pays
-
అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న సురేశ్ రైనా దంపతులు (ఫొటోలు)
-
Actor Surya : బోరున ఏడ్చిన హీరో సూర్య, విజయ్ కాంత్ కు స్టార్ హీరో నివాళి (ఫొటోలు)
-
వైఎస్సార్కు నివాళులర్పించిన భట్టి
హైదరాబాద్: డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న మల్లు భట్టి విక్రమార్క.. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించారు. తన నివాసంలోని పూజ గదిలో ఉన్న వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. వైఎస్సార్పై తనకున్న అభిమానాన్ని భట్టి చాటుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. భట్టి విక్రమార్క మల్లు గారు తన నివాసంలోని పూజ గదిలో ఈరోజు ఉదయం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు #BhattiVikramarkaMallu#YSRLivesOn pic.twitter.com/8O9oo7iSsh— Bhatti Vikramarka Mallu (@BhattiCLP) December 7, 2023 తెలంగాణలో నేడు ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. రేవంత్ రెడ్డి సీఎంగా పదవి చేపట్టనున్నారు. మంత్రులుగా భట్టి, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శ్రీధర్బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, రాజనర్సింహ, పొంగులేటి, తుమ్మల, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖతో సహా మొత్తం 11 మంది మంత్రి పదవులకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు సోనియాగాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఇదీ చదవండి: ఉత్తమ్కుమార్రెడ్డికి ఆర్థిక శాఖ? -
ప్రభుత్వానికి బీవోఐ డివిడెండ్ రూ. 668 కోట్లు చెల్లింపు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి(2022–23)గాను పీఎస్యూ.. బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) ప్రభుత్వానికి డివిడెండ్ చెల్లించింది. షేరుకి రూ. 2 చొప్పున ప్రభుత్వానికి రూ. 668 కోట్లకుపైగా అందించింది. బ్యాంక్ ఎండీ రజనీష్ కర్ణాటక్ ఆర్థిక సర్వీసుల కార్యదర్శి వివేక్ జోషి సమక్షంలో డివిడెండ్ చెక్కును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అందజేశారు. 2023 మే 30న బ్యాంకు డైరెక్టర్ల బోర్డు షేరుకి 20 శాతం చొప్పున డివిడెండ్ చెల్లించేందుకు అంగీకరించింది. గతేడాది బీవోఐ నికర లాభం 18 శాతంపైగా బలపడి రూ. 4,023 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22)లో రూ. 3,405 కోట్లు మాత్రమే ఆర్జించింది. మార్చితో ముగిసిన గతేడాది బ్యాంక్ నిర్వహణ లాభం 34 శాతం జంప్చేసి రూ. 9,988 కోట్లకు చేరింది. -
బల్బులు మార్చితే చాలు.. కోట్ల జీతం మీదే..!
జీవితాన్ని సౌకర్యవంతంగా గడపడానికి ఉద్యోగం తప్పనిసరి. ఏ ఉద్యోగం చేసినా పదో పాతికో సంపాదించగలం. బాగా శ్రమిస్తే కొందరైతే లక్షల వరకు చేరుకోగలరు. కానీ కేవలం బల్బులను మార్చుతూ కోట్లు సంపాదించగలరా? ఏ సంస్థ అయినా లైట్లు మార్చితే కోట్ల రూపాయల జీతం ఇస్తుందా? అవును ఇస్తుంది. కేవలం టవర్కు ఉండే లైట్లను మార్చితే కోట్ల రూపాయల జీతం సంపాదించవచ్చు. కాకపోతే.. ఆ టవర్ల ఎత్తు మామూలుగా ఉండదు మరి..! మామూలు టవర్లు కావు.. వందల మీటర్లు ఉండే ఎత్తైన సిగ్నల్ టవర్లపై పని చేయాలి. పైకి వెళ్లగానే కళ్లు తిరుగకుండా, ధైర్యంగా సన్నని కడ్డీలపై తిరుగాల్సి ఉంటుంది. బయట కనిపించే టవర్ల లాంటివి కావు ఇవి. ఎత్తుకు పోయేకొలది సన్నగా ఉంటాయి. చివరకు కేవలం సన్నని కడ్డీ మాత్రమే ఉంటుంది. ఈ టవర్లపై ఎక్కి లైట్లను మార్చాలి అంటే..భయంతో కూడిన పని. కేవలం ఒక తాడు మాత్రమే రక్షణగా ఉంటుంది. ఇలాంటి పనులు అందరూ చేయలేరు. ఇందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. శారీరకంగా దృఢంగా ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి టవర్లపై పనిచేయగలిగే వారికి చాలా డిమాండ్ అంటుందట. కోట్లలో జీతాలు.. టవర్ ఎత్తు, అనుభవం, నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగికి జీతం ఉంటుందట. కొందరికి గంటల చొప్పున ఉంటుంది. ఎంత తక్కువలో అయినా ఒక టవర్ ఎక్కి దిగడానికి కనీసం ఆరుగంటలైన పడుతుంది. 1500 మీటర్ల టవర్ను ఎక్కగలిగేవారికి దాదాపు 1 కోటి రూపాయలపైనే ఉంటుంది. ఉద్యోగంలో కొత్తగా చేరినవారికే గంటకు సరాసరిగా 17డాలర్ల వరకు ఇస్తారు. అయితే.. ప్రతీ ఆరునెలలకు ఒకసారి ఈ లైట్లను మారుస్తారట. అమెరికాలోని డకోటా నగరానికి చెందిన ఓ ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. Every six months this man in South Dakota climbs this communication tower to change the light bulb. He is paid $20,000 per climb. pic.twitter.com/z9xmGqyUDd — Historic Vids (@historyinmemes) December 2, 2022 ఇదీ చదవండి:యూఎస్కి 17 ఏళ్ల పాటు చుక్కలు చూపించిన గణిత మేధావి మృతి -
మోసపూరిత చెక్కులకు పీఎన్బీ చెక్
న్యూఢిల్లీ: చెక్కులకు సంబంధించి మోసాల విషయంలో కస్టమర్లను రక్షించే చర్యలో భాగంగా ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మరింత పటిష్ట కీలక చర్య తీసుకుంది. రూ. 5 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువైన చెక్కుల చెల్లింపులకూ ఇకపై పాజిటివ్ పే సిస్టమ్ (పీపీఎస్) వ్యవస్థను తప్పనిసరి చేసింది. ఏప్రిల్ 5 నుంచి కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం రూ.10లక్షలు ఆపైబడిన విలువైన చెక్కుకే పీపీఎస్ వ్యవస్థ అందుబాటులో ఉంది. పీపీఎస్ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అభివృద్ధి చేసింది. ఇది నిర్దిష్ట చెక్కులను జారీ చేసేటప్పుడు కస్టమర్లు అవసరమైన వివరాలను (ఖాతా నంబర్, చెక్ నంబర్, చెక్ ఆల్ఫా కోడ్, ఇష్యూ తేదీ, నగదు, లబ్ధిదారు పేరు) తిరిగి ధృవీకరించవలసి ఉంటుంది. బ్రాంచ్ ఆఫీస్, ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ ద్వారా చెక్ వివరాలను అందించడం ద్వారా కస్టమర్లు పీపీఎస్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. చెక్ ప్రెజెంటేషన్కు ఒక పని రోజు ముందు ఈ వివరాలను ఆమోదించడం, లేదా వివరాలను సమర్పించడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పీపీఎస్లో నమోదైన చెక్కులు మాత్రమే వివాద పరిష్కార యంత్రాంగం కిందకు వస్తాయి. -
వైరల్ వీడియో: గణేశుడికి మోకరిల్లి మొక్కుతున్న శునకం
-
గణేశుడికి మోకరిల్లి మొక్కుతున్న శునకం: వీడియో వైరల్
ఇటీవల కాలంలో ఉన్నటుండి మోగ జీవులు చాలా వింతగా ప్రవర్తిస్తున్నాయి. ఒక్కసారిగా మనుషుల వలే భక్తిప్రపత్తులు చాటుకుంటూ వింతగా ప్రవర్తిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఇటీవలే కోకొల్లుగా జరిగాయి. అచ్చం అలాంటి సంఘటనే ఒకటి పూణేలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఒక శునకం గణేశుడి దేవాలయం వద్ద మోకరిల్లి ప్రార్థిస్తోంది. అతని పక్కనే ఉన్న వ్యక్తి కూడా ప్రార్థిస్తున్నాడు. ఈ ఘటనను విశాల్ అనే వ్యక్తి రికార్డు చేసినట్లు తెలుస్తోంది. అతను ఇన్స్టాగ్రామ్లో 'పూణేలోని దగ్దుషేత్ గణపతి మందిర్ వద్ద ఏం జరుగుతుందో చూడండి' అని ఒక క్యాప్షన్ పెట్టి మరీ వీడియోని పోస్ట్ చేశాడు. ఆలస్యం ఎందుకు మీరు కూడా ఈ వీడియో చూసేయండి. (చదవండి: అరే! ఏం మనుషుల్రా ఇంత రాక్షసత్వమా! శునకానికి ఉరి వేసి...) -
అమ్మకు నివాళి కన్నీరు పెట్టిన పళని
-
అమ్మకు నివాళి.. కన్నీరు పెట్టిన పళని
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గిన ముఖ్యమంత్రి పళనిస్వామి తన మంత్రి వర్గసహచరులు, ఎమ్మెల్యేలతో అమ్మ సమాధి వద్దకు తరలి వెళ్లారు. అమ్మ గెలిచిందంటూ నినాదాలతో మెరీనా బీచ్ లోని అమ్మ సమాధి మారుమోగింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత సమాధి వద్దకు తన మద్దుతారుదలతో తరలి వెళ్లిన ఆయన అమ్మకు నివాళులర్పిస్తూ పళని స్వామి కన్నీరు పెట్టారు. దీంతో అమ్మ గెలిచిందంటూ నినాదాలు మిన్నంటాయి అటు. బలపరీక్షలో పళని స్వామి నెగ్గడంతో పళని స్వామి వర్గీయులు సంబరాల్లో మునిగి తేలుతుండగా, అసెంబ్లీలో చోటు చేసుకున్న హైడ్రామాపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమిళనాడు అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో రాజ్ భవన్ లో గవర్నర్ కలిశారు. జరిగిన ఘటనలపై చర్యలు తీసుకోవాలని ఆయన గవర్నర్ ను డిమాండ్ చేశారు. అనంతరం మెరినా బీచ్లోని గాంధీ విగ్రహం దగ్గర నిరాహార దీక్ష దిగారు. శనివారం ఉదయం సభ ప్రారంభంనుంచి తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా నెలకొంది. ప్రతిపక్షాల, ఆందోళన, ప్రతిపక్ష సభ్యులు సస్పెన్షన్ మధ్య సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరికి మార్షల్స్ రంగ ప్రవేశంతో మరింత ఉద్రిక్తంగా మారిపోయింది. దీంతో సభను స్పీకర్ ధనరాజ్ మధ్యాహ్నం మూడు గంటలకు వాయిదావేశారు. తిరిగి సభ ప్రారంభం అయిన తరువాత ప్రతిపక్షంలేకుండా ఓటింగ్ను ముగించారు. సీఎం పళినిస్వామి విశ్వాస పరీక్షలో విజయం సాధించినట్టు ప్రకటించారు. -
అంబేడ్కర్ అలోచనా విధానమే శరణ్యం
– వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు కాకినాడ రూరల్ : దేశానికి అంబేడ్కర్ ఆలోచనా విధానమే శరణ్యమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. మంగళవారం అంబేడ్కర్ 60వ వర్థంతి సందర్భంగా గైగోలుపాడులో అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్థంతి సభలో ఆయన మాట్లాడారు. యువత అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టిబత్తుల రాజబాబు, రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, బీసీ విభాగం కార్యదర్శులు కడియాల చినబాబు, రమణాతి మురళి, మాజీ కౌన్సిలర్ చింతపల్లి చంద్రశేఖర్, మాజీ సర్పంచులు బొమ్మిడి శ్రీనివాస్, కోమలి సత్యనారాయణ పాల్గొన్నారు. జయలలిత మృతికి సంతాపం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం రమణయ్యపేటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు స్వగృహంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో వారు పాల్గొన్నారు. తమినాడు రాజకీయాల్లోనే కాక దేశ రాజకీయాల్లోనే ఓ కీలకమైన ఆణిముత్యాన్ని కోల్పొయామని కన్నబాబు అన్నారు. జయలలిత మృతి దేశరాజకీయాలకే తీరని లోటన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర యువత కార్యదర్శి లింగం రవి, ఎస్సీ సెల్ కార్యదర్శి చెల్లే శేషారావు పాల్గొన్నారు. -
బాలమురళి కారణజన్ముడు
నన్నయ వీసీ ముత్యాలునాయుడు పుస్తక సంబరాల్లో ‘స్వర నివాళి’ రాజమహేంద్రవరం కల్చరల్ : గానగంధర్వుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ కారణజన్ముడని నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ముత్యాలునాయుడు అన్నారు. ప్రభుత్వ అటానస్ కళాశాలలో జరుగుతున్న నవ్యాంధ్ర పుస్తక సంబరాల వేదికపై బుధవారం బాలమురళీకృష్ణకు స్వరనివాళి సమర్పించారు. వీసీ మాట్లాడుతూ తెలుగు నేలకు, సంగీతానికి అంతర్జాతీయ ఖ్యాతిని చేకూర్చిన మంగళంపల్లి లేని లోటు తీరనిదని అన్నారు. విజయశంకర ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల కూచిపూడి అధ్యాపకుడు పసుమర్తి శ్రీనివాసశర్మ మాట్లాడుతూ బాలమురళి స్వరం మధురం, వాక్కు చమత్కారభరితమన్నారు. సాహితీవేత్త రెంటాల శ్రీవెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎవరూ ప్రశ్నించలేని స్థాయిలో తెలుగు గాయకులకు బాలమురళి కంఠం గుర్తింపు తెచ్చిందన్నారు. రాజ్యలక్ష్మి మహిళా కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ అద్దేపల్లి సుగుణ మాట్లాడుతూ ఎన్నో జీవిత సత్యాలు, తత్వాలను బాలమురళి ఆలపించారన్నారు. గాయని ఎం.పార్వతి బాలమురళి గానం చేసిన ‘ఏమి సేతురా లింగా’, ‘ఊగుమా ఊయల’ తదితర గీతాలను ఆలపించారు. వయొలి¯ŒS విద్వాంసుడు కొక్కొండç సూర్యసుబ్రహ్మణ్యం బాలమురళి గానం చేసిన ‘వస్తా వట్టిదే–పోతా వట్టిదే–ఆశ ఎందుకంటా–చేసిన ధర్మము–చెడని పదార్థము’ అన్న గేయాన్ని ఆలపించారు. ముందుగా వీసీ బాలమురళి చిత్రపటం వద్ద జ్యోతిప్రజ్వలన చేసి, పుష్పాంజలి ఘటించారు. నన్నయ వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ టి.సత్యనారాయణ, విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్యపాఠశాల ప్రిన్సిపాల్ ఆర్.వి.ప్రసన్నకుమారి పాల్గొన్నారు. -
సామాన్యులకు 'అందని ద్రాక్ష'..!
-
సామాన్యులకు 'అందని ద్రాక్ష'..!
జపాన్ః మనకు అందని ఎత్తులో ఉన్న ఏ విషయానికైనా 'అందని ద్రాక్ష' సామెతను ఉదహరిస్తుంటాం. కానీ జపాన్ లోని ఓ దుకాణందారుడు నిజంగా సామాన్యులకు అందని ద్రాక్షనే తన దుకాణంలో ప్రదర్శనకు పెట్టాడు. ఓ అరుదైన జాతికి చెందిన ద్రాక్షపళ్ళ గుత్తిని ఏకంగా లక్షల రూపాయలు వెచ్చించి వేలంలో దక్కించుకోవడమే కాదు... వాటిని తన దుకాణంలో ప్రదర్శనకు ఉంచి వచ్చినవారికి రుచి చూపించి ఇప్పుడు జపాన్ లోనే వార్తల్లో వ్యక్తిగా మారాడు. పాశ్చాత్య ప్రపంచంలో అరుదైన వైన్ కు ఎటువంటి గుర్తింపు ఉంటుందో అలాగే జపాన్ లో అరుదైన, ప్రత్యేకత కలిగిన పళ్ళను కొనుగోలు చేయడం, వినియోగించడం వారి హోదాకు గుర్తుగా భావిస్తారు. అదే నేపథ్యంలో జపాన్ లోని ఓ కిరాణా దుకాణం యజమాని రూబీ రోమన్ జాతికి చెందిన ద్రాక్షపళ్ళ గుత్తిని సుమారు 8 లక్షల రూపాయలకు వేలంలో దక్కించుకున్నాడు. అది తనకు గౌరవంగా భావించడమే కాదు... అలా లక్షలు పోసి కొన్న ద్రాక్షను ప్రదర్శనకు పెట్టి, అందరికీ ఉచితంగా రుచి చూపించాడు. ఆస్పత్రులను సందర్శించేప్పుడు, వివాహాలు, వేడుకల సందర్భాల్లో నాణ్యత కలిగిన, అరుదైన, రుచికరమైన పళ్ళను అందించడం జపాన్ సంప్రదాయాల్లో ఒక భాగమే కాక, హోదాగా కూడా భావిస్తారు. అందుకే అక్కడ అటువంటి ఖరీదైన పళ్ళను అమ్మేందుకు ప్రత్యేక దుకాణాలు కూడ ఉంటాయి. ప్రత్యేక పద్ధతుల్లో పండించిన, ఉత్పత్తి చేసిన పళ్ళ జాతులను ఆ యా దుకాణాల్లో అందుబాటులో ఉంచుతారు. అటువంటి పళ్ళను కొని, ఇతరులకు బహుమతిగా ఇవ్వడం కొనుగోలుదారులు సైతం హోదాగా భావిస్తారు. ఈ సీజన్ లో ప్రత్యేకంగా పండించిన రూబీ రోమన్ జాతికి చెందిన 30 ద్రాక్ష పళ్ళను కొన్నవాళ్ళలో జపాన్ లోనే తకమారూ కొనీషీ మొదటివాడు. పింగ్ పాంగ్ బంతుల సైజులో ఉన్న ఆ ద్రాక్ష.. నిజంగా రూబీ రోమన్ రత్నాల్లా ఉన్నాయని తెగ సంబరపడిపోతున్నాడు. అందుకే తాను సుమారు 8 లక్షల రూపాయలను వెచ్చించానని, తన దుకాణంలో ప్రదర్శనకు ఉంచి, అందరికీ రుచి చూపిస్తున్నానని గర్వంగా చెప్తున్నాడు. జపాన్ సముద్ర తీరంలోని ఇషికవ ప్రాంతంలో ఈ రూబీ రోమన్ జాతిని ఫిజిమోరీ వెరైటీ విత్తనాలతో మొదటిసారి 1992 లో పండించారు. ఈ ద్రాక్ష ఒక్కోటి కనీస బరువు 20 గ్రాములు ఉండటంతోపాటు, రసంలో 18 శాతం చక్కెర పాళ్ళు కలిగి ఉంటుంది. ఈ అరుదైన జాతి ద్రాక్షను మొదటిసారి 2008 లో జపాన్ పండ్ల మార్కెట్లో వేలానికి పెట్టారు. అయితే అప్పట్లో నిజంగానే అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా దాని ధర కూడ ప్రపంచంలోని ద్రాక్ష పళ్ళ మార్కెట్లలోనే అత్యధిక ధర పలికింది. అంతేకాదు అత్యంత అరుదైన, ఖరీదైన ద్రాక్షగా కొత్త రికార్డు సృష్టించింది. అయితే వేలంలో రూబీ రోమన్ ద్రాక్షను పొందటం నాకెంతో ఆనందంగా ఉందని, ప్రత్యేక గౌరవం లభించినట్లుగా ఉందని కొనిషీ చెప్తున్నాడు. తన దుకాణానికి వచ్చిన కొనుగోలుదారులు రుచి చూడటంతోపాటు, కొందరు ఇతర వ్యాపారులు శాంపిల్ గా కూడ ఈ ద్రాక్షను తీసుకెళ్ళారని చెప్తున్నాడు. ఒక్కోటి సుమారు 25 వేల రూపాయల ఖరీదు చేసే ఆ పళ్ళను కొనిషీ జనానికి ఎలా ఉచితంగా ఇచ్చాడో తెలియదు కానీ, అతడి దుకాణం దగ్గర శాంపిల్స్ కోసం, రుచికోసం జనం క్యూ కట్టడం మాత్రం పెద్ద ఈవెంట్ గా మారిపోయింది. పత్రికలు, మీడియా లో ప్రత్యేక వార్తా కథనం అయిపోయింది. కాగా మార్కెట్లోకి కొత్తగా వచ్చిన అరుదైన జాతి ద్రాక్షను అందరికీ పరిచయం చేసి, తన అమ్మకాలను పెంచుకొనేందుకు సదరు వ్యాపారి ఆ మార్గం ఎంచుకొన్నాడా అన్న అనుమానం కూడా కలుగుతోంది. -
'జేఎఫ్ఆర్ జాకబ్'కు ఘననివాళి
-
అమరవీరులకు సలాం
-
భారీగా పెరిగిన వేతనాలు
అగర్తలా: త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచింది. కేంద్ర 6వ పే కమిషన్ సిఫారసు ప్రకారం జీతాలను పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ వెల్లడించారు. ఫలితంగా సుమారు లక్షా అరవై వేలమంది లబ్ధి పొందనున్నారని సమాచారం. రాష్ట్రం తీవ్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.