one leg
-
ఒంటికాలితో విజయం సాధించి..
అన్ని అవయవాలు సవ్యంగా ఉన్నా చాలా మంది ఆటలు ఆడటానికి ఆసక్తి చూపరు. కానీ ఒక కాలు లేకపోయినా ఓ యువకుడు కుస్తీ పోటీలో పాల్గొనడమే కాకుండా, విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తానెవరికీ తీసిపోనని క్రీడాభిమానుల సాక్షిగా నిరూపించాడు. సంకల్ప బలానికి వైకల్యం అడ్డురాదని చాటిచెప్పాడు.పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు దివ్యాంగ మల్లయోధుడు యు. సాయిలు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంలో బేడీల మైసమ్మ ఉత్సవాల్లో భాగంగా సోమవారం కుస్తీపోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు వివిధ జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి సైతం మల్లయోధులు తరలి వచ్చారు. సంగారెడ్డి జిల్లా (Sangareddy District) నారాయణఖేడ్ పట్టణానికి చెందిన దివ్యాంగ మల్లయోధుడు (Divyang Wrestler) సాయిలు కూడా ఈ కుస్తీ పోటీల్లో పాల్గొన్నాడు. ఆయన రూ.500 కుస్తీ పోటీల్లో ఓ మల్లయోధునితో కుస్తీ పట్టి విజయం సాధించాడు. దీంతో సాయిలు పోరాటానికి మెచ్చిన ప్రేక్షకులు రూ.3 వేల వరకు విరాళాలు అందజేశారు. వివిధ విభాగాల్లో కుస్తీపోటీల్లో గెలుపొందిన మల్లయోధులకు నిర్వాహకులు నగదును బహుమానంగా అందజేశారు. కట్టె కాసులు తెచ్చి పెట్టెతెల్లబంగారం (White Gold) సాగులో ఆదిలాబాద్ జిల్లాది ఆసియాలోనే ప్రథమ స్థానమని చెప్పొచ్చు. జిల్లాలో 90 శాతం మంది రైతులు పత్తి పంటనే సాగు చేస్తున్నారు. పత్తితీత అనంతరం మిగిలిన చెట్లను గతంలో ట్రాక్టర్ల సాయంతో పెరికేసి చేలల్లోనే కాల్చేసేవారు. అయితే ఇప్పుడు పరిశ్రమల్లోని బాయిలర్లలో ఉపయోగించే బ్రికెట్లను ఈ పత్తి కట్టెతో తయారు చేస్తుండటంతో పత్తికట్టె కూడా అన్నదాతకు లాభసాటిగా మారింది. రైతులు పత్తి ఏరివేసిన అనంతరం మిగిలిన పత్తి కట్టెకు వ్యాపారులు ఎకరాకు రూ.300 చెల్లించి.. వారే ట్రాక్టర్ల ద్వారా తొలగించి జిల్లా కేంద్రంలోని ఓ పరిశ్రమకు తరలిస్తున్నారు. అక్కడ క్రష్ చేసి బ్రికెట్స్ను తయారు చేస్తున్నారు. దీంతో పత్తి కట్టె అన్నదాతకు అదనపు లాభంగా మారింది.చి‘వరి’కి పశువుల మేతగా..ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): రైతుల ఆరుగాలం కష్టం పశువులకు మేతగా మారుతోంది. సాగునీరు అందక ఎండుతున్న పంటలను పశువులకు మేతగా వదిలేస్తున్న రైతులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్టతండాకు చెందిన రైతు గుగులోతు మహేశ్నాయక్.. అప్పులు చేసి ఆరు ఎకరాల్లో వరిపంట సాగు చేశాడు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నాలుగు బోర్లు ఎత్తిపోయాయి. మల్కపేట రిజర్వాయర్ నుంచి కాలువల వెంట సాగునీటిని విడుదల చేయకపోవడంతో.. సాగు చేసిన పంట కళ్ల ముందే ఎండిపోతోంది. సాగునీటి కోసం అన్ని విధాలుగా ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోవడంతో చి‘వరి’కి రైతు మహేశ్నాయక్ పంట పొలాన్ని పశువులకు వదిలేశాడు. ఇలాంటి పరిస్థితి జిల్లావ్యాప్తంగా ఉంది.చదవండి: అందుకే హైదరాబాద్ దేశ రెండో రాజధానిగా ఉండాలి -
పేదరికంతో పోరాడి.. వైకల్యంతో ఎదురీది.. విజేతగా నిలిచిన భాగ్య
ఆమె పేరులో భాగ్యం ఉంది. ఆ భాగ్యం జీవితంలో కొరవడింది. ఆమె పేదరికంతో పోరాడింది. శారీరక వైకల్యంతో ఎదురీదింది. సమాజంలో విజేతగా నిలిచింది. అభినందనలు అందుకుంటోంది. తమిళనటి, నర్తకి సుధాచంద్రన్ ఒక అద్భుతం. నాట్య మయూరిగా పేరు తెచ్చుకుంది. నెమలిలా నాట్యం చేసే ఆమెతో విధి వింత నాటకం ఆడింది. ఒక కాలిని తీసుకెళ్లింది. ఆమె నిర్ఘాంతపోయింది. నడవడమే కష్టం అనుకున్న స్థితి నుంచి కోలుకుని కృత్రిమ కాలితో నాట్యం చేసింది. మన తెలుగు నాట్య మయూరితో విధి మరింత ఘోరంగా ఆటలాడుకుంది. ఆమెను ఒక్క కాలితోనే భూమ్మీదకు పంపించింది. డాన్స్ చేయాలంటే రెండు కాళ్లు ఉంటే మంచిదే... కానీ లేదని ఊరుకోవడమెందుకు? ఒక కాలు లేకపోతేనేం... మరో కాలుందిగా... అంటూ డాన్స్ చేస్తోంది. ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం గెలిచాయి. తెలంగాణ జానపద కళలంటే ప్రాణం పెట్టే భాగ్య అందులోనే ఎం.ఏ చేస్తోంది. తన విజయగాధను సాక్షితో పంచుకుంది. బస్సులు మారలేక... ‘‘మాది మహబూబాబాద్ జిల్లా, గూడూరు గ్రామం. అమ్మ కూలిపనులకు వెళ్తుంది. నాన్న మేకలు కాస్తాడు. అన్న, నేను ఇద్దరం పిల్లలం. నేను పుట్టడమే ఒక విచిత్రం. బిడ్డ ఒక కాలు లేకుండా పుట్టిందని ఊరంతా వచ్చి చూశారట. ఆ తర్వాత నేను పెరగడం, చదువు, డాన్స్ నేర్చుకోవడం... అన్నీ విచిత్రంగానే గడిచాయి. సెవెన్త్ క్లాస్ వరకు వరంగల్ జిల్లా, నెక్కొండ మండలం, పెద్ద కొర్పోల్లో చదువుకున్నాను. ఆ తర్వాత హన్మకొండలో సాగింది. ఇంటర్ ప్రైవేట్ కాలేజ్లో చదివించడం డబ్బుండి కాదు. ప్రభుత్వ కాలేజ్కి రెండు బస్సులు మారి వెళ్లాల్సి ఉండింది. నేనలా వెళ్లలేనని ప్రైవేట్ కాలేజ్లో చేర్చారు. వరంగల్ ఆర్ట్స్ కాలేజ్లో డిగ్రీ చేసి, ఇప్పుడు హైదరాబాద్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద కళల్లో ఎం.ఏ. చేస్తున్నాను. ఇంతకీ నేను డాన్సర్గా మారిన వైనం మరీ విచిత్రం. బాలెన్స్కి నెల పట్టింది నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు జరిగిందా విచిత్రం. ప్రముఖ డాన్సర్ లారెన్స్ మాస్టారి ఆలోచన నన్ను డాన్సర్ని చేసింది. ఆయన దగ్గర పని చేసిన ప్రశాంత్ మాస్టారు స్పెషల్లీ ఏబుల్డ్ పిల్లలకు డాన్స్ నేర్పించడానికి మేమున్న హాస్టల్కి కూడా వచ్చారు. అలా అప్పుడు వాళ్లు పదిమందికి పైగా స్టూడెంట్స్ని సేకరించి డాన్స్ క్లాసులు మొదలు పెట్టారు. వారిలో స్టేజ్ మీద ప్రదర్శనలిచ్చే స్థాయికి చేరింది ముగ్గురమే. అప్పటివరకు కర్ర లేకుండా నిలబడగలమనే ఊహ కూడా లేని వాళ్లమే అందరం. మొదట ఒక కాలి మీద దేహాన్ని బాలెన్స్ చేయడం సాధన చేశాం. బాలెన్స్ సాధించడానికి నెల పట్టింది. సినిమా పాటలు, జానపద నృత్యం, బతుకమ్మ పాటలు ప్రాక్టీస్ చేశాను. ఆ కోర్సు తర్వాత కూడా సొంతంగా కొన్ని పాటలకు సాధన చేశాను. టీవీ ప్రోగ్రామ్లలో కూడా డాన్స్ చేశాను. దసరా ఉత్సవాలు, వినాయక చవితి, ఇతర సమావేశాల్లో అవకాశాలను వెతుక్కుంటూ నాట్యం చేస్తున్నాను. శివరాత్రికి వేములవాడ రాజరాజేశ్వరస్వామి గుడిలో కూడా నాట్యం చేశాను. ఇక్కడ మరో విచిత్రం... ఏమిటంటే, సిట్టింగ్ వాలీబాల్ ఆడే అవకాశం వచ్చింది. ఈ ఆటకు మన దగ్గర పెద్దగా ఆదరణ లేదు. రాజస్థాన్, హర్యానా, తమిళనాడు, కర్నాటకల్లో జరిగిన పోటీలకు హాజరయ్యాను. థాయ్లాండ్లో జరిగే పోటీలకు ఎంపిక ప్రక్రియలో నెగ్గాను. మనదేశం తరఫున ఆడే అవకాశం వచ్చింది. కానీ కరోనా కారణంగా వెళ్లలేకపోయాను. తెలంగాణ ఆట పాట ఫోక్ ఆర్ట్స్ కోర్సులో భాగంగా డప్పు, జానపదగేయాలు, కర్రసాము, చెక్క భజన వంటి తెలంగాణ సంప్రదాయ కళలను నేర్చుకున్నాను. బతుకమ్మ పాటలను సేకరించి పాడాను. ఇతర పాటలు పాడే అవకాశాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. డాన్స్లో కూడా నిరూపించుకుంటాను. నాకు సీటు ఇచ్చేటప్పుడు సీటు వృథా అవుతుందేమోనని సందేహించిన యూనివర్సిటీనే ఇప్పుడు నాకు అండగా నిలిచింది. నేను ఎవరికీ భారం కాకూడదు, నా కాళ్ల మీద నేను నిలబడాలనే పట్టుదలే నన్ను ఇంతవరకు నడిపించింది’’ అని చెప్పింది భాగ్య. సవాళ్లను ఎదుర్కొనే మనోధైర్యం ఆమె సొంతం. ఆడపిల్లలకు ధైర్యం ఒకింత ఎక్కువగా ఉండాలని చెప్తోంది. బాలికలకు కర్రసాము నేర్పించి ధీరలుగా మలవాలనే ఆమె ఆశయం, జానపదానికి సేవ చేయాలనే ఆమె ఆకాంక్ష నెరవేరాలి. కొత్త అడుగులు ఎల్బీ స్టేడియంలో ఇచ్చిన ప్రదర్శన నా జీవితాన్ని కొత్తగా రాసింది. డిసెంబర్ మూడవ తేదీ ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్’. ఆ సందర్భంగా లాల్ బహదూర్ స్టేడియంలో నాలుగు రోజుల ముందు నుంచి ఆటలు, డాన్స్ ప్రోగ్రామ్లు జరిగాయి. నా డాన్స్ ఫొటోలు పేపర్లో వచ్చాయి. ఆ పేపర్ చూసి మా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ కిషన్రావు సర్ నన్ను పిలిచి మాట్లాడారు. మా ఆర్థిక పరిస్థితి, గవర్నమెంట్ పెన్షన్తో హాస్టల్ ఫీజు కట్టుకుంటూ చదువుకుంటున్నానని తెలుసుకుని ఆయన చలించిపోయారు. ఆయన ఎవరెవరితో మాట్లాడారో తెలియదు, వీసీ సర్, రిజిస్ట్రార్ సర్ కలిసి మూడు లక్షల నిధులు సేకరించి, జర్మనీ నుంచి డాన్స్ చేయడానికి వీలుగా ఉండే ప్రోస్థటిక్ లెగ్ను తెప్పించి పెట్టించారు. ఇప్పుడు ఆ కాలితో నడక ప్రాక్టీస్ చేస్తున్నాను. నడక మీద పట్టు వచ్చిన తర్వాత డాన్స్ చేస్తాను. – వాకా మంజులారెడ్డి -
ఒంటి కాలితో పాఠశాలకు వెళ్తున్న చిన్నారి వీడియో వైరల్
ఇంతవరకు ఎన్నో స్ఫూర్తిదాయకమైన గాథలు విన్నాం. ప్రతికూల పరిస్థితులను దాటుకుంటూ పైకి వచ్చిన వారిని చూశాం. దివ్వాంగులు సైతం అందరివాళ్లలా అన్ని చేయగలమంటూ సాధించిన విజయాల గురించి విన్నాం. అలాంటి వారి కోవకు చెందినదే ఈ చిన్నారి కూడా. విధి మిగిల్చిన విషాదాన్ని పక్కనపెట్టి చక్కగా చదువుకునేందుకు తాపత్రయ పడుతోంది ఈ చిట్టితల్లి. వివరాల్లోకెళ్తే....బిహార్లోని జాముయి జిల్లాకు చెందిన సీమా అనే బాలిక ఒంటికాలితో పాఠశాలకు వెళ్తోంది. ఆ చిన్నారికి రెండేళ్లక్రితం జరిగిన ప్రమాదంలో ఒక కాలు తీసేయాల్సి వచ్చింది. కానీ ఆ విషాదం ఆ చిన్నారి చదువుని ఆపలేకపోయింది. ఆ బాధను ఏ మాత్రం పట్టించుకోకుండా రోజు కి.మీ దూరంలో ఉన్న స్కూల్కి ఒంటికాలితోనే వెళ్తోంది. ఈ మేరకు ఆమె ఒంటి కాలుతో స్కూల్కి వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఆ చిన్నారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆయన కరోనా సమయంలో ఎంతోమందికి సాయం చేసి అందరి ప్రశంసలను అందుకున్న సంగతి తెలిసిందే. సోనుసూద్ ట్విట్టర్లో "ఆ చిన్నారి ఇప్పుడు రెండు పాదాలపై పాఠశాలకు వెళుతుంది. నేను టిక్కెట్ పంపుతున్నాను. ఆ చిన్నారి రెండు కాళ్లపై నడిచే సమయం ఆసన్నమైంది" అంటూ తన ఎన్జీవ్ సూధా ఫౌండేషన్ని కూడా ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ ఆ చిన్నారి వీడియో పలువురి ప్రముఖులను కదిలించింది. ఈ మేరకు బిహార్ ప్రభుత్వ భవన నిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ అశోక్ చౌదరి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆ చిన్నారిని ప్రశంసించారు. సీమా లాంటి పిల్లలను గుర్తించి సాయం అందించడమే కాకుండా ఆ చిన్నారికి కూడా తగిన సాయం అందుతుందని చెప్పారు. Bihar: जमुई में एक पैर से 1KM का सफर तय कर स्कूल जाती है बिहार की ये बेटी एक हादसे में मासूम का काटना पड़ा था पैर, हौसला देख करेंगे सलाम pic.twitter.com/pc6vUV2iLb — News24 (@news24tvchannel) May 25, 2022 (చదవండి: చిరకాల కాంక్ష! ఒక వ్యక్తి జంతువులా మారడం కోసం ఏకంగా రూ.12 లక్షలు పెట్టి...) -
ఒంటికాలి జపం అందుకేనట!
వాషింగ్టన్ : ఫ్లెమింగోలు..రెండు కాళ్లపై కాకుండా ఒంటికాలిపైనే ఎందుకు నిలబడతాయో తెలుసా. వాటికి రెండు కాళ్లపై నిలుచోవడం కంటే ఒకదానిపై నిలబడడమే తేలిక. అంతేకాకుండా ఈ భంగిమలో నిలబడడం వల్ల వాటికి తమ శక్తి ఆదా అవుతుందట, ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఒంటికాలిపై నిలబడిన సమయంలో కండర సంబంధమైన పనులేవీ అవి చేయవని, పనిలో పనిగా ఓ కునుకు సైతం తీయగలుగుతాయని తెలిపారు. ఈ భంగిమ వల్ల వాటికి కండరాల అలసట ఉండదని గతంలో అంతా భావించేవారు. అందుచేతనే అవి కాలు మార్చుకుంటాయే తప్ప రెండుకాళ్లను ఏకకాలంలో వినియోగించడానికి ఇష్టపడవని తెలిపారు. ఈ తరహా ప్రవర్తనద్వారా అవి తమ శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకుంటాయని జార్జియా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ,. ఎమోరి విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఈ ట్రిక్కు వెనుకగల అనేక యాంత్రిక రహస్యాలను వారు వెలుగులోకి తీసుకొచ్చారు.