NRI Branch
-
హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధికారుల తొలగింపు
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్ వేటు వేసింది. ఎన్నారై (NRI) క్లయింట్లకు 'క్రెడిట్ సూయిస్ AT-1' బాండ్లను తప్పుదోవ పట్టించి విక్రయించినట్లు తేలడంతో బ్యాంక్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. మరోవైపు బ్యాంక్ ఛైర్మన్ అతాను చక్రవర్తి ఆకస్మిక రాజీనామాతో గురువారం స్టాక్ మార్కెట్లో బ్యాంక్ షేర్లు 2.4% మేర పతనమయ్యాయి.వేటు పడిన అధికారులు వీరే..దుబాయ్ బ్రాంచ్ ద్వారా జరిగిన ఈ బాండ్ల విక్రయ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ముగ్గురు ఉన్నతాధికారులను బ్యాంక్ విధుల నుంచి తొలగించింది. వారిలో బ్రాంచ్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్ సంపత్ కుమార్, ఈవీపీ (మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా & ఎన్నారై బిజినెస్) హర్ష్ గుప్తా, ఎస్వీపీ స్థాయి అధికారి పాయల్ మంధ్యాన్ ఉన్నారు.అసలేం జరిగింది?జనవరి 2025లో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై బ్యాంక్ అంతర్గత విచారణ చేపట్టింది. దుబాయ్, బహ్రెయిన్ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది, భారత ఎన్నారై క్లయింట్లను తప్పుదోవ పట్టించి అధిక రిస్క్ ఉన్న AT-1 బాండ్లను విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి.క్లయింట్ల వద్ద ఉన్న ఎఫ్సీఎన్ఆర్ డిపాజిట్లను ఈ బాండ్లలోకి మళ్లించేలా ఒత్తిడి తెచ్చారు. ఈ బాండ్లను సురక్షితమైన 'ఫిక్స్డ్ మెచ్యూరిటీ' ఉత్పత్తులుగా ప్రచారం చేశారు. పెట్టుబడిదారుల నుంచి ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకున్నారని, బాండ్లలోని రిస్క్ అంశాలను వారికి వివరించకుండా దాచిపెట్టారని విచారణలో తేలింది.రెగ్యులేటరీ చర్యలు - భారీ నష్టంక్రెడిట్ సూయిస్ బ్యాంక్ పతనం తర్వాత, యూబీఎస్ (UBS) నేతృత్వంలో జరిగిన బెయిలౌట్ సమయంలో ఈ AT-1 బాండ్ల విలువ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో పెట్టుబడిదారులు భారీగా నష్టపోయారు. ఎన్నారైల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ (DFSA), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా నిషేధం విధించింది.బ్యాంక్ వివరణ"మా యూఏఈ బ్రాంచ్లో క్లయింట్ ఆన్-బోర్డింగ్ ప్రక్రియలో కొన్ని లోపాలను గుర్తించాం. అంతర్గత విచారణ అనంతరం నిబంధనల ప్రకారం బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకున్నాం" అని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది.ఏమిటీ AT-1 బాండ్లు?ఇవి ఈక్విటీ లక్షణాలున్న రుణ సాధనాలు. ఇందులో వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ, రిస్క్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఒకవేళ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటే లేదా దివాలా తీస్తే, ఈ బాండ్లలో పెట్టిన పెట్టుబడిని తిరిగి చెల్లించాల్సిన అవసరం బ్యాంకులకు ఉండదు. -
అమెరికాలో ‘కాళేశ్వరం’ సంబురాలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సంబురాలు అమెరికాలో ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర సమితి యూఎస్ఏ ఎన్ఆర్ఐ విభాగం–మిన్నెసొటా ఏరియా తెలంగాణ అసోసియేషన్ (మాటా) ఆధ్వర్యంలో మిన్నెసొటాలో ఎడెన్ప్రయరీలో ఈ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎన్నారై విభాగం ప్రతినిధి ఎర్రబెల్లి ప్రేమ్, టీఆర్ఎస్ ఎన్నారై యూఎస్ఏ ప్రాంతీయ ప్రతినిధి కాచం జ్ఞానేశ్వర్, ఉపాధ్యక్షుడు చేపూరి భవాని రామకృష్ణ, మాటా వ్యవస్థాపకుడు అల్లమనేని నిరంజన్, భీమా రవి, పాతూరి యోగేందర్, ముదిరెడ్డి రాజవెంకట్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరంతో తెలంగాణ రైతుల చిరకాలవాంఛ నెరవేరనుందన్నారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణలోని 40 లక్షల ఎకరాల్లో 2 పంటలకు సాగునీరు అందుతుందన్నారు. -
కార్డు లిమిట్ 13 వేలు.. ఖర్చు 9 కోట్లు
న్యూఢిల్లీ: 200 డాలర్ల(రూ.13 వేలు) పరిమితితో ఎస్బీఐ జారీచేసిన విదేశీ ట్రావెల్ కార్డుల్లో మార్పులు చేసి ముంబైకి చెందిన ఒక వ్యక్తి రూ. 9.1 కోట్ల మేర ఖర్చు చేసిన సంఘటన బ్యాంకు ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. యలమంచిలి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ తరఫున ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎన్నారై బ్రాంచ్ 2016లో ఫారిన్ ట్రావెల్ కార్డుల్ని జారీచేసింది. సందీప్ కుమార్ అనే వ్యక్తికి జారీచేసిన మూడు కార్డుల బ్యాలెన్స్లో మార్పులు చేసి నాలుగు బ్రిటిష్ ఈ కామర్స్ వెబ్సైట్లలో రూ. 9.1 కోట్ల మేర షాషింగ్ చేసిన విషయాన్ని యలమంచిలి కంపెనీ బ్యాంకు దృష్టికి తీసుకెళ్లింది. మూడు నెలల వ్యవధిలో మొత్తం 374 లావాదేవీలు జరిగినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఒరకిల్ డేటాబేస్ ద్వారా బ్యాలెన్స్లో మార్పులు చేసి ఈ మోసానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ మోసంపై ఎస్బీఐ ఫిర్యాదు మేరకు సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. -
కొత్త ప్రాంగణంలోకి ఎస్బీహెచ్ ఎన్నారై బ్రాంచ్
హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్కు చెందిన ఎన్నారై బ్రాంచ్ను వేరే ప్రాంతానికి మార్చినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఒక ప్రకటనలో తెలిపింది. 1992, నవంబర్లో ఫతే మైదాన్లో ఏర్పాటు చేసిన ఈ బ్రాంచ్ను ఇప్పుడు హిమాయత్ నగర్కు మారింది. ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలందించడానికి ఈ మార్పు చేసినట్లు బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. కొత్త ప్రాంగణంలో ఈ ఎన్నారై శాఖను ఎస్బీహెచ్ ఎండీ శంతను ముఖర్జీ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఉన్నతాధికారులు, వి. విశ్వనాధన్(సీజీఎం, ఆర్బీ), అనిల్ మల్హోత్ర(జనరల్ మేనేజర్, పీబీ), దేవేంద్ర కుమార్(జీఎం, హైదరాబాద్ నెట్వర్క్), ఎస్.సి. ధావన్ (డీజీఎం, మెట్రోజోన్), హర్షవర్థన్ మాడభూషి(జనరల్ సెక్రటరీ, ఎస్బీహెచ్ ఆఫీసర్స్ అసోసియేషన్), టి. సుధాకర్ రెడ్డి(బ్రాంచ్ హెడ్) తదితరులు పాల్గొన్నారు.


