడవున విస్తరించనున్నారు. పనులు పూర్తయిన తరువాత ఈ విమానాశ్రయం పీక్ అవర్ సరి్వంగ్ కెపాసిటీ 1,800 మంది ప్రయాణికులుగా ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషితో విమానాశ్రయం విస్తరణకు రూ.75 కోట్లతో స్థలం సేకరించారు. దీంతో రన్వే పొడిగిస్తున్న నేపథ్యంలో విమానాల నైట్ ల్యాండింగ్కు కూడా అవకాశం లభిస్తుంది. ఇప్పటికే ఇక్కడి నుంచి నిరంతరాయ సర్విసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కూడా భరించింది. 2015లో ప్రారంభమైన ఈ విమానాశ్రయం నుంచి 2017లో ట్రూ జెట్ సంస్థ ఉడాన్ స్కీమ్ కింద ఆర్సీఎస్ (రీజినల్ కనెక్టివిటీ స్కీమ్) అమలు చేసింది. 2021లో ఆ సంస్థ తన విమానాలను ఉపసంహరించుకుంది. 2022 మార్చి నుంచి ఇండిగోసంస్థ విమానాలను ప్రారంభించింది. ప్రధాని వర్చువల్గా శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజద్బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ విమానాశ్రయంలో అభివృద్ధి పనులతోపాటు టెర్మినల్ నిర్మాణంతో రూపురేఖలు మారిపోయి మహర్దశ పట్టనుందని చెప్పారు. ఈ విమానాశ్రయం ఏర్పాటుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కృషిచేయగా, ఎయిర్పోర్టు అభివృద్ధికి ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. ఎయిర్పోర్టు సుందరీకరణలోను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందన్నారు. ఎయిర్పోర్టుకు అతి సమీపంలో అటవీప్రాంతం ఉండడంతో అటవీశాఖ అనుమతులు తీసుకుని భూసేకరణ చేసినట్లు తెలిపారు. ఎయిర్పోర్టు అభివృద్ధి పనులు చేపట్టిన ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్ర విమానయానశాఖ మంత్రి జ్యోతిరావు సిందియాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయరామరాజు, ఎయిర్పోర్టు డైరెక్టర్ సుజిత్కుమార్ పోదార్, ›ప్రొటోకాల్ ఆఫీసర్ సురేష్బాబు, టెర్మినల్ మేనేజర్ జోసెఫ్ పాల్గొన్నారు. ముసుగు తొలగించారంతే: ఎంపీ అవినాశ్రెడ్డి అనంతరం ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎప్పటినుంచో పొత్తులో ఉన్న టీడీపీ, పవన్కళ్యాణ్, బీజేపీ ఇప్పుడు ముసుగు తొలగించారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు పొత్తులు కొత్తేమీ కాదని, ఎన్నికలు వచ్చాయంటే ఆయనకు పొత్తులు గుర్తొస్తాయని చెప్పారు. 2019లో టీడీపీ ఓటమి పాలుకాగానే చంద్రబాబు తన అనుచరులైన సుజనాచౌదరి, సీఎం రమేశ్లను బీజేపీలోకి పంపారని గుర్తుచేశారు. అప్పటి నుంచి ప్రత్యక్షంగా పొత్తులో ఉన్న టీడీపీ, వవన్కళ్యాణ్, బీజేపీ.. పరోక్షంగా కాంగ్రెస్, ఇతర పార్టీలతో కూడా కలిసే ఉన్నట్లు చెప్పారు. ఎంతమంది కలిసొచి్చనా, ఎల్లో మీడియా వారికి ఎంత మద్దతు ఇచ్చినా గెలిచేది వైఎస్సార్సీపీయేనని ఆయన తెలిపారు. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ బీజేపీతో పొత్తుకోసం టీడీపీ వెంపర్లాడిందని ఎద్దేవా చేశారు. సింహం సింగిల్గానే వస్తుందని, జగన్ సింగిల్గా పోటీచేసి మళ్లీ సీఎం కావడం తథ్యమని చెప్పారు. -
కడప ఎయిర్పోర్టు కొత్త టెర్మినల్కు ప్రధాని మోదీ శంకుస్థాపన
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప ఎయిర్పోర్టు కొత్త టెర్మినల్కు ప్రధాని మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. రూ.265 కోట్ల రూపాయల వ్యయంతో నూతన టర్మీనల్ భవన నిర్మాణం చేపట్టారు. ఢిల్లీ నుండి వర్చువల్ విధానంలో ప్రధాని పాల్గొన్నారు. కడప నుంచి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్రెడ్డి మాట్లాడుతూ, కడప ప్రజల కల నెరవేరుతున్న వేళ సంతోషంగా ఉందన్నారు. కడప విమానాశ్రయ అభివృద్ధి కోసం దివంగత మహానేత వైఎస్సార్ చేసిన కృషి అందరికి తెలిసిందే.. రూ. 75 కోట్ల రూపాయలతో స్థల సేకరణ పూర్తి చేశామని తెలిపారు. ఉడాన్ పథకం ద్వారా హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్, చెన్నైకు తక్కువ ధరకు విమాన సర్వీసులు నడపడం జరిగిందన్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో నైట్ ల్యాండింగ్, రన్ వే పొడిగింపు, పెద్ద విమానాలు ల్యాండ్ అయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరావు సిందియా, ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇదీ చదవండి: స్నేహం కాదు, దాసోహం! -
రాజమండ్రి ఎయిర్ పోర్ట్ విస్తరణ పనులకు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన
-
చరిత్ర చెరిపేయం
► మరో మార్గంలో సేతు పథకం ► వివాదాలకు అతీతంగా అమలు ► కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ► ఎన్నూరు హార్బర్లో కొత్త టెర్మినల్ ప్రారంభం సేతుసముద్ర ప్రాజెక్టు కోసం రామసేతు వంతెనను కూల్చ బోమని కేంద్ర రహదారులు, నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తమిళనాడు ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామేగానీ పురాతన రూపాన్ని నిర్మూలించేది లేదని ఆయన అన్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై శివారు ఎన్నూరు కామరాజర్ హార్బర్లో ఐదు కొత్త పథకాలను, రూ.1,270 కోట్లతో నిర్మించిన కొత్త టెర్మినల్ను నితిన్ గడ్కరీ శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సేతు సముద్ర ప్రాజెక్టు కోసం నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలనలో ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు వ్యవహారం కోర్టు నుంచి బైటపడిన తరువాత ప్రాజెక్టు పనులు అమలు చేస్తామని అన్నారు. రామసేతు వంతెన విషయంలో ప్రజల మనోభావాలను ఎంతమాత్రం దెబ్బతీయబోమని అన్నారు. తాను బాధ్యతలు స్వీకరించే ముందు దేశంలో రోజుకు రెండుకిలోమీటర్ల పొడవుకు మాత్రమే రోడ్లను నిర్మించేవారని, ప్రస్తుతం 23 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం సాగుతోందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 16,800 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగిందని చెప్పారు. దేశంలోని హార్బర్ల అభివృద్ధికి రూ.16 లక్షల కోట్లను కేటాయించగా ఇందులో చెన్నైలోని మూడు హార్బర్లకు రూ.4లక్షల కోట్ల వాటా ఉందని తెలిపారు. ఈ ని«ధుల ద్వారా హార్బర్లకు రైలు మార్గాలను అనుసంధానం, రోడ్ల నిర్మాణం, అభివృద్ధి వంటి పనులు జరుగుతాయని చెప్పారు. ప్రస్తుతం రెండు లక్షల కార్లు మాత్రమే ఎగుమతి జరుగుతుండగా రాబోయే రోజుల్లో ఐదు నుంచి ఆరు లక్షల కార్లను ఎగుమతి చేసుకునే సామర్థ్యం కలుగుతుందని చెప్పారు. తమిళనాడులో చెన్నై–బెంగళూరు, చెన్నై–హైదరాబాద్ రహదారుల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. తమిళనాడులో జలమార్గాల రూపకల్పనకు ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా సముద్రమార్గ రవాణాకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్రప్రభుత్వానికి సూచించారు. జలమార్గ రవాణా కోసం రూ.200 కోట్ల ఆర్థిక సహాయానికి కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు. ఈ నిధుల ద్వారా తిరువనంతపురం–కన్యాకుమారి, కన్యాకుమారీ–చెన్నైలకు జలమార్గాల రూపకల్పన చేయవచ్చని చెప్పారు. ఈ పథకానికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం ఒక నివేదికను కేంద్రానికి పంపాలని ఆయన కోరారు. చెన్నైలో అయిల్ కాలుష్య బాధితులకు రూ.203 కోట్లు నష్టపరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ పరిహారం పదిరోజుల్లో అందుతుందని చెప్పారు. కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. -
గన్నవరం ఎయిర్పోర్టులో కొత్త టెర్మినల్
-
కొత్త టర్మినల్ ప్రారంభించిన మోదీ
చండీగఢ్: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం చండీగఢ్ విమానాశ్రయంలో కొత్త టర్మనల్ ప్రారంభించారు. జాతీయ అంతర్జాతీయ విమాన సర్వీసులు అందించనున్న ఈ టర్మినల్ను దేశానికి అంకితం చేశారు. కొత్త టర్మినల్ ద్వారా అటు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో అభివృద్ధి వేగం పుంజుకుంటుందని చెప్పారు. మొత్తం రూ.939 కోట్ల వ్యయంతో ఈ టర్మినల్ను ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) , చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ భాగస్వామ్యంలో నిర్మించాయి. దీని నిర్వహణ బాధ్యతలను మాత్రం చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ చూసుకోనుంది. ఈ టర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకి, కేంద్రమంత్రి పీఅశోక్ గజపతి రాజు, ముఖ్యమంత్రులు ప్రకాశ్ సింగ్ బాదల్, మనోహర్ లాల్ ఖత్తర్ పాల్గొన్నారు.